-
చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్.. తొలి ఇండియన్గా రికార్డు
గువాహటి: భారత ఫుట్బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్ల మైలురాయిని తాకారు. -
‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ మెడల్ కోహ్లిదే.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మేటి బ్యాటర్ మాత్రమే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా! ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించిన ఈ రన్మెషీన్.. అఫ్గనిస్తాన్తో మూడో టీ20 సందర్భంగా.. మరోసారి అసాధారణ ఫీల్డింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. బెంగళూరు వేదికగా నువ్వా-నేనా అన్నట్లుగా టీమిండియాతో సాగిన మ్యాచ్లో అఫ్గనిస్తాన్ అసాధారణ పోరాటం చేసిన విషయం తెలిసిందే. రెండు సూపర్ ఓవర్ల తర్వాత గానీ జద్రాన్ బృందం రోహిత్ సేన ముందు తలవంచలేదు. ఆద్యంతం అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ మ్యాచ్ నిజానికి సూపర్ ఓవర్ దాకా వచ్చేదే కాదు. టీమిండియా విధించిన 213 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గన్ ఇన్నింగ్స్ పదిహేడో ఓవర్లో కోహ్లి ఓ అద్భుతం చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన బంతిని.. కరీం జనత్ లాంగాన్ దిశగా సిక్సర్గా మలిచేందుకు భారీ షాట్ ఆడాడు. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టి.. బౌండరీ రోప్ దాటకుండా లోపలికి విసిరాడు. Excellent effort near the ropes! How's that for a save from Virat Kohli 👌👌 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @imVkohli | @IDFCFIRSTBank pic.twitter.com/0AdFb1pnL4 — BCCI (@BCCI) January 17, 2024 అప్పటికి కరీం ఒక్క పరుగు మాత్రమే తీయగా.. కోహ్లి ఎఫర్ట్ వల్ల టీమిండియాకు ఐదు పరుగులు సేవ్ అయ్యాయి. అప్పటికి అఫ్గనిస్తాన్ స్కోరు 165-4. ఒకవేళ ఆ ఐదు పరుగులు వచ్చి అఫ్గన్కు వచ్చి ఉంటే మ్యాచ్ టై అయ్యేదీ కాదూ.. సూపర్ ఓవర్ల దాకా వచ్చేది కాదు! అలా కోహ్లి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడన్న మాట!! ఈ నేపథ్యంలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ విరాట్ కోహ్లిపై ప్రశంసల జల్లు కురిపించాడు. యువ ఆటగాళ్లకు సవాల్ విసిరేలా.. మైదానంలో పాదరసంలా కదులుతున్న కోహ్లి.. అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడాడు. ఈ క్రమంలో ‘ఫీల్డర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు విజేతగా కోహ్లిని ప్రకటించిన దిలీప్.. అతడికి మెడల్ అందజేశాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూంలో ఉన్న టీమిండియా క్రికెటర్లంతా చప్పట్లతో కోహ్లిని అభినందించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అమితానందం వ్యక్తం చేస్తూ సహచర ఆటగాడి నైపుణ్యాలను మెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లి.. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. రెండో టీ20లో 16 బంతుల్లో 29 పరుగులు చేసిన అతడు.. బుధవారం నాటి మూడో మ్యాచ్లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే, ఫీల్డర్గా మాత్రం సూపర్ సక్సెస్ అయి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 𝗗𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝗥𝗼𝗼𝗺 𝗕𝗧𝗦 | 𝗙𝗶𝗲𝗹𝗱𝗲𝗿 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗦𝗲𝗿𝗶𝗲𝘀 After a fantastic 3⃣-0⃣ win over Afghanistan, it's time to find out who won the much-awaited Fielder of the Series Medal 🏅😎 Check it out 🎥🔽 #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/N30kVdndzB — BCCI (@BCCI) January 18, 2024 చదవండి: #IndvsAus2021: మళ్లీ గోల్డెన్ డక్.. రీఎంట్రీ మర్చిపోవ్సాలిందే? -
కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి!.. సంజూ కూడా అంతే: రోహిత్ శర్మ
India vs Afghanistan, 3rd T20I- Rohit Comments On Kohli: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తమదైన ముద్ర వేయగలిగారు. అఫ్గనిస్తాన్తో తొలి రెండు మ్యాచ్లలో డకౌట్గా వెనుదిరిగిన రోహిత్.. ఆఖరి టీ20లో మాత్రం సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లంతా పెవిలియన్కు వరుస కట్టిన వేళ అజేయ శతకంతో రాణించాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 కెరీర్లో అత్యధిక సెంచరీలు(5) బాదిన క్రికెటర్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. మరోవైపు.. తొలి మ్యాచ్కు దూరంగా ఉన్న కోహ్లి.. రెండో మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 విలువైన ఇన్నింగ్స్తో పదహారు బంతుల్లో 29 పరుగులు రాబట్టి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, బుధవారం నాటి మూడో టీ20లో మాత్రం తన శైలికి భిన్నంగా ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని యత్నించి విఫలమయ్యాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటైన కోహ్లి.. తద్వారా తన ఇంటర్నేషనల్ టీ20 కెరీర్లో తొలిసారి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. సంజూ కూడా డకౌట్ మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కూడా రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక కోహ్లి మాదిరే వచ్చీ రాగానే పెవిలియన్కు చేరాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ వీరిద్దరి ప్రదర్శన గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. టీమిండియా- అఫ్గనిస్తాన్ టీ20 సిరీస్ బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడుతూ.. ‘‘ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలి.. వాళ్ల నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామన్న అంశాల గురించే జట్టులోని ఆటగాళ్లకు చెప్తాము. మైదానంలో దిగిన తర్వాత ఏం చేయాలో, ఎలా ఆడాలో వాళ్లకంటూ ఓ వ్యూహం ఉంటుంది. అలాగే వాళ్లు ఎలా ఆడాలని మేము కోరుకుంటున్నామో కూడా పూర్తి అవగాహనతో ఉంటారు. కోహ్లి అలా చేయడు.. కానీ ఈసారి మాత్రం ఈ మ్యాచ్లో కోహ్లి ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని ప్రయత్నించాడు. సాధారణంగా అతడు ఇలా చేయడు. అయితే, జట్టు కోసం ఏదైనా భిన్నంగా చేయాలనే తాపత్రయంతోనే కోహ్లి అలా ఆడాడు. శాంసన్ కూడా అంతే.. ఎదుర్కొన్న తొలి బంతికే షాట్కు యత్నించాడు. ఏదేమైనా వాళ్ల ఉద్దేశం మాత్రం సరైందే’’ అని రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లి, సంజూ శాంసన్లను సమర్థించాడు. కాగా అఫ్గనిస్తాన్తో మూడో టీ20లో ఫరీద్ అహ్మద్ బౌలింగ్లో విరాట్ కోహ్లి, సంజూ శాంసన్ సున్నా పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించారు. ఇదిలా ఉంటే.. స్వదేశంలో అఫ్గన్తో టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AFG 3rd T20I Highlights: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’... Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 -
సూపర్ ఓవర్ అంటే చాలు హిట్మ్యాన్కు పూనకం వస్తుంది..!
సూపర్ ఓవర్ అంటే చాలు టీమిండియా సారధి రోహిత్ శర్మకు పూనకం వస్తుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు మూడు సూపర్ ఓవర్లు ఆడిన హిట్ మ్యాన్ ఈ సందర్భం వచ్చిన ప్రతిసారి సూపర్ మ్యాన్లా రెచ్చిపోయాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టీ20లో రెండు సూపర్ ఓవర్లలో విధ్వంసం సృష్టించిన (4 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 13, 3 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 11) రోహిత్.. 2018లో న్యూజిలాండ్తో జరిగిన సూపర్ ఓవర్లో 4 బంతుల్లో 15 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు. ఈ మూడు సందర్భాల్లో రోహిత్ ఆటతీరును చూసిన వారు సూపర్ ఓవర్లో హిట్మ్యాన్ కాస్త సూపర్ మ్యాన్ అయిపోతాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్లో రోహిత్ సూపర్ ఓవర్లోనే కాకుండా అంతకుమందు కూడా విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన రోహిత్.. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలుత ఆచితూచి ఆడిన హిట్మ్యాన్ ఆతర్వాత పూనకం వచ్చినట్లు ఊగిపోయి, కెరీర్లో ఐదో టీ20 శతకం బాదాడు. రోహిత్తో పాటు రింకూ సింగ్ కూడా రెచ్చిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 212 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేయడంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
టాప్-10లోకి దూసుకొచ్చిన జైస్వాల్, అక్షర్ పటేల్
ఐసీసీ తాజాగా (భారత్-ఆఫ్ఘనిస్తాన్ మూడో టీ20 అనంతరం) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, బౌలింగ్లో అక్షర్ పటేల్ టాప్-10లోకి దూసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్తో విజృంభించిన యశస్వి.. ఏడు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానానికి ఎగబాకగా.. ఇదే సిరీస్లో విశేషంగా రాణించిన అక్షర్ పటేల్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఐదో ప్లేస్కు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో ఆడనప్పటికీ సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్ను కాపాడుకోగా.. ఆఫ్ఘన్ సిరీస్కు దూరమైన రుతురాజ్ ఓ స్థానం కోల్పోయి తొమ్మిదో ప్లేస్కు పడిపోయాడు. ఈ జాబితాలో ఫిలప్ సాల్ట్, మొహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్ రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే.. ర్యాంకింగ్స్లో అక్షర్ పటేల్ ఎఫెక్ట్ సహచర బౌలర్ రవి భిష్ణోయ్పై పడింది. తాజా ర్యాంకింగ్స్లో బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాలు దిగజారి ఆరో ప్లేస్కు పడిపోయాడు. జింబాబ్వే సిరీస్లో రాణించిన లంక బౌలర్లు హసరంగ, తీక్షణ ఒకటి, రెండు స్థానాలు మెరుగుపర్చుకుని సంయుక్తంగా మూడో స్థానానికి ఎగబాకారు. ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అకీల్ హొసేన్ ఓ స్థానం మెరుగుపర్చుకుని రెండో ప్లేస్కు చేరాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో నిన్న ముగిసిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రసవత్తరంగా సాగిన నిన్నటి సమరంలో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలుత రోహిత్ శర్మ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్ 212 పరుగులు చేయగా.. ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే స్కోర్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో సైతం మరోసారి స్కోర్లు సమం కావడంతో రెండో సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సూపర్ ఓవర్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. -
అఫ్గన్ బౌలింగ్ను చీల్చి చెండాడిన రోహిత్, రింకూ.. ఆల్టైమ్ రికార్డు
అఫ్గనిస్తాన్తో మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, నయా ఫినిషర్ రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. పవర్ ప్లేలో 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టులో కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ పట్టుదలగా నిలబడ్డారు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ అఫ్గన్ ఆటగాళ్ల బౌలింగ్ను చీల్చి చెండాడారు. మొత్తంగా.. 69 బంతుల్లో.. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదిన రోహిత్ హిట్మ్యాన్ అనే బిరుదును సార్థకం చేసుకున్నాడు. మరో ఎండ్ నుంచి కెప్టెన్ రోహిత్కు అన్ని విధాలా అండగా నిలిచిన రింకూ సైతం బ్యాట్ ఝులిపించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ యూపీ కుర్రాడు.. 39 బంతుల్లో 69 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రింకూ ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 6 సిక్స్లు ఉండటం విశేషం. ఇక రోహిత్- రింకూ పటిష్ట భాగస్వామ్యం కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.మరి ఈ మ్యాచ్ సందర్భంగా.. రోహిత్ శర్మ- రింకూ సింగ్ నమోదు చేసిన రికార్డులు గమనిద్దాం! Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 అంతర్జాతీయ టీ20లలో ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసింది వీళ్లే ►రోహిత్ శర్మ- రింకూ సింగ్- అఫ్గనిస్తాన్ మీద- 190 నాటౌట్- 2024లో ►సంజూ శాంసన్- దీపక్ హుడా- ఐర్లాండ్ మీద- 176 రన్స్- 2022లో ►రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్- శ్రీలంక మీద- 165 రన్స్- 2017లో ►యశస్వి జైశ్వాల్- శుబ్మన్ గిల్- వెస్టిండీస్ మీద- 165 రన్స్- 2023లో. అంతర్జాతీయ టీ20లలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు ►36- స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్-డర్బన్- 2007లో ►36- అకిల ధనంజయ బౌలింగ్లో- కీరన్ పొలార్డ్- కూలిడ్జ్- 2021లో ►36- కరీం జనత్ బౌలింగ్లో- రోహిత్ శర్మ, రింకూ సింగ్- బెంగళూరుల- 2024లో. చదవండి: రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత -
రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్.. దెబ్బకు రికార్డులన్నీ బద్దలు! ఇది కదా ఊచకోత
#RohitSharma Comeback- Hitman 5th T20I Century: అఫ్గనిస్తాన్ మూడో టీ20 సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వింటేజ్ హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ వైఫల్యాలను మరిపించేలా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అఫ్గన్ బౌలర్ల ధాటికి సహచరులంతా పెవిలియన్కు క్యూ కట్టిన వేళ తానున్నానంటూ భరోసా ఇచ్చాడు. కాగా బెంగళూరులో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. పవర్ ప్లేలోనే యశస్వి జైస్వాల్(4), విరాట్ కోహ్లి(0), శివం దూబే(1), సంజూ శాంసన్(0) రూపంలో టీమిండియా కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్కు తోడై దంచికొట్టిన రింకూ అప్పటికి జట్టుకు స్కోరు 30 పరుగులు మాత్రమే! అలాంటి సమయంలో ఆచితూచి ఆడుతూనే.. ఏదేమైనా తగ్గేదేలే అన్నట్లు రోహిత్ శర్మ ప్రత్యర్థి జట్టు బౌలర్లపై అటాకింగ్ మొదలుపెట్టాడు. అగ్నికి ఆజ్యంలా రోహిత్కు తోడైన యంగ్ బ్యాటర్ రింకూ సింగ్(69 నాటౌట్) కూడా ధనాధన్ బ్యాటింగ్తో అఫ్గన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నా రోహిత్ శర్మ పరుగుల దాహం తీరలేదు. 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో పరుగుల సునామీ సృష్టించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మొత్తంగా 69 బంతుల్లో 121 పరుగులు సాధించాడు. 2019 తర్వాత పొట్టి ఫార్మాట్లో తన తొలి శతకం నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. Rohit Sharma 🤝 Rinku Singh OuR’RR’ 😎 💪#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @ImRo45 | @rinkusingh235 pic.twitter.com/SfKSl07JoE — BCCI (@BCCI) January 17, 2024 అదే విధంగా.. రోహిత్ శర్మకు అంతర్జాతీయ టీ20లలో ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్గా హిట్మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లు 1.రోహిత్ శర్మ(ఇండియా)- 5 2.సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 4 3.గ్లెన్ మాక్స్వెల్(ఆస్ట్రేలియా)- 4. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 కోహ్లి ఆల్టైమ్ రికార్డు బ్రేక్ అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ(1643 పరుగులు) అవతరించాడు. తద్వారా విరాట్ కోహ్లి పేరిట(1570 రన్స్) ఉన్న ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టాడు. చదవండి: Ind vs Afg T20I: గోల్డెన్ డక్గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్లో ఇదే తొలిసారి -
T20I: గోల్డెన్ డక్గా వెనుదిరిగిన కోహ్లి.. కెరీర్లో ఇదే తొలిసారి
Ind vs Afg- Virat Kohli Golden Duck: అఫ్గనిస్తాన్తో మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు టీమిండియా ఆఖరిగా ఆడుతున్న ఈ సిరీస్తోనే కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్కు దూరమైన ఈ రన్మెషీన్.. ఇండోర్లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. మొత్తంగా 16 బంతుల్లో 29 పరుగులతో రాణించాడు. అయితే, బెంగళూరులో జరుగుతున్న మూడో టీ20లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(4) స్థానంలో క్రీజులోకి వచ్చిన కోహ్లి.. గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. తొలిసారిగా గోల్డెన్ డక్ అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ బౌలింగ్లో.. టీమిండియా ఇన్నింగ్స్ మూడో ఓవర్ నాలుగో బంతికి.. పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లి విఫలమయ్యాడు. ఈ క్రమంలో మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలిసారిగా గోల్డెన్ డక్ నమోదు చేశాడు కోహ్లి. అది కూడా ఐపీఎల్లో తన సొంతమైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ చెత్త రికార్డు మూటగట్టుకోవడం గమనార్హం. స్టేడియం మొత్తం గప్చుప్ దీంతో.. కోహ్లి బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. విరాట్ కోహ్లి అవుట్ కాగానే స్టేడియం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. -
Ind vs Afg: ఉత్కంఠ పోరులో అఫ్గన్పై భారత్ విజయం.. సిరీస్ కైవసం
India vs Afghanistan 3rd T20I- Updates: అఫ్గన్పై భారత్ విజయం సాధించింది. దాంతో సిరీస్ను టీమిండియా కైవసం చేసుకుంది. రెండో సూపర్ ఓవర్లో తేలిన మ్యాచ్ ఫలితం. తొలి సూపర్ ఓవర్లో 16 పరుగులు చేసిన ఇరు జట్లు రెండో సూపర్ ఓవర్లో ఉత్కంఠ పోరులో టీమిండియా గెలుపొందింది. స్కోర్లు IND 212/4 (20), AFG 212/6 (20) మొదటి సూపర్ ఓవర్లో కూడా మ్యాచ్ టై అయింది. అఫ్గన్ ఆరు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్ టై అయింది (సూపర్ ఓవర్ ప్రోగ్రెస్లో ఉంది) 16.2: నాలుగో వికెట్ కోల్పోయిన అఫ్గన్ సుందర్ బౌలింగ్లో నబీ అవుట్.. స్కోరు 164/4 (16.3) ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన వాషింగ్టన్ సుందర్ 12.4: అజ్మతుల్లా అవుట్.. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 12.4: సుందర్ బౌలింగ్లో జద్రాన్ స్టంపౌట్. 10.6: తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో గుర్బాజ్ అవుట్. వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి 50 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. స్కోరు: 93-1(11 ఓవర్లలో). పవర్ ప్లేలో అఫ్గనిస్తాన్ స్కోరు: 51/0 (6) ►నిలకడగా ఆడుతున్న అఫ్గన్ ఓపెనర్లు.. ఇబ్రహీం జద్రాన్ 28, రహ్మనుల్లా గుర్బాజ్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. శతక్కొట్టిన రోహిత్.. రింకూ సింగ్ ధనాధన్ ఇన్నింగ్స్ బెంగళూరు వేదికగా అఫ్గనిస్తాన్తో మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్కు తోడు రింకూ సింగ్ ధనాధన్ బ్యాటింగ్ కారణంగా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 212 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులతో చెలరేగగా.. రింకూ 39 బంతుల్లో 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా ఐదో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. అదే విధంగా పొట్టి ఫార్మాట్లో తన అత్యధిక స్కోరు నమోదు చేసి దటీజ్ హిట్మ్యాన్ అనిపించుకున్నాడు. 🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏 Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD — BCCI (@BCCI) January 17, 2024 18.6: రింకూ సింగ్ హాఫ్ సెంచరీ రోహిత్ 104, రింకూ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. 18.4: శతక్కొట్టిన రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 5 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా చరిత్ర. దటీజ్ హిట్మ్యాన్ అంటూ ప్రశంసల జల్లు దంచి కొడుతున్న రోహిత్, రింకూ.. టీమిండియా స్కోరు: 144/4 (17) రోహిత్ 57 బంతుల్లో 80, రింకూ సింగ్ 32 బంతుల్లో 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న రోహిత్, రింకూ సింగ్ 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు: 131/4 100 పరుగుల భాగస్వామ్యం 15.3: సలీం సఫీ నోబాల్.. రోహిత్ శర్మ, రింకూ సింగ్ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు. 12.6: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ అఫ్గన్తో తొలి రెండు మ్యాచ్లలో డకౌట్ అయిన రోహిత్ శర్మ.. మూడో టీ20 అర్ధ శతకంతో మెరిశాడు. 13 ఓవర్లలో టీమిండియా స్కోరు: 97-4. రింకూ 30 పరుగులతో రోహిత్కు తోడుగా ఉన్నాడు. నిలకడగా రోహిత్.. స్పీడు పెంచిన రింకూ 12: వరుసగా రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ . 12 వ ఓవర్ ముగిసే సరికి రోహిత్ 41, రింకూ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు- 61/4 రోహిత్ 27, రింకూ 19 పరుగులతో ఉన్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతూ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసే దిశగా వెళ్తున్నారు. ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 48-4 పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 30-4 రోహిత్ 13, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. సంజూ శాంసన్ డకౌట్ 4.3: ఫరీద్ అహ్మద్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగిన సంజూ. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన వికెట్ కీపర్ బ్యాటర్. సంజూ స్థానంలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ 8 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 22-4 (5 ఓవర్లు) దూబే అవుట్.. మూడో వికెట్ డౌన్ 3.6: అజ్మతుల్లా బౌలింగ్లో శివం దూబే వికెట్ కీపర్ క్యాచ్గా అవుటయ్యాడు. గత రెండు మ్యాచ్లలో వరుసగా అర్ధ శతకాలు బాదిన ఈ ఆల్రౌండర్.. బెంగళూరులో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. దూబే స్థానంలో సంజూ శాంసన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-3(4) కోహ్లి డకౌట్.. టీమిండియా స్కోరు 19-2(3) 2.4: ఫరీద్ అహ్మద్ బౌలింగ్లో కోహ్లి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో కోహ్లి ఇలా ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ కావడం ఇదే తొలిసారి. కాగా ఇబ్రహీం జద్రాన్కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అతడి స్థానంలో శివం దూబే క్రీజులోకి వచ్చాడు. రోహిత్ నాలుగు పరుగులతో ఆడుతున్నాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 2.3: యశస్వి జైస్వాల్(4) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఫరీద్ అహ్మద్ బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ పెవిలియన్ చేరగా.. విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. రెండు ఓవర్లలో టీమిండియా స్కోరు: 13-0 టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి, రోహిత్ 1.3: ఎట్టకేలకు రీఎంట్రీలో.. ఈ సిరీస్లోనూ పరుగుల ఖాతా తెరిచిన రోహిత్. అజ్మతుల్లా బౌలింగ్లో సింగిల్ తీసిన హిట్మ్యాన్. సంజూకు ఛాన్స్ తొలి రెండు మ్యాచ్లలో మొదట బౌలింగ్ చేశాం కాబట్టి.. ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.అదే విధంగా ఈ మ్యాచ్లో మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు హిట్మ్యాన్ వెల్లడించాడు. నామమాత్రపు మ్యాచ్ సందర్భంగా భిన్నమైన కాంబినేషన్లు ట్రై చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే.. అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, అర్ష్దీప్ సింగ్ల స్థానంలో కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్లకు తుదిజట్టులో చోటిచ్చినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. క్లీన్స్వీప్పై కన్ను కాగా టీ20 ప్రపంచకప్-2024కు ముందు భారత జట్టు ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ఇది. ఇందులో భాగంగా.. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్ సేన... అఫ్గన్తో మూడో టీ20లోనూ గెలిచి క్లీన్స్వీప్తో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అఫ్గనిస్తాన్ భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా తాము కూడా తుదిజట్టులో మూడు మార్పులు చేసినట్లు అఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు. షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్లను ఆడించనున్నట్లు వెల్లడించాడు. తుదిజట్లు టీమిండియా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శివమ్ దూబే, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్. అఫ్గనిస్తాన్ రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), గుల్బదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, మహ్మద్ సలీం సఫీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. -
చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!
Ind vs Afg 3rd T20- Virat Kohli On Cusp Of Becoming...: సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇప్పటికే ఎన్నెన్నో ఘనతలు సాధించాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అఫ్గనిస్తాన్తో మూడో టీ20 సందర్భంగా ఈ రన్మెషీన్ను మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. రీఎంట్రీలో దూకుడుగా కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత దాదాపు పద్నాలుగు నెలల విరామం అనంతరం కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీ వేదికగా తొలి టీ20తోనే బరిలోకి దిగాల్సి ఉండగా.. కూతురు వామిక పుట్టినరోజు(జనవరి 11) నేపథ్యంలో ఆ మ్యాచ్కు దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇండోర్లో ఆదివారం నాటి రెండో టీ20 సందర్భంగా రంగంలోకి దిగిన విరాట్ కోహ్లి.. 16 బంతుల్లో 29 పరుగులతో ఆకట్టుకున్నాడు. క్రీజులో ఉన్నది కాసేపే అయినా దూకుడుగా ఆడుతూ అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడుతూ అభిమానులకు వినోదాన్ని పంచాడు. ఐపీఎల్ హోం గ్రౌంగ్లో సిక్స్తో ఆరంభిస్తే ఇక ఇప్పటికే ఈ సిరీస్ను టీమిండియా 2-0తో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులో బుధవారం నాటి నామమాత్రపు మూడో టీ20కి ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. విరాట్ కోహ్లికి ఐపీఎల్లో హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి ఆరు పరుగులు సాధిస్తే.. టీ20 ఫార్మాట్లో 12 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్గా ఈ జాబితాలో క్రిస్ గేల్(14562), షోయబ్ మాలిక్(12993), కీరన్ పొలార్డ్(12430) తర్వాతి స్థానాల్లో నిలుస్తాడు. Indore ✈️ Bengaluru#TeamIndia in town for the 3⃣rd & final T20I 👏 👏#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/xKKRi6yf9W — BCCI (@BCCI) January 15, 2024 పొట్టి ఫార్మాట్లో అన్నీ కలిపి దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ(టీ20) ట్రోఫీలో భాగమైన కోహ్లి.. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా టీమిండియాకు ఆడుతూ.. అన్నీ కలిపి పొట్టి ఫార్మాట్లో పదకొండు వేలకు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ స్థాయిలో టీ20లలో 4037 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి నంబర్ వన్(అత్యధిక రన్స్) బ్యాటర్గా కొనసాగుతున్నాడు. అదే విధంగా.. ఐపీఎల్లోనూ 7263 రన్స్తో హయ్యస్ట్ రన్ స్కోరర్గా ఉన్నాడు. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
హార్దిక్ తిరిగొచ్చినా వరల్డ్కప్లో ఆడేది అతడే: టీమిండియా దిగ్గజం
T20 WC 2024: టీమిండియా ఆల్రౌండర్ శివం దూబేపై భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఈ ముంబై బ్యాటర్... టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అంచనా వేశాడు. ఇలాగే ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగితే సెలక్టర్లు అతడిని పక్కనపెట్టే సాహసం చేయలేరని పేర్కొన్నాడు. కాగా 2019లో బంగ్లాదేశ్ టూర్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టాడు పేస్ ఆల్రౌండర్ శివం దూబే. ఢిల్లీ వేదికగా జరిగిన నాటి మ్యాచ్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అదే విధంగా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఆ తర్వాత అడపాదడపా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పాండ్యా గాయం.. దూబే పాలిట వరం! దీంతో బీసీసీఐ సెలక్టర్లు శివం దూబేను పక్కనపెట్టారు. అయితే, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున గతేడాది సత్తా చాటిన దూబేను.. హార్దిక్ పాండ్యా గాయం రూపంలో అదృష్టం వరించింది. ప్రపంచకప్-2024కు ముందు స్వదేశంలో టీమిండియా అఫ్గనిస్తాన్తో ఆడుతున్న టీ20 సిరీస్కు పాండ్యా దూరమయ్యాడు. చీలమండ నొప్పి కారణంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా స్థానంలో పేస్ ఆల్రౌండర్గా శివం దూబేకు అవకాశం వచ్చింది. అయితే, పునరాగమనంలో దూబే తప్పులను పునరావృతం చేయలేదు. వరుస హాఫ్ సెంచరీలు మొహాలీ వేదికగా తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో పాటు.. లక్ష్య ఛేదనలో దంచికొట్టాడు. కేవలం 40 బంతుల్లోనే 60 పరుగులు రాబట్టి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలుపుతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక రెండో టీ20లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన శివం దూబే.. ఒక వికెట్ పడగొట్టడంతో పాటు.. 32 బంతుల్లోనే 63 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. మరోసారి జట్టును గెలిపించాడు. తద్వారా టీమిండియా 2-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. సెలక్టర్లకు తలనొప్పి ఇక బుధవారం నాటి మూడో టీ20లోనూ సత్తా చాటి.. ఆపై ఐపీఎల్-2024లోనూ అద్భుతాలు చేస్తే దూబేకు తిరుగు ఉండదు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ హార్దిక్ పాండ్యా ఫిట్గా లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి? అని మనమంతా ఆందోళనకు గురయ్యాం. కానీ.. ఇప్పుడు హార్దిక్ పూర్తి ఫిట్గా ఉన్నా శివం దూబే అమెరికా ఫ్లైట్ ఎక్కడం ఖాయం. ఇలాగే తన ప్రదర్శనను కొనసాగిస్తే... అతడిని జట్టు నుంచి తప్పించాలన్న ఆలోచనే రాదు. హార్దిక్ తిరిగి వస్తే సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. గత రెండు మ్యాచ్లతో దూబే తన స్థాయిని పెంచుకున్నాడు. తనదైన శైలిలో ఆడుతూ విజయవంతమవుతున్నాడు. ఎవరినీ అనుకరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి తానేం చేయాలో అంతా చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా జూన్ 4 నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. చదవండి: లక్ష్యం 110.. నరాలు తెగే ఉత్కంఠ! ఏకంగా 7 వికెట్లు కూల్చి.. -
రోహిత్, పంత్లను అధిగమించిన యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ విషయంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్లను అధిగమించాడు. ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20 అనంతరం యశస్వి సాధించిన ఈ ఘనతకు సంబంధించిన విశేషాలు బయటికి వచ్చాయి. టీ20ల్లో 23 ఏళ్లు దాటక ముందే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన భారత బ్యాటర్గా యశస్వి రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు రిషబ్ పంత్, అప్ కమింగ్ ప్లేయర్ తిలక్ వర్మల పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అధిగమించాడు. రోహిత్, పంత్, తిలక్ ముగ్గురూ 23 ఏళ్లు దాటకముందు రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయగా.. యశస్వి ఏకంగా నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదాడు. 22 ఏళ్ల యశస్వి 16 టీ20ల్లోనే 163.83 స్ట్రయిక్రేట్తో 498 పరుగులు చేశాడు. Young and unstoppable! Yashasvi Jaiswal notches up five fifties in T20Is before turning 23, setting a new record for the most by an Indian player. pic.twitter.com/IFNTeB35iW— CricTracker (@Cricketracker) January 16, 2024 కాగా, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో టీ20లో 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసిన యశస్వి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వితో పాటు శివమ్ దూబే (63 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించడంతో ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. గుల్బదిన్ (57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. అర్ష్దీప్ 3, అక్షర్, భిష్ణోయ్ తలో 2 వికెట్లు, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టారు. ఛేదనలో దూబే, జైస్వాల్ భారత్ ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 బెంగళూరు వేదికగా జనవరి 17న జరుగనుంది. -
నాకు అప్పగించిన పని పూర్తి చేశా.. ఇక: శ్రేయస్ అయ్యర్
అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాలో చోటు దక్కకపోవడంపై మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తన ఆధీనంలో లేని విషయాల గురించి పట్టించుకోనని.. తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంపై మాత్రమే శ్రద్ధ పెడతానని తెలిపాడు. ప్రస్తుతం తను అదే పనిలో ఉన్నానని పేర్కొన్నాడు. యువ బ్యాటర్లకు అవకాశం సౌతాఫ్రికా పర్యటనలో స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డ శ్రేయస్ అయ్యర్ను అఫ్గన్తో స్వదేశంలో టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు బీసీసీఐ సెలక్టర్లు. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి యువ బ్యాటర్లకు అవకాశం ఇచ్చారు. అదే విధంగా.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో శివం దూబేకు దాదాపు నాలుగేళ్ల తర్వాత పిలుపునిచ్చారు. వీళ్లంతా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సిరీస్ 2-0తో గెలవడంలో తమ వంతు పాత్ర పోషించారు. టీ20 ప్రపంచకప్-2024 బెర్తులను ఖాయం చేసుకునే పనిలో పడ్డారు. ఇలా వీరంతా టీ20 సిరీస్తో బిజీగా ఉంటే.. శ్రేయస్ అయ్యర్కు మాత్రం దేశవాళీ క్రికెట్ ఆడాలనే ఆదేశాలు వెళ్లాయి. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్నకు సన్నద్ధం కావాల్సిందిగా మేనేజ్మెంట్ సూచించింది. రంజీ ట్రోఫీ-2024 బరిలో అందుకు తగ్గట్లుగానే ముంబై తరఫున రంజీ ట్రోఫీ-2024 బరిలో దిగాడు. ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో 48 పరుగులతో ఆకట్టుకున్న అయ్యర్.. 145కు పైగా ఓవర్లపాటు ఫీల్డింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఆంధ్ర జట్టుపై ముంబై 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ నేపథ్యంలో విజయానంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. "గతం గురించి ఆలోచించను. వర్తమానంలో జీవించాలనుకుంటున్నాను. నాకు ఏ పనినైతే అప్పగించారో అది విజయవంతంగా పూర్తి చేశాను. రంజీ ఆడమన్నారు. వచ్చాను.. ఆడాను.. నా ప్రణాళికలు అమలు చేశాను. కావాల్సినంత ప్రాక్టీస్ నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. కొన్ని విషయాలు మన ఆధీనంలో ఉండవు. అలాంటి వాటి గురించి ఆలోచించకపోవడమే మంచిది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా బాల్ బాగా టర్న్ అయ్యే వికెట్లు అందుబాటులో ఉండటం సహజం. నాకు ఇది సానుకూలాంశం. ఏదేమైనా ఈ రంజీ మ్యాచ్ ద్వారా నాకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించింది. మ్యాచ్ ఫిట్నెస్ సాధించాను. ఇంగ్లండ్తో మొదటి రెండు టెస్టుల్లో ఎలా ఆడాలన్నదాని గురించే ప్రస్తుతం ఆలోచిస్తున్నా. నా ధ్యాసంతా ఆ రెండు మ్యాచ్లపైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25 నుంచి ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి తొలి రెండు మ్యాచ్లకు బీసీసీఐ ప్రకటించిన జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కింది. -
టీ20లలో కోహ్లి ప్రపంచ రికార్డు.. ఏకైక బ్యాటర్గా ఘనత
అంతర్జాతీయ టీ20 పునరాగమనం సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంత వరకు ఏ క్రికెటర్కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లి ఏడాదికి పైగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో... టీ20 వరల్డ్ కప్-2024కు ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి సిరీస్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న రెండో టీ20 సందర్భంగా బరిలోకి దిగాడు. 16 బంతుల్లో 29 కాగా.. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేసింది. పర్యాటక అఫ్గనిస్తాన్ జట్టును 172 పరుగులకు ఆలౌట్ చేసింది. లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్(68), శివం దూబే(63- నాటౌట్) దంచి కొట్టగా.. కోహ్లి సైతం దూకుడుగా ఆడాడు. కేవలం 16 బంతుల్లోనే నాలుగు ఫోర్ల సాయంతో 29 పరుగులు సాధించాడు. ప్రపంచంలో ఏకైక క్రికెటర్గా.. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ టీ20 ఛేజింగ్ మ్యాచ్లలో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు కోహ్లి. తద్వారా ప్రపంచంలో ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్ ఛేజింగ్లో కోహ్లి 46 ఇన్నింగ్స్ ఆడి 136.96 స్ట్రైక్రేటుతో 2012 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 20 అర్ధ శతకాలు ఉన్నాయి. వన్డేల్లోనూ ఈ రికార్డుల రారాజే ఇక వన్డేల్లోనూ సెకండ్ బ్యాటింగ్లో ఈ రికార్డుల రారాజే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. ఇప్పటివరకు ఛేజింగ్లో 152 ఇన్నింగ్స్ ఆడి 7794 రన్స్ పూర్తి చేసుకున్నాడు కోహ్లి. ఇందులో 27 సెంచరీలు, నలభై ఫిఫ్టీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్తో రెండో మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. అన్నట్లు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి.. పేసర్ నవీన్ ఉల్ హక్కు వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. -
ఈసారి తప్పు ముమ్మాటికీ రోహిత్దే.. చెత్త సెలక్షన్: మాజీ బ్యాటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించాడు. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్లో హిట్మ్యాన్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించలేదన్నాడు. ముఖ్యంగా రెండో టీ20లో రోహిత్ వికెట్ పారేసుకున్న విధానం విస్మయపరిచిందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రీఎంట్రీలో రనౌట్ సుమారు పద్నాలుగు నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై అఫ్గన్తో తొలి మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ ఓపెనర్.. రనౌట్గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు. ఇండోర్లో డకౌట్ మొహాలీ మ్యాచ్లో ఈ మేరకు.. శుబ్మన్ గిల్తో సమన్వయలోపం కారణంగా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు రోహిత్. ఈ నేపథ్యంలో కనీసం రెండో టీ20లోనైనా హిట్మ్యాన్ మెరుపులు చూడాలని ఆశించిన వాళ్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ఇండోర్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్.. డకౌట్ అయ్యాడు. తప్పుడు షాట్ సెలక్షన్ అఫ్గన్ బౌలర్ ఫజల్హక్ ఫారూకీ సంధించిన బంతికి బౌల్డ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా రోహిత్ శర్మ బ్యాటింగ్ను విశ్లేషిస్తూ.. "రోహిత్ అవుటైన తీరు ఆశ్చర్యపరిచింది. తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఇలాంటి షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదు. బంతి నేరుగా స్టంప్స్ ను హిట్ చేసింది. సాధారణంగా రోహిత్ అలాంటి షాట్లు ఆడడు. తొలి టీ20లో సున్నాకే రనౌట్ అయ్యాడు. అందులో అతడి తప్పేమీ లేదు. కానీ రెండో టీ20లో తప్పుడు షాట్ సెలక్షన్తో మూల్యం చెల్లించాడు. ఈసారి తప్పు ముమ్మాటికీ అతడిదే. ఆ రోహిత్ కావాలి రోహిత్ శర్మ టీ20 ఆట తీరు, సామర్థ్యాలపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కానీ అతడి నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించరు. ఐపీఎల్ ద్వారానైనా రోహిత్ ఫామ్లోకి రావాలి. వన్డే వరల్డ్ కప్లో దంచికొట్టిన రోహిత్ శర్మ మనకి కావాలి" అని పేర్కొన్నాడు. ఏదేమైనా ఐపీఎల్-2024లో రోహిత్ బ్యాట్ ఝులిపిస్తేనే టీమిండియాకు వరల్డ్ కప్లో సానుకూలంగా ఉంటుందని ఆకాశ్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా.. అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో రోహిత్ శర్మ విఫలం కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, పేస్ ఆల్రౌండర్ శివం దూబే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి కారణంగా రెండో టీ20లో గెలిచిన టీమిండియా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. -
Viral Video: విరాట్ క్రేజ్ అట్లుంటది మరి..!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోహ్లి ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా జనాలు అతని దర్శనం కోసం ఎగబడతారు. భారత్లో అయితే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. విరాట్ ఎక్కడ ఉంటే అక్కడ జాతరను తలపిస్తుంది. రన్ మెషీన్ను చూసేందుకు జనాలు పోటెత్తుతారు. ఈ మధ్యకాలంలో అయితే కోహ్లి ఆన్ ద ఫీల్డ్ ఉన్నా అభిమానులు వదిలిపెట్టడం లేదు. మైదానంలోకి దూసుకొచ్చి మరీ తమ ఆరాధ్య క్రికెటర్ను కలుస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి జరిగింది. The moment when a fan touched Virat Kohli's feet and hugged him. - King Kohli, the crowd favourite. 😍pic.twitter.com/NfShGwtF8I — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2024 ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో నిన్న (జనవరి 14) జరిగిన రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని కోహ్లిని కలిసేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. సదరు ఫ్యాన్ గ్రౌండ్ సిబ్బంది కళ్లు కప్పి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి వద్దకు వచ్చి కాళ్లు మొక్కి, కౌగిలించుకున్నాడు. తొలుత ఆ అభిమాని తనవైపు వస్తున్నప్పుడు కాస్త అసౌకర్యంగా కనిపించిన కోహ్లి ఆ తర్వాత అతన్ని హత్తుకున్నాడు. ఈలోపు సిబ్బంది వచ్చి ఆ అభిమానికి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కారణంగా మ్యాచ్కు కాసేపు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే, 429 సుదీర్ఘ విరామం తర్వాత నిన్నటి మ్యాచ్తోనే విరాట్ తిరిగి అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో కింగ్ 16 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 29 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ (68), శివమ్ దూబే (63 నాటౌట్) చెలరేగడంతో భారత్.. ఆఫ్ఘనిస్తాన్ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు అర్ష్దీప్ సింగ్ (3/32), అక్షర్ పటేల్ (2/17), రవి భిష్ణోయ్ (2/39), శివమ్ దూబే (1/36) కట్టడి చేశారు. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. -
ధనాధన్ దూబే.. కోహ్లితో సమానంగా.. హార్దిక్ స్థానానికి ఎసరు పెట్టేలా..!
టీమిండియా ఆల్రౌండర్ శివమ్ దూబే ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆల్రౌండర్గా సత్తా చాటిన దూబే.. భావి భారత కెప్టెన్గా అనుకుంటున్న హార్దిక్ పాండ్యా స్థానానికే ఎసరు పెట్టాడు. హార్దిక్ పాండ్యాలా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన దూబే.. హార్దిక్ గైర్హాజరీలో అద్భుతంగా రాణిస్తూ అతని స్థానాన్నే ప్రశ్నార్థకంగా మార్చాడు. ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణిస్తున్న దూబే.. ఇలాగే తన మెరుపులు కొనసాగిస్తే టీమిండియాలో హార్దిక్ స్థానం గల్లంతవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. తరుచూ గాయపడే హార్దిక్ కన్నా దూబే చాలా బెటర్ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హార్దిక్ను తీసుకున్నా దూబేని టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 30 ఏళ్ల దూబే ఆటతీరులో ఇటీవలికాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్ 2023 తర్వాత అతను బాగా రాటుదేలాడు. దేశవాలీ క్రికెట్లోనూ దూబే సత్తా చాటాడు. చాలాకాలంగా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకు దూబే కరెక్ట్ మ్యాచ్ అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తొలి టీ20లో అజేయమైన అర్ధసెంచరీ (60 నాటౌట్) సహా వికెట్ (2-0-9-1) తీసి టీమిండియాను గెలిపించిన దూబే.. రెండో మ్యాచ్లోనూ ఇంచుమించు అదే ప్రదర్శనతో (32 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు, 3-0-36-1) భారత్ను విజయతీరాలకు చేర్చాడు. కోహ్లి సరసన.. రెండో టీ20 ప్రదర్శనతో దూబే ఏకంగా లెజెండ్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్ టీ20ల్లో రెండు సార్లు అర్ధసెంచరీతో పాటు వికెట్ తీయగా.. దూబే సైతం అన్నే సార్లు ఈ ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక సార్లు ఈ ప్రదర్శన నమోదు చేసిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. యువీ మూడుసార్లు ఓ మ్యాచ్లో 50 పరుగులతో పాటు వికెట్ తీశాడు. భారత్ తరఫున హార్ధిక్, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ తలోసారి 50 స్కోర్తో పాటు వికెట్ తీశారు. కాగా, దూబేతో పాటు యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో రెండో టీ20లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫలితంగా టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ గెలుపుతో భారత్ స్వదేశంలో తమ అజేయ యాత్రను కొనసాగించింది. సొంతగడ్డపై టీమిండియాకు గత 15 టీ20 సిరీస్ల్లో (2019 నుంచి) ఓటమిలేదు. -
India vs Afghanistan 3rd T20I: ఆడుతూ పాడుతూ...
ఇండోర్: ముందుగా బౌలింగ్లో, ఆ తర్వాత బ్యాటింగ్లో చెలరేగిన భారత్ స్వదేశంలో మరో ద్వైపాక్షిక టి20 సిరీస్ను సొంతం చేసుకుంది. 2019 నుంచి సొంతగడ్డపై టి20 సిరీస్లలో ఓటమిలేని భారత్ అదే జోరును అఫ్గానిస్తాన్పై కూడా కొనసాగించింది. మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా అఫ్గానిస్తాన్తో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్ను దక్కించుకుంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్ బుధవారం బెంగళూరులో జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ సరిగ్గా 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. గుల్బదిన్ (35 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్‡్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 173 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. యశస్వి జైస్వాల్ (34 బంతుల్లో 68; 5 ఫోర్లు, 6 సిక్స్లు), శివమ్ దూబే (32 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) అఫ్గాన్ బౌలర్ల భరతం పట్టి అర్ధ సెంచరీలు సాధించారు. కెపె్టన్ రోహిత్ శర్మ (0) వరుసగా రెండో మ్యాచ్లోనూ ‘డకౌట్’కాగా... 14 నెలల తర్వాత మళ్లీ టి20 మ్యాచ్ ఆడిన కోహ్లి (16 బంతుల్లో 29; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) దూబే (బి) రవి బిష్ణోయ్ 14; ఇబ్రహీమ్ (బి) అక్షర్ పటేల్ 8; గుల్బదిన్ (సి) రోహిత్ శర్మ (బి) అక్షర్ పటేల్ 57; అజ్మతుల్లా ఒమర్జాయ్ (బి) శివమ్ దూబే 2; మొహమ్మద్ నబీ (సి) రింకూ సింగ్ (బి) రవి బిష్ణోయ్ 14; నజీబుల్లా (బి) అర్‡్షదీప్ 23; కరీమ్ (సి) అక్షర్ పటేల్ (బి) అర్‡్షదీప్ 20; ముజీబ్ (రనౌట్) 21; నూర్ అహ్మద్ (సి) కోహ్లి (బి) అర్‡్షదీప్ 1; నవీన్ ఉల్ హఖ్ (నాటౌట్) 1; ఫరూఖీ (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 172. వికెట్ల పతనం: 1–20, 2–53, 3–60, 4–91, 5–104, 6–134, 7–164, 8–170, 9–171, 10–172. బౌలింగ్: అర్‡్షదీప్ సింగ్ 4–0–32–3, ముకేశ్ కుమార్ 2–0–21–0, రవి బిష్ణోయ్ 4–0–39–2, అక్షర్ పటేల్ 4–0–17–2, శివమ్ దూబే 3–0–36–1, వాషింగ్టన్ సుందర్ 3–0–23–0. భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (సి) గుర్బాజ్ (బి) కరీమ్ 68; రోహిత్ శర్మ (బి) ఫరూఖీ 0; విరాట్ కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) నవీన్ 29; శివమ్ దూబే (నాటౌట్) 63; జితేశ్ శర్మ (సి) నబీ (బి) కరీమ్ 0; రింకూ సింగ్ (నాటౌట్) 9; ఎక్స్ట్రాలు 4; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1–5, 2–62, 3–154, 4–156. బౌలింగ్: ఫరూఖీ 3.4–0–28–1, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2–0–32–0, నవీన్ ఉల్ హఖ్ 3–0–33–1, నూర్ అహ్మద్ 3–0–35–0, నబీ 2–0–30–0, కరీమ్ 2–0–13–2. 150: అంతర్జాతీయ టి20ల్లో 150 మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. 12: అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధికంగా 12 సార్లు ‘డకౌట్’ అయిన ప్లేయర్ రోహిత్ శర్మ. కేఎల్ రాహుల్ (5) రెండో స్థానంలో ఉన్నాడు. 15: స్వదేశంలో జరిగిన గత 15 ద్వైపాక్షిక టి20 సిరీస్లలో భారత్ అజేయంగా నిలిచింది. 2019 నుంచి భారత జట్టు 13 టి20 సిరీస్లను నెగ్గి, రెండింటిని ‘డ్రా’గా ముగించింది. -
జైస్వాల్ అద్భుతం.. అతడేమో బిగ్ ప్లేయర్.. గర్వంగా ఉంది: రోహిత్
అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తానెంతో గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. గత రెండు మ్యాచ్లలో తాము అన్ని బాక్సులను టిక్ చేశామని.. సమిష్టి ప్రదర్శనతో గెలుపొందామని జట్టును ప్రశంసించాడు. ముఖ్యంగా విజయాల్లో కీలక పాత్ర పోషించిన శివం దూబే, యశస్వి జైస్వాల్లను ఈ సందర్భంగా రోహిత్ శర్మ కొనియాడాడు. కాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్ను టీమిండియా 2-0తో సొంతం చేసుకుంది. ఇండోర్లో ఆదివారం నాటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో జట్టును గెలిపించి.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కుర్రాళ్లు భారత్కు విజయాన్ని బహుమతిగా అందించారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. తద్వారా మెన్స్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హిట్మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఇదొక గొప్ప అనుభూతి. 2007లో మొదలైన ఈ ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలతో ఇక్కడిదాకా సాగింది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే.. మేము ఎలాంటి ప్రయోగాలు చేయాలనుకున్నామో అన్నీ చేశాం. జట్టులోని ప్రతి ఆటగాడి నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో ముందే స్పష్టంగా వివరించాం. అందుకు తగ్గట్లుగానే అందరూ రాణించారు. నన్ను గర్వపడేలా చేశారు. గత రెండు మ్యాచ్లలో అన్ని విభాగాల్లోనూ అనుకున్న ప్రణాళికలు అమలు చేయగలిగాం. జైస్వాల్ తొలుత టెస్టుల్లో తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు టీ20లలోనూ సత్తా చాటుతున్నాడు. ఆటగాడిగా తన నైపుణ్యాలేమిటో.. సామర్థ్యం ఏపాటిదో మరోసారి చూపించాడు. జైస్వాల్ ప్రతిభావంతుడు. వైవిధ్యమైన గొప్ప షాట్లు ఆడగలడు. ఇక దూబే బిగ్ ప్లేయర్. అత్యంత శక్తిమంతమైన ఆటగాడు. స్పిన్నర్ల బౌలింగ్ను చిత్తు చేయగలడు. జట్టులోకి వచ్చాడు.. రెండు విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తన పాత్రను చక్కగా పోషించాడు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా దాదాపు నాలుగేళ్ల తర్వాత టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన పేస్ ఆల్రౌండర్ శివం దూబే.. అఫ్గన్తో సిరీస్లో సత్తా చాటాడు. తొలి టీ20లో ఒక వికెట్ తీయడంతో పాటు.. 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు. తాజాగా రెండో టీ20లోనూ ఒక వికెట్ తీసిన అతడు.. 32 బంతులు ఎదుర్కొని 63 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(34 బంతుల్లో 68)తో కలిసి టీమిండియాను గెలిపించాడు. ఇదిలా ఉంటే.. అఫ్గన్తో సిరీస్తో అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ రెండు మ్యాచ్లలో డకౌట్ కాగా.. రెండో టీ20తో పునరాగమనం చేసిన విరాట్ కోహ్లి 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: రీఎంట్రీలో కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు! అదొక్కటే లోటు.. -
Ind vs Afg: రీఎంట్రీలో కోహ్లి మార్కు .. జైస్వాల్, దూబే దంచికొట్టారు!
India vs Afghanistan, 2nd T20I: అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో టీమిండియా జయభేరి మోగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్-2024కు ముందు ఆడుతున్న ఆఖరిదైన ద్వైపాక్షిక సిరీస్లో అఫ్గన్పై ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే ఈ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియాతో తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గనిస్తాన్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీలో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. 172 పరుగులకు అఫ్గన్ ఆలౌట్ ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన అఫ్గన్ జట్టు.. ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇండోర్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జద్రాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ పడగొట్టారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు వచ్చాయి. కాగా గుల్బదిన్ నైబ్ (35 బంతుల్లో 57), కరీం జనత్(10 బంతుల్లో 20), ముజీబ్ ఉర్ రహ్మాన్(9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మేరకు స్కోరు చేయగలిగింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ.. పరుగుల వరదపారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాను నిలువరించడం అంతతేలిక కాదని అఫ్గన్కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్లో ఐదో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అఫ్గన్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. విరాట్ కోహ్లి (16 బంతుల్లో 29 పరుగులు) కూడా త్వరగానే పెవిలియన్ చేరినా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లి దంచికొడితే.. జైస్వాల్, దూబే దుమ్ములేపారు కోహ్లి స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దూబేతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి 68 పరుగులు సాధించగా.. దూబే 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లలోనే టీమిండియా అఫ్గన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో అఫ్గన్ కీలక వికెట్లు(జద్రాన్, గుల్బదిన్) తీసిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అంతాబాగానే ఉన్నా తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్ కావడం అభిమానులకు నిరాశ కలిగింది. రీఎంట్రీలో హిట్మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికి అలాగే మిగిలిపోయింది. -
Ind Vs Afg: దూబే ధనాధన్ ఇన్నింగ్స్.. టీమిండియాదే సిరీస్
India vs Afghanisthan 2nd T20I 2024 Updates: అఫ్గనిస్తాన్తో రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇండోర్ మ్యాచ్లో జద్రాన్ బృందాన్ని ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 34 బంతుల్లో 68 పరుగులతో దంచికొట్టగా.. ఆల్రౌండర్ శివం దూబే 30 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా రోహిత్ సేన అఫ్గన్తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. 14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 164/4 విజయానికి 9 పరుగుల దూరంలో టీమిండివయా. దూబే 62, రింకూ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్ 12.6: జితేశ్ శర్మ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా. శివం దూబే 12.3: కరీం జనత్ బౌలింగ్లో జైస్వాల్ ఔట్. 11.6: దూబే ధనాధన్ హాఫ్ సెంచరీ 22 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న శివం దూబే 9.1: జైస్వాల్ హాఫ్ సెంచరీ 27 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్న యశస్వి జైస్వాల్. మరో ఎండ్లో శివం దూబే(15 బంతుల్లో 34 పరుగులు) కూడా జోరుగా ఆడుతున్నాడు. 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 116/2. విజయానికి 57 పరుగుల దూరం ఉంది. 5.3: రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో కోహ్లి పెవిలియన్ చేరాడు. 16 బంతులు ఎదుర్కొని 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. శివం దూబే క్రీజులోకి వచ్చాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ దంచి కొడుతుండటంతో పవర్ ప్లేలో భారత్ 69-2 స్కోరు చేయగలిగింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు: 32-1 కోహ్లి 12, యశస్వి 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. రోహిత్ మళ్లీ డకౌట్ 0.5: టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరిగాడు. ఫజల్హక్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. కాగా తొలి టీ20లోనూ హిట్మ్యాన్ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. టార్గెట్ 173 టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్ మెరుగైన స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, రవి బిష్ణోయి రెండు, అక్షర్ పటేల్ రెండు, శివం దూబే ఒక వికెట్ తీశారు. రనౌట్ల రూపంలో రెండు వికెట్లు దక్కాయి. ఆఖరి ఓవర్లో 4 వికెట్లు కోల్పోయిన అఫ్గనిస్తాన్ 19.6: ఫజల్హక్ రనౌట్ 19.6 వైడ్: తొమ్మిది బంతుల్లోనే 21 పరుగులు చేసిన ముజీబ్ రనౌట్ 19.5: నూర్ అహ్మద్ అవుట్(1). 19.1: ఏడో వికెట్ కోల్పోయిన అఫ్గన్ అర్ష్దీప్ బౌలింగ్లో కరీం జనత్(20) అవుట్. నూర్ అహ్మద్ క్రీజులోకి వచ్చాడు. నజీబుల్లా అవుట్ 17.1: అర్ష్దీప్ బౌలింగ్లో ఆరో వికెట్గా వెనుదిరిగిన నజీబుల్లా. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ముజీబ్ ఉర్ రహ్మాన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 144-6(18). 15 ఓవర్లలో అఫ్గన్ స్కోరు: 109-5 నజీబుల్లా 4, కరీముల్లా ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన అఫ్గన్ 14.2: మహ్మద్ నబీ రూపంలో అఫ్గనిస్తాన్ ఐదో వికెట్ కోల్పోయింది. రవి బిష్ణోయి బౌలింగ్లో రింకూ సింగ్కు క్యాచ్ ఇచ్చి నబీ 14 పరుగుల వద్ద నిష్క్రమించాడు. కరీం జనత్ క్రీజులోకి వచ్చాడు. అర్ధ శతక వీరుడు అవుట్ 11.3: అర్ధ శతకంతో జోరు మీదున్న గుల్బదిన్ను అక్షర్ పటేల్ పెవిలియన్కు పంపాడు. 35 బంతుల్లో 57 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి గుల్బదిన్ అవుట్ అయ్యాడు. దీంతో అఫ్గన్ నాలుగో వికెట్ కోల్పోయింది. నజీబుల్లా జద్రాన్ క్రీజులోకి వచ్చాడు. గుల్బదిన్ హాఫ్ సెంచరీ 9.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గుల్బదిన్. 27 బంతుల్లోనే అతడు 50 పరుగుల మార్కును అందుకున్నాడు. మరోవైపు.. నబీ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు. స్కోరు: 81/3 (10). మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 6.5: శివం దూబే బౌలింగ్లో ఒమర్జాయ్(2) క్లీన్ బౌల్డ్. మూడో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్. మహ్మద్ నబీ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 60-3(7) రెండో వికెట్ కోల్పోయిన అఫ్గనిస్తాన్ 5.4: అక్షర్ పటేల్ బౌలింగ్లో అఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్(8) క్లీన్బౌల్డ్ అయ్యాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 58-2(6) హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అఫ్గనిస్తాన్ వన్డౌన్ బ్యాటర్ గుల్బదిన్ దంచికొడుతున్నాడు. 13 బంతుల్లోనే 26 పరుగులు చేసి దూకుడు మీద ఉన్నాడు. దీంతో 5 ఓవర్లలోనే అఫ్గన్ 50 పరుగుల మార్కు అందుకుంది. గుల్బదిన్తో పాటు జద్రాన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన అఫ్గన్ 2.2: భారత స్పిన్నర్ రవి బిష్ణోయి బౌలింగ్లో శివం దూబేకు క్యాచ్ ఇచ్చి రహ్మనుల్లా గుర్బాజ్(14) అవుటయ్యాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ రూపంలో అఫ్గన్ తొలి వికెట్ కోల్పోయింది. గుల్బదిన్ నైబ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 22-1 (3). బ్యాటింగ్ చేస్తున్న అఫ్గనిస్తాన్ టాస్ గెలిచిన టీమిండియా ఆహ్వానం మేరకు అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. రెండు ఓవర్లు ముగిసే సరికి అఫ్గన్ స్కోరు: 20/0. ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్ 4, రహ్మనుల్లా గుర్బాజ్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. బౌలింగ్ ఎంచుకున్న రోహిత్ టీమిండియా- అఫ్గనిస్తాన్ మధ్య రెండో టీ20 మొదలైంది. ఇండోర్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రన్మెషీన్ రీఎంట్రీ ఇక.. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు పద్నాలుగు నెలల విరామం తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేశాడు. ఈ రన్మెషీన్ రాకతో హైదరాబాద్ స్టార్ తిలక్ వర్మపై వేటు పడింది. గిల్కు నో ఛాన్స్ అదే విధంగా.. గజ్జల్లో గాయం కారణంగా మొదటి టీ20కి దూరమైన యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తిరిగి వచ్చాడు. దీంతో శుబ్మన్ గిల్కు భారత తుదిజట్టులో చోటు దక్కలేదు. రోహిత్కు జోడీగా యశస్వి ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఈ మేరకు టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగగా.. అఫ్గనిస్తాన్ ఒక మార్పుతో మైదానంలో దిగనుంది. రహ్మత్ షా స్థానంలో నూర్ అహ్మద్ జట్టులోకి వచ్చినట్లు అఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ వెల్లడించాడు. కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇప్పటికే 1-0తో అఫ్గన్ కంటే ముందంజలో ఉంది. తుది జట్లు ఇవే టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శివమ్ దూబే, జితేశ్ శర్మ, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముకేష్ కుమార్. అఫ్గనిస్తాన్ రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫారూఖీ, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్. -
ఆఫ్ఘనిస్తాన్తో రెండో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి
భారత్-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇండోర్ వేదికగా ఇవాళ (జనవరి 14) రెండో టీ20 జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కోహ్లి చివరిసారిగా 2022 టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తిరిగి 429 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి మళ్లీ పొట్టి క్రికెట్లోకి పునరాగమనం చేయనున్నాడు. వాస్తవానికి ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనే విరాట్ ఆడాల్సి ఉండింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆ మ్యాచ్కు దూరమయ్యాడు. మొహాలీ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో భారత్.. 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసి మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆఫ్ఘన్తో రెండో టీ20కి ముందు విరాట్ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్లో కోహ్లి 35 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (14562) పేరిట ఉంది. ఈ జాబతాలో పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (12993), విండీస్ టీ20 స్పెషలిస్ట్ కీరన్ పోలార్డ్ (12430) గేల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
సంచలన రికార్డుపై రోహిత్ శర్మ కన్ను..
India vs Afghanistan, 2nd T20I - Rohit Sharma Eyes On Rare Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టీ20లలో ఇంత వరకు ఏ క్రికెటర్కూ సాధ్యం కాని ఫీట్ నమోదు చేయడానికి అడుగుదూరంలో ఉన్నాడు. దాదాపు పద్నాలుగు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ ఇంటర్నేషనల్ పొట్టి ఫార్మాట్లో పునరాగమనం చేశాడు. టీ20 వరల్డ్కప్-2022 సెమీస్లో భారత జట్టు ఓటమి తర్వాత.. మళ్లీ తాజాగా అఫ్గనిస్తాన్తో సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీలో మరోసారి కెప్టెన్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. రీఎంట్రీలో డకౌట్ అయినా వరల్డ్ రికార్డు మరో ఓపెనర్ శుబ్మన్ గిల్తో సమన్వయలోపం కారణంగా డకౌట్గా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్ను చిత్తు చేయడంతో సారథిగా రోహిత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. తద్వారా.. అంతర్జాతీయ టీ20లలో 100 మ్యాచ్లు గెలిచిన ఏకైక పురుష క్రికెటర్గానూ హిట్మ్యాన్ చరిత్ర సృష్టించాడు. అదే జరిగితే ప్రపంచంలోనే ఏకైక క్రికెటర్గా ఇదిలా ఉంటే.. ఇప్పటికే అఫ్గన్తో సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇండోర్ వేదికగా ఆదివారం (జనవరి 14) రెండో మ్యాచ్లో తలపడనుంది. రోహిత్ శర్మ కెరీర్లో ఇది 150వ అంతర్జాతీయ టీ20 కావడం విశేషం. ఏ ఆటంకాలు లేకుండా హిట్మ్యాన్ ఈ మ్యాచ్ పూర్తి చేస్తే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా చరిత్రకెక్కుతాడు. అదండీ విషయం..!! అంతర్జాతీయ టీ20లలో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్లు ఆడిన టాప్-5 క్రికెటర్లు 1. రోహిత్ శర్మ(ఇండియా)- 149 2. పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్)- 134 3.జార్జ్ డాక్రెల్(ఐర్లాండ్)- 128 4. షోయబ్ మాలిక్(పాకిస్తాన్)- 124 5. మార్టిన్ గప్టిల్(న్యూజిలాండ్)- 122. చదవండి: Ind vs Eng: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! టీమిండియాలో ఎంట్రీ.. -
వెళ్లడం వరకే నీ ఇష్టం!.. ద్రవిడ్ ‘వార్నింగ్’ తర్వాత ఇషాన్ ఫస్ట్ రియాక్షన్
Rahul Dravid- Ishan Kishan: టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ ఇంకా సెలవులోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో.. అఫ్గనిస్తాన్తో టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా.. అలా జరుగలేదని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. ఇషాన్ మళ్లీ భారత జట్టుతో చేరాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. మానసికంగా అలసిపోయానని తనకు తాను తప్పుకొన్న ఇషాన్ కిషన్.. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండటం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వినిపించాయి. వెళ్లడం వరకే మీ ఇష్టం.. తిరిగి రావాలంటే ఈ నేపథ్యంలోనే .. ‘‘జట్టును వీడి వెళ్లాలా వద్దా అనేది మాత్రమే ఆటగాళ్ల ఇష్టం.. వాళ్లను తిరిగి తీసుకోవాలా వద్దా అనేది మాత్రం మా ఇష్టమే’’ అన్న అర్థం ద్రవిడ్ మాటల్లో ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనప్పుడల్లా అవకాశాలు ఇస్తున్నా.. తనను కావాలనే పక్కనపెడుతున్నారని ఇషాన్ ఇగోకు పోయి తన కెరీర్ను తానే నాశనం చేసుకుంటున్నాడనే మాటలూ వినిపిస్తున్నాయి. రంజీల్లో ఆడతాడో లేదో చెప్పలేదు.. వస్తే మాత్రం మరోవైపు.. ద్రవిడ్ చెప్పిన తర్వాత ఇషాన్ కిషన్ రంజీ ట్రోఫీ-2024 సీజన్లో కచ్చితంగా ఆడతాడని అంతా భావించారు. ఇంగ్లండ్తో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు ఇషాన్.. దేశవాళీ క్రికెట్లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జార్ఖండ్ తరఫున బరిలోకి దిగుతాడని ఊహించారు. కానీ.. ఇందుకు సంబంధించి తమకు ఇషాన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేబాశిష్ చక్రవర్తి వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు. ఒకవేళ ఇషాన్ రంజీల్లో ఆడాలనుకుంటే నేరుగా తుదిజట్టులో చేర్చుకుంటామని స్పష్టం చేశాడు. అయినప్పటికీ ఈ పరిణామాలపై ఇషాన్ కిషన్ ఇంత వరకు నేరుగా స్పందించకపోవడం గమనార్హం. అయితే, తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ ఇందులో... యోగా చేస్తూ, మైదానంలో పరుగులు తీస్తూ కనిపించాడు. దీనిని బట్టి త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఇషాన్ చెప్పకనే చెప్పినట్లయింది. అయితే, ఇప్పటికే శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు... కేఎల్ రాహుల్- శ్రీకర్ భరత్(టెస్టు), సంజూ శాంసన్- జితేశ్ శర్మ(వన్డే, టీ20లలో) రూపంలో వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: NZ vs Pak: చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు 🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc — Ishan Kishan (@ishankishan51) January 12, 2024 -
రోహిత్ రనౌట్.. తప్పు అతడిదే: టీమిండియా మాజీ బ్యాటర్
India vs Afghanistan, 1st T20I - Rohit Sharma Run Out: అంతర్జాతీయ టీ20 పునరాగమనంలో విఫలమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అండగా నిలిచాడు. శుబ్మన్ గిల్ కారణంగానే రోహిత్ వికెట్ పారేసుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. గిల్ గనుక సరైన సమయంలో స్పందించి ఉంటే రోహిత్ ఆట తీరు మరోలా ఉండేదని పేర్కొన్నాడు. సుమారు 14 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ20లలో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్తో స్వదేశంలో సిరీస్ సందర్భంగా తిరిగి టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన హిట్మ్యాన్.. ఆరంభ మ్యాచ్లోనే రనౌట్ అయ్యాడు. గిల్ కదల్లేదు.. రోహిత్ రనౌట్ మొహాలీ వేదికగా గురువారం నాటి మ్యాచ్లో భారత ఇన్నింగ్స్లో రెండో బంతికే డకౌట్గా వెనుదిరిగాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. నిజానికి బంతిని బాదిన తర్వాత వేగంగా క్రీజును వీడిన రోహిత్ శర్మ.. తన జోడీ గిల్ను పరుగుకు రావాల్సిందిగా పిలిచాడు. కానీ ఫీల్డర్ల విన్యాసాలు గమనిస్తూ.. బంతిని చూస్తూ అలాగే ఉండిపోయిన గిల్ అక్కడి నుంచి కదల్లేదు. అప్పటికే రోహిత్.. గిల్ ఉన్న ఎండ్కి వచ్చేయగా.. అఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ వికెట్లను గిరాటేశాడు. అంతే.. రోహిత్ శర్మ సున్నాకే పెవిలియన్ చేరాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు గిల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్కాగా.. తప్పు ఎవరిదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. రోహిత్ శర్మపై నమ్మకం ఉంచాల్సింది స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మపై శుబ్మన్ గిల్ నమ్మకం ఉంచాల్సింది. అంతర్జాతీయ టీ20లలో వాళ్లిద్దరు కలిసి ఓపెనింగ్ చేయడం ఇదే తొలిసారి అని తెలుసు. కానీ వన్డే, టెస్టుల్లో వారిద్దరు ఇప్పటికే ఎన్నో మ్యాచ్లలో కలిసి ఆడారు. శుబ్మన్ గిల్ బాల్నే చూస్తూ ఉండటం వల్ల సమన్వయలోపం చోటుచేసుకుంది. గిల్ అలా చేసే బదులు రోహిత్ పిలవగానే పరిగెత్తుకుని వస్తే బాగుండేది’’ అని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా రీఎంట్రీలో రోహిత్ శర్మ ఇలా డకౌట్ కావడం నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా అఫ్గనిస్తాన్తో మొదటి టీ20లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన.. ఇండోర్లో జనవరి 14న రెండో మ్యాచ్లో తలపడనుంది. చదవండి: Ind vs Afg: కావాలనే అలా చేశాం: రోహిత్ శర్మ Ind vs Afg: కోహ్లి రీఎంట్రీ.. అతడిపై వేటు? సంజూకు మళ్లీ నో ఛాన్స్
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
No Headline
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
వేప చెట్టుకు మామిడి కాయలు.. మరో వింత
మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
30 టన్నుల మామిడి పండ్లు ఎగుమతి
మూడు దశల్లో 90 వేల పోస్టల్ బ్యాలెట్లు
చివరి విడత ప్రచారానికి కాంగ్రెస్ ప్రముఖులు
తప్పక చదవండి
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement