WTC Final 2021-2023
-
రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు! ఇలా అయితే: డీకే
India tour of West Indies, 2023- Ajinkya Rahane Failure: అజింక్య రహానేకు ఇది అత్యంత సాదాసీదా సిరీస్. డబ్ల్యూటీసీ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన తర్వాత ఏకంగా వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. అతడికి ఇలాంటి అవకాశం ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోవడం సహజం. అయితే, అజింక్య రహానేకు ఎవరు ఏమనుకుంటున్నారన్న అంశంతో పనిలేదు. అతడికి రెండు టెస్టుల్లోనూ ఆడే అవకాశం వచ్చింది. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. కొన్నిసార్లు కఠినమైన పిచ్ల కారణంగా బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. మరికొంత మందికి ఇలా కొన్ని సిరీస్లు చేదు అనుభవాన్నిస్తాయి. అయితే, అజింక్య రహానే విషయంలో మాత్రం నిలకడలేని ఆట ప్రభావం చూపుతోంది. అందుకే గతంలో అతడు జట్టులో చోటు కోల్పోయాడు. అంతర్మథనం మొదలయ్యే ఉంటుంది ఈ విషయం అతడికి కూడా తెలిసే ఉంటుంది. అయితే, సౌతాఫ్రికా టూర్లో ఇలాంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అతడిలో అంతర్మథనం మొదలవడం ఖాయం’’ అని టీమిండియా వెటరన్ బ్యాటర్, కామెంటేటర్ దినేశ్ కార్తిక్ అన్నాడు. విండీస్తో టెస్టు సిరీస్లో విఫలమైన భారత జట్టు ఉప నాయకుడు అజింక్య రహానేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని వైస్ కెప్టెన్గా ఎలా నియమించారో చాలా మందికి అర్థం కాలేదన్న డీకే.. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడని పెదవి విరిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదుర్స్ కాగా ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో రహానే ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మిగిలిన ఆటగాళ్లంతా విఫలమైన వేళ అజ్జూ రాణించాడు. ఈ మెగా ఫైట్లో 135 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో విండీస్ టూర్లో భాగంగా టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ అయ్యాడు. రెండు టెస్టుల్లో కలిపి 11 పరుగులు కానీ ఆడిన రెండు టెస్టుల్లో పూర్తిగా విఫలమయ్యాడు. మొత్తంగా కేవలం 11(3, 8) పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. ఈ నేపథ్యంలో క్రిక్బజ్తో మాట్లాడుతూ డీకే.. రహానేను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో 209 పరుగుల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. తాజా సైకిల్లో తొలి సిరీస్ను కైవసం చేసుకుంది. చదవండి: ఆసీస్ ఆల్రౌండర్ మాక్సీ భార్య సీమంతం.. ఫొటోలు వైరల్! ఆ విషాదం తర్వాత.. -
Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే
West Indies vs India, 1st Test Day 1: వెస్టిండీస్తో తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దుమ్ములేపుతున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా ఏకంగా 5 వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ముందుగా ఓపెనర్లు క్రెగ్ బ్రాత్వైట్(20), తగెనరైన్ చందర్పాల్(12)లను పెవిలియన్కు పంపిన అశూ.. నిలకడ ప్రదర్శించిన అరంగేట్ర బ్యాటర్ అలిక్ అథనాజ్(47)తో పాటు టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్(4), వారికన్(1) వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు అశ్విన్ పాంచ్ పటాకాకు తోడు.. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మూడు వికెట్లతో రాణించగా.. పేసర్లు సిరాజ్, శార్దూల్ ఒక్కో వికెట్ తీశారు. దీంతో వెస్టిండీస్ 150 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో అశ్విన్ అద్భుత ప్రదర్శన(5/60)ను ఉద్దేశించి టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. మనం తప్పు చేశామా? ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో తనను ఆడించకుండా మేనేజ్మెంట్ ఎంత పెద్ద తప్పుచేసిందో తెలిసొచ్చేలా చేశాడన్నాడు ఆకాశ్ చోప్రా. భారత్- వెస్టిండీస్ తొలి రోజు ఆటను విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు తొలిరోజే 150 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్ ఆడించకుండా మనం తప్పు చేశామా అనే ఫీలింగ్ కలిగించాడు. విండీస్ పిచ్లు స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటాయని, వెస్టిండీస్తో సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలుస్తాడని నేను ముందుగానే అంచనా వేశాను." అన్నాడు ఆకాశ్ చోప్రా. అశూ మాదిరే వాళ్లు కూడా తొలిరోజు మాదిరే అశ్విన్ చెలరేగితే నా మాటలు నిజమవుతాయి’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఒకే చోట బంతిని విసురుతూ అశూ మంచి ఫలితాలు రాబడుతున్నాడన్న ఈ కామెంటేటర్.. నాథన్ లియోన్, జడేజా కూడా అతడి మాదిరే బౌలింగ్ చేసే సత్తా కలిగి ఉన్నారని పేర్కొన్నాడు. కాగా మొదటి రోజు ఆటలో విండీస్పై పైచేయి సాధించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 80 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 40, రోహిత్ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. నంబర్ 1 అశ్విన్ ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్-2023 సందర్భంగా తుది జట్టులో అశ్విన్కు చోటు దక్కని విషయం తెలిసిందే. ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో అశూను కాదని.. జడ్డూకు అవకాశమిచ్చారు. రెండు ఇన్నింగ్స్లో కలిపి జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో ఓడి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. అశ్విన్ గత కొంతకాలంగా టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్1గా కొనసాగుతున్నాడు. చదవండి: కోహ్లిని టీజ్ చేసిన ఇషాన్ కిషన్.. వీడియో వైరల్ Ind Vs WI: చెలరేగిన అశ్విన్.. అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు బద్దలు -
వాళ్లంతా అందుబాటులో ఉంటే కథ వేరేలా ఉంటది! ఒకవేళ: రోహిత్ శర్మ
Rohit Sharma's Counter On India's Successive WTC Final Failure: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో ఓటమి తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ద్వైపాక్షిక సిరీస్లలో రాణిస్తున్నప్పటికీ ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న రోహిత్ను సారథిగా తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు హిట్మ్యాన్. కరేబియన్ దీవిలో కాగా డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో భాగంగా టీమిండియా వెస్టిండీస్తో తమ తొలి సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే కరేబియన్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన బుధవారం(జూలై 12) నుంచి ఆరంభం కానున్న తొలి టెస్టుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ఓపెనింగ్ జోడీగా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ బరిలోకి దిగడం ఖాయమని తెలిపాడు. శుబ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని వెల్లడించాడు. ఇక ఐసీసీ ఈవెంట్లలో ముఖ్యంగా ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమికి ప్రధాన కారణం ఏంటనే ప్రశ్న రోహిత్కు ఎదురైంది. వాళ్లంతా అందుబాటులో ఉంటే ఇందుకు స్పందిస్తూ.. ‘‘ప్రతి ఒక్క ఆటగాడు సెలక్షన్కు అందుబాటులో ఉండాలని నేను కోరుకుంటాను. నా జట్టులోని కీలక ఆటగాళ్లంతా వందకు వంద శాతం టీమ్తోనే ఉండాలి. గాయాల బెడద అస్సలు ఉండకూడదు. అన్నింటికంటే ముఖ్యమైనది అదే’’ అని రోహిత్ బదులిచ్చాడు. అదే విధంగా.. గత కొన్నేళ్లుగా టీమిండియా అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తోందన్న ఈ ముంబైకర్.. ఒక్కోసారి అదృష్టం వెక్కిరిస్తే చేదు అనుభవాలు తప్పవని పేర్కొన్నాడు. గత ఐదారేళ్లుగా భారత జట్టు ప్రతిచోటా జయకేతనం ఎగురవేసిందన్న రోహిత్.. చాంపియన్షిప్స్ కూడా గెలవడం ముఖ్యమేనని.. అందుకు తాము తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు. కాగా ఇంగ్లండ్లోని ప్రఖ్యాత ఓవల్ వేదికగా ఆసీస్తో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడిన రోహిత్ సేన 209 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కీలక బ్యాటర్ రిషభ్ పంత్, మిడిలార్డర్ స్టార్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఈ మేరకు ఆటగాళ్లు అందుబాటులో ఉంటే బాగుంటుందని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: అర్జున్ టెండూల్కర్కు గోల్డెన్ చాన్స్ టీమిండియా నుంచి ఒకే ఒక్కడు! రోహిత్ ఇంకొకటి! కోహ్లి మాత్రం... -
Ind vs WI: అతడొక్కడే కాదు.. వాళ్లు కూడా విఫలం.. కానీ పాపం..
Ind Vs WI 2023 Test Series: ‘‘అన్ని రకాల గౌరవాలు పొందేందుకు అతడు నూటికి నూరు శాతం అర్హుడు. అలాంటిది తనను జట్టు నుంచి తప్పించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో అతనొక్కడే విఫలం కాలేదు కదా! అదే జట్టులో ఉన్న చాలా మంది కూడా కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేదు. పుజారా మాదిరే వాళ్లు కూడా పరుగులు సాధించడంలో వైఫల్యం చెందారు. స్ట్రైక్రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణమదే చాలా మంది టెస్టుల్లో పుజారా స్ట్రైక్రేటు గురించిన విమర్శలు చేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. వాస్తవానికి పుజారా స్ట్రైక్రేటు అంతంత మాత్రంగా ఉండటానికి కారణం.. సహచర ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టినపుడు వికెట్ పడకుండా చూసుకోవడం.. జట్టును ఆదుకునే వాళ్లకు సపోర్టు ఇవ్వడం వల్లే! ఎన్నో విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. కానీ అతడికి దక్కాల్సినంత గౌరవం దక్కలేదు. జట్టుకు ఇప్పుడు కూడా తన అవసరం ఎంతగానో ఉంది. కానీ అనూహ్య రీతిలో పక్కనపెట్టారు. ముఖ్యంగా SENA(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) గడ్డ మీద జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. వాళ్లను మాత్రం పక్కన పెట్టరు?! ఎవరైనా సరే ప్రతిసారి అద్భుతంగా ఆడలేరు కదా! పుజారా లాంటి టెస్టు క్రికెటర్ను వదులుకుంటే నష్టపోవాల్సి ఉంటుంది’’ అంటూ టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్.. ఛతేశ్వర్ పుజారాకు అండగా నిలబడ్డాడు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో పుజారాను తప్పించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఘోర ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఓపెనర్లు రోహిత్ శర్మ(15, 43), శుబ్మన్ గిల్(13, 18) ఆకట్టుకోలేకపోయారు. స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన కోహ్లి వన్డౌన్లో వచ్చిన పుజారా చేసిన పరుగులు 14, 27. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లి(14, 49) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. అజింక్య రహానే మొత్తంగా 138 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు అతడు వైస్ కెప్టెన్గా ఎంపిక కాగా.. అనూహ్యంగా పుజారాకు చోటే దక్కలేదు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ భజ్జీ స్పందిస్తూ పుజారాకు జట్టులో చోటు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టాడు. ముఖ్యంగా కోహ్లి, ఇతర బ్యాటర్లను టార్గెట్ చేస్తూ.. పుజారాకు అండగా నిలిచాడు. కాగా జూలై 12 నుంచి టీమిండియా- విండీస్ మధ్య డొమినికా వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. చదవండి: రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! -
Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్గా మరోసారి విరాట్ కోహ్లి!?
Team India Test Captain: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో ఓటమి తర్వాత టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై క్రీడా వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఘోర పరాజయం నేపథ్యంలో రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తాయి. 36 ఏళ్ల రోహిత్ను తప్పించి.. శుభ్మన్ గిల్ లేదంటే శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు.. ఇప్పుడిపుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న గిల్ వంటి ఆటగాళ్లపై భారం మోపే బదులు.. మాజీ సారథి విరాట్ కోహ్లినే మరోసారి కెప్టెన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ప్రశ్న ఎదురైంది. కోహ్లి అంతటి సమర్థుడే.. యూబ్యూబ్ చానెల్ వేదికగా.. అభిమానులతో ముచ్చటిస్తున్న సందర్భంగా.. కోహ్లి తిరిగి టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఓ నెటిజన్ అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కోహ్లి మరోసారి సారథిగా బాధ్యతలు చేపట్టగల సమర్థుడే.. కానీ.. అతడు ఆ పని చేయడు. ఎందుకంటే.. టెస్టు కెప్టెన్సీ వదులుకోమని ఎవరూ అతడిని ఒత్తిడి చేయలేదు. తనకు తానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మళ్లీ తను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకపోవచ్చు. కోహ్లి ప్రకటన తర్వాతే బీసీసీఐ కొత్త కెప్టెన్ను నియమించింది. కాబట్టి మళ్లీ విరాట్ కోహ్లి.. నాయకుడిగా తిరిగి రావడం సాధ్యం కాకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తనకు తానుగా తప్పుకొన్నాడు! కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న కోహ్లిని.. అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్గా తప్పించారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాలో టీమిండియా 2021-22 పర్యటన సమయంలో టెస్టులో ఓటమి తర్వాత కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో అప్పటికే టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ టెస్టు జట్టు నాయకుడయ్యాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి, రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. తొట్టతొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో. 2021-23 ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి.. రెండు సందర్భాల్లోనూ రన్నరప్తోనే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన ప్రస్తుతం వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు సిద్ధమవుతోంది. జూలై 12- ఆగష్టు 13 వరకు కరేబియన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపనుంది. చదవండి: జాక్పాట్ కొట్టిన అనంతపురం క్రికెటర్.. టీమిండియాకు ఎంపిక స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు -
టీమిండియా కెప్టెన్గా ఊహించని పేరు! అసలు రహానే ఏం చేశాడని ఆ బాధ్యతలు?
‘‘రవీంద్ర జడేజా గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదో నాకైతే అర్థం కావడం లేదు. టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ అతడు ప్రధాన ఆటగాడిగా సేవలు అందిస్తున్నాడు. టెస్టుల్లోనూ అతడి రికార్డులు మెరుగ్గా ఉన్నాయి. మరి తదుపరి నాయకుడు ఎవరన్న చర్చ వచ్చినపుడు జడేజా పేరు ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? గిల్ కూడా ఉన్నాడుగా నిజానికి మూడు ఫార్మాట్లలోనూ అతడి స్థానాన్ని భర్తీ చేయగల సత్తా ఉన్న ఆటగాడు లేడు. టీమిండియాను ముందుకు నడిపించ గల సత్తా అతడిలో ఉంది. ఒకవేళ జడేజా పేరును పరిశీలనలోకి తీసుకోకపోతే.. శుబ్మన్ గిల్ ఉన్నాడు కదా! టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమైన గిల్ పేరునైనా పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి యువకుడైన యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లకు చోటివ్వడం బాగుంది. మెల్లమెల్లగా యువ రక్తం ఎక్కిస్తున్నారు. కానీ అజింక్య రహానేను వైస్ కెప్టెన్ చేయడం వెనుక లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. టెస్టు జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ తిరిగి వచ్చిన తర్వాత అతడు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. రహానే ఏం చేశాడు? అందులో అద్భుతంగా రాణించిన మాట వాస్తవమే. అయితే, భవిష్యత్ టీమిండియా నిర్మిస్తున్నపుడు మళ్లీ అజింక్య రహానేనే వైస్ కెప్టెన్గా నియమించే బదులు కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు కదా? రోహిత్ శర్మ వారసుడిగా ఎదగగల లక్షణాలు ఉన్న ఆటగాడికి డిప్యూటీగా బాధ్యతలు అప్పగిస్తే బాగుండు’’ అని టీమిండియా మాజీ సెలక్టర్ సబా కరీం కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ ఇటీవల టెస్టు, వన్డే జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టి ఇందులో భాగంగా టెస్టు జట్టులో స్థానం పొందిన అజింక్య రహానే తిరిగి వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడిన రహానే.. ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జట్టుకు ఎంపికయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం దక్కించుకున్న రహానే దానిని సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్లలో వరుసగా 89, 46 పరుగులు చేశాడు. దీంతో సెలక్టర్లు అతడికి మరోసారి కెప్టెన్ డిప్యూటీగా అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సబా కరీం ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా రవీంద్ర జడేజా 2021లో చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు చేపట్టి మధ్యలోనే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో జట్టును నడిపించలేని జడ్డూకు జాతీయ జట్టు బాధ్యతలు అప్పగించాలని సబా కరీం వ్యాఖ్యానించడంపై క్రికెట్ ప్రేమికుల్లో చర్చ మొదలైంది. వెస్టిండీస్ రెండు టెస్టులకు భారత జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: మాకు భుజాల నొప్పులు.. ధోనికి మెకాలి సమస్య.. అసలే సచిన్ బరువు! అందుకే.. ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: భారత మాజీ కెప్టెన్ -
కొలీగ్స్ మాత్రమే అన్న అశ్విన్! రవిశాస్త్రి స్పందన మామూలుగా లేదు! నాకైతే..
Ravi Shastri- Ashwin: టీమిండియా డ్రెసింగ్ రూం వాతావరణం గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కొలీగ్సే ఒక్కోసారి ప్రాణ స్నేహితుల్లా మారతారని.. అయినా ఒకరి జీవితంలో ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారని ప్రశ్నించాడు. కాగా అనూహ్య రీతిలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023 తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వలేదు మేనేజ్మెంట్. విదేశీ గడ్డ మీద అశూకు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వైపే మొగ్గు చూపాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో చిత్తుకావడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పుడు స్నేహితులు.. ఇప్పుడు కొలీగ్స్ ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెదిలేవారని.. ఇప్పుడు మాత్రం కేవలం కొలీగ్స్లా ఉంటున్నారని వ్యాఖ్యానించాడు. సహచర ఆటగాళ్లతో మాట్లాడే తీరిక ఎవరికీ ఉండటం లేదని వాపోయాడు. ఈ నేపథ్యంలో ది వీక్తో మాట్లాడిన టీమిండియా మాజీ హెడ్కోచ్, అశ్విన్తో కలిసి పనిచేసిన రవిశాస్త్రిని అశ్విన్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో.. ‘‘నాకైతే ఎల్లప్పుడూ కొలీగ్స్ మాత్రమే ఉండేవారు. నిజానికి మన స్నేహితులే కొలీగ్స్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అయినా ఒక వ్యక్తికి ఎంత మంది బెస్టీస్ ఉంటారు? 4-5 మంది అంతేకదా! వాళ్లతో నేను సంతోషంగా ఉన్నా నాకైతే ఐదుగురు ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్లతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతకు మించి నాకేమీ అవసరం లేదు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. కొలీగ్స్ స్నేహితులు కావొచ్చు. కాకపోవనూవచ్చు. ప్రస్తుతం నాకైతే కామెంటరీ బాక్స్లో చాలా మంది కొలీగ్స్ ఉన్నారు’’ అంటూ సరదాగా బదులిచ్చాడు. కాగా 2021లో హెడ్కోచ్ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. తిరిగి కామెంట్రీ మొదలుపెట్టాడు. ఇటీవల ఇంగ్లండ్లో టీమిండియా- ఆసీస్ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ కామెంటేటర్గా వ్యవహరించాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో అశూకు అవకాశం ఇవ్వని మేనేజ్మెంట్.. జూలై 12 నుంచి మొదలుకానున్న వెస్టిండీస్తో టెస్టు సిరీస్ జట్టుకు ఎంపిక చేసింది. విండీస్తో రెండు మ్యాచ్ల సిరీస్లో అశ్విన్ భాగం కానున్నాడు. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్పై అశ్విన్ విసుర్లు! -
కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు! అసలు పోరులో తుస్సు! అందుకే..
Cheteshwar Pujara- Ind Vs WI test Series: వెస్టిండీస్తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారాకు మొండిచేయి ఎదురైంది. విండీస్తో రెండు టెస్టుల సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. కాగా ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుతో జట్టులోకి తిరిగి వచ్చిన పుజారా బంగ్లాదేశ్ సిరీస్లోనూ ఆడాడు. కౌంటీల్లో సెంచరీల మీద సెంచరీలు ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో ఆసీస్తో నాలుగు మ్యాచ్లలో కలిపి 140 పరుగులు చేయగలిగాడు. అనంతరం ఇంగ్లండ్లో కౌంటీల్లో ఆడిన పుజారా ససెక్స్ జట్టు నాయకుడిగా వ్యవహరించాడు. అద్భుత ఫామ్ను కొనసాగిస్తూ 8 ఇన్నింగ్స్లో 3 సెంచరీల సాయంతో.. 545 పరుగులతో అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో ఛతేశ్వర్ అదరగొట్టడం ఖాయమని అభిమానులు సంబరపడిపోయారు. కానీ గుజరాత్ బ్యాటర్ వారి ఆశలపై నీళ్లు చల్లాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో తుస్సు ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు కలిగి ఉన్న పుజారా.. ఓవల్ వేదికగా తొలి ఇన్నింగ్స్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకు పరిమితమై వైఫల్యం కొనసాగించాడు. దీంతో అతడికి భారీ షాకిచ్చారు టీమిండియా సెలక్టర్లు. విండీస్తో సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. అదే సమయంలో.. మరో వెటరన్ బ్యాటర్, డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆకట్టుకున్న అజింక్య రహానేకు మాత్రం ఈ సిరీస్తో మరోసారి వైస్ కెప్టెన్గా ప్రమోషన్ దక్కింది. విండీస్తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: ఎన్నాళ్లో వేచిన ఉదయం! ఈసారి మా ఆశలు వమ్ము చేయొద్దు ప్లీజ్! అప్పుడు జట్టులో చోటే కరువు.. ఇప్పుడు వైస్ కెప్టెన్గా.. నువ్వు సూపర్ ‘హీరో’! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్పై అశ్విన్ విసుర్లు! -
ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్పై అశ్విన్ విసుర్లు!
‘‘ముందుగా ఆస్ట్రేలియాకు కంగ్రాట్యులేషన్స్!! డబ్ల్యూటీసీ ఫైనల్ అద్భుతంగా సాగింది. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. మార్నస్ లబుషేన్ వంటి ఆటగాళ్లు కౌంటీల్లో ఆడటం వాళ్లకు కాస్త ప్రయోజనకరంగా మారిన మాట వాస్తవమే. నిజానికి టీమిండియాలాగే ఆసీస్ కూడా గత డబ్ల్యూటీసీ సైకిల్లో నిలకడైన ప్రదర్శన కనబరిచింది. కానీ ఫైనల్కు చేరలేకపోయింది. కానీ ఈసారి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంది. వారికి గెలిచే అర్హత వందకు వందశాతం ఉంది’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. అశూకు మొండిచేయి ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో రోహిత్ సేనను ఓడించిన ఆసీస్కు శుభాకాంక్షలు తెలుపుతూ తన యూట్యూబ్ చానెల్లో ఓ వీడియో విడుదల చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్ అశూకు ఫైనల్ ఆడే జట్టులో చోటు దక్కలేదు. అనుభవజ్ఞుడు, విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అశ్విన్కు ప్రతిష్టాత్మక మ్యాచ్లో మొండిచేయి చూపడం చర్చనీయాంశమైంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన అశ్విన్.. ‘‘గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. కాబట్టి అభిమానులు ఆవేశపడటం సహజమే. వారి బాధను నేను సహానుభూతి చెందగలను. నేనూ ధోని కెప్టెన్సీలో ఆడినవాడినే అయితే, జట్టు నుంచి ఈ ఆటగాడిని తప్పిస్తే బాగుండు.. అతడికి అవకాశం ఇవ్వాల్సింది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదు. ఎందుకంటే రాత్రికి రాత్రే ఆటగాళ్ల నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాల్లో మార్పులు రావు. మనలో చాలా మంది ధోని నాయకత్వ పటిమ గురించి చర్చించుకుంటాం. అతడి సీక్రెట్ ఏంటి? ఏ విషయాన్నైనా అతడు సరళతరం చేస్తాడు. నేను కూడా ధోని సారథ్యంలో ఆడిన వాడినే. అతడు తన జట్టులో తొలుత 15 మందిని ఎంపిక చేసుకుంటాడు. ఆ పదిహేను మంది నుంచే తుదిజట్టును ఎంపిక చేసుకుంటాడు. వారినే ఏడాది మొత్తం జట్టులో ఉండేలా చూసుకుంటాడు. ఆటగాడికి సెక్యూరిటీ ఉండాలి నిజానికి ఓ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలంటే.. జట్టులో తన స్థానం పదిలమే అన్న నమ్మకం అతడికి కలగాలి’’ అని అన్నాడు. ధోని కెప్టెన్సీని ప్రశంసిస్తూ.. పరోక్షంగా రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్కు చురకలు అంటించాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అశూకు బదులు మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు చోటిచ్చారు. అతడు ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మరోసారి భారత జట్టులోకి ధోని! -
'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది!
ఇటీవలే ముగిసిన డబ్ల్యూటీసీ చాంపియన్షిప్లో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ క్యాచ్ ఎంత వివాదాస్పదమయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెరాన్ గ్రీన్ అందుకున్న బంతి నేలకు తాకినట్లు క్లియర్గా తెలుస్తున్నప్పటికి థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడం విమర్శలకు దారి తీసింది. మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలయినప్పటికి గిల్ క్యాచ్ విషయంలో మాత్రం భారత్కు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. తాజాగా మరోసారి గిల్ క్యాచ్ సీన్ తమిళనాడు ప్రీమియర్ లీగ్లో రీక్రియేట్ అయింది. యాదృశ్చికంగా జరిగినప్పటికి అచ్చం గిల్ క్యాచ్ వివాదమే ఇక్కడా చోటుచేసుకుంది. అయితే ఈసారి కూడా థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో మరోసారి అన్యాయమే గెలిచింది. టీఎన్పీఎల్ 2023లో భాగంగా బుధవారం నెల్లయ్ రాయల్ కింగ్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ మధ్య మ్యాచ్ జరిగింది. రాయల్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో నాలుగో ఓవర్ భువనేశ్వరన్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతిని ఎల్. సూర్యప్రకాశ్ ఆఫ్సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ఔట్సైడ్ ఎడ్జ్ అయి స్లిప్లో ఉన్న ఎస్. రాధాకృష్ణన్ చేతిలోకి వెళ్లింది. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో రాధాకృష్ణన్ బంతిని నేలకు తాకించాడు. కానీ ఫీల్డ్ అంపైర్ అనుమానంతో థర్డ్ అంపైర్కు పంపించాడు. క్యాచ్ను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో సూర్యప్రకాశ్ షాక్ తిన్నాడు. ఎందుకంటే రిప్లేలో బంతి నేలను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి ఔట్ ఎలా ఇస్తారంటూ బాధపడిన సూర్య చేసేదేం లేక నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. The third umpire thought this catch was clean. Does it bring back some recent memories? 🤔 #TNPLonFanCode pic.twitter.com/apAKHVn34v — FanCode (@FanCode) June 20, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐడ్రీమ్ తిరుప్పూర్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ 18.2 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయింది. సోను యాదవ్ 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. భువనేశ్వరన్ ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడ్రీమ్ తిరుప్పూర్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ను చేధించింది. తుషార్ రహేజా 49, ఎస్ రాధాకృష్ణన్ 34, రాజేంద్రన్ వివేక్ 21 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. చదవండి: కనీస ధర 350 కోట్లేనా!.. బీసీసీఐ ఎందుకిలా? #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
అప్పుడు నాన్న.. అమ్మతో వచ్చారు.. కానీ ఈసారి: కమిన్స్ భావోద్వేగం
England vs Australia, 1st Test: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. 2019లో తన తండ్రి.. తల్లితో పాటు మ్యాచ్ చూడటానికి వచ్చారని.. ఇప్పుడు లండన్లో ఆయన ఒక్కరే ఉన్నారని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్న సమయంలో ప్యాట్ కమిన్స్ ఉన్నఫళంగా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లిన విషయం తెలిసిందే. బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్న తన తల్లి బాగోగులు చూసుకునేందుకు టెస్టు సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే కమిన్స్ తల్లి కన్నుమూసింది. అయితే, తాను ఎంతగానో ప్రేమించే మాతృమూర్తిని కోల్పోయిన బాధ నుంచి కమిన్స్ ఇంకా బయటపడలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ తర్వాత ఆసీస్ నేరుగా టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడింది. ఇంగ్లండ్లో జరిగిన ఈ మ్యాచ్లో కమిన్స్.. మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక కమిన్స్ సారథ్యంలోని ఆసీస్.. ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో 209 పరుగుల భారీ తేడాతో రోహిత్ సేనను ఓడించింది. తద్వారా సంప్రదాయ క్రికెట్లోనూ విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఈ మ్యాచ్ ముగియగానే ఆసీస్.. ఇంగ్లండ్తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్కు సిద్ధమైంది. ఈ క్రమంలో జూన్ 16-20 వరకు జరిగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కమిన్స్ 4 వికెట్లు తీయడంతో పాటు.. కీలక సమయంలో 44 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం కమిన్స్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘వ్యక్తిగతంగా.. గత కొన్నిరోజులుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నా. అయితే, ఈ వారం మొత్తం నాన్న, నా సోదరుడు నాతో పాటే ఉన్నారు. 2019లో నాన్న అమ్మతో పాటు వచ్చారు. కానీ ఇప్పుడు ఇలా!.. మరేం పర్లేదు ఆయన నాతో ఉండటం స్పెషల్.. లక్కీగా ఫీలవుతున్నా’’ అని ఎమోషనల్ అయ్యాడు. చదవండి: Ravindra Jadeja: పాపం! జడేజా మనసు గాయపడి ఉంటుంది.. సీఎస్కే సీఈఓ కామెంట్స్ వైరల్ -
విరాట్ కోహ్లి తాజా పోస్ట్ వైరల్.. ఇంతకీ రన్మెషీన్ ఏమన్నాడంటే!
Virat Kohli posts another spiritual story: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్స్టాగ్రామ్లో ఇతర క్రికెటర్లెవరికీ సాధ్యం కాని రీతిలో 253 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్నాడు ఈ రన్మెషీన్. ట్విటర్లోనూ ఈ రికార్డుల కింగ్కు ఫాలోయింగ్ ఎక్కువే. ప్రస్తుతం కోహ్లి ట్విటర్ ఖాతాకు 56.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎప్పటికప్పుడు వృత్తిగత, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసే కోహ్లి గత రెండ్రోజులుగా ఫుల్ యాక్టివ్ అయిపోయాడు. వరుస పోస్టులతో ముందుకు వస్తున్నాడు. ఈగో నుంచి బయటపడేసేది అదే మొన్నటికి మొన్న జిమ్ వీడియో షేర్ చేసిన ఈ మాజీ సారథి.. తాజాగా క్రిప్టిక్ పోస్టు షేర్ చేశాడు. ‘‘మెదుడు అనుమానాలతో సతమతం అవుతుంది. అదే మనసులో ఎల్లప్పుడూ నమ్మకంతో ముందుకు సాగుతుంది. నిజానికి.. ఈగో మైండ్ నుంచి బయటపడేందుకు నమ్మకమే ఓ వారధిలా పనిచేస్తుంది’’ అన్న కోట్ను ఇన్స్టా స్టోరీలో పంచుకున్నాడు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. స్థాయికి తగ్గట్లు రాణించలేదు కాగా కోహ్లి ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లో ఆడాడు. ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడిన టీమిండియా ఈ మ్యాచ్లో 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇక ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లో కోహ్లి విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో కేవలం 14 పరుగులే చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకానికి పరుగు దూరంలో నిలిచిపోయాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి లభించింది. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి సెలవులను ఆస్వాదిస్తున్నారు పలువురు క్రికెటర్లు. కాగా తదుపరి జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో బిజీ కానుంది. చదవండి: Ind Vs WI: విండీస్కు కష్టాలు! సందిగ్దంలో టీమిండియాతో టెస్టు సిరీస్! ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం! -
పంత్ లేకపోవడం తీరని లోటే.. కానీ భరత్ను బలిపశువును చేయొద్దు: మాజీ కెప్టెన్
KS Bharat: ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్కు భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అండగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో టీమిండియా ఓటమికి అతడిని కారణంగా చూపడం సరికాదంటూ మద్దతు ప్రకటించారు. దయచేసి అతడిని బలిపశువును చేయవద్దంటూ మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశారు. ఆసీస్తో టెస్టు సిరీస్తో కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు కేఎస్ భరత్. స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్గా అవకాశం దక్కించుకున్న అతడు తన విధులను చక్కగా నిర్వర్తించాడు. కానీ కొంతమంది మాత్రం అతడు బ్యాటర్గా పంత్ స్థానాన్ని భర్తీ చేయలేకపోయాడంటూ విషం చిమ్మారు. ఈ క్రమంలో ఇంగ్లండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో భరత్ బ్యాటింగ్ తీరుపై కూడా పెదవి విరిచారు. ఏడో స్థానంలో కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన భరత్ తొలి ఇన్నింగ్స్లో 5 పరుగులకే అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 23 పరుగులు చేయగలిగాడు. ఇక ఈ ప్రతిష్టాత్మక ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేఎస్ భరత్ బ్యాటింగ్ ప్రదర్శనపై అనవసరపు విమర్శల నేపథ్యంలో అంజుమ్ చోప్రా అతడికి మద్దతు ప్రకటించారు. జూలై 12న మొదలుకానున్న వెస్టిండీస్ పర్యటనకు భరత్ స్థానంలో ఇషాన్ కిషన్కు చోటు ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంత్ లేకపోవడం తీరని లోటే.. కానీ ఈ మేరకు న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు తీరని లోటే. కానీ అతడిని దృష్టిలో పెట్టుకుని కేఎస్ భరత్ పట్ల అనుచితంగా ప్రవర్తించడం సరికాదు. నిజానికి వికెట్ కీపర్గా అతడు తన బాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నాడు. తన ప్రైమరీ జాబ్ కూడా వికెట్ కీపింగే కదా! రిషభ్ పంత్ మాదిరే అతడు కూడా బ్యాటింగ్ అదరగొట్టాలని భావించడం పొరపాటే అవుతుంది. తన పని తాను చేస్తున్నాడు భరత్ లోయర్ ఆర్డర్లో ఆడుతున్నాడు. వాస్తవానికి.. టాపార్డర్ బ్యాటింగ్ బాధ్యతను నెత్తినవేసుకోవాలి.. మిడిలార్డర్ వాళ్లకు సపోర్టుగా ఉంటుంది.. ఇక లోయర్ ఆర్డర్ వీరందరికీ తమ వంతు సహకారం అందిస్తుందంతే!! ఈ విషయాలను మనం కచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ బ్యాటింగ్ సరిగా లేదంటూ అతడిని విమర్శించడం సరికాదు’’ అని అంజుమ్ చోప్రా చెప్పుకొచ్చారు. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ రాణిస్తున్నాడని.. అతడిని అదే కోణంలో చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా జూలై 12- ఆగష్టు 13 వరకు టీమిండియా వెస్టిండీస్లో పర్యటించనుంది. ఇక కోన శ్రీకర్ భరత్ ఇప్పటి వరకు భారత్ తరఫున 5 టెస్టులాడి 129 పరుగులు సాధించాడు. చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! టీమిండియా కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్.. ! శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్గా! -
ఇదేం ట్విస్టు భయ్యా! వదినమ్మను కాదని ఇలా..! జడ్డూ ట్వీట్ వైరల్
ప్రపంచంలోని ఉత్తమ ఆల్రౌండర్లలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కుతుంది. 34 ఏళ్ల ఈ గుజరాత్ ఆటగాడు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో అదరగొట్టిన జడ్డూ.. డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో ఫర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్లో 48 పరుగులు చేసిన ఈ స్పిన్ ఆల్రౌండర్.. రెండో ఇన్నింగ్స్లో డకౌట్గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఆసీస్తో ఫైనల్లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ వేదికగా ప్రఖ్యాత ఓవల్ వేదికగా జూన్ 7- 11 వరకు జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక జడేజా సైతం తనకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగిపోయాడు. కాగా రవీంద్ర జడేజాకు అశ్వాలన్నా, గుర్రపు స్వారీ అన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో తాజాగా జడ్డూ షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్గా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత తనకు ఇష్టమైన అశ్వాన్ని కలిశానన్న జడ్డూ.. ‘‘ఫరెవర్ క్రష్’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా గత అక్టోబరులోనూ మై క్రష్ అంటూ జడేజా ఇలాంటి ఫొటోను పంచుకున్నాడు. ఇక జడేజా డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా బిషన్ సింగ్ బేడీ పేరిట ఉన్న రికార్డును సవరించాడు. టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన లెఫ్టార్మ్ స్పిన్నర్గా నిలిచాడు. బిషన్ సింగ్ బేడి 67 మ్యాచ్లలో 266 వికెట్లు తీయగా.. జడ్డూ 65 మ్యాచ్లలో 268 వికెట్లతో అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023లో విన్నింగ్ షాట్లో రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ను చాంపియన్గా నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి భార్య, ఎమ్మెల్యే రివాబా మైదానంలోకి వచ్చి జడ్డూ పాదాలకు నమస్కరించిన ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో జడ్డూ తాజా ట్వీట్పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం ట్విస్టు భయ్యా! వదినమ్మ కాకుండా గుర్రాన్ని క్రష్ అంటున్నావు! ’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు చదవండి: శుబ్మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్రైజర్స్ కెప్టెన్గా! రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్ను చేసిందంటే.. Forever crush ❤️🐎 #meetingafterlongtime pic.twitter.com/NvrvZrqenV — Ravindrasinh jadeja (@imjadeja) June 18, 2023 -
రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్ను చేసిందంటే..
Team India Captain: టీమిండియా విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ముందు వరుసలో ఉంటాడనడంలో సందేహం లేదు. జట్టులోకి వచ్చిన దాదాపు మూడేళ్ల కాలంలోనే సారథిగా పగ్గాలు చేపట్టి అనేకానేక విజయాలు అందించాడు. ఏకంగా మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచి మరే ఇతర కెప్టెన్లకు సాధ్యం కాని రికార్డులు నమోదు చేశాడు. ఇక ధోని తర్వాత అతడి వారసుడిగా విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతలు స్వీకరించి తనదైన ముద్ర వేయగలిగాడు. ఐసీసీ మేజర్ టోర్నీల్లో టీమిండియాను చాంపియన్గా నిలపలేకపోయినప్పటికీ పలు చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని వారసుడిగా కోహ్లి ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగగా.. అనూహ్య రీతిలో వన్డే సారథిగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్బై చెప్పగా... రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో సారథిగా నియమితుడయ్యాడు. రోహిత్ ఇలా ఇక హిట్మ్యాన్ ద్వైపాక్షిక సిరీస్లలో కెప్టెన్ అద్భుతంగా రాణించినప్పటికీ ఆసియా కప్-2022, టీ20 వరల్డ్కప్-2022 టోర్నీల్లో ప్రభావం చూపలేకపోయాడు. తాజాగా ముగిసిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లోనూ రోహిత్ సేన ఓటమిపాలైంది. రోహిత్ వద్దే వద్దంటూ ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడం ఖాయమని వార్తలు వినిపిస్తుండగా.. టెస్టుల్లో రోహిత్కు సరైన వారసుడు ఎవరన్న అంశంపై చర్చలు నడుస్తున్నాయి. నాడు బీసీసీఐ ధోనిని కెప్టెన్ ఎందుకు చేసిందంటే ఈ క్రమంలో ఓ ఆటగాడిని సారథిగా నియమించే ముందు ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం, ధోని తక్కువ కాలంలోనే ఎలా కెప్టెన్ అయ్యాడన్న విషయంపై మాజీ సెలక్టర్ భూపీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘జట్టులోని సీనియర్లలో ఎవరో ఒకరిని ఆటోమేటిక్ ఆప్షన్గా తీసుకునే బదులు.. ఆట పట్ల సదరు క్రికెటర్కు ఉన్న అవగాహన, శక్తిసామర్థ్యాలు, చాతుర్యత, బాడీ లాంగ్వేజ్, జట్టును ముందుకు నడిపించగల సత్తా, మేనేజ్మెంట్ స్కిల్స్.. ఇవన్నీ గమనిస్తాం. నాడు ధోనిలో ఇవన్నీ చూసిన తర్వాతే అతడి విషయంలో ఓ నిర్ణయానికి వచ్చాం. ఆట పట్ల అతడి ఆలోచనా ధోరణి, ఇతరులతో మమేకమయ్యే విధానం.. వీటితో పాటు ధోని విషయంలో పాజిటివ్ ఫీడ్బ్యాక్.. అతడిని సారథిగా నియమించేందుకు దోహదం చేశాయి’’ అని భూపీందర్.. హిందుస్థాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెల రోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12 నుంచి భారత జట్టు వెస్టిండీస్ పర్యటన మొదలుపెట్టనుంది. చదవండి: లబూషేన్ తొండాట.. చీటర్ అంటూ ఏకి పారేసిన నెటిజన్లు #MSKPrasad: 'క్రికెట్ కు సంబంధించి దేశానికి ఏపీ రోల్ మోడల్' -
జిమ్లో వర్కౌట్లు చేస్తున్న కోహ్లి! క్షణాల్లోనే వీడియో వైరల్
Virat Kohli does weight training in gym: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి జిమ్లో చెమటోడుస్తున్నాడు. వర్కౌట్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కోహ్లి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘‘సాకులు వెదుక్కుంటారా? లేదంటే మరింత మెరుగవుతురా?’’ అన్న అర్థంలో క్యాప్షన్ జత చేసి మరోసారి ఫిట్నెస్ గోల్స్ సెట్ చేశాడు. కోహ్లి షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. కాగా అత్యంత ఫిట్గా ఉండే క్రికెటర్ అనగానే కోహ్లి పేరే గుర్తుకువస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలోని అథ్లెట్లందరిలో కూడా ఫిట్నెస్ విషయంలో కోహ్లి ముందుంటానడం అతిశయోక్తి కాదు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ రన్ మెషీన్ ఫిట్నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు అరుదు. కాగా కోహ్లి ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భాగమయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో అతడు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన ఈ స్టార్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతిష్టాత్మక ఐసీసీ మెగా మ్యాచ్లో టీమిండియా ఆసీస్ చేతిలో ఏకంగా 209 పరుగుల తేడాతో చిత్తైంది. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ట్రోఫీ గెలవలేక విమర్శలు మూటగట్టుకుంది. కాగా జూన్ 7-11 వరకు జరిగిన ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు దాదాపు నెలరోజుల పాటు విశ్రాంతి లభించింది. ఇక జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో భారత జట్టు మళ్లీ బిజీ కానుంది. విండీస్తో రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కేవలం టెస్టు సిరీస్ మాత్రమే ఆడి వెస్టిండీస్ నుంచి తిరుగు ప్రయాణం కానున్నట్లు సమాచారం. ఇక జూన్ 27న.. విండీస్ టూర్కు వెళ్లే జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: నువ్వెందుకు బౌలింగ్ చేస్తున్నావు? కావాలంటే మీకు కూడా.. అంతేగానీ! ధోని ఆ ఒక్క మాటతో 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవనంత మాత్రాన.. కెప్టెన్సీ నుంచి తొలగిస్తారా? ఇలా చేస్తే..
Rohit Sharma Captaincy: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా మాజీ సారథి మైకేల్ క్లార్క్ మద్దతుగా నిలిచాడు. కేవలం ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ఓడినంత మాత్రాన అతడిని తొలగించాలనే డిమాండ్లు సరికావంటూ హిట్మ్యాన్ను సమర్థించాడు. కాగా డబ్ల్యూటీసీ సైకిల్ 2019-21లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్లో జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా 2021-23 సీజన్లోనూ ఫైనల్కు అర్హత సాధించింది. కానీ ఈసారి కూడా గతం మాదిరే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. దారుణ ఓటమి ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో రోహిత్ సేన ఏకంగా 209 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో ఆసీస్ సంప్రదాయ క్రికెట్లోనూ చాంపియన్గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించగా.. టీమిండియా రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో 36 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. టాస్ విషయంలో, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడంపై మాజీలు సైతం పెదవి విరిచారు. ఈ క్రమంలో అతడిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. నాకు నమ్మకం ఉంది ఈ విషయంపై స్పందించిన మైకేల్ క్లార్క్ రోహిత్కు అండగా నిలిచాడు. ‘‘రోహిత్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. తను గొప్ప కెప్టెన్. అతడి దూకుడైన ఆట తీరు, కెప్టెన్సీ నాకు నచ్చుతాయి. ఎల్లవేళలా అతడు సానుకూల దృక్పథంతోనే కనిపిస్తాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ రికార్డు అమోఘం. నాయకుడిగా తను విజయవంతమయ్యాడు. ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవలేదన్న ఒకే ఒక్క కారణంగా రోహిత్ కెప్టెన్గా పనికిరాడనడం సరికాదు. నిజానికి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో టీమిండియా వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకుంది. టెస్టు క్రికెట్లో వారి రికార్డు బాగుంది. టీమిండియా నిలకడైన ప్రదర్శనతో ముందుకు సాగుతోంది. ఇక వన్డే వరల్డ్కప్ ఈవెంట్లో వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది’’ అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. రోహిత్ను కెప్టెన్గా కొనసాగించాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! ‘మొదటి బంతి’కే రూట్ అలా! పంత్ను లాగిన ఫ్యాన్స్.. వీడియో వైరల్ -
ఇప్పుడలా లేదు.. ఎవరూ ఎవరికి సాయం చేయరు: అశ్విన్ షాకింగ్ కామెంట్స్
Ravichandran Ashwin Shocking Comments: ‘‘ఒకప్పుడు జట్టులోని ఆటగాళ్లంతా స్నేహితుల్లా మెలిగేవారు. కానీ.. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కేవలం సహచర ఆటగాడిగానే పరిగణింపబడతాడు. అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉంది. డ్రెసింగ్రూం వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరు అనుక్షణం పక్క వాళ్లతో పోటీ పడుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి. ‘‘హాయ్ బాస్.. ఏంటి సంగతులు?’’ అని పక్కవాళ్లతో సరదాగా మాట్లాడేందుకు ఎవరి దగ్గరా కాస్తైనా సమయం లేదు’’ అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లంతా కేవలం కొలీగ్స్ మాదిరే ఉంటున్నారని, మునుపటిలా ఫ్రెండ్స్లా కొనసాగే పరిస్థితి లేదన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిల్ 2021-23లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఈ టీమిండియా బౌలర్కు ఫైనల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అత్యుత్తమ బౌలర్కు మొండిచేయి ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రతిష్టాత్మక మ్యాచ్లో అశ్విన్కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మేనేజ్మెంట్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక.. ఆసీస్తో ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించినప్పటికీ ట్రోఫీ గెలవలేక చతికిలపడింది. ఇదిలా ఉంటే.. అశ్విన్ తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్రెసింగ్రూం వాతావరణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరికి వారే యమునా తీరే.. ఒంటరి ప్రయాణం జట్టులోని ఇతర సభ్యుల నుంచి సహకారం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లు ఉంటారని అశూ పేర్కొన్నాడు. ‘‘నిజానికి.. ఎంత ఎక్కువగా ఆట గురించి చర్చిస్తే అంత ఎక్కువగా టెక్నిక్ను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఒకరి అనుభవాలు మరొకరికి పాఠాలుగా పనికివస్తాయి. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. మనకు ఏదైనా సాయం కావాలంటే ఎవరూ ముందుకురారు. పది మందితో కూడిన ఒంటరి ప్రయాణం లాంటిది ఇది’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అయితే, క్రికెట్లో ఒకరు చెప్పే పాఠాల కంటే సొంతంగా నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందంటూ ముక్తాయింపు ఇచ్చాడు. మేటి బౌలర్గా ఎదిగిన అశూ కాగా రైట్ ఆర్మ్ ఆఫ్బ్రేక్ స్పిన్నర్ అయిన ఈ తమిళనాడు బౌలర్.. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు 92 టెస్టులు, 113 వన్డేలు, 65 టీ20 మ్యాచ్లు ఆడాడు. మేటి బౌలర్గా ఎదిగిన అతడు టెస్టుల్లో 474, వన్డేల్లో 151, టీ20లలో 72 వికెట్లు పడగొట్టాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు.. ధోని సహచర ఆటగాడు! బస్ డ్రైవర్గా.. ఒక్కడే కాదు! సచిన్, ధోని, కోహ్లి, రోహిత్.. రుతురాజ్ కూడా వీళ్ల బ్యాచ్లో చేరిపోయాడు..! -
రోహిత్ మంచి కెప్టెన్.. మేటి టెస్ట్ బ్యాటర్ కూడా! కానీ.. ఇకపై..
Rohit Sharma Captaincy: ‘‘రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం గొప్ప నాయకుడే కాదు.. మంచి టెస్ట్ బ్యాటర్ కూడా! ఈ మాట అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందా అంటే నేనైతే కచ్చితంగా చెప్పలేను. గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ సైకిళ్లలో టీమిండియా ఫైనల్కు చేరింది. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సే అతడికి పెద్ద సమస్యగా మారనుంది. ఇది నమ్మకతప్పని వాస్తవం. రానున్న రెండేళ్లలో డబ్ల్యూటీసీ సైకిల్-2025 షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్లో కొనసాగాలని భావిస్తే తప్పకుండా ఆడతాడు. నిజానికి ఒక డబ్ల్యూటీసీ సైకిల్లో దాదాపు ఆరు సిరీస్లు ఆడాల్సి ఉంటుంది. కానీ గత రెండేళ్లలో చాలా మంది క్రికెటర్లు(రోహిత్ శర్మ సహా) కీలక సిరీస్లు కూడా మిస్ చేశారు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు ఒక్కోసారి విశ్రాంతి దొరక్కపోవచ్చు. అలాంటపుడు మూడు ఫార్మాట్లు ఆడే అవకాశం కొంతమందికే దక్కుతుంది. సెలక్టర్లు అన్ని విషయాలు దృష్టిలో పెట్టుకునే జట్టును ఎంపిక చేస్తారు. డబ్ల్యూటీసీ తదుపరి సైకిల్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్తో మ్యాచ్లు ఉంటాయి. తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉండొచ్చు. రోహిత్ శర్మ కెప్టెన్గా తనను తాను నిరూపించుకున్నాడు. కానీ.. రానున్న రెండేళ్ల కాలంలో కెప్టెన్గా అతడికి ప్రత్యామ్నాయం వెతక్కతప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. 36 ఏళ్ల రోహిత్ శర్మ ఇకపై సారథిగా కొనసాగడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస వైఫల్యాలు కాగా రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో అంతంత మాత్రమే ఆడిన ‘హిట్మ్యాన్’.. ఇటీవల ముగిసిన ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం 15 పరుగులే చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 43 పరుగులు సాధించగలిగాడు. ఇక కీలక మ్యాచ్లో టాస్, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను పక్కనపెట్టిన విషయంలో తీవ్ర విమర్శలపాలయ్యాడు రోహిత్. అతడిని కెప్టెన్గా తప్పించాల్సిందేనంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: కోహ్లి సంపాదన ఎంతో తెలిస్తే షాక్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! ఎలా సంపాదిస్తున్నాడంటే? -
ఆసీస్తో సిరీస్ నా చివరిదని భార్యకు చెప్పా.. చాలా కష్టంగా ఉండేది: అశ్విన్
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తుది జట్టులో టీమిండియా వెటరన్ పేసర్ రవిచంద్రనన్ అశ్విన్కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. డబ్ల్యూటీసీ సైకిల్ 2021-23 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ను పక్కన పెట్టడం అందరినీ షాక్కు గురిచేసింది. ఇదే విషయంపై ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చనడుస్తోంది. అశ్విన్ జట్టులో ఉంటే టీమిండియా గెలిచి ఉండేదాని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో అశ్విన్ ఓ షాకింగ్ విషయం వెల్లడించాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించినట్లు ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ తెలిపాడు. కాగా అశ్విన్ తన మోకాలి గాయం కారణంగానే రిటైర్మెంట్ గురించి ఆలోచించాడు. అశ్విన్ చాలా కాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. దీని వల్ల అతని కెరీర్ కూడా చాలా దెబ్బతింది. "బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత భారత్కు వచ్చాక తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడ్డాను. ఇదే విషయంపై నా భార్యతో కూడా మాట్లాడాను. ఆస్ట్రేలియా సిరీస్ నాకు చివరిదయ్యే అవకాశం ఉందని తనకు చెప్పేశాను. గాయం కారణంగా నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాలి అనుకుంటున్నట్లు కూడా తనకు చెప్పా. బౌలింగ్ వేసే క్రమంలో నా మోకాలిపై చాలా ప్రభావం పడేది. దీంతో చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో నొప్పి మరి ఎక్కువైంది. అనంతరం బెంగుళూరు వచ్చి నొప్పికి ఇంజెక్షన్ తీసుకున్నాను. ఆ తర్వాత నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోవడానికి చాలా కష్టపడ్డా. దాదాపు రోజుకు 3-4 గంటలు కొత్త బౌలింగ్ యాక్షన్ ప్రాక్టీస్ చేశా అని ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పుకొచ్చాడు. చదవండి: చరిత్ర సృష్టించిన 12 ఏళ్ల కుర్రాడు.. ఒకే ఓవర్లో 6 వికెట్లు -
భారత క్రికెట్కు అహంకారం ఎక్కువైంది.. అందుకే ఇలా: వెస్టిండీస్ లెజెండ్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి పాలైన భారత జట్టుపై వెస్టిండీస్ లెజెండ్ సర్ ఆండీ రాబర్ట్స్ ఘూటు వాఖ్యలు చేశాడు. అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే భారత జట్టు ఓడిపోయిందని అతడు విమర్శించాడు. కాగా లండన్ వేదికగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో భారత జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జాబితాలో ఆండీ రాబర్ట్స్ కూడా చేరాడు. "భారత క్రికెట్కు అహంకారం ఎక్కవైంది. అందువల్ల ప్రపంచక్రికెట్లో మిగితా జట్లను తక్కువగా అంచనా వేస్తున్నారు. ఏదో ఒక్క కుప్పకూలిపోతారు అని నాకు తెలుసు. అందుకే భారత జట్టుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. టెస్ట్ క్రికెట్, పరిమిత ఓవర్ల క్రికెట్లో తమ లోపాలపై దృష్టి పెట్టాలి. తమ తీరును మార్చుకుని ముందుకు వెళ్లాలి. టీ20 క్రికెట్ను నేను పెద్దగా లెక్కలోని తీసుకోను. అందులో బ్యాట్ కు, బంతికి మధ్య సరైన పోటీనే లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శిస్తుందని నేను ఊహించాను. అజింక్య రహానే పోరాటం మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. రహానే తన చేతికి గాయమైనప్పటికీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. శుబ్మన్ గిల్ కొన్ని షాట్లు మంచిగా ఆడాడు. కానీ అతడు లెగ్ స్టంప్పై నిలుచుని తన వికెట్ను కోల్పోయాడు. విరాట్ కోహ్లి కూడా అంతే. మిచెల్ స్టార్క్ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకపోయింది. భారత జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ విదేశాల్లో మాత్రం రాణించలేకపోతున్నారు" అని మిడ్డే ఫ్రమ్ ఆంటిగ్వాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబర్ట్స్ పేర్కొన్నాడు. కాగా వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా విండీస్తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. చదవండి: Ashes 2023: సరికొత్త వార్నర్ను చూస్తాం.. అతడికి చుక్కలు చూపిస్తాడు: ఆసీస్ కెప్టెన్ -
లిగసీ కంటిన్యూ చేస్తారనుకున్నాం.. మూకుమ్మడి విఫలం
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రూపంలో చేతిదాకా వచ్చిన ఐసీసీ టైటిల్ను టీమిండియా చేజార్చుకుంది. ఒకసారి అంటే అనుకోవచ్చు.. కానీ వరుసగా రెండోసారి కూడా రన్నరప్గా నిలవడం అభిమానులకు రుచించడం లేదు. ఎందుకంటే పదేళ్లుగా టీమిండియా ఖాతాలో ఒక్క ఐసీసీ మేజర్ టైటిల్ లేకుండా పోయింది. ఇక క్రికెట్లో మిస్టర్ డిపెండబుల్, ది వాల్ అని పేర్లు కలిగిన రాహుల్ ద్రవిడ్ హెడ్కోచ్గా వచ్చినప్పటికి పెద్దగా ప్రభావం చూపడం లేదు. కోహ్లి-రవిశాస్త్రి లిగసీని కంటిన్యూ చేయడంలో రోహిత్- ద్రవిడ్లు విఫలమయ్యారు. అయితే కోహ్లి- రవిశాస్త్రి కూడా టీమిండియాకు కప్లు అందించింది లేదు కానీ వారిద్దరు ఉన్నప్పుడు జట్టులోకి ఎంతోమంది యువ ఆటగాళ్లు వచ్చారు. కానీ రోహిత్ హయాంలో అలా జరగడం లేదు. కేవలం అనుభవం ఉన్న ప్లేయర్లకు మాత్రమే అవకాశాలు వస్తున్నాయి తప్పితే కొత్త వాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు కోచ్గా రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్గా రోహిత్ శర్మల పదవులకు ఎసరు పెట్టేలా ఉంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్గా ఉన్న హయాంలో టీమిండియా దూకుడు మీద కనిపించేది. కెప్టెన్గా గంగూలీ ఖాతాలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ మినహా మిగతా టైటిల్స్ లేకపోయినప్పటికి తన అగ్రెసివ్నెస్తో టీమిండియాకు విదేశాల్లో విజయాలు అందించిన మొదటి కెప్టెన్గా పేరు పొందాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు 2003లో సౌతాఫ్రికా గడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్లో టీమిండియాను ఫైనల్ చేర్చాడు. ఆ తర్వాత కోచ్ చాపెల్తో వివాదం.. 2007 వన్డే వరల్డ్కప్లో టీమిండియా ఘోర వైఫల్యం దాదాను కెప్టెన్సీ కోల్పోయేలా చేసింది. అయితేనేం సౌరవ్ గంగూలీ తన మార్క్ను సెట్ చేసి వెళ్లగా దానిని ధోని సక్సెస్ఫుల్గా నడిపించాడు. 2007లో జరిగిన టి20 వరల్డ్కప్లో అండర్డాగ్స్గా బరిలోకి దిగిన ధోని సేన విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో మరింత రాటుదేలిన టీమిండియా 2011లో సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్కప్లో విజేతగా నిలిచి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. ఆ తర్వాత 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా అప్పటినుంచి మరో ఐసీసీ టైటిల్ నెగ్గలేదు. అయితే ధోని కెప్టెన్గా ఉన్నంతకాలం టీమిండియా సక్సెస్ రేట్ ఎక్కడా తగ్గలేదు. ఇక ధోని కెప్టెన్గా తప్పుకున్న తర్వాత కోహ్లి- రవిశాస్త్రి లిగసీ ప్రారంభమయింది. వీరి హయాంలో టీమిండియా విదేశాల్లో సిరీస్ విజయాలు అందుకోవడం ప్రారంభించింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లను వారి సొంతగడ్డపైనే ఓడించింది. అయితే కోహ్లి-రవిశాస్త్రి ఎరాలో టీమిండియా ఒక్క మేజర్ టైటిల్ సాధించలేదు. వీరి తర్వాత కెప్టెన్గా బాధ్యత చేపట్టిన రోహిత్.. కోచ్గా ద్రవిడ్ ఆ లిగసీని కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారు. ధోని కెప్టెన్సీలో 2011లో వన్డే వరల్డ్కప్ సాధించిన టీమిండియా.. అదే ధోని సారధ్యంలో 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ నెగ్గింది. అంతే అప్పటినుంచి ఇప్పటిదాకా పదేళ్లపాటు మరో ఐసీసీ టైటిల్ నెగ్గలేకపోయింది. అయితే ఘోరంగా ఓడిపోతే పర్లేదు.. కానీ 2013 తర్వాత జరిగిన 2014 టి20 వరల్డ్కప్లో ఫైనల్లో, 2015 వన్డే వరల్డ్కప్, 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్ల్లో, 2016 టి20 వరల్డ్కప్లో మళ్లీ సెమీస్లో, 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో ఫైనల్లో, 2022 టి20 వరల్డ్కప్లో సెమీస్లో ఇంటిబాట పట్టింది. ఇక 2021, 2023లో జరిగిన డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్లోనూ ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. అంటే దాదాపు ఎనిమిదిసార్లు కప్ కొట్టే అవకాశాన్ని చేజార్చుకున్నట్లే. చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్కప్ కొట్టబోతున్నాం: రోహిత్ -
#RAshwin: బాధ కలిగిన మాట నిజమే..
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమిండియా మరోసారి రన్నరప్కే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో టీమిండియాపై 209 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా సగర్వంగా టైటిల్ను అందుకుంది. అయితే టెస్టుల్లో వరల్డ్ నెంబర్వన్ బౌలర్గా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను అదనపు పేసర్గా తీసుకొచ్చారు. అయితే ఈ నిర్ణయంపై విమర్శలు వచ్చినప్పటికి మ్యాచ్ ముగిసేవరకు అశ్విన్ స్పందించలేదు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన అనంతరం అశ్విన్ ఎట్టకేలకు నోరు విప్పాడు. ట్విటర్ ద్వారా స్పందించిన అశ్విన్ ముందుగా ఆస్ట్రేలియాకు శుభాకాంక్షలు తెలిపాడు. ''డబ్ల్యూటీసీ టైటిల్ సాధించిన పాట్ కమిన్స్ సేనకు కంగ్రాట్స్. ఈ విజయానికి వారు అర్హులు. నన్ను ఎంపిక చేయకపోవడంపై పెద్దగా బాధ లేదు. ఎంత కష్టపడినా జట్టులో 11 మందికి మాత్రమే చోటు ఉంటుంది. వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉండడంతో ఒక స్పిన్నర్ చాలనుకొని జడేజాను ఆడించారు. అయితే టీమిండియా ఓటమి బాధ కలిగించింది నిజమే. మన జట్టులో కొన్ని లోపాలున్నప్పటికి గెలవడానికి ప్రయత్నించిన పోరాటం బాగుంది. రెండేళ్లు కష్టపడితే డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వచ్చాం. ఇలా ఆఖరి మెట్టుపై బోల్తా పడడం బాధనే కలిగిస్తుంది కదా. ఇంకో విషయం ఏంటంటే.. ఈ రెండేళ్లలో నాతో పాటు ఎన్నో టెస్టు మ్యాచ్లు ఆడిన సభ్యులకు.. ముఖ్యంగా కోచింగ్, సపోర్ట్ స్టాఫ్కు ప్రత్యేక కృతజ్ఞతలు. త్వరలోనే మీ ముందుకు వస్తా'' అంటూ తెలిపాడు. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్లో టీమిండియా తరపున అశ్విన్ అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ సైకిల్లో అశ్విన్ మొత్తంగా 61 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ అదే డబ్ల్యూటీసీ ఫైనల్లో మొత్తంగా ఐదు వికెట్లు(తొలి ఇన్నింగ్స్లో ఒకటి, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు) పడగొట్టాడు. ఒకవేళ అశ్విన్ ఫైనల్ ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు భావిస్తున్నారు. Congratulations Australia on winning this #WTCFinal and closing out this cycle of test cricket. It is disappointing to end up on the wrong side of things, nevertheless it was a great effort over the last 2 years or so to get here in the first place. Amidst all the chaos and… — Ashwin 🇮🇳 (@ashwinravi99) June 11, 2023 చదవండి: అహ్మదాబాద్ స్టేడియం నిజంగా గొప్పదా!.. ఎందుకంత ప్రాముఖ్యత? -
కోహ్లి అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు.. అది అతడికే తెలియాలి: గంగూలీ
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. రోహిత్ టెస్టులకు కెప్టెన్గా పనికిరాడని, వెంటనే అతడిని ఆ భాధ్యతల నుంచి తప్పించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు. మరి కొంత మంది కెప్టెన్గా రోహిత్ కంటే విరాట్ కోహ్లి ఎంతో బెటర్ అని, అతడి సారధ్యంలో భారత జట్టు అద్బుతంగా రాణించందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లిని టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోవాలని ఎప్పుడూ తాము కోరుకోలేదని, అది అతడి వ్యక్తిగత నిర్ణయమని గంగూలీ తెలిపాడు. కాగా గతేడాది ఆరంభంలో ధక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకున్నాడు. అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లి.. ఆ సిరీస్ అనంతరం టెస్టులకు కూడా గుడ్బై చెప్పేశాడు. అయితే అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న సౌరవ్ గంగూలీతో విభేదాల కారణంగానే కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వినిపించాయి. ఇక కోహ్లి తప్పుకున్న అనంతరం రోహిత్ శర్మ భారత జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని మేము అస్సలు ఊహించలేదు. అప్పటికే మేము దక్షిణాఫ్రికా సిరీస్ కోల్పోయి బాధలో ఉన్నాము. అంతలోనే కోహ్లి ఇటువంటి నిర్ణయం తీసుకుని మమ్మల్ని షాక్కు గురిచేశాడు. అయితే టెస్టు కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో కోహ్లికే తెలియాలి. అది అతడి వ్యక్తిగత నిర్ణయం. కోహ్లి తప్పుకున్న తర్వాత భారత జట్టుకు ఓ కెప్టెన్ అవసరం వచ్చింది. ఆ సమయంలో రోహిత్ బెస్ట్ అనిపించాడు. అందుకే సెలక్షన్ కమిటీ రోహిత్ పగ్గాలు అప్పజెప్పింది అని ఆజ్ తక్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఐసీసీ ఈవెంట్లో రాణించలేకపోతుంది అని పలువురు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా దాదా మాట్లాడుతూ.. ప్రపంచకప్ గెలవడం కంటే ఐపీఎల్ టైటిల్ గెలవడం చాలా కష్టం. 14 మ్యాచ్ ల తర్వాత ప్లేఆఫ్స్ చేరుకుంటారు. వరల్డ్ కప్లో నాలుగైదు మ్యాచ్ లలో గెలిస్తే సెమీస్ వెళ్తారు. ఐపీఎల్లో 17 మ్యాచ్ ల తర్వాత టైటిల్ గెలుస్తారు" అని గంగూలీ అన్నాడు. చదవండి: LPL 2023: లంక ప్రీమియర్ లీగ్ ఆడనున్న సురేష్ రైనా.. ధర ఎంతంటే? -
డబ్ల్యూటీసీ ఓటమి ఎఫెక్ట్.. పుజారా, ఉమేశ్ యాదవ్లపై వేటు..?
వరుసగా రెండో సీజన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. చర్యల్లో భాగంగా గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనలు చేస్తున్న ఆటగాళ్లపై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రకారం.. త్వరలో ప్రారంభంకాబోయే విండీస్ టూర్ కోసం టీమిండియాలో సమూల మార్పుల చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ల్లో దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్లపై వేటుకు సర్వం సిద్ధమైనట్లు సమాచారం. వీరి స్థానంలో యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ పలు మార్పులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2023 ప్రదర్శనల ఆధారంగా పలు ఎంపికలు ఉండవచ్చని సమాచారం. టీ20ల్లో రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, మోహిత్ శర్మలకు దాదాపుగా ఛాన్స్ దక్కవచ్చని తెలుస్తోంది. విండీస్ టూర్లో సీనియర్ల గైర్హాజరీలో వీరికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని బోర్డు యోచిస్తున్నట్లు వినికిడి. ఇదే విండీస్ టూర్లో వన్డేల కోసం పలువురు ఆటగాళ్లను ప్రత్యేకంగా ఎంపిక చేయవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ లిస్ట్లో శిఖర్ ధవన్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ధవన్కు వయసు పైబడుతుండటంతో వరల్డ్కప్కు ముందు వీలైనన్ని అవకాశాలు కల్పించాలన్నది బీసీసీఐ యోచనగా తెలుస్తోంది. కాగా, 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం భారత జట్టు జులై 12 నుంచి వెస్టిండీస్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ తొలుత టెస్ట్లు, ఆతర్వాత వన్డేలు, టీ20లు ఆడుతుంది. విండీస్ పర్యటన వివరాలు.. తొలి టెస్ట్- జులై 12-16, డొమినికా రెండో టెస్ట్- జులై 20-24, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా చదవండి: WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్గా ఈ ఐదుగురు క్రికెటర్లు -
WTC Final 2023: ఆల్ ఫార్మాట్ సూపర్ స్టార్స్గా ఈ ఐదుగురు క్రికెటర్లు
తాజాగా ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్లో విజేతగా నిలవడం ద్వారా మూడు ఫార్మాట్ల ఐసీసీ టైటిల్స్ సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా టీమ్ చరిత్ర పుటల్లోకెక్కిన విషయం తెలిసిందే. జట్టుగా ఆసీస్ ఈ రికార్డు సాధించగా.. వ్యక్తిగతంగా ఐదుగురు ఆటగాళ్లు కూడా ఈ ఘనత సాధించారు. పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్లు మూడు ఫార్మాట్ల ఐసీసీ టైటిల్స్ (2015 వన్డే వరల్డ్కప్, 2021 టీ20 వరల్డ్కప్, 2023 డబ్ల్యూటీసీ) గెలిచిన ఆటగాళ్లుగా రికార్డుల్లోకెక్కారు. ఈ ఐదుగురు వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్, డబ్ల్యూటీసీ టైటిల్స్ గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ క్రికెట్లో ఈ ఐదుగరు మినహా మరెవ్వరూ ఈ ఘనత సాధించలేకపోయారు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై ఆసీస్ 209 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ఇతర దేశాల క్రీడా సంస్కృతికి భారత్లో జరుగుతున్న తంతుకు మధ్య వ్యత్యాసాన్ని వివరించాడు. క్రికెట్లో వ్యక్తి పూజపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. జట్టు కంటే ఆటగాళ్లను ఎక్కువగా ఆరాధించే అభిమానుల వైఖరిపై మండిపడ్డాడు. జట్టు ఓడిపోయినా పర్వాలేదు, తమ ఆరాధ్య ఆటగాడు రాణిస్తే చాలనుకునే మనస్తత్వాన్ని ఫ్యాన్స్ వీడాలని పిలుపునిచ్చాడు. భారత దేశంలో క్రికెటర్లు క్రికెట్ కంటే ఎత్తుకు ఎదిగిపోయారని అన్నాడు. కొందరు క్రికెటర్లు తాము ఆట కంటే గ్రేట్ అని ఫీలవ్వడానికి అభిమానుల వైఖరే కారణమని తెలిపాడు. భారత క్రికెట్లో క్రికెటర్లను ఆరాధించే సంస్కృతి పోతే తప్ప టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేదని అభిప్రాయపడ్డాడు. జట్టు కంటే ఆటగాడు ఎప్పుడూ ఎక్కువ కాదని, ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానులు ఇతర దేశాల ఫ్యాన్స్ను చూసి నేర్చుకోవాలని అన్నాడు. భారత్లో లాగా ఇతర దేశాల్లో క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా ఆరాధించరని, వ్యక్తిగత భజన కంటే వారికి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని తెలిపాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ సంస్కృతి ఉంది కాబట్టే ఆ జట్లు విశ్వవేదికపై భారత్ కంటే మెరుగ్గా రాణిస్తున్నాయని అన్నాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఉద్దేశించి చేసినవిగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో భారత జట్టు నాలుగు సందర్భాల్లో ఫైనల్కు చేరినా నిరాశే మిగిలింది. నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలై, నాలుగో సారి ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. ఇటు సోషల్ మీడియాలోనూ భారత్ ఓటమిని జీర్ణించుకోవట్లేదు అభిమానులు. తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు ఫ్యాన్స్. Indians trying to hold ICC trophy in last 10 yearspic.twitter.com/p0iK63TzK7— Sagar (@sagarcasm) June 11, 2023 చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..! -
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..!
Roger Binny: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, మాజీలు, విశ్లేషకులు టీమిండియాను ఏకి పారేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే సోషల్మీడియా వేదికగా భారత ఆటగాళ్లను ఓ రేంజ్లో ఎండగడుతున్నారు. మాజీలు, విశ్లేషకులు సైతం ఎన్నడూ లేనంతగా స్వరం పెంచి టీమిండియా వైఫల్యాలను తూర్పారబెడుతున్నారు. బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ సైతం టీమిండియాను వదిలిపెట్టలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ చేసిన సెంచరీలే భారత్కు ఆసీస్కు మధ్య వత్యాసమని తెలిపాడు. హెడ్, స్మిత్ భాగస్వామ్యమే టీమిండియా కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. ఈ పార్ట్నర్షిపే ఆసీస్ టీమిండియాపై ఆధిక్యత ప్రదర్శించేలా చేసిందని అన్నాడు. హెడ్, స్మిత్ సెంచరీ చేయకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల పోరాటం మూలాన మ్యాచ్ ఆఖరి రోజు వరకు వచ్చింది కాని, నా దృష్టిలో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందంటూ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ ఫైర్ -
ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై లెజెండ్ ఫైర్
ఐసీసీ ఈవెంట్లో టీమిండియా మరోసారి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా ఘోర ఓటమి చూసింది. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే కుప్పకూలింది. కాగా డబ్ల్యూటీసీ విజేతను నిర్ణయించడానికి కేవలం ఒక్క మ్యాచ్ సరిపోదని, కనీసం మూడు మ్యాచ్ల సిరీస్నైనా ఆడించాలని రోహిత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ వాదనతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విభేదించాడు. "డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంతో కాలం క్రితమే నిర్ణయించబడి ఉంటుంది. ఫైనల్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఉంటుందని డబ్ల్యూటీసీ సైకిల్ మొదటి మ్యాచ్ మొదలకావడానికి ముందే మీకు తెలుసు. కాబట్టి అందకు తగ్గట్టు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. మీరు ఐపీఎల్కు ఎలా అయితే సిద్దమవుతున్నారో ఈ మ్యాచ్కు కూడా అలానే ప్రిపేర్ కావాలి. అక్కడ ఎవరూ మూడు మ్యాచులు పెట్టండి అని అడగడం లేదు కాదా. ఎవరికైనా కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. భవిష్యత్తులో ముందుకు ఎలా వెళ్లాలన్న దాని గురించి ఆలోచించాలి. ఇప్పుడు విజేతను నిర్ణయించడానికి మూడు మ్యాచ్లు పెట్టమని అడుగుతున్నారు. అదే అప్పుడు కూడా ఓడిపోతే ఐదు మ్యాచ్లు పెట్టమని అడగరని గ్యారంటీ ఎంటీ" అని సన్నీ ప్రశ్నించాడు. చదవండి: WTC Final: కోహ్లికి ఏమైంది.. రోహిత్, ద్రవిడ్తో విభేదాలా? కారణం అదేనా -
టాస్ ఓడిపోవడమే మంచిదైంది..
-
కోహ్లికి ఏమైంది.. రోహిత్, ద్రవిడ్తో విభేదాలా? కారణం అదేనా
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి వరుసగా సోషల్ మీడియాలో క్రిప్టిక్ స్టోరీలను పోస్టు చేస్తున్నాడు. తాజగా ఈ ఓటమి తర్వాత ఇన్స్టాగ్రామ్లో మరో క్రిప్టిక్ స్టోరీని కోహ్లి పోస్టు చేశాడు. "మౌనమే మన బలానికి గొప్ప మూలం" అర్ధం వచ్చే పోస్టును విరాట్ షేర్ చేశాడు. అంతకు ముందు కూడా విరాట్ కోహ్లి ఈ తరహా మరో పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్ చేయాలి " అంటూ ఇన్స్టాలో క్రిప్టిక్ స్టోరీని షేర్ చేశాడు. అయితే విరాట్ ఇటువంటి పోస్టులు ఎందుకు చేస్తున్నాడో తెలియక అతడి అభిమానులు బుర్రలు చించుకుంటున్నారు. మరి కొంతమంది అయితే మరో అడుగు ముందుకు వేసి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో కోహ్లికి విభేదాలు ఏర్పడ్డాయి అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టు ఎంపిక విషయంలో కోహ్లి సూచనలను రోహిత్, ద్రవిడ్ పరిగణలోకి తీసుకోలేదని, అందుకే అతడు జట్టు మేనేజ్మెంట్పై ఆసంతృప్తిగా ఉన్నాడని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. చదవండి: WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. ఇలా అయితే చాలా కష్టం: సెహ్వాగ్ Instagram story of Virat Kohli. pic.twitter.com/sv0iFAzqtc — Johns. (@CricCrazyJohns) June 11, 2023 -
టీమిండియా చేసిన తప్పు అదే.. ఇలా అయితే చాలా కష్టం: సెహ్వాగ్
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో 209 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో పేలవ ప్రదర్శన కరబరిచిన భారత జట్టు ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. టీమిండియా కనీస పోటీ కూడా ఇవ్వకుండా టైటిల్ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. ఇక ఈ కీలక మ్యాచ్కు రవిచంద్రన్ అశ్విన్ పక్కన పెట్టిన భారత జట్టు మెనెజ్మెంట్పై మొదటి రోజు నుంచే విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తవించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా తప్పిదాలను సెహ్వాగ్ ఎత్తి చూపాడు. "డబ్ల్యూటీసీ విజేతగా నిలిచినందుకు ఆస్ట్రేలియాకు అభినందనలు. వారు చాంపియన్స్గా నిలవడానికి అర్హులు. అయితే ఆసీస్ జట్టులో ఎడమచేతి బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అశ్విన్ జట్టులో ఉండాల్సింది. అతడు లెఫ్ట్హ్యండర్స్కు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. ఎప్పుడైతే అశ్విన్ను పక్కన పెట్టి జట్టు మెనెజ్మెంట్ పెద్ద తప్పుచేసింది. అది వాళ్ల ఓటమికి ఒక కారణం. అదేవిధంగా భారత టాపర్డర్ కూడా చాలా నిరాశపరిచింది. వారు కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఛాంపియన్షిప్లను గెలుచుకోవాలంటే ఇటువంటి ఆటతీరు పనికిరాదు. ఇంకా బెటర్ మైండ్ సెట్తో ముందుకు పోవాలని" ట్విటర్లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. చదవండి: World Cup 2023: ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఉప్పల్లో నో వరల్డ్కప్ మ్యాచ్! పాక్- భారత్ మ్యాచ్ అక్కడే Congratulations to Australia on winning the #WTCFinal. They are the deserved winners. India lost it in their minds when they decided to exclude Ashwin against a left-handed heavy attack. Plus the top order needed to bat better. Need to have better mindset and approach to win… — Virender Sehwag (@virendersehwag) June 11, 2023 -
టాస్ ఓడిపోవడమే మంచిదైంది.. అతడు నా ఫేవరేట్ ప్లేయర్: కమ్మిన్స్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 టైటిల్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఇక చారిత్రత్మక విజయంపై మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెప్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఈ మ్యాచ్లో అదరగొట్టిన బోలాండ్పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోవడమే మంచిదైంది. లేకపోతే మేమూ బౌలింగ్ తీసుకునేవాళ్లం. కొన్నిసార్లు భారత్ ప్రతిఘటించినా, ఎక్కువ భాగం మేమే ఆధిపత్యం ప్రదర్శించాం. మాకు సంబంధించి ఇదో మధుర క్షణం. ఈ విజయాన్ని కొన్ని రోజులు ఆస్వాదించిన తర్వాతే యాషెస్ గురించి ఆలోచిస్తాం. ఈ మ్యాచ్లో బోలాండ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బోలాండ్ నా ఫేవరేట్ ప్లేయర్. హెడ్, స్టీవ్ కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఇక ఫైనల్ ఒక్క మ్యాచ్ ఉండటమే మంచిది. అనుకంటే 50 మ్యాచ్ల సిరీస్ కూడా ఆడవచ్చు. ఒలింపిక్స్లో ఒక్క రేస్ గెలిస్తేనే స్వర్ణం దక్కుతుంది కదా అని" పోస్ట్ మ్యాచ్ కాన్పరెన్స్లో కమ్మిన్స్పేర్కొన్నాడు. చదవండి: WTC Final: ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. కోహ్లి క్రిప్టిక్ పోస్ట్! మౌనమే అంటూ -
ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి.. కోహ్లి క్రిప్టిక్ పోస్ట్! మౌనమే అంటూ
ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుని 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన టీమిండియాకు మరోసారి నిరాశే ఎదురైంది. లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఇక 444 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్లో ఏ ఒక్క భారత బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ మార్క్ను అందుకోలేకపోయారు. విరాట్ కోహ్లి (49), అజింక్య రహానే (46) విజయంపై ఆశలు రేపినా.. ఎక్కువ సేపు నిలువలేకపోయారు. ఇక ఈ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక క్రిప్టిక్ స్టోరీని పోస్టు చేశాడు. "మౌనమే మన బలానికి గొప్ప మూలం" అంటూ అర్ధం వచ్చే పోస్టును విరాట్ షేర్ చేశాడు. కాగా ఐదో రోజు ఆటకు ముందు కూడా విరాట్ కోహ్లి ఈ తరహా మరో పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్ చేయాలి" అంటూ ఇన్స్టాలో క్రిప్టిక్ స్టోరీని షేర్ చేశాడు. Instagram story of Virat Kohli. pic.twitter.com/sv0iFAzqtc — Johns. (@CricCrazyJohns) June 11, 2023 -
రోహిత్ను తొలగిస్తే!.. భారత కొత్త టెస్టు కెప్టెన్ ఎవరంటే?
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను విజేతగా నిలపడంలో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెస్టుల్లో రోహిత్ కెప్టెన్గా పనికిరాడని.. అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్గా టెస్టు సిరీస్లు గెలిచినప్పటికి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్స్లో జట్టును నడిపించడంలో విఫలం కావడంతోనే రోహిత్ను తప్పించాలనే డిమాండ్ ఎక్కవగా వినిపిస్తోంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ప్రత్యామ్నాయం ఎవరనే దానికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు అజింక్యా రహానే. 512 రోజుల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడిన రహానే అందరికంటే మంచి ప్రదర్శన చేశాడు. అసలు రహానే లేకపోయుంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మూడు రోజుల్లోనే ముగిసిపోయేది. తొలి ఇన్నింగ్స్లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియా పరువు కాపాడడంతో పాటు మ్యాచ్ ఐదురోజులు జరగడానికి కారణమయ్యాడు. ఇక రోహిత్ స్థానంలో రహానే టీమిండియా టెస్టు కెప్టెన్గా సరైనోడని చాలా మంది పేర్కొంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టు ఓటమి అనంతరం అప్పటి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నిటీ లీవ్స్ పేరిట స్వదేశానికి వచ్చేశాడు. దీంతో వైస్ కెప్టెన్గా ఉన్న రహానే.. తాత్కాలిక కెప్టెన్గా జట్టును నడిపించాడు. నడిపించడమే కాదు అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా సూపర్ సక్సెస్ అయ్యాడు. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా గెలవడంలో రహానే పాత్ర కీలకం. కెప్టెన్గా అతని తీసుకున్న నిర్ణయాలతో పాటు బ్యాటింగ్లో సెంచరీతో మెరవడంతో భారత్ రెండో టెస్టు గెలిచింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు 2-1తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో భవిష్యత్తు కెప్టెన్గా రహానే పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు రోహిత్ టెస్టు కెప్టెన్గా తరచూ విఫలం అవుతుండడంతో అతని స్థానంలో రహానే అయితేనే కరెక్ట్ అని చాలా మంది భావిస్తున్నారు. రహానేలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. జట్టు ఓటమి దిశగా ఉన్నప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి మ్యాచ్ను గాడిన పెట్టడం రహానేకున్న సమర్థత అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇప్పుడు కాకపోయినా రోహిత్ తర్వాతి టెస్టు కెప్టెన్ అజింక్యా రహానేనే అవుతాడని అభిమానులు బల్ల గుద్ది చెబుతున్నారు. Ajinkya Rahane's Captaincy Record :- No. Of Matches - 5 Wins - 4 Draw - 1 Loss - 0 👑 Also he led India to the historic series victory against AUS while overcoming a 36 runs all out defeat led by kohli. Petition for BCCI to make Rahane nxt Captain If you want any trophies. pic.twitter.com/tN6qADrzBx — 🄺Ⓐ🅃🄷🄸🅁 1⃣5⃣ (@katthikathir) June 11, 2023 He should be the test captain if they want any kind of good test cricket. Thankyou Ajinkya Rahane. pic.twitter.com/HnpMZ5oLaI — mona (@notafsidekick) June 11, 2023 చదవండి: #RetireRohit: 'కెప్టెన్గా దిగిపో.. కాదంటే రిటైర్ అయిపో' WTC Final 2023: 21వ శతాబ్దం మొత్తంలో ఈ ఆసీస్ బౌలర్ను మించినోడే లేడు -
WTC Final 2023: 21వ శతాబ్దం మొత్తంలో ఈ ఆసీస్ బౌలర్ను మించినోడే లేడు
ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో 5 వికెట్లతో ఇరగదీసిన ఈ వెటరన్ ఫాస్ట్ బౌలర్.. ఈ శతాబ్దంలోనే (21) టెస్ట్ల్లో అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్(కనీసం 30 వికెట్లు తీసిన బౌలర్లలో) కలిగిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. బోలండ్ తానాడిన 8 మ్యాచ్ల్లో 14.57 సగటున 33 వికెట్లు పడగొట్టాడు. ఈ శతాబ్దంలో గడిచిన 22 ఏళ్లలో ఇంత తక్కువ బౌలింగ్ యావరేజ్ కలిగిన బౌలర్ ఎవరూ లేరు. కాగా, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో బోలండ్ టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్, శ్రీకర్ భరత్లను క్లీన్ బౌల్డ్ చేసిన బోలండ్.. సెకెండ్ ఇన్నింగ్స్లో మరింత రెచ్చిపోయి మరోసారి గిల్ వికెట్ను, కీలకమైన విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వికెట్లను దక్కించుకున్నాడు. 34 ఏళ్ల బోలండ్ ఇప్పటివరకు ఆడిన 8 టెస్ట్ల్లో ఆసీస్ పాలిట ట్రంప్ కార్డుగా నిలిచాడు. నిప్పులు చెరిగే వేగంతో బౌలింగ్ చేసే ఇతను ముఖ్యంగా సొంత దేశంలో పిచ్లపై చెలరేగిపోతాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. -జాన్పాల్, సాక్షి వెబ్డెస్క్ చదవండి: WTC Final 2023: ఐపీఎల్ నుంచి నేరుగా వచ్చి ఆడితే ఇలాగే ఉంటది..! -
#RetireRohit: 'కెప్టెన్గా దిగిపో.. కాదంటే రిటైర్ అయిపో'
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవ్వగానే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓటమికి తొలి బాధ్యుడిగా కెప్టెన్ రోహిత్ శర్మనే టార్గెట్ చేశారు అభిమానులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం #Retire #Rohitsharma హ్యాష్ట్యాగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయంటేనే కోపం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇక అభిమానులు కూడా రోహిత్ను ట్రోల్ చేశారు. ''నువ్వు కెప్టెన్గా పనికిరావు.. నువ్వు ఏదో చేస్తావని కోహ్లి నుంచి నీకు ఇచ్చారు.. కానీ కెప్టెన్గా దారుణంగా విఫలమవుతున్నావు.. చేతగాకపోతే కెప్టెన్గా దిగిపో.. అదీ కాదంటే రిటైర్ అయిపో బాగుంటుంది.. ప్లీజ్రిటైర్ వడాపావ్'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కనీసం పోరాడే ప్రయత్నం కూడా చేయకుండా ఆలౌట్ కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఏదో చేస్తారనుకున్న కోహ్లి, రహానేలు కూడా జట్టును రక్షించడంలో విఫలమయ్యారు. ఇక రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. రెండో ఇన్నింగ్స్లో ఆడిన బ్యాటింగ్ తొలి ఇన్నింగ్స్లో ఆడి ఉంటే టీమిండియా పరిస్థితి కచ్చితంగా వేరుగా ఉండేది. ఐపీఎల్లో నమోదు చేసిన చెత్త ప్రదర్శననే ఇక్కడా కొనసాగించాడు. ఒక కెప్టెన్ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన సమయంలో నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం అతనికే చెల్లింది. ఒక బ్యాటర్గా విఫలమైన రోహిత్.. తాజాగా కెప్టెన్గానూ పనికిరాలేకపోయాడు. కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్న రోహిత్.. తాను నాయకుడిగా ఒక్క మేజర్ ట్రోఫీని గెలవలేకపోగా కొన్ని సిరీస్లు కోల్పోయాడు. రోహిత్ కెప్టెన్ అయ్యాకా టీమిండియా టి20 ప్రపంచకప్తో పాటు ఆసియా కప్ను గెలవలేకపోయింది. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ నిరాశే ఎదురైంది. దీనికి తోడు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలకు అతని కెప్టెన్సీలోనే టీమిండియా సిరీస్ కూడా కోల్పోయింది. ఇన్ని ప్రతికూలతల మధ్య రోహిత్ మరో నాలుగు నెలల్లో వన్డే వరల్డ్కప్లో టీమిండియాను నడిపించనున్నాడు. ఇక్కడ కూడా రోహిత్ విఫలమైతే కెప్టెన్సీ పోవడమే కాదు కెరీర్కు ఎండ్కార్డ్ పడే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడు రోహిత్ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని చెప్పలేం కానీ ఆ అవకాశముంది. ఒకవేళ రోహిత్ను టెస్టు కెప్టెన్సీ నుంచి తొలగిస్తే అతని స్థానంలో అజింక్యా రహానే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే క్రమంగా టి20 కెప్టెన్సీ హార్దిక్ పాండ్యా చేతుల్లోకి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. రానున్న టి20 సిరీస్ల్లో రోహిత్ ఆడడం అనుమానమే.. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్గా జట్టును నడిపించడం దాదాపు ఖాయమే. ఇక వన్డే వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకొని రోహిత్ను కేవలం వన్డేలకే కెప్టెన్గా పరిమితం చేసే చాన్స్ కూడా ఉంది. ఈ లెక్కన రోహిత్ ఒకవేళ వన్డే వరల్డ్కప్లో టీమిండియాను విజేతగా నిలపకపోవతే కెప్టెన్గానే కాదు ఆటగాడిగానూ అతని కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే! Rohit Sharma after becoming full time captain : Lost Asia Cup Lost T20 World Cup Lost WTC final .. RETIRE VADAPAV SACK ROHIT...... pic.twitter.com/oj4eQo5PI5 — ☞➸♕ ηίςհαηt☜⚓♕ (@Nishant__907) June 11, 2023 @ImRo45 Do this 1) Retire from T20Is. No need for that format again 2) Step down from Test captaincy. Better focus on batting. He isn't Test captaincy material 3) BIGGEST POINT - Work on fitness 4) Stop that intent thing. The day when he stops this he'll automatically improve — Aadvik (@thecoolguy03) June 11, 2023 No true ICT fan will pass without liking this post !! RETIRE VADAPAV SACK ROHIT SHARMA#WTCFinals #WTCFinal2023 #WTC2023Final pic.twitter.com/SwYcjf7ooN — Cric_uneeb (@GOAT_Virat18) June 11, 2023 చదవండి: 'ఇదొక గుణపాఠం.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మా కొంపముంచింది' ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా -
WTC Final 2023: ఐపీఎల్ నుంచి నేరుగా వచ్చి ఆడితే ఇలాగే ఉంటది..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు భారత ఆటగాళ్లను ఏకి పారేస్తున్నారు. అంతకుమించి ఐపీఎల్, బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి బీసీసీఐ, ఐపీఎలే ప్రధాన కారణమని మండిపడుతున్నారు. గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూల్ను ఫిక్స్ చేసి బీసీసీఐ పొరపాటు చేస్తే.. మ్యాచ్ల సంఖ్యను పెంచి ఐపీఎల్ యాజమాన్యం ఘోర తప్పిదం చేసిందని అంటున్నారు. ఐపీఎల్ షెడ్యూల్ పెరగడంతో ఆటగాళ్లు శారీరకంగా, మానసికంగా అలసటకు లోనయ్యారని, ఈ విషయంలో బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం లోపాయకారి ఒప్పందం చేసుకుని దేశ ప్రయోజనాలకు పణంగా పెట్టాయని మండిపడుతున్నారు. సరే, పెంచుకుంటే పెంచుకున్నారు.. తదుపరి ప్రతిష్టాత్మక మ్యాచ్ ఉందని తెలిసి కూడా ఆటగాళ్లకు కనీస విరామం ఎందుకివ్వలేదని నిలదీస్తున్నారు. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసి బీసీసీఐ, సొంత ప్రయోజనాల కోసం ఐపీఎల్, డబ్బు కోసం ఆటగాళ్లు భారత క్రికెట్ అభిమానుల మనోభావాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఓ ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్కు ఛేంజ్ అయ్యేప్పుడు ఆటగాళ్లకు కనీస ప్రాక్టీస్, విరామం ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బీసీసీఐ వ్యవహరిస్తే.. ఎవరెటు పోతే మాకేం, మన పని జరిగిపోయింది కదా అన్న చందంగా ఐపీఎల్ యాజమాన్యం స్వార్ధపూరితంగా వ్యవహరించిందని మండిపడుతున్నారు. ఐపీఎల్ నుంచి నేరుగా వచ్చి ఆడితే ఇలాగే ఉంటదని కామెంట్స్ చేస్తున్నారు. విశ్వవేదికపై ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉందని తెలిసి కూడా బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యం, ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇదే టీమిండియా కొంపముంచిందని ఆరోపిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్కు ముందు ఆసీస్ ఆటగాళ్ల సన్నద్ధత చూసి సిగ్గు పడాలని.. కాసులు కురిపించే ఐపీఎల్లో ఆడే అవకాశం ఉన్నా వారు దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా హర్షనీయమని అంటున్నారు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. -మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
'ఇదొక గుణపాఠం.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ మా కొంపముంచింది'
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2021-23 టైటిల్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఓవల్ వేదికగా ఆసీస్తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. వరుసగా రెండో ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన టీమిండియా రన్నరప్కే పరిమితమైంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ''టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని వారిని(ఆస్ట్రేలియాను) కఠిన పరిస్థితుల్లో బ్యాటింగ్కి దించడంతో మేము బాగా ప్రారంభించామని అనుకున్నాను. అందుకు అనుగుణంగా మా బౌలర్లు ఆట తొలిరోజు మొదటి సెషన్లో బాగా బౌలింగ్ చేశారు. కానీ తర్వాతి సెషన్ నుంచి మా పతనం ఆరంభమైంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. పట్టు చిక్కిందనుకున్న సమయంలో ట్రెవిస్ హెడ్, స్టీవెన్ స్మిత్ల భాగస్వామ్యం వారిని ముందంజలో ఉంచింది. ఒక రకంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో చేసిన పరుగులతోనే సగం విజయం సాధించింది. కానీ మేము గెలవడానికి ప్రయత్నించాం. రెండో ఇన్నింగ్స్లో వారిని తొందరగా ఔట్ చేయాలనుకున్నాం. అందులో దాదాపు సక్సెస్ అయ్యాం. కానీ తొలి ఇన్నింగ్స్లో లభించిన భారీ ఆధిక్యం వాళ్లకు కలిసొచ్చింది.. అదే మా కొంపముంచింది. మా బ్యాటింగ్ విభాగం బాగానే ఉందనుకుంటున్నా. కీలక సమయంలో ఆడడంలో విఫలమయ్యాం. నాలుగేళ్లలో రెండు ఫైనల్స్ ఆడామంటే మా ఆట బాగానే ఉందని అర్థం. ఈ ఫైనల్ కోసం రెండేళ్లు పాటు కష్టపడ్డాం. వరుసగా టెస్టు సిరీస్లు గెలిచి ఫైనల్ దాకా వచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్లో ఓడిపోయాం. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానులు మాకు బాగా మద్దతిచ్చారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అంటూ ముగించాడు. -
WTC Final 2023: ఐసీసీ ఫైనల్స్లో కొనసాగుతున్న టీమిండియా వైఫల్యాల పరంపర
ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్లో టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. 2014 నుంచి వరుసగా నాలుగు ఫైనల్స్లో భారత జట్టు ఓటమిపాలైంది. 2014 టీ20 వరల్డ్కప్ ఫైనల్లో (శ్రీలంక చేతిలో) ధోని సారధ్యంలో ఓటమిపాలైన భారత్.. ఆతర్వాత కోహ్లి నేతృత్వంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో (పాకిస్తాన్ చేతిలో), అదే కోహ్లి సారధ్యంలో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో (న్యూజిలాండ్ చేతిలో), తాజాగా రోహిత్ శర్మ సారధ్యంలో 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో (ఆస్ట్రేలియా చేతిలో) ఓటమిపాలైంది. 2014 నుంచి నాకౌట్ మ్యాచ్ల్లో టీమిండియా పరిస్థితి దయనీయంగా ఉంది. నాటి నుంచి భారత జట్టు ఆడిన 8 ఐసీసీ నాకౌట్స్లో ఓటమిపాలైంది. 2014 టీ20 వరల్డ్కప్ ఫైనల్స్ (శ్రీలంక చేతిలో), 2015 వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్స్ (ఆసీస్ చేతిలో), 2016 టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్స్ (విండీస్ చేతిలో), 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ (పాకిస్తాన్ చేతిలో), 2019 వన్డే వరల్డ్కప్ సెమీస్ (న్యూజిలాండ్ చేతిలో), 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్ (న్యూజిలాండ్ చేతిలో), 2022 టీ20 వరల్డ్కప్ సెమీస్ (ఇంగ్లండ్ చేతిలో), తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ (ఆసీస్ చేతిలో) మ్యాచ్ల్లో టీమిండియా వరుసగా పరాజయాలపాలైంది. మరోవైపు ఆసీస్ ఏమో మూడు ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
ఆస్ట్రేలియా చరిత్ర.. అన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి జట్టుగా
డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్గా ఆస్ట్రేలియా అవతరించింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్లోని ఓవల్ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ 209 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 444 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కనీసం డ్రాకు కూడా ప్రయత్నించకుండానే 234 పరుగులకు ఆలౌట్ అయింది తొలి సెషన్లోపే ఆసీస్ బౌలర్ల ధాటికి తోక ముడిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. గిల్ క్యాచ్ విషయంలో చేసిన పొరపాటు మినహా మిగతా అన్ని విషయాల్లో పక్కా ప్లాన్తో ఆడిన ఆస్ట్రేలియా పరిపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికే వన్డే, టి20 వరల్డ్కప్స్తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలు నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. తాజా డబ్ల్యూటీసీ టైటిల్తో కలిసి ఇప్పటివరకు ఆసీస్ తొమ్మిది ఐసీసీ టైటిల్స్ నెగ్గడం విశేషం. అందులో వన్డే వరల్డ్కప్ను ఐదుసార్లు(1987, 1999, 2003, 2007, 2015), ఒక టి20 వరల్డ్కప్(2021), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండుసార్లు (2006, 2009)లో గెలుచుకున్న ఆస్ట్రేలియా తాజాగా 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గి ఐసీసీ అన్ని మేజర్ టైటిల్స్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. ✅ICC ODI World Cup ✅ICC Champions Trophy ✅ICC T20 World Cup ✅ICC World Test Championship Australia becomes the first team to win all ICC trophies 👏 Their 9th ICC title🤯 pic.twitter.com/yQLXJFFtTu — CricTracker (@Cricketracker) June 11, 2023 చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా వరుసగా రెండో సీజన్లో ఫైనల్కు చేరి ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో ఎలాగైనా టైటిల్ గెలుస్తుందని భావించిన అభిమానుల ఆశలను టీమిండియా ఆటగాళ్లు పటాపంచలు చేశారు. భారీ లక్ష్య ఛేదనలో ఆఖరి రోజు కనీస ప్రతిఘటన కూడా లేకుండా ఓటమిని ఒప్పుకున్నారు. ఆదుకుంటారనుకున్న కోహ్లి (49), రహానే (46) ఉసూరుమనిపించగా.. రవీంద్ర జడేజా (0), శార్దూల్ ఠాకూర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర భరత్ తూతూమంత్రంగా 23 పరుగులు చేసి ఔట్ కాగా.. ఉమేశ్ యాదవ్, సిరాజ్ తలో ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. ఫలితంగా టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగి భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని ఎదుర్కంది. టీమిండియా సభ్యులు 10 ఏళ్ల భారత ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేస్తారనుకుంటే, దారుణంగా నిరాశపరిచారు. భారత ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీసం డ్రా కూడా చేసుకోలేక చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఆసియా కప్ 2023 విషయంలో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్..! -
WTC Final: ఆదుకుంటారనుకుంటే ఉసూరుమనిపించారు.. ఓటమే తరువాయి..!
వరల్ట్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021 ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైంది. ఈ సీజన్లో కూడా భారత్ టైటిల్ గెలవకుండా రిక్త హస్తాలతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత టీమిండియా సభ్యులు 10 ఏళ్ల భారత ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేస్తారనుకుంటే, దారుణంగా నిరాశపరిచారు. ఆఖరి రోజు కోహ్లి, రహానే అద్భుతం చేసి టీమిండియాకు టైటిల్ అందిస్తారనుకుంటే, ఉసూరుమనిపించారు. కోహ్లి (49) ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుక్కుని వికెట్ సమర్పించుకుంటే, రహానే (46) తన వంతు ప్రయత్నం చేద్దామనుకుని విఫలమయ్యాడు. మధ్యలో జడేజా (0), శార్దూల్ ఠాకూర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత్ 213 పరగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. శ్రీకర్ భరత్ (22) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి జతగా ఉమేశ్ యాదవ్ (0) క్రీజ్లో ఉన్నాడు. కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఇక టీమిండియాకు ఓటమి మాత్రమే మిగిలి ఉంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 220/7 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. చదవండి: ఆసియా కప్ 2023 విషయంలో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్..! -
కోహ్లి వికెట్.. స్మిత్కు రికార్డు అందించిన వేళ
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో కోహ్లి క్యాచ్ తీసుకోవడం ద్వారా టెస్టు క్రికెట్లో ఆసీస్ తరపున అత్యధిక క్యాచ్లు అందుకున్న జాబితాలో స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి క్యాచ్ స్మిత్కు 157వది. తొలి స్థానంలో రికీ పాంటింగ్ 196 క్యాచ్లతో ఉన్నాడు. 181 క్యాచ్లతో మార్క్ వా రెండో స్థానంలో ఉండగా.. మార్క్ టేలర్తో కలసి స్టీవ్ స్మిత్ 157 క్యాచ్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అలెన్ బోర్డర్ 156 క్యాచ్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడుతుందా లేక మ్యాచ్ డ్రా చేసుకుంటుందా అన్నది చూడాలి. కోహ్లి ఉన్నంతవరకు గెలుపుపై ఆశలు ఉన్నా అతను ఔట్ కావడం టీమిండియాకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక రిస్క్ తీసుకోకుండా డ్రా కోసం ఆడితే మంచిదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐదోరోజు ఆట ప్రారంభమైన తర్వాత స్కాట్ బోలాండ్ బౌలింగ్లో కోహ్లి తన ఆఫ్స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టాడు. కోహ్లి ఇచ్చిన క్యాచ్ను స్మిత్ అద్బుతంగా డైవ్ చేస్తూ అందుకున్నాడు. He's an absolute G.O.A.T in slip fielding.#INDvsAUS #WTCFinals #WTC23Final #WTC2023Final #WTCFinals #TeamIndia #KingKohli #ViratKohli #AUSvsIND #ViratKohli𓃵 #SteveSmith pic.twitter.com/IHSn0rnlV0 — myKhel.com (@mykhelcom) June 11, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్లోనే ఉంది!' -
WTC Final: విజేత ఆసీస్.. భారత్పై 209 పరుగుల తేడాతో విజయం
టీమిండియా ఆలౌట్.. 209 పరుగుల తేడాతో ఆసీస్ విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. టీమిండియాతో జరిగిన ఫైనల్లో ఆసీస్ జట్టు 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 444 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఐదోరోజు లంచ్ సెషన్లోపే 234 పరుగులకే కుప్పకూలింది. 161/3 క్రితం రోజు స్కోరుతో ఐదోరోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు కోహ్లి రూపంలో కాసేపటికే షాక్ తగిలింది. ఆ వెంటనే జడేజా కూడా డకౌట్ కావడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది. అయితే రహానే, శార్దూల్లు తొలి ఇన్నింగ్స్లో లాగా ఏదైనా అద్బుతం చేసి డ్రా దిశగా నడిపిస్తారేమోనని ఆశించారు. కానీ ఆసీస్ బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. రహానే, శార్దూల్లు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో.. టెయిలెండర్డను ఔట్ చేయడం ఎంతో సేపు పట్టలేదు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియోన్ నాలుగు వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ మూడు, స్టార్క్ రెండు, కమిన్స్ ఒక వికెట్ తీశాడు. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 469& 270/8 టీమిండియా: 296 ఆలౌట్& 234 ఆలౌట్ ఫలితం: 209 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2021-23 ఛాంపియన్గా అవతరించింది. ఓటమికి రెండు వికెట్ల దూరంలో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి మరింత దగ్గరైంది. ప్రధాన బ్యాటర్లంతా ఇప్పటికే వెనుదిరగడంతో ఆసీస్ బౌలర్లు టెయిలెండర్ల వికెట్లు తీసే పనిలో పడ్డారు. మిచెల్ స్టార్క్ ఉమేశ్ యాదవ్ను ఔట్ చేయడం ద్వారా టీమిండియా 220 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ► తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్లో మాత్రం డకౌట్గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో శార్దూల్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆసీస్ విజయం సాధించడం తథ్యం. రహానే(46) ఔట్.. ఆరో వికెట్ డౌన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ మాదిరి ఆదుకుంటాడనుకున్న రహానే(46) మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 212 పరుగుల వద్ద ఆరో వికెట్ నష్టపోయింది. మరో 232 పరుగులు చేయాల్సిన టీమిండియా ఓటమి నుంచి తప్పించుకోవడం అసాధ్యంగా కనిపిస్తుంది. జడేజా డకౌట్.. ఐదో వికెట్ డౌన్ ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. కోహ్లి ఔటైన రెండు బంతుల వ్యవధిలోనే జడేజా కూడా డకౌట్గా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కోహ్లి(49)ఔట్.. టీమిండియా 179/4 భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు కోహ్లి రూపంలో షాక్ తగిలింది. 49 పరుగులు చేసిన కోహ్లి స్కాట్ బోలాండ్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 179 పరుగులు వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది. కాగా భారత్ విజయానికి ఇంకా 265 పరుగులు చేయాల్సి ఉంది. ఐదోరోజు మొదలైన ఆట.. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆట ఆఖరి రోజుకు చేరుకుంది. క్రితం రోజు స్కోరు ఆటను ఆరంభించిన టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కోహ్లి 46, రహానే 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. చేయాల్సినవి 280 పరుగులు.. చేతిలో ఉన్నవి ఏడు వికెట్లు. మరి టీమిండియా 444 పరుగుల టార్గెట్ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక డ్రాకు మొగ్గుచూపుతుందా అనేది చూడాలి. -
WTC Final Day 5: క్రికెట్ అభిమానులకు బ్యాడ్న్యూస్
క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త. భారత్-ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ చివరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని యూకే వాతావరణ శాఖ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు సమాచారం. ఐదో రోజు ఆట ప్రారంభ సమయానికి వర్షం నుంచి ఎలాంటి ముప్పు ఉండదని, మధ్యాహ్న సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలో పేర్కొన్నట్లు తెలస్తోంది. ఇదే జరిగితే ఛేజింగ్ చేస్తున్న టీమిండియా లయ తప్పే ప్రమాదం ఉంది. ఆసీస్ వర్షం అంతరాయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని టీమిండియాపై పైచేయి సాధించవచ్చు. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా.. ఎలాగూ రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో ఫలితం తేలడం ఖాయం. అయితే ఈ పరిస్థితి ఆసీస్కు అనుకూలంగా, టీమిండియాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే టీమిండియా అభిమానులు వర్షం రాకూడదని కోరుకుంటున్నారు. కాగా, 444 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి (60 బంతుల్లో 44 బ్యాటింగ్; 7 ఫోర్లు), రహానే (59 బంతుల్లో 20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్లో ఉన్నారు. టీమిండియా విజయం సాధించాలంటే, ఆఖరి రోజు మరో 280 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్లకు 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ క్యారీ (105 బంతుల్లో 66 నాటౌట్; 8 ఫోర్లు), మిచెల్ స్టార్క్ (57 బంతుల్లో 41; 7 ఫోర్లు) ఏడో వికెట్కు 93 పరుగులు జోడించి ఆసీస్కు భారీ ఆధిక్యాన్ని అందించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులు, భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక! -
గిల్ది ఔటే.. నేను క్లియర్గానే క్యాచ్ పట్టుకున్నా: గ్రీన్
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ సెకెండ్ ఇన్నింగ్స్లో శుబ్మన్ గిల్ ఔటైన విధానం తీవ్రదుమారం రేపుతోంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరోపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ది నాటౌట్ అని అభిప్రాయపడుతున్నారు. ఇక 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ మంచి ఆరంభం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గిల్ ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్లో కామెరూన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే గ్రీన్ పట్టిన క్యాచ్ స్పష్టంగా లేకపోవటంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. ఆఖరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అయితే ఈ నిర్ణయంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వివాదంపై నాలుగో రోజు ఆట అనంతరం కామెరూన్ గ్రీన్ స్పందించాడు. తను క్లియర్ క్యాచ్ పట్టానని గ్రీన్ చెప్పుకొచ్చాడు. "గిల్ క్యాచ్ను నేను సృష్టంగా పట్టుకున్నానని భావించాను. ఆ సమయంలో నేను అది క్లియర్ క్యాచ్ అనుకుని బంతి పైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాను. నా వైపు నుంచి ఎటువంటి సందేహాలు లేవు. కానీ తుది నిర్ణయం థర్డ్ అంపైర్కు వదిలేశాను. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ సమయం ఫీల్డింగ్ ప్రాక్టీస్కే కేటాయించేవాడిని. అదే విధంగా టెస్టుల్లో మొదటి లేదా రెండో స్లిప్లో ఫీల్డింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఈ మ్యాచ్లో నేను కొన్ని మంచి క్యాచ్లను పట్టుకున్నాను. కానీ రెండో రోజు ఆటలో కొన్ని సులభమైన క్యాచ్లను విడిచిపెట్టాను. అది నన్ను చాలా నిరాశపరిచింది. అయితే తర్వాత అంతకమించిన క్యాచ్లను పట్టడం చాలా సంతోషంగా ఉంది" అని పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో గ్రీన్ పేర్కొన్నాడు. చదవండి: WTC FINAL: ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక! -
ఐదో రోజు ఆట ముందు కోహ్లీ క్రిప్టిక్ పోస్ట్.. ఎందుకు చేశాడో తెలియక!
ఓవల్ వేదికగా భారత్-ఆస్ట్రూలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసవత్తరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ఎవరన్నది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. భారత్ తమ చారిత్రత్మక విజయానికి 280 పరుగుల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి (44), రహానే(20) పరుగులతో ఉన్నారు. ఇక కీలకమైన ఐదో రోజు ఆటకు ముందు విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక క్రిప్టిక్ స్టోరీని పోస్టు చేశాడు. "మనకు బాధలు, భయాలు, అనుమానాలు మరీ ఎక్కువైతే బ్రతకడానికి, ప్రేమించడానికి సమయం ఉండదు. కాబట్టి కొన్ని సార్లు అన్నీ వదిలేయడానికి కూడా ప్రాక్టీస్ చేయాలి" అంటూ అర్ధం వచ్చే పోస్టును విరాట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు కోహ్లి ఎందుకు ఈ పోస్టు చేశాడో అర్ధం కాక బుర్ర చించుకుంటున్నారు. చదవండి: WTC Final: ఓవల్ పోరులో గెలుపెవరిది? టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా? -
ఓవల్ పోరులో గెలుపెవరిది? టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ జట్టు ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన భారత బ్యాటర్లు.. సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం అద్భుతమైన పోరాట పటిమ కనబరుస్తున్నారు. ఛాంపియన్స్గా నిలిచేందుకు భారత జట్టుకు ఆఖరి రోజు 280 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ తమ విజయానికి 7 వికెట్ల దూరంలో నిలిచింది. 444 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అందుకు తగ్గట్టు గానే తమ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఈ క్రమంలో మంచి ఓపెనింగ్ అందించేందుకు రోహిత్ శర్మ (43), శుభ్మన్ గిల్ (18) ప్రయత్నించారు. అయితే థర్డ్ అంపైర్ వివాదస్పద నిర్ణయానికి గిల్ బలయ్యాడు. ఆ తర్వాత రోహిత్(43), పుజారా(27) ఇన్నింగ్స్ను ముందుకు నడిపించినప్పటికీ... కేవలం 5 బంతుల వ్యవధిలోనే వీరిద్దరూ పెవిలియన్కు చేరారు. దీంతో టీమిండియాకు మరో కొత్త భాగస్వామ్యం అవసరమైంది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి(44), అజింక్య రహానే (20 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించింది. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో నిలిచింది. ఆశల మొత్తం వాళ్లపైనే ఇక 280 పరుగుల భారీ టార్గెట్ ఆసాధ్యమేమి కాదు. భారత జట్టు విజయం సాధించాలంటే క్రీజులో ఉన్న కోహ్లి, రహానే అద్భుత ఇన్నింగ్స్లు ఆడాలి. ముఖ్యంగా ఆఖరి రోజు తొలి సెషన్ చాలా ముఖ్యం. అపారమైన అనుభవం ఉన్న ఈ సీనియర్ ఆటగాళ్లు.. తమ వికెట్లను కాపాడుకోని స్కోర్బోర్డును ముందుకు తీసుకువెళ్లాలి. కనీసం వీరిద్దరూ మరో 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే.. భారత్ విజయానికి దగ్గరకావచ్చు. అనంతరం రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, శార్ధూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు మ్యాచ్ను ఫినిష్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ద్రవిడ్, లక్ష్మణ్ కాగా గతంలో 2001లో ఇదే ఆస్ట్రేలియాపై రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇద్దరూ అద్భుతంగా పోరాడి 376 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విషయం అభిమానులకు తెలిసిందే. ఈ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ సాధిస్తుంది. అయితే భారత్ మాత్రం తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 171 పరుగులకే కూప్పకూలిపోతుంది. దీంతో టీమిండియా ఫాలోఆన్ ఆడాల్సి వస్తుంది. ఫాలో ఆన్లో కూడా భారత్ తడబడుతుంది. కేవలం 100 పరుగులకే సచిన్, సుందర్ దాస్ వంటి వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడుతుంది. ఈ సమయంలో ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఇద్దరూ వీరిచిత పోరాటం కనబరిచి భారత్కు 657 పరుగుల భారీ స్కోర్ను అందిస్తారు. అనంతరం 384 లక్క్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 212 పరుగులకు కుప్పకూలుతుంది. ఇక ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కోహ్లి, రహానే కూడా ద్రవిడ్, వీవీఎస్ మాదిరి రాణించి భారత్కు విజయం అందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా? ఒక వేళ ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. టెస్టు క్రికెట్లో ఇంత భారీ టార్గెట్ను చేధించిన ఇప్పటివరకు సందర్బాలు లేవు. ఇక టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరుగుల టార్గెట్ను అందుకుంది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా ఉది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక భారత్ ఛాంపియన్స్గా నిలుస్తుందా లేదా మరోసారి ట్రోఫీని అప్పగిస్తారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. చదవండి: WTC FINAL: కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్ -
కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ ఔటైన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించాడని థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరోను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సెహ్వాగ్ తప్పుబట్టాడు. కళ్లకు గంతలు కట్టుకొని అంపైరింగ్ చేశాడని సెహ్వాగ్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కళ్లకు గంతలు కట్టుకున్న ఫొటోతో సెహ్వాగ్ ఫన్నీ మీమ్ సోషల్మీడియాలో షేర్ చేశాడు. "శుబ్మన్ గిల్ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకొని నిర్ణయం తీసుకున్నాడు. సరైన ఆధారాలు లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నాటౌటగా ప్రకటించాలి. గిల్ది క్లియర్గా నాటౌట్" అని ట్విటర్లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. అసలేం జరిగిందంటే..? టీమిండియా రెండో ఇన్నింగ్స్ 8వ వేసిన స్కాట్ బోలాండ్లో బౌలింగ్లో తొలి బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. బోలాండ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. గిల్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గల్లీ స్లిప్ ఫీల్డర్ వైపు దూసుకెళ్లింది. గల్లీలో ఉన్న కామెరూన్ గ్రీన్ అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ను అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే క్రమంలో బంతి నేలకు తాకినట్లు అనిపించింది.. దీంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్కు రెఫర్ చేశారు. పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు క్యాచ్ ఔట్ విషయంలో క్లారిటీ లభించలేదు. ఆఖరికి గ్రీన్ చేతి వేళ్లు బంతి కింద ఉన్నాయని చెబుతూ థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. చదవండి: WTC FINAL: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. మూడో భారత ఓపెనర్గా Third umpire while making that decision of Shubman Gill. Inconclusive evidence. When in doubt, it’s Not Out #WTC23Final pic.twitter.com/t567cvGjub — Virender Sehwag (@virendersehwag) June 10, 2023 -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. మూడో భారత ఓపెనర్గా
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 13000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్గా రోహిత్ రికార్డులకెక్కాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండో ఇన్నింగ్స్లో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హిట్మ్యాన్ .. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు ఓపెనర్గా ఆన్ని ఫార్మాట్లు కలిపి 295 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 13031 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో ఓపెనర్గా 38 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(15758), ఆ తర్వాత స్ధానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్( 15335) ఉన్నాడు. ఇక ఈ ఫైనల్ పోరులో టీమిండియా పోరాడతోంది. భారత జట్టు విజయం సాధించాలంటే ఆఖరి రోజు 280 పరుగులు కావాలి. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి(44), రహానే(20) పరుగులతో ఉన్నారు. అయితే వీరిద్దరికి అపారమైన అనుభవం ఉంది కాబట్టి చివరి రోజు 280 పరుగులు చేయడం అసాధ్యమేమీ కాదు. దానికి తోడు పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలిస్తోంది. ఇక టీమిండియా స్ఫూర్తి పొందేందుకు ఆ్రస్టేలియాపై ఆఖరి రోజు 325 పరుగులు సాధించి మరీ గెలిచిన ‘గాబా’ను గుర్తు చేసుకుంటే చాలు. చదవండి: WTC FINAL: వంద శాతం విజయం మాదే.. నేను కూడా బ్యాటింగ్ చేస్తా: షమీ View this post on Instagram A post shared by ICC (@icc) -
గిల్ది అవుటా.. నాటౌటా? రోహిత్ రియాక్షన్ వైరల్
లండన్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తుది అంకానికి చేరుకుంది. ఆఖరి రోజు విజయం కోసం భారత్కు మరో 280 పరుగులు కావాల్సి ఉండగా, ఆసీస్కు 7 వికెట్లు అవసరం. కాగా 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లి (44), రహానే(20) పరుగులతో ఉన్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్లకు 270 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. రెండో ఇన్నింగ్స్లో గిల్ ఔటైన తీరు వివాదస్పదమైంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని శుభ్మన్ గిల్ ఎదుర్కొన్నాడు. ఆసీస్ పేసర్ స్కాట్ బోలండ్ బౌలింగ్ చేయగా.. శుభ్మన్ గిల్ బ్యాట్ ఎడ్జ్కు బంతి తగిలి గల్లీలో ఉన్న కామెరూన్ గ్రీన్కు క్యాచ్ వెళ్లింది. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్స్.. థర్డ్ అంపైర్కు రెఫర్ చేశారు. అల్ట్రాఎడ్జ్లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ చివరికి గిల్ ఔటయినట్టు ప్రకటించాడు. రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్ ఇక గిల్ను థర్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించగానే నాన్ స్ట్రైక్లో ఉన్న రోహిత్ ఒక్కసారిగా షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. గట్టిగా అరుస్తూ హిట్మ్యాన్ పక్కకు వెళ్లిపోయాడు. ఇక 444 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు వీరిద్దరూ మంచి ఆరంభం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గిల్ వికెట్ కోల్పోవడం రోహిత్ను తీవ్ర నిరాశపరిచింది. కాగా వీరిద్దరూ తొలి వికెట్కు 41 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సెకెండ్ ఇన్నింగ్స్లో గిల్ 18 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు. చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప! Rohit Sharma reaction #WTCFinal #WTC23Final pic.twitter.com/GwckvmX4KW — आदित्य पंडीत (@AdityaP23166892) June 10, 2023 -
ICC నాకౌట్స్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా
టీమిండియా స్టార్ కింగ్ కోహ్లికి రికార్డులు కొత్త కాదు. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా కొన్ని రికార్డులను అందుకున్నాడు. అవేంటనేది ఒకసారి పరిశీలిద్దాం. ఐసీసీ టోర్నీ నాకౌట్ మ్యాచ్ల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లి నిలిచాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ 657 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా కోహ్లి సచిన్ను అధిగమించి 660 పరుగులతో లీడింగ్ టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. డబ్ల్యూటీసీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక ఐసీసీ ఫైనల్స్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లి నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై కోహ్లి 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు, అదే సమయంలో టెస్టుల్లోనూ ఆసీస్పై 2వేల పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం. Virat Kohli today: - Most runs for India in ICC Knock-outs. - Most runs for India in WTC. - 2nd Most runs in ICC finals. - Completed 5000 runs vs Australia in International cricket. - Completed 2000 runs vs Australia in Tests. The GOAT - King Kohli. pic.twitter.com/0MzyPCI7Bn — Johns. (@CricCrazyJohns) June 10, 2023 ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో 444 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కోహ్లి 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా.. రహానే 20 పరుగులతో సహకరిస్తున్నాడు. ఇక చివరిరోజు ఆటలో టీమిండియా విజయానికి 280 పరుగులు అవసరం కాగా.. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్లోనే ఉంది!' -
'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్లోనే ఉంది!'
క్రికెట్ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్కప్లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్వన్గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్కప్ ఫైనల్ అందుకు చక్కటి ఉదాహరణ. స్టీవా, రికీ పాంటింగ్, మార్క్ వా, ఆడమ్ గిల్క్రిస్ట్, మైకెల్ బెవాన్, గ్లెన్ మెక్గ్రాత్, షేన్ వార్న్, మైకెల్ క్లార్క్, జాసన్ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్ చేసి గెలిచిన మ్యాచ్లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్ ఔట్ల విషయంలో ఆసీస్ ఆటగాళ్లు చేసిన చీటింగ్లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ నుంచి సాండ్ పేపర్ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్ అనే పదం కంగారూల బ్లడ్లోనే ఉందంటారు క్రికెట్ అభిమానులు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు గిల్, రోహిత్లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్ బోలాండ్ బౌలింగ్లో షాట్ ఆడే యత్నంలో శుబ్మన్ గిల్ స్లిప్లో ఉన్న గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్లో చెప్పి బిగ్ స్ర్కీన్పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్, గిల్తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది. గతంలోనూ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకెల్ క్కార్ల్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్ అని క్లియర్గా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) Always winning with cheating #notout pic.twitter.com/H2m939vqCD — Milind Joshi (@MilindJ03022606) June 10, 2023 Cheating is in Australian cricket team DNA. pic.twitter.com/fqXsPxulBQ — SAVAGE (@Freakvillliers) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
#NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియాకు షాక్ తగిలింది. 444 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు గిల్, రోహిత్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు 41 పరుగులు జోడించారు. టీ విరామానికి ఒక్క ఓవర్ ముందు టీమిండియాకు ఊహించని దెబ్బ తగలిగింది. స్కాట్ బోలాండ్ బౌలింగ్లో షాట్ ఆడే యత్నంలో శుబ్మన్ గిల్ స్లిప్లో ఉన్న గిల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్ ఔట్పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్లో చెప్పి బిగ్ స్ర్కీన్పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం గిల్తో పాటు కెప్టెన్ రోహిత్ను ఆశ్చర్యపరిచింది. అభిమానులు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేశారు. ''థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతిలా ఉన్నాడు.. అందుకే నాటౌట్ అని క్లియర్గా కనిపిస్తున్నా ఔట్ ఇచ్చాడు.. కళ్లకు గంతలు కట్టుకొని తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. RIP థర్డ్ అంపైర్'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) Cheating is in Blood of Australians and ICC. ICC is a slave of white skinned dominance. #WTCFinal#WTCFinal2023 Ponting Cameroon Green Gill pic.twitter.com/zlWAgob6zN — Ayush Jain (@aestheticayush6) June 10, 2023 చదవండి: WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప! -
చేధిస్తే చరిత్రే; టెస్టుల్లో అత్యధిక లక్ష్య చేధన ఎంతో తెలుసా?
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ తుది అంకానికి చేరుకుంది. నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టెస్టు క్రికెట్లో ఇంత భారీ టార్గెట్ను చేధించిన సందర్బాలు లేవు. ఒకవేళ టీమిండియా భారీ టార్గెట్ను అందుకుంటే మాత్రం కొత్త చరిత్రను తిరగరాసినట్లవుతుంది. టెస్టుల్లో అత్యధిక చేధన ఎంతో తెలుసా? ఇక టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇక మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇది మినహా ఇప్పటివరకు టీమిండియా 400 పరుగుల టార్గెట్ను మళ్లీ చేధించిన దాఖలాలు లేవు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా విధించిన 444 పరుగుల టార్గెట్ను చేధిస్తే.. అత్యధిక పరుగుల టార్గెట్ను చేధించిన జట్టుగా టీమిండియా రికార్డులకెక్కనుంది. India will create history if they chase down 444. No team chased down more 418 in Test cricket! pic.twitter.com/Tkyd3khSpz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
WTC Final: గెలవకపోయినా పర్లేదు డ్రా చేసుకుంటే అదే గొప్ప!
ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాకు 137 ఓవర్లలో 444 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఆటకు ఒకటిన్నరోజు మిగిలి ఉంది. అంటే ఓవర్కు మూడు పరుగుల చొప్పున పరుగులు చేసినా గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే.. పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. ముఖ్యంగా నాలుగు, ఐదు రోజుల్లో బౌలర్లకు వరంగా మారింది. ఈ లెక్కన చూస్తే టీమిండియా రిస్క్ చేయకపోవడం ఉత్తమం. మనోళ్లు బ్యాటింగ్ ఏంటో తొలి ఇన్నింగ్స్లోనే చూశాం. టాపార్డర్లో వచ్చిన నలుగురిలో ఏ ఒక్కరిలోనూ నిలకడ కనిపించలేదు. అటాకింగ్ గేమ్ ఆడుతారని ఊహించలేం. అటాకింగ్ గేమ్తో అన్ని కలిసి వచ్చి విజయం సాధిస్తే అది చరిత్రే అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసాధ్యమని చెప్పొచ్చు. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు కోల్పోతే అసలుకే ఎసరు వస్తుంది. దీనివల్ల టీమిండియా ఓటమి పాలయ్యే చాన్స్ ఉంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మ్యాచ్ గెలవడం కంటే డ్రా దిశగా అడుగులు వేయడం ఉత్తమం. వేగంగా ఆడడం కంటే ఓపికతో ఆడుతూ వికెట్లు కాపాడుకుంటూ డ్రాకు ప్రయత్నించడం మేలు. అయితే రిస్క్ చేసి వేగంగా ఆడితే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదంతా ఓపెనింగ్ జంట రోహిత్, శుబ్మన్ గిల్ ఆడడంపైనే ఉంటుంది. ఈ జంట వేగంగా ఆడి కనీసం 200 పరుగుల వరకు నిలబడితే టీమిండియాకు గెలిచే చాన్స్ ఉంటుంది.. లేని పక్షంలో కనీసం డ్రాకు అవకాశం ఉంటుంది. ఇవన్నీ వద్దనుకుంటే డ్రాకు ప్రయత్నించడం ఉత్తమం అని చెప్పొచ్చు. కనీసం డ్రా చేసుకుంటే ఆస్ట్రేలియాతో కలిసి సంయుక్తంగా డబ్ల్యూటీసీ టైటిల్ను అందుకోవచ్చు. ఓడిపోతే మాత్రం టీమిండియా రెండోసారి కూడా రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ► ఇక టెస్టు క్రికెట్లో టీమిండియా 400కు పైగా లక్ష్యాన్ని ఒక సందర్భంలో మాత్రమే చేధించింది. 1976లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 403 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 406 పరుగులు చేసి అందుకుంది. ► ఇక ఇదే ఓవల్లో టీమిండియా టెస్టుల్లో చేజ్ చేసిన దాఖలాలు లేవు. అయితే 1979లో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్లో 438 పరగులను చేధించే క్రమంలో 8 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసి కేవలం 9 పరుగుల వ్యవధిలో మ్యాచ్ను డ్రా చేసుకుంది. ఓవల్లో టీమిండియాకు ఫోర్త్ ఇన్నింగ్స్లో ఈ పరుగులే ఇప్పటివరకు అత్యధికం ► ఇంతకముందు ఆస్ట్రేలియా 1978లో ఒక టెస్టులో టీమిండియాకు 445 పరుగుల టార్గెట్ను విధించింది. అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. -
టీమిండియా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అతడొచ్చేస్తున్నాడు..!
టీమిండియా అభిమానులకు వెటరన్ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ శుభవార్త చెప్పాడు. గాయం కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా.. ఆగస్ట్లో ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని పరోక్షంగా కన్ఫర్మ్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 నాలుగో రోజు కామెంట్రీ ఇస్తూ డీకే ఈ విషయాన్ని బయటపెట్టాడు. బుమ్రా ఎంట్రీతో టీమిండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టం కానుంది. ఈ ఏడాది చివర్లో స్వదేశంలో జరిగే వరల్డ్కప్ కంతా బుమ్రా సెట్ అయితే, అది టీమిండియాకు చాలా మేలు చేస్తుంది. కాగా, ఆగస్ట్ 18, 20, 23 తేదీల్లో టీమిండియా.. ఐర్లాండ్తో 3 టీ20లు ఆడనుంది. ఇందుకోసం భారత్.. ఐర్లాండ్లో పర్యటించనుంది. ఈ పర్యటన కోసం జట్లను ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగిస్తుంది. నాలుగో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 425 పరుగుల లీడ్ను సాధించింది. మరో 30, 40 పరుగులు చేసి, ఆ జట్టు ఇన్నింగ్స్ను (ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 252/6) డిక్లేర్ చేయవచ్చు. అలెక్స్ క్యారీ (64), స్టార్క్ (33) క్రీజ్లో ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 252/6 (అలెక్స్ క్యారీ 64 బ్యాటింగ్, జడేజా 3 వికెట్లు) ఆసీస్ 425 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..? -
అరుదైన ఘనత.. టీమిండియా తరపున లీడింగ్ వికెట్టేకర్గా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. మొదట బ్యాటింగ్లో 48 పరుగులు చేసిన జడేజా.. తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్.. ఇక రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్గా టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జడేజా రికార్డులకెక్కాడు. గ్రీన్ను ఔట్ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు)ని క్రాస్ చేసి ఓవరాల్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్(433 వికెట్లు), డేనియల్ వెటోరి(362 వికెట్లు), డ్రీక్ అండర్వుడ్(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక టీమిండియా తరపున లెఫ్టార్మ్ స్పిన్నర్లలో జడేజా(268 వికెట్లు), బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు) వినూ మన్కడ్(161 వికెట్లు), రవిశాస్త్రి(151 వికెట్లు), దిలిప్ దోషి(114 వికెట్లు), ప్రగ్యాన్ ఓజా(113 వికెట్లు) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా బౌలర్ల జాబితాలో జడేజా ఏడో స్థానానికి చేరుకున్నాడు. జడేజా ప్రస్తుతం 65 టెస్టుల్లో 268 వికెట్లతో కొనసాగుతున్నాడు. జడ్డూ కంటే ముందు అనిల్ కుంబ్లే(619 వికెట్లతో) అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్(474 వికెట్లు), కపిల్ దేవ్(434 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. హర్బజన్(417 వికెట్లు), ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్లు 311 వికెట్లతో నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. Sir Ravindra Jadeja 🔥👏#Cricket #RavindraJadeja #TeamIndia #WTCFinal #InsideSport pic.twitter.com/p2h1TaVk0q — InsideSport (@InsideSportIND) June 10, 2023 Ravi Jadeja has joined the group of the elite spinners. Left-arm spinners with most wickets in Test cricket: ⁰433 - Rangana Herath ⁰362 - Daniel Vettori ⁰297 - Derek Underwood ⁰267 - Ravindra Jadeja ⁰266 - Bishan Singh Bedi#WTCFinal #WTC23Final pic.twitter.com/S6dl7xwyVM — Vipin Tiwari (@vipintiwari952) June 10, 2023 Ravindra Jadeja now has most Test wickets for an Indian left-arm spinner. He overtook Bishan Singh Bedi in the list by picking his 267th Test wicket during WTC 2023 final. Sir Ravindra Jadeja 🔥🔥🔥 One of the best All rounder in the world.❤ pic.twitter.com/41OnAVamLP — Hardy🇮🇳 (@Hardy10001000) June 10, 2023 చదవండి: WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..? అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్.. జడ్డూ దెబ్బకు మైండ్బ్లాక్ -
WTC Final: టీమిండియా గెలుస్తుందా లేక చేతులెత్తేస్తుందా..?
ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతుంది. తొలుత (తొలి ఇన్నింగ్స్) బ్యాటింగ్లో ఆతర్వాత బౌలింగ్లో పైచేయి సాధించిన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో కాస్త తడబడుతున్నప్పటికీ, గెలుపుకు కావాల్సిన లీడ్ను ఇప్పటికే సాధించేసింది. నాలుగో రోజు లంచ్ విరామం సమయానికి ఆ జట్టు 374 పరుగుల లీడ్లో (201/6) కొనసాగుతుంది. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. పిచ్ పరిస్థితుల దృష్ట్యా మరో 50 పరుగులు చేయడం ఆసీస్కు పెద్ద కష్టమైన పనేమీ కాకపోవచ్చు. ఇదే జరిగితే టీమిండియా కనీసం 430 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తుంది. అయితే ఓవల్ మైదానం చరిత్రలో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేకపోవడం టీమిండియా అభిమానులను కలవరపెడుతుంది. అయినా ఏదో మూల టీమిండియా గెలుస్తుందనే ఆశతో వారు టీవీలకు అతుక్కుపోయారు. పరిస్థితులన్నీ ఆసీస్కే అనుకూలంగా ఉన్నప్పటికీ, పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్పై వారు నమ్మకం కలిగి ఉన్నారు. హీన పక్షంలో కనీసం డ్రా అయినా చేసుకోగలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గిల్, కోహ్లి, పుజారా, రహానేలపై యావత్ భారత క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు కలిగి ఉన్నారు. ఇటీవలికాలంలో ఇంగ్లండ్ అవళంభిస్తున్న బజ్బాల్ అప్రోచ్ను ఆచరణలో పెట్టి టీమిండియా గెలవాలని యావత్ భారతావణి ఆకాంక్షిస్తుంది. మరి మన బ్యాటర్లు ఏం చేస్తారో వేచి చూడాలి. ఎదురుదాడికి దిగి గెలుస్తుందా.. లేక డిఫెన్స్కకు ప్రాధాన్యమిచ్చి డ్రా చేసుకుంటుదా.. ఎటూ కాకుండా చేతులెత్తేస్తుందా అన్న విషయాలు తేలాలంటే మరికొద్ది గంటల పాటు వేచి చూడాల్సిందే. టీమిండియా విజయావకాశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 201/6 (అలెక్స్ క్యారీ 41 బ్యాటింగ్, జడేజా 3/44) ఆసీస్ 374 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్.. జడ్డూ దెబ్బకు మైండ్బ్లాక్ -
అడ్డుకునేలోపే అదిరిపోయే ట్విస్ట్.. జడ్డూ దెబ్బకు మైండ్బ్లాక్
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో ఆసక్తికర ఘటన జరిగింది. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన స్పిన్ మ్యాజిక్ను మరోసారి చూపెట్టాడు. నాలుగోరోజు ఆట ఆరంభంలోనే లబుషేన్ ఔటైనప్పటికి క్రీజులో ఉన్న గ్రీన్, అలెక్స్ కేరీలు పట్టుదలగా ఆడారు. దీంతో మరో వికెట్ పడదేమో అనుకుంటున్న తరుణంలో జడ్డూ తన బౌలింగ్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 63వ ఓవర్ జడేజా బౌలింగ్ చేశాడు. 25 పరుగులతో నిలకడ చూపిస్తున్న గ్రీన్ అప్పటికే ఓపికగా నాలుగు బంతులు ఎదుర్కొన్నాడు. ఇంకా ఒక్క బంతి ఆపితే ఓవర్ పూర్తవుతుంది. అయితే జడ్డూ ఆరో బంతిని కాస్త తెలివిగా ఔట్సైడ్ లెగ్ దిశగా వేశాడు. గ్రీన్కు ఆ బంతి ఆడే ఉద్దేశం లేకపోవడంతో బ్యాట్ను అడ్డుపెట్టాడు. కానీ ఎవరు ఊహించని విధంగా లోటర్న్ అయిన బంతి గ్రీన్ బ్యాట్ ఎడ్జ్ను తాకి పైకి లేచి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో గ్రీన్కు ఏం జరిగిందో కాసేపు అర్థం కాక షాక్లో ఉండిపోయాడు. తర్వాత చేసేదేంలేక నిరాశతో పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిషన్సింగ్ బేడీ రికార్డు బద్దలు ఈ క్రమంలో జడేజా టెస్టుల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో లెఫ్టార్మ్ స్పిన్నర్గా టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా జడేజా రికార్డులకెక్కాడు. గ్రీన్ను ఔట్ చేయడం ద్వారా జడేజా 268వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో బిషన్ సింగ్ బేడీ(266 వికెట్లు)ని క్రాస్ చేసి ఓవరాల్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో రంగనా హెరాత్(433 వికెట్లు), డేనియల్ వెటోరి(362 వికెట్లు), డ్రీక్ అండర్వుడ్(298 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. Excellent delivery by Ravinder Jadeja. A perfect set-up from Ravindra Jadeja and it disturbs the stumps to send back Cameron Green for 25. #INDvsAUS #WTCFinal2023 #SupriyaSule #AajKeBaadOutNow #unicornspotted #ShameOnKajolHotstar #WTC23 #TirupatiWelcomesNadda pic.twitter.com/MqCamF6Dsr — 𝒮𝒾𝓂𝓇𝒶𝓃 (𝒥𝑜𝓊𝓇𝓃𝒶𝓁𝒾𝓈𝓉)✨ (@simi2214) June 10, 2023 చదవండి: ఉమేశ్ యాదవ్ వైల్డ్ రియాక్షన్ వెనుక కారణం అదేనా? -
ఉమేశ్ యాదవ్ వైల్డ్ రియాక్షన్ వెనుక కారణం అదేనా?
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పోరాడుతోంది. ఆసీస్ ఇప్పటికే 330 పరుగులకు పైగా ఆధిక్యంలో ఉండడంతో టీమిండియాకు ఓటమి ముప్పు పొంచే ఉంది. మరో గంటలో ముగిసే తొలి సెషన్లోపూ ఆసీస్ను ఆలౌట్ చేయకుంటే టీమిండియాకు పెను ప్రమాదం ఉంది. 400 పరుగులకు పైగా టార్గెట్ను నిర్దేశించే పనిలో ఉన్న ఆసీస్ ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. గ్రీన్ 25, అలెక్స్ కేరీ 22 పరుగులతో ఆడుతున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. నాలుగోరోజు ఆట మొదలైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ బ్రేక్ ఇచ్చాడు. 41 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్నస్ లబుషేన్ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ఇన్సైడ్ ఎడ్జ్ అయిన బంతి లబుషేన్ బ్యాట్కు తగులుతూ నేరుగా పుజారా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. అయితే లబుషేన్ ఔట్ చేసిన ఆనందంలో ఉమేశ్ యాదవ్ గట్టిగా అరుస్తూ కాస్త వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. అయితే ఉమేశ్ ఇలా చేయడం వెనుక ఒక కారణముందని అభిమానులు భావిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్లో ఉమేశ్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ ఉమేశ్ ఇవేవి పట్టించుకోకుండా కేవలం తన ప్రదర్శనతోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్న ఉమేశ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియారిటీ ఎప్పటికైనా పనికొచ్చేది కాని వ్యర్థం కాదు అని నిరూపించాడు. అందుకే లబుషేన్ వికెట్ తీయగానే అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం' -
WTC Final: టీమిండియాకు కష్టమే.. 250 పరుగులే చాలా ఎక్కువ..!
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా విజయావకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయి. నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఆసీస్ 333 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీమిండియా డ్రా కోసమే ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే డ్రా లేక ఓటమే తప్ప.. రోహిత్ సేనకు గెలిచే అవకాశం దాదాపుగా లేనట్టే. ఈ పరిస్థితుల్లో మరో విషయం టీమిండియాను తెగ కలవరపెడుతుంది. ఓవల్లో ఇప్పటివరకు ఏ జట్టు 300కు పైగా టార్గెట్ను ఛేదించింది లేదు. ఇక్కడ విజయవంతంగా ఛేదించిన టార్గెట్ 263. 1902లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అతికష్టం మీద 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆతర్వాత 1963లో 255, 1972లో 242, 1988లో 226 పరుగుల లక్ష్యాలను వివిధ జట్లు ఛేదించాయి. ఎటు చూసినా ఓవల్లో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం మాత్రం చాలా కష్టం. ఈ విషయమే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే, 123/4 స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే లబూషేన్ వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లోనే లబూషేన్ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్కు పంపించాడు. వికెట్ కోల్పోయినా ఆసీస్ ఏమాత్రం తడబడకుండా నిలకడగా ఆడుతుంది. ఆ జట్టు స్కోర్ 160/5గా ఉంది. గ్రీన్ (21), క్యారీ (19) క్రీజ్లో ఉన్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 160/5 (లబూషేన్ 41, జడేజా 2/32) ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: WTC Final: అరుదైన క్లబ్లో మిచెల్ స్టార్క్.. నాలుగో బౌలర్గా..! -
'గాయాన్ని సైతం లెక్క చేయని మీ పోరాటం అసమానం'
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్ ఫైనల్లో టీమిండియా స్టార్ బ్యటర్లంతా మూకుమ్మడిగా విఫలమైన చోట అజింక్యా రహానే ఒక్కడే పోరాడాడు. లార్డ్ శార్దూల్ ఠాకూర్ సహాయంతో టీమిండియాను ఫాలోఆన్ గండం నుంచి బయటపడేశాడు. 512 రోజుల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆసీస్ బౌలర్ల నుంచి బులెట్లా దూసుకొస్తున్న బంతులు రహానేను పలుమార్లు గాయపరిచాయి. అయినా రహానే ఏమాత్రం బెదరకుండా తన ఆటను కొనసాగించాడు. సెంచరీ చేయకపోయినప్పటికి 129 బంతుల్లో 89 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. రహానే చేసిన పోరాటానికైనా టీమిండియా మ్యాచ్ గెలవాలని కోరుకుందాం. ఒకవేళ టీమిండియా ఓడినా రహానే ఇన్నింగ్స్ మాత్రం గుర్తుండిపోతుంది. రహానే స్పూర్తిదాయక ఇన్నింగ్స్పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ.. అతని భార్య రాధికా దొపోవ్కర్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన భర్త ఆటతీరుపై ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్గా రాసుకొచ్చింది. ''పలుమార్లు వేలికి గాయాలు అయినా స్కాన్ చేయించుకోవడానికి నిరాకరించి పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. ఆట పట్ల మీకున్న అంకితభావానికి హ్యాట్సాఫ్. మీ నిస్వార్థత, సంకల్పబలం చాలా గొప్పది.. ఈ రెండింటిని ఒక అంశంలో జోడించి ఇవాళ బ్యాటింగ్ చేసి అందరిలో స్పూర్తి నింపారు. జట్టును గెలిపించడంకోసం మీరు ప్రదర్శించిన స్పిరిట్కు గర్విస్తున్నా.. మై రీసైలెంట్ పార్టనర్.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Radhika Rahane (@radhika_dhopavkar) కాగా మూడోరోజు ఆట ముగిసిన తర్వాత రహానే మాట్లాడుతూ.. ''ఈరోజు బ్యాటింగ్ చేసిన విధానంపై హ్యాపీగా ఉన్నా. శార్దూల్తో కలిసి మంచి భాగస్వామ్యం ఏర్పడడంతో కనీసం 320 నుంచి 330 పరుగులు చేస్తామనుకున్నాం. కానీ అది జరగలేదు. అయితే మా ప్రదర్శన ఇంతటితో ఆగలేదు.. మ్యాచ్ గెలిచేందుకు పోరాడుతాం. నాలుగోరోజు ఉదయం సెషన్ మాకు కీలకం. జడేజా బౌలింగ్ బాగుంది. అతను కీలకంగా మారే అవకాశం ఉంది. సీమ్ బౌలర్స్ కూడా సహకరించే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్ తరపున తొలి బ్యాటర్గా -
WTC Final: అరుదైన క్లబ్లో మిచెల్ స్టార్క్.. నాలుగో బౌలర్గా..!
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు భారీ లక్ష్యం ఉంచేలా ఉంది. 123/4 స్కోర్ వద్ద నాలుగో ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే లబూషేన్ (41) వికెట్ కోల్పోయినప్పటికీ 300 పరుగుల లీడ్ను సాధించింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబూషేన్ ఔటయ్యాడు. కాగా, తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీని ఔట్ చేయడంతో ఆసీస్ స్పీడ్స్టర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన క్లబ్లో చేరాడు. స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 600 వికెట్లు పడగొట్టిన 24వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసీస్ తరఫున షేన్ వార్న్ (999), మెక్గ్రాత్ (948), బ్రెట్ లీ (718) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ స్పిన్నర్ మురళీథరన్ (1347) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్ (972), అనిల్ కుంబ్లే (956), మెక్గ్రాత్ టాప్=5లో ఉన్నారు. భారత బౌలర్లలో కుంబ్లే, హర్భజన్ (711), అశ్విన్ (697), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610) స్టార్క్ కంటే ముందున్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 138/5 (లబూషేన్ 41, జడేజా 2/25) ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: విధ్వంసం సృష్టించిన కర్రన్ బ్రదర్స్.. సిక్సర్ల సునామీ -
WTC Final: చేతిలో ఏడు వికెట్లు.. భారత్ విజయానికి 280 పరుగులు
ముగిసిన ఆట.. చేతిలో ఏడు వికెట్లు; విజయానికి 280 పరుగుల దూరంలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 40 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 44, రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 444 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు చేతిలో ఏడు వికెట్లు ఉండగా.. చేయాల్సిన పరుగులు 280. చివరి రోజు మొత్తం నిలబడితే మాత్రం టీమిండియాకు గెలిచే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తే మాత్రం ఓటమి ముప్పు పొంచి ఉంది. ఏది ఏమైనా క్రీజులో కుదురుకున్న కోహ్లి, రహానేలు ఆదివారం తొలి సెషన్లో ఆడబోయే ఆటతో టీమిండియా కథ తేలిపోనుంది. పరిస్థితి ఏ మాత్రం ప్రతికూలంగా మారినా టీమిండియా మ్యాచ్ను డ్రా చేసుకోవడం మేలు. 444 పరుగుల టార్గెట్ను చేధించి చరిత్ర సృష్టిస్తుందా లేక వికెట్లు పోగొట్టుకొని డ్రా లేదా ఓటమిని మూగట్టకుంటుందా అనేది చూడాలి. నిలకడగా ఆడుతున్న కోహ్లి, రహానే.. టీమిండియా 136/3 444 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 33 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కోహ్లి 30, రహానే 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. పూజారా(27) ఔట్.. మూడో వికెట్ డౌన్ రోహిత్ ఇలా ఔటయ్యాడో లేదు నేను కూడా అంటూ పుజారా పెవిలియన్ చేరాడు. ఒకే ఓవర్లో కమిన్స్ రెండు వికెట్లు తీసి టీమిండియాను దెబ్బకొట్టాడు. 27 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల వద్ద మూడో వికెట్ నష్టపోయి కష్టాల్లో పడింది. ఇక బారం అంతా కోహ్లి, రహానేలపైనే ఉంది. రోహిత్ శర్మ(43)ఔట్.. రెండో వికెట్ డౌన్ రోహిత్ శర్మ(43) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ లియోన్ బౌలింగ్లో రోహిత్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 92 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఇంకా 352 పరుగుల దూరంలో ఉంది. నిలకడగా ఆడుతున్న రోహిత్.. టీమిండియా 66/1 టీ విరామం అనంతరం చివరి సెషన్ ఆడుతున్న టీమిండియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 33 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. అతనికి పుజారా నుంచి చక్కని సహకారం అందుకుంది. టీమిండియా విజయానికి 378 పరుగులు అవసరం ఉంది. టీ విరామం.. తొలి వికెట్ పడింది.. గిల్(18) ఔట్ 444 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో కామెరాన్ గ్రీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే స్లిప్లో ఉన్న గ్రీన్ బంతి కింద పెట్టినట్లు అల్ట్రాఎడ్జ్లో కనిపించింది. కానీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్ ఔటిచ్చాడు. వికెట్ నష్టానికి 41 పరుగులతో టీమిండియా టీ విరామానికి వెళ్లింది. టార్గెట్ 444.. టీమిండియా 4 ఓవర్లలో 23/0 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 14, శుబ్మన్ గిల్ 9 పరుగులతో ఆడుతున్నారు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆసీస్.. టీమిండియా టార్గెట్ 444 డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు 137 ఓవర్లలో 444 పరుగుల టార్గెట్ను నిర్ధేశించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అలెక్స్ కేరీ 66 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. లబుషేన్ 41, మిచెల్ స్టార్క్ 41 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 433 పరుగుల ఆధిక్యంలో మిచెల్ స్టార్క్(41) రూపంలో ఆస్ట్రేలియా 260 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 433 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్.. టీమిండియాకు 450 పరుగుల టార్గెట్ను నిర్దేశించే అవకాశం ఉంది. 400 దాటిన ఆసీస్ ఆధిక్యం లంచ్ విరామం అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్లో వేగం పెంచింది. ప్రస్తుతం 400 పరుగుల ఆధిక్యం దాటిన ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 230 పరుగులతో ఆడుతుంది. అలెక్స్ కేరీ 57 పరుగులు, మిచెల్ స్టార్క్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా విజయం కన్నా డ్రా దిశగా ఆడడం మేలు. లంచ్ విరామం.. 374 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 70 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 41, మిచెల్ స్టార్క్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 374 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. 400 పరుగుల టార్గెట్ను టీమిండియా ముందు ఉంచాలని ఆసీస్ భావిస్తుంది. తిప్పేసిన జడ్డూ.. ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 25 పరుగులు చేసిన కామెరాన్ గ్రీన్ను జడేజా తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. లోటాస్గా వెళ్లిన బంతి గ్రీన్ బ్యాట్ హ్యాండిల్ను తాకుతూ వెళ్లి వికెట్లను గిరాటేసింది. దీంతో ఆసీస్ 167 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. జడ్డూ స్పిన్ మాయాజాలానికి గ్రీన్ నోరెళ్లబెట్టాడు. ఇక ఆసీస్ 340 పరుగుల ఆధిక్యంలో ఉంది. 321 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ నాలుగో రోజు ఆటలో ఐదో వికెట్ త్వరగానే తీసినప్పటికి తర్వాతి వికెట్లు తీయడానికి టీమిండియా బౌలర్లు చెమటోడుస్తున్నారు. ఇప్పటికే ఆసీస్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. లబుషేన్ను ఔట్ చేసిన ఉమేశ్.. ఐదో వికెట్ డౌన్ నాలుగోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఉమేశ్ యాదవ్ 41 పరుగులు చేసిన లబుషేన్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం ఆసీస్ ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. 297 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగో రోజు ఆట మొదలైంది. మూడోరోజు ఆట ముగిసేసమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ కలుపుకొని 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన కంగారూలు దానిని కొనసాగిస్తూ ఓవరాల్ ఆధిక్యాన్ని దాదాపు మూడొందలకు చేర్చారు. మిగిలిన 6 వికెట్లతో ఆ జట్టు శనివారం ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. పిచ్ నెమ్మదిస్తుండటంతో ప్రస్తుతానికి ఇంకా మ్యాచ్ ఆ్రస్టేలియాతో చేతిలోనే ఉన్నట్లు! -
'ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ చేసింది.. అందుకే కోహ్లి ఔటయ్యాడు'
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ సంచలన వాఖ్యలు చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ పాల్పడందని బాసిత్ అలీ ఆరోపణలు చేశాడు. 15 ఓవర్లో ఆసీస్ బాల్ ట్యాంపరింగ్ చేసందని, కోహ్లి, పుజారాలు ఔట్ కావడానికి ఇదే కారణమని అతడు అన్నాడు. "కామెంటరీ బాక్స్లోంచి మ్యాచ్ చూస్తున్న వారికి, అంపైర్లకు ముందుగా చప్పట్లు కొట్టాలి అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా కచ్చితంగా బంతి స్వరూపాన్ని మార్చేందుకు ఏదో చేసింది. ఎవరూ దాని గురించి మాట్లాడటం లేదు. బ్యాటర్లు కూడా దాన్ని పెద్దగా గమనించలేదు. బ్యాటర్లు బాల్ ను వదిలేస్తూ బౌల్డ్ అయ్యారు. అంతే తప్ప ఏం జరుగుతుందని ఆలోచించలేకపోయారు. ఈ ఆరోపణలకు నా దగ్గర ఆధారం కూడా ఉంది. భారత ఇన్నింగ్స్ 17, 18, 19 ఓవర్లు ఓసారి చూడండి. విరాట్ కోహ్లి ఔటైనప్పుడు బంతికి మెరుపు ఏవైపు ఉందో ఓ సారి గమనించండి. మిచెల్ స్టార్క్ బంతి పట్టుకున్నప్పుడు మెరుపు బంతికి బయటి ఉంది. కానీ బంతి మాత్రం లోపలకు వచ్చింది. మెరుపు బయట వైపు ఉండి బంతి ఎప్పుడూ రివర్స్ స్వింగ్ అవ్వదు. ఆసీస్ ఎదో చేసింది. అదే విధంగా జడేజా బాల్ ను ఆన్ సైడ్ ఆడుతుంటే అది పాయింట్ వైపు వెళ్తోంది. ఇది అంపైర్లకు కనిపించలేదా? ఈ చిన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు అంటూ అలీ తన యూట్యూబ్ ఛానెల్లో విమర్శలు గుప్పించాడు. చదవండి: ఇటువంటి కమ్బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ -
ఇటువంటి కమ్బ్యాక్ ఇప్పటి వరకూ చూడలేదు.. అతడొక అద్భుతం: గంగూలీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానే అద్భుత ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులోకి వచ్చిన రహానే కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి, రోహిత్, పుజరా వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. రహానే తన అద్బుత ఇన్నింగ్స్తో జట్టును అదుకున్నాడు. 129 బంతుల్లో 89 పరుగులు చేసిన రహానే.. శార్దూల్ ఠాకూర్ (51)తో కలిసి ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఇక రీ ఎంట్రీలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రహానేపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నప్పటికీ.. రహానే మాత్రం పోరాట పటిమ కనబరిచాడని దాదా కొనియాడాడు. "రహానే 18 నెలల పాటు అతడు టెస్టు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. రీ ఎంట్రీ మ్యాచ్లోనే రహానే ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం అంత ఈజీ కాదు. అయినప్పటికీ అతడు మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా మంది అతడి కెరీర్ ముగిపోయిందని భావించారు. నిజానికి రహానే కూడా అదే అనుకుని ఉంటాడు. భారత్ క్రికెట్లో ఒక బ్యాటర్ తిరిగి జట్టులో చోటు సంపాదించుకుని తనను తాను నిరూపించుకోవడం అంత సులువు కాదు. రహానే రీ ఎంట్రీ మాత్రం అద్భుతం. గతంలో చాలా మంది ఆటగాళ్లు కొంత కాలం పాటు జట్టుకు దూరంగా ఉండి రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ రహానే వంటి రీ ఎంట్రీ నేను ఇప్పుడు వరకు చూడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ అతడు మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు అని స్టార్స్పోర్ట్స్ షోలో గంగూలీ పేర్కొన్నాడు. చదవండి: WTC Final: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్పై ఫ్యాన్స్ ఫైర్ -
మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్పై ఫ్యాన్స్ ఫైర్
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప, ఈ మ్యాచ్లో టీమిండియా గెలవలేదు. గెలవడం పక్కన పెడితే, కనీసం డ్రా కూడా చేసుకోలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. లంచ్ అనంతరం కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, 450కిపైగా టార్గెట్ సెట్ చేయాలన్నది ఆసీస్ ప్రణాళిక కావచ్చు. క్రీజ్లో లబూషేన్ (41), గ్రీన్ (7) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్ ఉమేశ్యాదవ్ తేలిపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఉమేశ్ను అనవసరంగా తీసుకున్నారని మేనేజ్మెంట్పై మండిపడుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో తెలుసుకోకుండా ఉమేశ్ను లండన్ ఫ్లైట్ ఎక్కించారని ఆరోపిస్తున్నారు. షమీ, సిరాజ్ స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్లుగా ఉన్నప్పుడు, ఉమేశ్ను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. ఆసీస్ టాపార్డర్ లెఫ్ట్, రైట్ హ్యాండ్ బ్యాటర్ల కలయికతో ఉంటుందని తెలిసినప్పుడు, మూడో పేసర్గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ను తీసుకోవాల్సి ఉండిందని అంటున్నారు. ఉనద్కత్పై కూడా సదభిప్రాయం లేనప్పుడు మ్యాచ్ విన్నర్, అనుభవజ్ఞుడైన అశ్విన్ను అయినా తీసుకోవాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. జట్టులో మిగతా ఆటగాళ్లంతా ఏదో ఒక రకంగా అయినా ఉపయోగపడ్డారని.. ఉమేశ్ తన పాత్రకు కనీస న్యాయం కూడా చేయలేకపోయాడని మండిపడుతున్నాడు. ఒకవేళ టీమిండియా ఓడిపోతే, దానికి ప్రధాన కారణం ఉమేశ్యాదవే అవుతాడని అంటున్నారు. స్పిన్నర్లుకు ఏ మాత్రం సహకరించని పిచ్పై జడేజా 3 వికెట్లు తీస్తే.. ఉమేశ్ 30 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు. ఓవరాల్గా ఉమేశ్ను టార్గెట్ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు. స్కోర్ వివరాలు.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108) భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83) ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 123/4 (లబూషేన్ 41 బ్యాటింగ్, జడేజా 2/25) ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంలో ఉంది చదవండి: ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్ -
కొంచెం ఆలోచించండి.. కోచ్గా ద్రవిడ్ జీరో: పాకిస్తాన్ మాజీ క్రికెటర్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శల వర్షం కురిపించాడు. ఈ కీలక మ్యాచ్లో ద్రవిడ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడని అలీ విరుచుకుపడ్డాడు. అదే విధంగా ద్రవిడ్ అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ కోచ్గా మాత్రం జీరో అని అలీ అన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ప్రదర్శన చూసి అలీ ఈ వాఖ్యలు చేశాడు. "టీమిండియా ఎప్పుడైతే తొలుత బౌలింగ్ ఎంచుకుందో అప్పుడే ఈ మ్యాచ్ను కోల్పోయింది. ఇక భారత్ బౌలింగ్ కూడా ఐపీఎల్లోలాగే ఉంది. తొలి రోజు లంచ్ సమయానికి.. భారత బౌలర్లు ఏకంగా మ్యాచ్ గెలిచినట్లు చాలా సంతోషంగా కనిపించారు. ఇప్పుడు భారత జట్టు ముందు ఒక్కటే మార్గం. ఆసీస్ను వీలైనంత తొందరగా ఔట్ చేసి, భారత్ బ్యాటింగ్కు వచ్చి అద్బుతాలు సృష్టించాలి. అదే విధంగా ఫీల్డింగ్లో కూడా భారత ఆటగాళ్లు అంత ఫిట్నెస్గా కనిపించలేదు. రహానే, కోహ్లి, జడేజా మినహా చాలా మంది ప్లేయర్లు బాగా అలసిపోయినట్లు కనిపించారు" అని అలీ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ఇక ద్రవిడ్ గురించి మాట్లాడుతూ.. "నేను రాహల్ ద్రవిడ్కు వీరాభిమానిని. గతంలో ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. అతడొక క్లాస్ ప్లేయర్, లెజెండ్. కానీ కోచ్గా మాత్రం అతడు జీరో. భారత్లో టర్నింగ్ పిచ్ లు తయారు చేయించారు. నాకు ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు అక్కడ అలాంటి పిచ్ లే ఉన్నాయా? అక్కడ బౌన్సీ పిచ్ లు ఉన్నాయా? ద్రవిడ్ ఏమీ ఆలోచిస్తున్నాడో ఆ దేవుడుకే తెలియాలంటూ ఘూటు వాఖ్యలు చేశాడు. చదవండి: WTC Final: ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్ -
ఆసీస్ పేసర్ సూపర్ డెలివరీ.. భరత్కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ తీవ్ర నిరాశపరిచాడు. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్.. వికెట్ కీపింగ్ పరంగా పర్వాలేదనిపించినప్పటికీ, బ్యాటింగ్లో మాత్రం అకట్టుకోలేకపోయాడు. మూడో రోజు ఆటలో అజింక్య రహానేకు భరత్ సపోర్ట్గా నిలుస్తాడని అంతా భావించారు. కానీ ఆటప్రారంభమైన కొద్దిసేపటికే భరత్ 5 పరుగులు చేసి స్కాట్ బోలాండ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. భరత్ను అద్భుతమైన ఇన్స్వింగర్తో బోలాండ్ బోల్తా కొట్టించాడు. బోలాండ్ వేసిన డెలివరీకి భరత్ ఢిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్ అయ్యి మిడిల్ స్టంప్ను గిరాటేసింది. దీంతో భరత్ ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. అంతకముందు భారత తమ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే, (89 పరుగులు), ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోర్నైనా అందుకుంది. ఇక మొత్తంగా ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: WTC Final: బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తెలుగు సినిమాల్లోని డైలాగులు చెప్పి అభిమానులను అలరించాడు. లండన్ వేదికగా భారత్తో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో బీజీగా ఉన్న స్మిత్.. ఖాళీ సమయంలో స్టార్స్పోర్ట్స్-1 తెలుగుతో ముచ్చటించాడు. ఈ క్రమంలో యాంకర్ చెప్పిన డైలాగ్లను స్మిత్ తనదైన స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో బాలకృష్ణ డైలాగ్లను స్మిత్ తనదైన మేనరిజంతో చెప్పాడు. అపాయింట్మెంట్ లేకుండా వస్తే వకేషన్ చూడను, లొకేషన్ చూడను “, ” డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ట్రుత్ వంటి డైలాగ్లు స్మిత్ నోటి నుంచి వచ్చాయి. అదే విధంగా చివరకు ” తగ్గేదేలే “.. అంటూ అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ను స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్స్పోర్ట్స్-1 ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన పరుగులతో మొత్తంగా ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. చదవండి: WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. అందుకే ఈ పరిస్థితి: ఆసీస్ దిగ్గజం స్టీవ్ స్మిత్ నోట 🥳 మన తెలుగు సినిమా డైలాగ్స్ 😎 మరి తనదైన మనేరిజంతో 🔥 ఎలా అలరించాడో మీరే చూసేయండి 😉 చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND Day 3 Live మీ 📺 #StarSportsTelugu/HD & Disney+Hotstar లో #BelieveInBlue pic.twitter.com/maudxIGLoJ — StarSportsTelugu (@StarSportsTel) June 9, 2023 -
టీమిండియా చేసిన తప్పు అదే.. అందుకే ఈ పరిస్థితి: ఆసీస్ దిగ్గజం
లండన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన పరుగులతో మొత్తంగా ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇక అంతకుముందు భారత తమ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. భారత తొలి ఇన్నింగ్స్లో అజింక్య రహానే (89 పరుగులు), ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) టాప్ స్కోరర్గా నిలిచారు. టీమిండియా చేసిన తప్పు అదే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్కు తుది జట్టు ఎంపిక విషయంలో భారత జట్టు మెనెజ్మెంట్పై పలువరు మాజీ క్రికెటర్లు తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి ఆసీస్ దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా చేరాడు. రవిచంద్రన్ అశ్విన్ను ఎంపికచేయకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని స్టీవా అన్నాడు. "ఓవల్ పిచ్ చాలా విచిత్రంగా ఉంటుంది. పిచ్పైన్ చూడడానికి గ్రీన్గా కనిపిస్తుంది. కానీ కిద కాస్త పగుళ్లు, డ్రైగా ఉంటుంది. అయితే ఆకాశం మేఘావృతమైనప్పుడు పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉంది. అదే సూర్యుడు బయటకు వచ్చిన వెంటనే పిచ్ డ్రై అయిపోతుంది. స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ అనుకూలిస్తుంది. ఈ ఫైనల్ మ్యాచ్కు భారత్ తమ తుది జట్లు తప్పుగా ఎంచుకుంది. ఈ టెస్టులో స్పిన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అశ్విన్ జట్టులో ఉండాల్సింది. బౌలింగ్ విషయం పక్కన పెడితే బ్యాటింగ్లోనైనా అతడు ఉపయోగపడేవాడు. అతడికి టెస్టుల్లో ఐదు సెంచరీలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ సైకిల్ 2021-23లో భారత తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ అశ్విన్. అటువంటి ఆటగాడికి జట్టులో లేకపోవడం ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని ఏఏపీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వా పేర్కొన్నాడు. చదవండి: అంతరం తగ్గించినా... ఆసీస్దే పైచేయి! -
'గబ్బా' రిపీట్ అయ్యేనా! ఫాలోఆన్ తప్పినా ఓటమి పొంచే ఉంది!
ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ముగిసింది. తొలి రెండు రోజులు ఆసీస్ ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడోరోజు ఆటలో మాత్రం టీమిండియా రెండు సెషన్లలో ఆసీస్పై చేయి సాధించింది. తొలి సెషన్లో అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ అద్భుత పోరాటంతో టీమిండియా ఫాలోఆన్ గండం నుంచి బయటపడింది. మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే 5 పరుగులు చేసిన కేఎస్ భరత్ ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. అప్పటికి టీమిండియా స్కోరు 151 మాత్రమే. ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 100 పరుగులు చేయాల్సిన దశలో రహానే, శార్దూల్ అద్బుతం చేశారు. ఈ ఇద్దరు ఏడో వికెట్కు 109 పరుగులు జోడించారు. అయితే వీరిద్దరు ఔటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఎక్కువసేపు నిలబడలేదు. దీంతో ఆసీస్కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో విజయావకాశాలు ఎక్కువగా ఆసీస్కే ఉన్నట్లు తెలుస్తోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ కలుపుకొని ఇప్పటివరకు ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యం సాధించింది. ఒకవేళ నాలుగు రోజు ఆటలో లంచ్లోపే ఆసీస్ ఆలౌట్ చేయకపోతే వారి ఆధిక్యం 350 నుంచి 400 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఆటకు ఇంకా రెండు రోజులు ఉండడంతో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాలుగు, ఐదు రోజుల్లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇది టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ నిలదొక్కుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఓటమి తప్పకపోవచ్చు. గబ్బా రిపీట్ అయ్యేనా? అయితే 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో రహానే నేతృత్వంలో గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఇలాంటి పరిస్థితిలోనే చారిత్రక విజయాన్ని సాధించింది. ఆసీస్ విధించిన 329 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. అప్పటి మ్యాచ్లో రిషబ్ పంత్ 89 నాటౌట్, శుబ్మన్ గిల్ 91 పరుగులు, పుజారా 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రస్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగు రోజు ఆటలో టీమిండియా బౌలర్లు విజృంభించి తొలి సెషన్లో తక్కువ వ్యవధిలో(అంటే మరో 40 పరుగులు) ఆసీస్ను ఆలౌట్ చేయగలిగితే టీమిండియా లక్ష్యం 330 నుంచి 340 మధ్య ఉంటుంది. ఆటకు రోజున్నర సమయం ఉండడంతో కాస్త నిలకడగా ఆడితే టీమిండియా విజయం అందుకోవడంతో పాటు టైటిల్ నెగ్గే అవకాశం ఉంది. మరి టీమిండియా ఆసీస్ను ఆలౌట్ చేసి చేధనలో టార్గెట్ను అందుకుంటుందా లేక మరోసారి రన్నరప్గా నిలుస్తుందా అనేది రేపటితో తేలిపోనుంది. చదవండి: #ShubmanGill: లవ్ ప్రపోజ్కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు! 512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే -
#ShubmanGill: లవ్ ప్రపోజ్కు పడిపోయాడు.. రనౌట్ మిస్ చేశాడు!
ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో బ్యాటింగ్లో వీరవిహారం చేసి 890 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న శుబ్మన్ గిల్ డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. 13 పరుగులు మాత్రమే చేసి క్లీన్బౌల్డ్ అయ్యాడు. అయితే తాజాగా ఫీల్డింగ్లోనూ గిల్ విఫలమయ్యాడు. ఈజీ రనౌట్ చేసే చాన్స్ను చేజేతులా జారవిడిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇది జరిగింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో మార్నస్ లబుషేన్ ఆడిన షాట్ నేరుగా శుబ్మన్ గిల్ చేతుల్లోకి వెళ్లింది. సమన్వయ లోపంతో మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా ఇద్దరూ కూడా ఒకే వైపు పరుగెత్తారు. మూడో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న శుబ్మన్ గిల్, మెల్లిగా లేచి బంతి అందుకుని వికెట్ కీపర్ వైపు బంతి వేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. అయితే బంతిని ఆపగానే కంగారుపడిన శుబ్మన్ గిల్ బ్యాటర్లు ఎటువైపు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించకుండా బౌలింగ్ ఎండ్వైపు బంతి త్రో చేశాడు. అటు వైపు బంతిని ఆపేందుకు కూడా ఎవ్వరూ లేకపోవడంతో రనౌట్ ఛాన్స్ మిస్ అయింది. అయితే ఈ సంఘటనకి ముందు గ్రౌండ్లో ఉన్న ఓ యువతి, శుబ్మన్ గిల్కి మ్యారేజ్ ప్రపోజ్ చేసింది. ''శుబ్మన్ గిల్ మ్యారీ మీ'' అని రాసి ఉన్న ఫ్లకార్డును కెమెరావైపు ప్రదర్శించింది. వాస్తవానికి గిల్ దీనిని పట్టించుకోలేదు. కానీ అభిమానులు ఊరికే ఉండరుగా. గిల్ ఆ పిల్ల ప్రపోజల్ విషయాన్ని సీరియస్గా తీసుకుని రనౌట్ చాన్స్ మిస్ చేశాడంటూ ట్రోల్ చేశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో ఫాలోఆన్ గండం దాటుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి ఏడో వికెట్కు 109 పరుగులు జోడించి టీమిండియాను ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించారు. ఆసీస్కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ భారీ ఆధిక్యం లభించింది. అయితే తొలి ఇన్నింగ్స్లో విఫలమైన గిల్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే తరహా ఆటతీరు నమోదు చేస్తే అభిమానుల ఆగ్రహానికి గురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మ్యాచ్లో విజయావకాశాలు ఆసీస్కే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఆడుతున్న ఆసీస్ మొత్తంగా 253 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండురోజులు సమయం ఉండడంతో టీమిండియా ఏ మేరకు పోరాడుతుందనేది ఆసక్తిగా మారింది. Proposal for Shubman Gill at the Oval. pic.twitter.com/76hpNoPlbi — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ షాట్ -
'చాన్స్ కూడా ఇవ్వలేదు'.. సిరాజ్ దెబ్బకు లేచి కూర్చొన్నాడు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్కు 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే పాపం పొద్దున నుంచి ఫీల్డింగ్ చేసి అలిసిపోయాడేమో తెలియదు కానీ డ్రెస్సింగ్ రూమ్లో లబుషేన్ రిలాక్స్ అయ్యాడు. కుర్చూన్న కుర్చీలోనే రిలాక్స్ అయ్యాడు. కళ్లు మూసుకుపోతుండడంతో చిన్న కునుకు తీయాలనకున్నాడు. కానీ సిరాజ్ లబుషేన్న్కు ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు. లబుషేన్ అలా కునుకు తీస్తున్నాడో లేదో.. ఇక్కడ సిరాజ్ వార్నర్ను ఔట్ చేసేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్ సిరాజ్ వేశాడు. ఆ ఓవర్ మూడో బంతిని వార్నర్ ఫ్లిక్ చేసే క్రమంలో బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ భరత్ చేతుల్లో పడింది. నిద్ర కళ్లతోనే చూసిన లబుషేన్ వార్నర్ ఔట్ అయ్యాడని తెలియగానే ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. పాపం మంచిగా రెస్ట్ తీసుకుందామనుకున్నాడు..కానీ సిరాజ్ ఆ అవకాశం కూడా ఇవ్వలేదుగా అంటూ అభిమానులు కామెంట్ చేశారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిరాజ్ దెబ్బకు నిద్రమత్తు పూర్తిగా పాయే.. ఇక వార్నర్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన లబుషేన్ నిద్రమత్తును సిరాజ్ తన బౌలింగ్తో పూర్తిగా తొలగించాడు. అదే ఓవర్లో ఐదో బంతిని సిరాజ్ బౌన్సర్ వేశాడు. లబుషేన్ ఫ్రంట్ఫుట్ వచ్చి షాట్ ఆడే యత్నంలో విఫలమయ్యాడు. అంతే బంతి వేగంగా వచ్చి వేలుకు బలంగా తాకింది. దీంతో దెబ్బకు బ్యాట్ వదిలేసి నొప్పితో అల్లాడిపోయాడు. ఈ దెబ్బతో కొన్ని సెకన్ల ముందు ఉన్న నిద్రమత్తు పూర్తిగా తొలిగిపోయి ఉండొచ్చు అని అభిమానులు పేర్కొన్నారు. Marnus labuschagne was sleeping. Siraj took a wicket and man had to wake up immediately 😭#WTCFinal2023 #WTC23 pic.twitter.com/s239Ijt3Fz — Cricket With Abdullah 🏏 (@Abdullah__Neaz) June 9, 2023 Mohammed Siraj gatecrashes Marnus Labuschagne's sleep 🤣😂 📸: Disney + Hotstar pic.twitter.com/f2InAuplFW — 𝚂𝚘𝚕𝚘_𝚙𝚞𝚛𝚞𝚜𝚑𝚘𝚝𝚑𝚊𝚖_7 (@lpurushothamre1) June 9, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే -
512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఎన్నోసార్లు జట్టుకు ఆపద్బాందవుడయ్యాడు. తన ఇన్నింగ్స్లతో ఎన్నోసార్లు టీమిండియాకు విజయాలు అందించాడు. కెరీర్ ఆరంభంలో మూడు ఫార్మాట్లలో ఆడిన రహానే క్రమంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అయినా సంప్రదాయ ఫార్మాట్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. ఎంత బాగా ఆడినా ఏదో ఒక దశలో ఒక బ్యాడ్ఫేజ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. అజింక్యా రహానేకు కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. రెండేళ్ల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో రహానే ఘోర ప్రదర్శన కనబరిచాడు. అంతే దెబ్బకు టీమిండియాలో చోటు కోల్పోయాడు. జాతీయ జట్టుకు దూరమైనప్పటికి రహానే పెద్దగా బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం మళ్లీ తనను వెతుక్కుంటూ వస్తుందని నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోపీ సహా మిగతా టోర్నీల్లో పాల్గొని సెంచరీలతో చెలరేగినా రహానేకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఐపీఎల్ 2023 సీజన్ వచ్చింది. రహానేను పెద్దగా ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో సీఎస్కే రూ. 50 లక్షల కనీస ధరకే రహానేను సొంతం చేసుకుంది. అయితే రహానే అప్పటికే పరుగుల దాహంతో ఉన్నాడు. ఆకలి మీద ఉన్న సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అప్పటికి ఎవరికి తెలియదు. కానీ రహానేను సీఎస్కే కెప్టెన్ ధోని నమ్మాడు. ధోని నమ్మకాన్ని రహానే నిలబెట్టాడు. గతంలో ఐపీఎల్ ఆడినప్పటికి రహానేలో ఇంత వేగవంతమైన ఆట ఎప్పుడు చూసింది లేదు. ఈ సీజన్లో 14 మ్యాచ్లాడిన రహానే 172.49 స్ట్రైక్రేట్తో 326 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో చూపెట్టిన సూపర్ ఫామ్ రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ సమయంలో ఏప్రిల్ 23న మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. ''ఇది సరిపోదు.. నా బెస్ట్ ఇంకా రావాల్సి ఉంది'' అంటూ కామెంట్ చేశాడు. అలా 512 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే సరికొత్తగా కనిపించాడు. ఐపీఎల్ తన ఆటతో దూకుడుగా కనిపించిన అదే రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో శాంతంగా కనిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ కొత్త రహానేను చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. తొలుత జడేజాతో కలిసి 70 పరుగులు జోడించిన రహానే.. ఆపై శార్దూల్ ఠాకూర్తో కలిసి ఏకంగా 109 పరుగులు జోడించి టీమిండియా ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. ఒక దశలో 200 లోపే చాప చుట్టేస్తుందనుకున్న తరుణంలో శార్దూల్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానే టీమిండియా పరువు కాపాడాడు. చివరికి 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 89 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తన బెస్ట్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పిన మాటకు కట్టుబడి తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రహానే రెండు వారాల వ్యవధిలోనే అభిమానులకు తనలోని డబుల్ వర్షన్ చూపించాడు. 96 at Durban 118 at Wellington 103 at Lord's 147 at Melbourne 126 at Colombo 108* at Jamaica 81 at Nottingham 112 at Melbourne 89 at Oval The crisis man at Overseas, Rahane. pic.twitter.com/LW52iqOAtH — Johns. (@CricCrazyJohns) June 9, 2023 TAKE A BOW, AJINKYA RAHANE. 89 in 129 balls with 11 fours and a six. An innings to remember on the Test return, what a knock. He made a grand comeback! No words can describe his contribution today. pic.twitter.com/N4QsbvWiVz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే -
కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే
టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ విలువను చూపించాడు. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో లార్డ్ శార్దూల్(#LordShardul) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతీసారి నేనున్నానంటూ భరోసా ఇస్తున్న శార్దూల్ మరోసారి దానిని నిలబెట్టుకున్నాడు. 2020లో ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చారిత్రాత్మక టెస్టులో శార్దూల్ హాఫ్ సెంచరీని అంత తొందరగా ఎవరు మరిచిపోరు. ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన వేళ వారిని సమర్థంగా ఎదుర్కొన్న శార్దూల్.. వాషింగ్టన్ సుందర్తో కలిసి ఏడో వికెట్కు వందకు పైగా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 115 బంతుల్లో 67 పరుగులతో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో టీమిండియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించడమే గాక 2-1తేడాతో ఆసీస్ను సొంత గడ్డపై ఓడించిన చారిత్రక సిరీస్ విజయాన్ని అందుకుంది. మరో విశేషమేమిటంటే ఈ సిరీస్ నుంచి కోహ్లి మధ్యలోనే తప్పుకోవడంతో రహానే కెప్టెన్సీలో టీమిండియా టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఇంగ్లండ్తో 2021లో ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్లోనూ అర్థసెంచరీలు సాధించడమే గాక బౌలింగ్లోనూ వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఆసీస్తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మూడోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే ఐదు పరుగులు చేసిన కేఎస్ భరత్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. రహానే ఒంటరిపోరాటం చేస్తున్నా లాభం లేదు.. ఇంకేముంది.. మరో 40 లేదా 50 పరుగుల్లోపూ టీమిండియా ఆలౌట్ అయిపోతుంది.. ఆస్ట్రేలియా టీమిండియాను ఫాలోఆన్ ఆడించి భారీ విజయం నమోదు చేస్తుంది.. ఇదే మనం చూడబోతున్నాం అంటూ టీమిండియా ఫ్యాన్స్ నిట్టూర్చారు. కానీ అప్పుడు క్రీజులోకి వచ్చాడు ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్. అయితే వచ్చీ రావడంతోనే కమిన్స్ బౌలింగ్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ పేసర్ల జోరు చూస్తుంటే శార్దూల్ను ఔట్ చేయడం పెద్ద కష్టమేమి కాదనుకున్నారు. దీనికి తోడు కమిన్స్ బౌలింగ్లో వరుసగా రెండుసార్లు గాయపడ్డాడు. కమిన్స్ వేగంతో విసిరిన బంతులు శార్దూల్ చేతిని టార్గెట్ చేశాయి. అయితే నొప్పిని భరిస్తూనే ఆసీస్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. శార్దూల్ చేసిన 36 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్కు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా ఒంటరిపోరాటం చేస్తున్న రహానేకు అండగా నిలబడేందుకు ఒక బ్యాటర్ కావాల్సిన సమయంలో శార్దూల్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఎక్కువగా రహానేకు స్ట్రైక్ ఇస్తూ మధ్యమధ్యలో తాను పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి ఏడో వికెట్కు 108 పరుగులు జోడించి అజేయంగా సాగుతున్నారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రహానే 89 బ్యాటింగ్, శార్దూల్ 36 పరుగులు బ్యాటింగ్ క్రీజులో ఉన్నారు. అయితే శార్దూల్ ఆట ఇంకా ముగియలేదు.. మరోసారి హాఫ్ సెంచరీ చేస్తాడా.. లేదంటే ఏకంగా సెంచరీతో మెరుస్తాడా అనేది చూడాలి. -
రీఎంట్రీలో ఆపద్భాందవుడి పాత్ర.. భారత్ తరపున తొలి బ్యాటర్గా
టీమిండియా స్టార్ అజింక్యా రహానే టెస్టు పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. దాదాపు 512 రోజుల తర్వాత నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ ద్వారా టెస్టు ఆడుతున్న రహానే అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో రహానే ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ సూపర్ ఫిఫ్టీతో మెరిశాడు. ఆసీస్ పేసర్ల దాటికి బ్యాటింగ్ చేయడానికి ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో రహానే 92 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. రహానే టెస్టు కెరీర్లో ఇది 26వ అర్థశతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే అజింక్యా రహానే టీమిండియా తరపున డబ్ల్యూటీసీ ఫైనల్లో అర్థసెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 2021లో టీమిండియా కివీస్తో తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడినప్పటికి ఆ మ్యాచ్లో ఒక్క భారత్ బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ అందుకోలేకపోయాడు. అప్పటి మ్యాచ్లోనూ రహానే 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవడం విశేషం. తాజాగా ఆసీసీతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుదేలైనప్పటికి రహానే ఒక్కడే ఒంటరిపోరాటం చేస్తూ టీమిండియాను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలే ఐపీఎల్ సీఎస్కే తరపున అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రహానే అదే ఫామ్ను ఇక్కడా కంటిన్యూ చేయడం సంతోషదాయకం. టి20ల్లో తన వేగవంతమైన ఆటతో అలరించిన రహానే టెస్టులకు వచ్చేసరికి తనలోని టెస్టు స్పెషలిస్ట్ను బయటికి తీశాడు. #WATCH | The Oval, London: This has been a pleasant and surprising morning as yesterday we had a very disappointing result. Shardul Thakur is batting very maturely and the result we have now is that they (Rahane and Thakur) have given us a fighting chance. Yesterday it looked… pic.twitter.com/56I8gMWmCz — ANI (@ANI) June 9, 2023 -
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లండ్లోనే ఎందుకు?
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలు క్రికెట్ ఆడుతున్న సభ్యదేశాల్లో ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటుంది. వన్డే వరల్డ్కప్, టి20 వరల్డ్కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మెగాటోర్నీలు ఏవైనా ఏదో ఒక దేశం ఆతిథ్యం ఇవ్వడం కనబడుతుంది. అయితే తాజాగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు మాత్రం ఇంగ్లండ్ మాత్రమే ఎందుకు ఆతిథ్యమిస్తోంది అని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. తొలిసారి 2021లో నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్కు ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ వేదిక అయింది. ఈసారి ఓవల్ స్టేడియంలో రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. రెండు వేర్వేరు స్టేడియాల్లో రెండు ఫైనల్స్ జరిగితే ఇందులో కామన్గా ఉంది మాత్రం టీమిండియానే. వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా ఈసారి కూడా మ్యాచ్ గెలస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. 2021లో కివీస్తో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్స్ను ఐసీసీ ఇంగ్లండ్లోనే ఎందుకు నిర్వహిస్తుందనే ప్రశ్నకు ఒకటే సమాధానం వినిపిస్తుంది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లాంటి ఆసియా ఖండపు దేశాల్లో జూన్ నెలలో ఎలాంటి టెస్టు మ్యాచ్లు జరగవు. దానికి కారణం వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్, శ్రీలంక ఇలా ఏది చూసుకున్నా ఉపఖండపు దేశాల్లో వాతావరణ పరిస్థితి ఒకలాగే ఉంటుంది. అందుకే జూన్ నుంచి ఆగస్టు వరకు ఉపఖండపు దేశాలు స్వదేశంలో టెస్టు మ్యాచ్లు ఎక్కువగా ఆడవు. మనం సరిగ్గా గమనిస్తే జూన్ నెలలో ఇంగ్లండ్ మినహా ఏ దేశంలోనూ ఎక్కువగా క్రికెట్ మ్యాచ్లు జరగవు. ఈ సమయంలో ఇంగ్లండ్ లాంటి యూరోప్ దేశంలోనే పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయి. అందుకే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ను ఇంగ్లండ్లో నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇంగ్లండ్లోని లార్డ్స్లో నిర్వహించాలని ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా.. ఇంగ్లండ్లోని పరిస్థితులు ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా ఉంటాయి. ఇక్కడి పిచ్లన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లండ్ పిచ్ల్లో ఎక్కువగా స్వింగ్ కనిపిస్తుంది. ఆసీస్ పిచ్లు ఎక్కువగా బౌన్సీ ట్రాక్లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్లోనూ పరిస్థితులు అలానే ఉంటాయి. అందుకే ఇంగ్లండ్లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నప్పటికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ టీమిండియాకు ఇది కాస్త ప్రతికూలమని చెప్పొచ్చు. 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా తడబడింది. స్వింగ్ పిచ్లపై బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన టీమిండియా బ్యాటర్లు వికెట్లుపారేసుకున్నారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఈసారి కూడా పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఓవల్ పిచ్ టీమిండియా కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా సహకరిస్తుందని తెలుస్తోంది. అలా అని పిచ్ను తప్పు బట్టడానికి లేదు. ఆసీస్ ఇన్నింగ్స్లో టీమిండియా పేసర్లు ఎలాగైతే వికెట్లు తీశారో.. టీమిండియా ఇన్నింగ్స్లోనూ ఇప్పటివరకు పడిన ఆరు వికెట్లలో ఐదు పేసర్లే పడగొట్టారు. అయినా ఆసీస్ బ్యాటర్లు యదేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన చోట టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయలేక అల్లాడిపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా ఈసారి కూడా రన్నరప్గా నిలిచేలా కనిపిస్తోంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ను ఐసీసీ ఇంగ్లండ్లో నిర్వహిస్తున్నప్పటికి బీసీసీఐ పెద్దగా అడ్డుచెప్పడం లేదు. క్రికెట్ ప్రపంచాన్ని కనుసైగలతో శాసిస్తున్న బీసీసీఐ తలచుకుంటే డబ్ల్యూటీసీ వేదికను మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ టెస్టు ఛాంపియన్షిప్ విషయంలో బీసీసీఐ సీరియస్గా కనిపించడం లేదు. టెస్టు క్రికెట్లో పెద్దగా కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ తన దృష్టంతా టి20లు, వన్డేలపైనే ఉంచింది. బీసీసీఐ ఆలోచనా ధోరణి మారాలని అభిమానులు భావిస్తున్నారు. ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్(FTP) పేరిట ఇప్పటికే రానున్న మూడేళ్లకు షెడ్యూల్ రూపొందించిన ఐసీసీ వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ను కూడా ఇంగ్లండ్లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది మార్చడానికి అవకాశం లేకపోయినప్పటికి బీసీసీఐ చొరవ తీసుకొని ఐసీసీని ఒప్పించి 2027 టెస్టు ఛాంపియన్షిప్కు తటస్థ వేదికలో జరిగేలా చూడొచ్చు. అలా కాదని బీసీసీఐ పట్టించుకోకుండా ఉంటే మాత్రం టీమిండియా భవిష్యత్తులోనూ రన్నరప్గానే నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: WTC Final Day-3: రహానే ఫిఫ్టీ.. 200 మార్క్ దాటిన టీమిండియా