Smriti Mandhana
-
బెంగళూరు గెలిచింది
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్ చాంప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్ప్రీత్ సేన ఫైనల్కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్ జెయింట్స్తో ‘ప్లేఆఫ్’ మ్యాచ్ ఆడనుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో సీజన్లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్రేట్తో క్యాపిటల్స్ ముందంజ వేసింది. 2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్ చేరినా... రన్నరప్గానే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్లు), ఎలీస్ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్ సివర్ బ్రంట్ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (3/26) మూడు... కిమ్ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు. అందరూ ధాటిగా... బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్స్మృతి ఓపెనింగ్ వికెట్కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ మంధానకు జతయిన ఎలీస్ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్కు 59 పరుగులు జోడించారు. స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్హామ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) డెత్ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన నాట్ సివర్ ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (19), అమెలియా కెర్ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్ సివర్ బ్రంట్ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (20; 2 ఫోర్లు), అమన్జోత్ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్ 26; స్మృతి (సి) షబి్నమ్ (బి) అమెలియా 53; ఎలీస్ పెరీ నాటౌట్ 49; రిచా ఘోష్ (సి) నాట్ సివర్ (బి) హేలీ మాథ్యూస్ 36; జార్జియా నాటౌట్ 31; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. బౌలింగ్: షబ్నిమ్ ఇస్మాయిల్ 4–0–41–0, నాట్ సివర్ 2–0–16–0, హేలీ మాథ్యూస్ 4–0–37–2, అమన్జోత్ 4–0–27–0, అమెలియా కెర్ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, పారుణిక సిసోడియా 2–0–24–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) గ్రాహమ్ (బి) స్నేహ్ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్ రాణా 9; నాట్ సీవర్ (సి అండ్ బి) పెరీ 69; హర్మన్ప్రీత్ (సి) రిచా ఘోష్ (బి) కిమ్ గార్త్ 20; అమన్జోత్ (బి) గ్రాహమ్ 17; యస్తిక భాటియా (సి అండ్ బి) స్నేహ్ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్ గార్త్ 10; షబ్నిమ్ నాటౌట్ 4; పారుణిక నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–33–2, ఎలీస్ పెరీ 4–0–53–2, స్నేహ్ రాణా 4–0–26–3, హిథెర్ గ్రాహమ్ 4–0–47–1, జార్జియా వేర్హామ్ 4–0–29–1. -
WPL 2025: స్మృతి మంధాన విఫలం.. దంచికొట్టిన ఎలిస్ పెర్రీ.. కానీ!
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(RCBW) జట్టు నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్(WPL)-2025లో ఆరంభంలో అదరగొట్టిన ఆర్సీబీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.గత మూడు మ్యాచ్లలో స్మృతి మంధాన(Smriti Mandhana) సేన చేదు అనుభవాలు చవిచూసింది. ముంబై ఇండియన్స్ వుమెన్తో మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఆర్సీబీ.. ఆ తర్వాత యూపీ వారియర్స్తో మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా తెచ్చుకుని టై చేసుకుంది. అనంతరం గుజరాత్ జెయింట్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు జట్టు.. శనివారం నాటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టింది.సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన(8) దారుణంగా విఫలం కాగా.. మరో ఓపెనర్ డానియెల్ వ్యాట్- హాడ్జ్(18 బంతుల్లో 21) ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది.పెర్రీ 47 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 60 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మరోవైపు.. రాఘ్వి 32 బంతుల్లో 33 పరుగులు చేయగలిగింది. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్(5), కనిక అహుజా(2) చేతులెత్తేయగా.. జార్జియా వారెహాం 12 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఫలితంగా ఆర్సీబీ 147 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో శిఖా పాండే, నల్లపురెడ్డి చరణి రెండేసి వికెట్లు కూల్చగా.. మరిజానే కాప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.డబ్ల్యూపీఎల్-2025: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ వుమెన్ తుదిజట్లుఢిల్లీ క్యాపిటల్స్మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిజానే కాప్, జెస్ జోనాస్సెన్, సారా బ్రైస్ (వికెట్ కీపర్), నికీ ప్రసాద్, శిఖా పాండే, మిన్ను మణి, నల్లపురెడ్డి చరణి.ఆర్సీబీ వుమెన్స్మృతి మంధాన (కెప్టెన్), డానియల్ వ్యాట్-హాడ్జ్, ఎలిస్ పెర్రీ, రాఘ్వి బిస్త్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వారెహాం, కిమ్ గార్త్, స్నేహ్ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, ఏక్తా బిష్త్.చదవండి: Karun Nair: మళ్లీ శతక్కొట్టాడు.. సెలబ్రేషన్స్తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
సూపర్ ఓవర్లో ఓటమి.. పెర్రీకి సారీ చెప్పిన మంధన
డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా యూపీ వారియర్జ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ సూపర్ ఓవర్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి సూపర్ ఓవర్. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఎల్లిస్ పెర్రీ (56 బంతుల్లో 90 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. పెర్రీతో పాటు డానీ వ్యాట్ హాడ్జ్ (57) కూడా రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేయగలిగింది.ఛేదనలో సోఫీ ఎక్లెస్టోన్ (19 బంతుల్లో 33; ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగడంతో (ఇన్నింగ్స్ చివర్లో) ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. ఫలితంగా మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్జ్ 8 పరుగులు మాత్రమే చేయగలిగింది. కిమ్ గార్త్ అద్బుతంగా బౌలింగ్ చేసి వారియర్జ్ను స్వల్ప స్కోర్కే కట్టడి చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. కేవలం 4 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. రెగ్యులర్ మ్యాచ్లో బ్యాటింగ్లో సత్తా చాటిన ఎక్లెస్టోన్ సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేసింది. అద్భుతమైన టచ్లో ఉన్న పెర్రీని సూపర్ ఓవర్లో బరిలోకి దించకుండా స్మృతి మంధన పెద్ద తప్పు చేసింది. పెర్రీకి బదులు తనే బరిలోకి దిగడంతో సొంత అభిమానుల నుంచే ట్రోలింగ్ను ఎదుర్కొంది.ఓటమి అనంతరం మంధన పెర్రీకి క్షమాపణలు చెప్పింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన పెర్రీ కోసం మ్యాచ్ గెలవలేకపోయినందుకు బాధగా ఉందని అంది. జట్టు మొత్తం పెర్రీకి సారీ చెప్పాలని పేర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్లో రాణించినప్పటికి ఇలాంటి ఫలితం రావడంతో బాధాకరమని చెప్పుకొచ్చింది. కాగా, ఈ మ్యాచ్లో పెర్రీ ఆర్సీబీ ఇన్నింగ్స్ను ఒంటిచేత్తో నిర్మించింది. గాయంతో బాధపడుతూనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్లోనూ రాణించి ఓ వికెట్ తీసింది. పెర్రీ అద్భుత ప్రదర్శన కనబర్చినా ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడటం నిజంగానే బాధాకరం. ఇదే మ్యాచ్లో పెర్రీ డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక రన్ స్కోరర్గా అవతరించింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శనలు చేసినప్పటికీ.. జట్టు నుంచి సహకారం లేకపోతే ఫలితాలు ఇలానే వస్తాయని అభిమానులు అంటున్నారు.ఇదిలా ఉంటే, ఈ సీజన్ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అద్భుతంగా ప్రారంభించింది. తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి మాంచి జోరును ప్రదర్శించింది. అయితే ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో నిరాశపర్చింది. ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచి పెర్రీ అద్బుతంగా రాణిస్తుంది. ప్రస్తుతం ఆమెనే లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతుంది. పెర్రీ అద్భుత ప్రదర్శనల కారణంగానే ఈ సీజన్లో ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచింది. మంధన విఫలమవుతున్నా పెర్రీ ఆర్సీబీ బ్యాటింగ్కు వెన్నెముకగా నిలిచింది. -
టీమిండియా వైస్ కెప్టెన్కు షాక్
టీమిండియా వైస్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధనకు (Smriti Mandhana) హండ్రెడ్ లీగ్ (The Hundred League) ఫ్రాంచైజీ సథరన్ బ్రేవ్ (Southern Brave) షాకిచ్చింది. గత కొంతకాలంగా తమకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంధనను ఆ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మంధన విఫలం కావడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మంధన గత సీజన్లో 5 మ్యాచ్ల్లో కేవలం 60 పరుగులు మాత్రమే సాధించింది. గత సీజన్లో విఫలమైనా మంధనకు హండ్రెడ్ లీగ్లో మంచి రికార్డు ఉంది. 2022, 2023 సీజన్లలో ఆమె మంచి స్ట్రయిక్ రేట్తో వరుసగా 211, 238 పరుగులు చేసింది.ఆసక్తికరంగా మంధన ఆర్సీబీ టీమ్ మేట్ అయిన డానీ వ్యాట్ను (ఇంగ్లండ్ ఓపెనర్) సథరన్ బ్రేవ్ తొలి రీటెన్షన్గా దక్కించుకుంది. వ్యాట్తో పాటు లారా వోల్వార్డ్, లారెన్ బెల్, మయా బౌచియర్, ఫ్రేయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కార్టీన్ కోల్మన్, రిహన్నా సౌత్బైలను కూడా రీటైన్ చేసుకుంది. రిటెన్షన్ జాబితాను సథరన్ బ్రేవ్ ఇవాళ ప్రకటించింది.మంధన ప్రస్తుతం డబ్ల్యూపీఎల్లో బిజీగా ఉంది. ఈ సీజన్లో ఆమె 4 మ్యాచ్ల్లో 122 పరుగులు చేసింది. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. మంధన ఈ సీజన్లో తన స్థాయికి తగ్గట్టు రాణించడం లేదు. ఫలితంగా భారం మొత్తం ఎల్లిస్ పెర్రీపై పడుతుంది. పెర్రీ ఈ సీజన్లో విశేషంగా రాణిస్తుంది. నిన్న యూపీతో జరిగిన మ్యాచ్లో పెర్రీ అజేయమైన 90 పరుగులు చేసినా ఆర్సీబీ ఓటమిపాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. సూపర్ ఓవర్లో యూపీ నిర్ధేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఆర్సీబీ ఓటమిపాలైంది.డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ సీజన్ తొలి రెండు మ్యాచ్ల్లో గుజరాత్, ఢిల్లీపై విజయాలు సాధించి సూపర్ ఫామ్లో ఉన్నట్లు కనిపించింది. అయితే ఆతర్వాతి మ్యాచ్ల్లో వరుసగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ చేతుల్లో ఓడింది. అయినా ఆర్సీబీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ముంబై, యూపీ, ఢిల్లీ, గుజరాత్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 25) జరుగబోయే మ్యాచ్లో ఢిల్లీ, గుజరాత్ తలపడనున్నాయి. -
టీ20ల్లో అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళల ఐపీఎల్లో (WPL) ముంబై ఇండియన్స్ సారధి అయిన హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) పొట్టి క్రికెట్లో (T20 Cricket) అరుదైన మైలురాయిని తాకింది. హర్మన్.. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్, డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ సారధి అయిన స్మృతి మంధన తర్వాత టీ20ల్లో 8000 పరుగుల మైలురాయిని తాకిన రెండో భారత మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. డబ్ల్యూపీఎల్-2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఫిబ్రవరి 15) జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్కు ముందు 8000 పరుగులు పూర్తి చేసేందుకు హర్మన్కు 37 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో హర్మన్ 8000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఈ మ్యాచ్లో హర్మన్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసింది.అంతర్జాతీయ క్రికెట్తో పాటు వివిధ టీ20 లీగ్ల్లో హర్మన్ చేసిన పరుగులుడబ్ల్యూపీఎల్- 591 పరుగులుమహిళల బిగ్బాష్ లీగ్- 1440 పరుగులుహండ్రెడ్ వుమెన్స్ లీగ్- 176 పరుగులుఅంతర్జాతీయ క్రికెట్- 3589 పరుగులు- వీటితో పాటు హర్మన్ దేశవాలీ టీ20 టోర్నీల్లో పంజాబ్ తరఫున మరిన్ని పరుగులు సాధించింది.టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్లు..స్మృతి మంధన- 8349హర్మన్ప్రీత్ కౌర్- 8005జెమీమా రోడ్రిగెజ్- 5826షఫాలీ వర్మ- 4542మిథాలీ రాజ్- 4329దీప్తి శర్మ- 3889ముంబై, ఢిల్లీ మ్యాచ్ విషయానికొస్తే.. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ సమరంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ గెలుపుకు చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. అరుంధతి రెడ్డి చాలా ప్రయాసపడి రెండు పరుగులు పూర్తి చేసింది. తొలి పరుగును సునాయాసంగా పూర్తి చేసిన అరుంధతి.. రెండో పరుగు తీసే ప్రయత్నంలో డైవ్ చేయగా... కీపర్ వికెట్లను గిరాటేసింది. మూడో అంపైర్కు నివేదించగా... రీప్లేలో అరుంధతి బ్యాట్ క్రీజ్ను దాటినట్లు తేలింది. దీంతో రెండో పరుగొచ్చింది. ఫలితంగా ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఆఖరి బంతిదాకా చెమటోడ్చిన ముంబై ఇండియన్స్కు పరాభవం తప్పలేదు.ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 19.1 ఓవర్లలో 164 పరుగుల వద్ద ఆలౌటైంది. నాట్ సీవర్ బ్రంట్ (59 బంతుల్లో 80 నాటౌట్; 13 ఫోర్లు) చెలరేగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (22 బంతుల్లో 42; 4 ఫోర్లు, 3 సిక్స్లు) మెరిపించింది. ఢిల్లీ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3, శిఖా పాండే 2 వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి గెలిచింది. ఓపెనింగ్లో షఫాలీ వర్మ (18 బంతుల్లో 43; 7 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేసింది. మిడిలార్డర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికీ ప్రసాద్ (33 బంతుల్లో 35; 4 ఫోర్లు) ఢిల్లీ గెలుపుకు అవసరమైన పరుగుల్ని జతచేసింది. -
RCB సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి జట్టుగా అరుదైన ఘనత
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల(Royal Challengers Bengaluru Women) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసి.. అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. కాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)-2025 సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 14) మొదలైంది.డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ జెయింట్స్ వుమెన్(Gujarat Giants Women) మధ్య మ్యాచ్తో వడోదర వేదికగా ఈ మెగా ఈవెంట్కు తెరలేచింది. కోటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే నష్టపోయి 201 పరుగులు చేసింది.ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ(42 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ సునామీ ఇన్నింగ్స్తో చెలరేగింది. కేవలం 37 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. మిగతా వాళ్లలో డియాండ్రా డాటిన్(13 బంతుల్లో 25), సిమ్రన్ షేక్(5 బంతుల్లో 11) ధనాధన్ దంచికొట్టారు. దీంతో గుజరాత్కు భారీ స్కోరు సాధ్యమైంది.అయితే, లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కెప్టెన్ స్మృతి మంధాన(9), డానియెల్ వ్యాట్- హాడ్జ్(4)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్కు చేర్చింది ఆష్లే గార్డ్నర్. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ(34 బంతుల్లో 57) అర్ధ శతకంతో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. రాఘ్వి బిస్త్(25) ఆమెకు సహకారం అందించింది.రిచా విధ్వంసకర ఇన్నింగ్స్అయితే, వికెట్ కీపర్ రిచా ఘోష్ క్రీజులోకి రాగానే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన రిచా విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడింది. కేవలం 27 బంతుల్లోనే 64 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక రిచాకు తోడుగా కనికా అహుజా(13 బంతుల్లో 30) బ్యాట్ ఝులిపించింది. ఇద్దరూ కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ వుమెన్ వరల్డ్ రికార్డు సాధించింది. మహిళల డొమెస్టిక్, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల టార్గెట్ను పూర్తి చేసిన జట్టుగా నిలిచింది. ఇక అద్భుత బ్యాటింగ్తో అలరించిన రిచా ఘోష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.మహిళల డొమెస్టిక్ లేదంటే ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన1. ఆర్సీబీ వుమెన్- వడోదరలో 2025లో గుజరాత్ జెయింట్స్పై- 202/4(WPL)2. ముంబై ఇండియన్స్- ఢిల్లీలో 2024లో గుజరాత్ జెయింట్స్పై- 191/3(WPL)3. ఆర్సీబీ వుమెన్- ముంబైలో 2023లో గుజరాత్ జెయింట్స్- 189/2(WPL)4. మెల్బోర్న్ రెనెగేడ్స్- అడిలైడ్లో 2024లో అడిలైడ్ స్ట్రైకర్స్పై 186/1(WBBL)5. సదరన్ వైపర్స్- 2019లో యార్క్లో యార్క్షైర్ డైమండ్పై 185/4(WCSL).డబ్ల్యూపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ స్కోర్లు👉గుజరాత్ జెయింట్స్- 201/5 (20)👉ఆర్సీబీ వుమెన్- 202/4 (18.3)👉ఫలితం: గుజరాత్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన ఆర్సీబీ వుమెన్.చదవండి: అద్భుత ఫామ్.. అతడిని ఆపతరమా!.. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే! -
నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విషయం చెప్పలేను: రోహిత్ శర్మ
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు మతిమరుపు ఎక్కువన్నసంగతి తెలిసిందే. తన విలువైన వస్తువుల్ని రోహిత్ తరచుగా మర్చిపోతుంటాడని గతంలో సహచర ఆటగాడు విరాట్ కోహ్లి సైతం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. తాజాగా ముంబైలో జరిగిన బీసీసీఐ నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ విషయం సంబంధించి పలు ప్రశ్నలు రోహిత్కు ఎదురయ్యాయి.ఈ ఈవెంట్లో భారత మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన(Smriti Mandhana)తో హిట్మ్యాన్ ఇంట్రాక్టయ్యాడు. ఇటీవల మీ సహచరులు మిమ్మల్ని మీ హాబీల్లో దేనిపై ఆటపట్టించారు అని మంధాన నుంచి రోహిత్కు ప్రశ్న ఎదురైంది."నా టీమ్మేట్స్ మతిమరుపుపై ఎక్కువగా టీజ్ చేస్తుంటారు. కానీ అది నా హాబీ కాదు. ఇటీవలే నా వ్యాలెట్, పాస్పోర్ట్ మర్చిపోయానన్న వార్తల్లో నిజం లేదు. అది ఎప్పుడో పదేళ్ల కిందట జరిగింది అని రోహిత్ నవ్వుతూ బదులిచ్చాడు. దీంతో ఈ ఈవెంట్లో పాల్గోన్న మిగితా ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.అదేవిధంగా ఇప్పటివరకు మీ జీవితంలో మర్చిపోయిన పెద్ద విషయం ఏమైనా ఉందా? అని రోహిత్ను ఆమె ప్రశ్నించింది. "నేను అది చెప్పలేను. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని నా భార్య లైవ్లో చూస్తుంటుంది. అందుకే ఆ విషయాన్ని నా మనసులోనే ఉంచుకుంటానని" హిట్మ్యాట్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. ఉత్తమ ప్లేయర్లగా బుమ్రా, మంధాన..ఇక నమన్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్కు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గావస్కర్, రవి శాస్రితో సహా భారత క్రికెటర్లు హాజరయ్యారు. 2023–24 సంవత్సరంలో ప్రదర్శనకుగానూ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్కు అందించే ‘పాలీ ఉమ్రీగర్ అవార్డు’ పురుషుల విభాగంలో మేటి పేసర్ జస్ప్రీత్ బుమ్రాను వరించగా... మహిళల విభాగంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఈ పురస్కారం దక్కించుకుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో 664 మ్యాచ్లాడి లెక్కకు మిక్కిలి అవార్డులు తన పేరిట లిఖించుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు బీసీసీఐ ‘జీవన సాఫల్య’ పురస్కారం అందించింది. శనివారం ముంబైలో నిర్వహించిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న బుమ్రాకు ‘పాలీ ఉమ్రీగర్ అవార్డు’ దక్కగా... మహిళల విభాగంలో స్మృతి మంధాన నాలుగోసారి ఈ అవార్డుకు ఎంపికైంది. 2017–18, 2020–21, 2021–22లోనూ స్మృతికి పాలీ ఉమ్రీగర్ పురస్కారం లభించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్కు బోర్డు ప్రత్యేక పురస్కారం అందజేసింది. అత్యుత్తమ అంతర్జాతీయ అరంగేట్రం ఆటగాడి పురస్కారం సర్ఫరాజ్ ఖాన్ గెలుచుకున్నాడు. మహిళల విభాగంలో ఈ పురస్కారం ఆశా శోభనకు దక్కింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల అవార్డు కూడా స్మృతి మంధానకే దక్కింది. అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా దీప్తి శర్మ పురస్కారం గెలుచుకుంది. రంజీ ట్రోఫీలో ఉత్తమ ప్రదర్శన చేసిన ఆల్రౌండర్కు అందించే లాలా అమర్నాథ్ అవార్డు ముంబై ప్లేయర్ తనుశ్ కొటియాన్కు దక్కింది. దేశవాళీ టోరీ్నల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్టుగా ముంబై నిలిచింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్కు అందించే మాధవ్రావు సింధియా అవార్డుకు తెలంగాణ ప్లేయర్ తనయ్ త్యాగరాజన్ దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ పురస్కారం గెలుచుకున్నాడు. ఈ ఇద్దరూ రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్లు ఆడుతుండటంతో శనివారం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు. వారి స్థానంలో ఆయా రాష్ట్ర సంఘాల ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీలో వారిద్దరిదే కీలక పాత్ర: గౌతం గంభీర్ Don't 𝒇𝒐𝒓𝒈𝒆𝒕 to watch this 😎 Smriti Mandhana tries to find out the one hobby that Rohit Sharma has picked up recently, which his teammates tease him about 😃#NamanAwards | @ImRo45 | @mandhana_smriti pic.twitter.com/9xZomhnJjy— BCCI (@BCCI) February 1, 2025 -
BCCI Naman Awards 2025: అవార్డుల ప్రదానోత్సం.. విజేతల పూర్తి జాబితా
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నమన్ అవార్డుల(BCCI Naman Awards 2025) వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం, శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar)ను బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అదే విధంగా.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు బీసీసీఐ ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డు అందజేసింది.అదే విధంగా.. మహిళల క్రికెట్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ను ప్రత్యేక పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీసిన అశూ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేసింది.ఇక ఈ అవార్డుల ప్రదానోత్సవంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ ఈవెంట్కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తంగా 26 మంది క్రికెటర్లు పురస్కారాలు అందుకున్నారు.బీసీసీఐ నమన్ అవార్డులు-2025: విజేతల పూర్తి జాబితా1. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (జూనియర్ డొమెస్టిక్) [పతకం] - ఈశ్వరి అవసరే2. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (సీనియర్ డొమెస్టిక్) (సీనియర్ మహిళల వన్డే) [పతకం] - ప్రియా మిశ్రా3. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (అండర్-16) [పతకం] - హేమచుదేశన్ జగన్నాథన్4. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (U-16) [పతకం] - లక్ష్య రాయచందనీ5. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(U-19) [పతకం] - విష్ణు భరద్వాజ్6. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (U-19) [పతకం] - కావ్య టియోటియా7. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - నీజెఖో రూపేయో8. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - పి. విద్యుత్9. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - హేమ్ చెత్రి10. M. A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - అనీష్ కేవీ11. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ప్లేట్ గ్రూప్ [పతకం] - మోహిత్ జంగ్రా12. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ఎలైట్ గ్రూప్ [పతకం] - తనయ్ త్యాగరాజన్13. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ప్లేట్ గ్రూప్ [పతకం] - అగ్ని చోప్రా14. మాధవరావు సింధియా అవార్డ్: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ఎలైట్ గ్రూప్ [పతకం] - రికీ భుయ్15. దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్ రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు, 2023-24 [పతకం] - శశాంక్ సింగ్16. రంజీ ట్రోఫీ 2023-24 లో ఉత్తమ ఆల్ రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు [పతకం]- తనుష్ కోటియన్17. దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్, 2023-24 [ట్రోఫీ] - అక్షయ్ టోట్రే18. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన - ముంబై క్రికెట్ అసోసియేషన్19. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ [పతకం] - దీప్తి శర్మ20. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ [పతకం] - స్మృతి మంధాన21. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు [ట్రోఫీ] - ఆశా శోభన22. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు [ట్రోఫీ] - సర్ఫరాజ్ ఖాన్23. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు [ట్రోఫీ] - స్మృతి మంధాన24. పాలీ ఉమ్రిగర్ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు [ట్రోఫీ] - జస్ప్రీత్ బుమ్రా25. బీసీసీఐ ప్రత్యేక అవార్డు [షీల్డ్] - రవిచంద్రన్ అశ్విన్26. కల్నల్ CK నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు [షీల్డ్] - సచిన్ టెండూల్కర్. -
సచిన్కు ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు'.. బెస్ట్ ప్లేయర్లగా బుమ్రా, మంధాన
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ‘జీవిత సాఫల్య’ పురస్కారం అందజేయనుంది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుమీదుగా 1994 నుంచి ఈ ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్’ అవార్డును బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. నేడు బోర్డు నిర్వహించే కార్యక్రమంలో 51 ఏళ్ల సచిన్కు ఈ అవార్డు బహూకరిస్తారు. రెండు దశాబ్దాల పైచిలుకు భారత క్రికెట్కు వెన్నెముకగా నిలిచిన బ్యాటింగ్ తురుపుముక్క సచిన్ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్లో 664 మ్యాచ్లాడాడు. 200 టెస్టుల్లో 15, 291 పరుగులు, 51 శతకాలు... 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు సాధించాడు. ఈ రెండు ఫార్మాట్లో కలిపి 100 సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్గా క్రికెట్ పుటల్లోకెక్కాడు.బుమ్రాకు పాలీ ఉమ్రిగర్..అదేవిధంగా గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. 2024 ఏడాదిలో ఫార్మాట్తో సంబంధం లేకుండా బుమ్రా అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో అయితే బుమ్రా దుమ్ములేపాడు.గతేడాది 13 టెస్టుల్లో ఆడిన బుమ్రా 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన అయిదు టెస్టుల సిరీస్లో భారత స్పీడ్ స్టార్ 32 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా టీ20 వరల్డ్కప్-2024ను భారత్ సొంతం చేసుకోవడంలో బుమ్రాది కీలక పాత్ర.మొత్తంగా 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ది సిరీస్గా నిలిచాడు. 2024కు గాను ఐసీసీ బెస్ట్ క్రికెటర్ అవార్డుకు బుమ్రా ఎంపికైన సంగతి తెలిసిందే. అలాగే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ది ఈయర్ అవార్డు కూడా బుమ్రా సొంతం చేసుకున్నాడు.మరోవైపు మహిళల్లో స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డు వరించింది. గతేడాది 50 ఓవర్ల ఫార్మాట్లో 743 పరుగులు చేసింది. 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు గాను ఈ ప్రతిష్టాత్మకు అవార్డును ఆమె అందుకోనుంది. ఈ అవార్డులను బీసీసీఐ శనివారం ప్రధానం చేయనుంది.చదవండి: పాండ్యా, దూబే మెరుపులు.. సిరీస్ టీమిండియా వశం -
ICC: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆల్రౌండర్.. తొలి ప్లేయర్గా
న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్(Amelia Kerr) సరికొత్త చరిత్ర సృష్టించింది. ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్(ICC Women's Cricketer Of The Year)’ అవార్డు గెలుచుకున్న తొలి కివీ ప్లేయర్గా నిలిచింది.సౌతాఫ్రికాకు చెందిన లారా వొల్వర్ట్(Laura Wolvaardt), శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టు, ఆస్ట్రేలియా క్రికెటర్ అనాబెల్ సదర్లాండ్లను వెనక్కి నెట్టి ‘ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- 2024 అవార్డును సొంతం చేసుకుంది. తద్వారా ప్రతిష్టాత్మక రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని ముద్దాడనుంది.మోస్ట్ డేంజరస్ప్లేయర్కాగా 24 ఏళ్ల అమేలియా కెర్ వరల్డ్క్లాస్ ఆల్రౌండర్గా ఎదిగింది. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించే అమేలియా.. ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందింది. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగ్ నైపుణ్యాలు కనబరిచే అమేలియా.. ఎన్నో సార్లు ‘వైట్ ఫెర్న్స్’(న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టు)ను ఒంటిచేత్తో గెలిపించింది.టీ20 ప్రపంచకప్లో సత్తా చాటిఇక గతేడాది జరిగిన ఐసీసీ మహిళ టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో కెర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఆమె.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా గెలుచుకుంది. సౌతాఫ్రికాతో ఫైనల్లో కేవలం 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడంతో పాటు.. 43 పరుగులు చేసింది. ఈ టోర్నీలో మొత్తంగా 15 వికెట్లు పడగొట్టింది. ఇక మొత్తంగా 2024లో 18 అంతర్జాతీయ టీ20లు ఆడిన అమేలియా కెర్.. 387 పరుగులు చేయడంతో పాటు.. 29 వికెట్లు పడగొట్టింది. ఆమె జ్ఞాపకార్థంఅదే విధంగా.. గతేడాది తొమ్మిది వన్డేల్లో కలిపి 264 పరుగులు చేసిన అమేలియా కెర్.. పద్నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక గతేడాదికిగానూ ఐసీసీ అత్యుత్తమ మహిళా క్రికెటర్గా అవార్డును అమేలియా సొంతం చేసుకంది. కాగా మహిళల క్రికెట్కు మార్గదర్శకులుగా నిలిచారు ఇంగ్లండ్ క్రికెటర్ రేచల్ హేహో ఫ్లింట్. ఆమె జ్ఞాపకార్థం 2017 నుంచి ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన వారికి రేచల్ హేహో ఫ్లింట్ ట్రోఫీని అందిస్తున్నారు. 2017 నుంచి భారత క్రికెటర్ స్మృతి మంధాన, ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్సా పెర్రీ రెండేసిసార్లు ఈ ట్రోఫీని అందుకోగా.. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సీవర్- బ్రంట్ కూడా రెండుసార్లు (2022, 2023)ఈ అవార్డును ముద్దాడింది. ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ స్మృతిగత సంవత్సరం స్మృతి మంధాన అద్భుత ఆటతీరు కనబరిచింది. 2024లో స్మృతి 13 వన్డేలు ఆడి 747 పరుగులు సాధించింది. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. గతేడాది స్మృతి మొత్తం 95 ఫోర్లు, 6 సిక్స్లు కొట్టింది. ఆస్ట్రేలియాతో 4 వన్డేలు ఆడి 151 పరుగులు చేసిన స్మృతి... న్యూజిలాండ్పై 105 పరుగులు (3 వన్డేల్లో), దక్షిణాఫ్రికాపై 343 పరుగులు (3 వన్డేల్లో), వెస్టిండీస్పై 148 పరుగులు (3 వన్డేల్లో) సాధించింది.ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లపై ఒక్కో శతకం సాధించిన స్మృతి దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు నమోదు చేసింది. ఐసీసీ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెల్చుకోవడం స్మృతి మంధానకిది రెండోసారి. 2018లోనూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. భారత్ నుంచి ఈ అవార్డు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ కూడా స్మృతినే కావడం విశేషం. చదవండి: T20 WC 2025: భారత్తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును గెలుచుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు గెలుచుకుంది. గతేడాది వన్డేల్లో విశేషంగా రాణించినందుకు గానూ మంధనను ఈ అవార్డు వరించింది.గతేడాది మొత్తం 13 వన్డేలు ఆడిన మంధన, నాలుగు సెంచరీల సాయంతో 57.86 సగటున, 95.15 స్ట్రయిక్రేట్తో 747 పరుగులు చేసింది. తద్వారా గతేడాది లీడింగ్ రన్ స్కోరర్గానూ నిలిచింది. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన మంధన.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లపై తలో సెంచరీ చేసింది.ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు కోసం మంధనతో పాటు లారా వోల్వార్డ్ట్, అన్నాబెల్ సదర్ల్యాండ్, చమారీ ఆటపట్టు పోటీపడ్డారు. అయితే చివరికి ఈ అవార్డు మంధననే వరించింది. ఈ అవార్డు సాధించడానికి ముందు మంధన ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్, ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్లలో చోటు దక్కించుకుంది. వన్డే టీమ్కు మంధనతో పాటు భారత్ నుంచి దీప్తి శర్మ ఎంపిక కాగా.. టీ20 టీమ్లో మంధన, దీప్తి శర్మతో పాటు భారత్ నుంచి రిచా ఘోష్ కూడా చోటు దక్కించుకుంది.ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ద ఇయర్: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), స్మృతి మంధాన, చమరి అతపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (వికెట్కీపర్), మరిజాన్ కప్ప్, ఓర్లా ప్రెండర్గాస్ట్, దీప్తి శర్మ, సదియా ఇక్బాల్.ఐసీసీ వుమెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్: స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ (కెప్టెన్), చమర్తి అథపత్తు, హేలీ మాథ్యూస్, మారిజాన్ కాప్, ఆష్లీ గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, అమీ జోన్స్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్.వ్యక్తిగత విభాగంలో ఇప్పటివరకు ప్రకటించిన ఐసీసీ అవార్డులు (2024)..ఐసీసీ వుమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- స్మృతి మంధన ఐసీసీ మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్- అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐసీసీ ఎమర్జింగ్ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అన్నెరీ డెర్క్సెన్ఐసీసీ ఎమర్జింగ్ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-కమిందు మెండిస్ఐసీసీ వుమెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-ఈషా ఓఝాఐసీసీ మెన్స్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-గెర్హార్డ్ ఎరాస్మస్ఐసీసీ అంపైర్ ఆఫ్ ద ఇయర్-రిచర్డ్ ఇల్లింగ్వర్త్ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-అర్షదీప్ సింగ్ఐసీసీ వుమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్-మేలీ కెర్ -
ఐసీసీ మహిళల వన్డే జట్టులో స్మృతి, దీప్తి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్’ జట్టులో ఇద్దరు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన, స్పిన్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈ టీమ్లో స్థానం సంపాదించారు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గాకాగా స్మృతి మంధాన 2024లో 13 వన్డేలు ఆడి 747 పరుగులు చేసింది. తద్వారా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుసగా రెండు శతకాలు బాదిన ఆమె న్యూజిలాండ్పై కూడా ఒక సెంచరీ చేసింది.24 వికెట్లు పడగొట్టిఇక 2024లో 13 వన్డేలాడిన దీప్తి శర్మ 186 పరుగులు చేయడంతో పాటు... 24 వికెట్లు పడగొట్టి ఈ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ సారథిగా ఎంపికైంది.మరోవైపు.. ఇంగ్లండ్ నుంచి అమీ జోన్స్, సోఫీ ఎకెల్స్టోన్, కేట్ క్రాస్ రూపంలో ముగ్గురు ప్లేయర్లు, ఆస్ట్రేలియా నుంచి ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్ చోటు దక్కించుకున్నారు. సఫారీ ప్లేయర్ మరీనే కాప్తో పాటు శ్రీలంక నుంచి చమరి ఆటపట్టు, వెస్టిండీస్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ కూడా ఈ టీమ్కు ఎంపికయ్యారు.ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024స్మృతి మంధాన, లారా వాల్వర్ట్(కెప్టెన్), చమరి ఆటపట్టు, హేలీ మాథ్యూస్, మరీనే కాప్, ఆష్లే గార్డ్నర్, అనాబెల్ సథర్లాండ్, అమీ జోన్స్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సోఫీ ఎక్లిస్టోన్, కేట్ క్రాస్. మరిన్ని క్రీడా వార్తలుఫైనల్లో సూర్మా క్లబ్ రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ తొలి టోర్నమెంట్లో జేఎస్డబ్ల్యూ సూర్మా హాకీ క్లబ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సూర్మా క్లబ్ జట్టు 4–2 గోల్స్ తేడాతో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టును ఓడించింది. సూర్మా క్లబ్ తరఫున ఎంగెల్బెర్ట్ (1, 17వ, 47వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేయగా... హినా బానో (9వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది.బెంగాల్ టైగర్స్ తరఫున కెప్టెన్ వందన కటారియా (48వ నిమిషంలో), శిల్పి దబాస్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నాలుగు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక సూర్మా క్లబ్ 13 పాయింట్లతో... ఒడిశా వారియర్స్ జట్టు 11 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్కు చేరుకున్నాయి. ఈనెల 26న జరిగే ఫైనల్లో సూర్మా క్లబ్, ఒడిశా వారియర్స్ టైటిల్ కోసం తలపడతాయి. శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు నాలుగో ఓటమిసాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టుకు నాలుగో ఓటమి ఎదురైంది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి జట్టు 0–1 గోల్ తేడాతో స్పోర్టింగ్ క్లబ్ బెంగళూరు జట్టు చేతిలో ఓడిపోయింది.ఆట 34వ నిమిషంలో ఆసిఫ్ గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన స్పోర్టింగ్ జట్టు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి జట్టు 9 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్ల్లో గెలిచి, 2 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 4 మ్యాచ్ల్లో ఓడిన శ్రీనిధి జట్టు 11 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 28న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్ లో నాంధారి జట్టుతో శ్రీనిధి జట్టు ఆడుతుంది. -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్పై; 455/5; 1997లో పాక్పై; 440/3; 2018లో ఐర్లాండ్పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్ను స్మృతి బృందం క్లీన్స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025 -
భారత్ ఖాతాలో అతిపెద్ద వన్డే విజయం
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు(India Women vs Ireland Women)తో మూడో వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా భారత మహిళా క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపు(Largest Margin Win)ను నమోదు చేసింది. అంతేకాదు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది.కాగా ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా రాజ్కోట్ వేదికగా భారత్- ఐర్లాండ్ మధ్య మూడు వన్డేలు జరిగాయి. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ సిరీస్కు దూరం కాగా.. ఆమె స్థానంలో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించింది. ఇక శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్లో 116 పరుగుల తేడాతో ఐరిష్ జట్టును చిత్తు చేసింది.శతకాలతో చెలరేగిన స్మృతి, ప్రతికాఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు ప్రతికా రావల్(Prathika Rawal 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్- 154), స్మృతి మంధాన(80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ అర్ధ శతకం(42 బంతుల్లో 59) రాణించింది.మిగిలిన వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్(15), జెమీమా రోడ్రిగ్స్(4*), దీప్తి శర్మ(11*) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. మెన్స్, వుమెన్స్ వన్డే క్రికెట్లో భారత్కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఆది నుంచే ఐర్లాండ్ తడ‘బ్యా’టుఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో కెప్టెన్ గాబీ లూయీస్(Gaby Lewis- 1) పూర్తిగా విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ కౌల్టర్ రెలీ(0) డకౌట్గా వెనుదిరిగింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్(41)తో కలిసి ఓర్లా ప్రెరెండెర్గాస్ట్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.చెలరేగిన భారత బౌలర్లుఅయితే, భారత బౌలర్ల ధాటికి ఈ ఇద్దరు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. సారా, ఓర్లా అవుటైన తర్వాత ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లారా డెలానీ(10), లీ పాల్(15), అర్లెనె కెలీ(2), అవా కానింగ్(2), జార్జియానా డెంప్సీ(0), అలనా డాల్జెల్(5*), ఫ్రేయా సార్జెంట్(1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఫలితంగా ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగగా.. తనూజ కన్వార్ రెండు వికెట్లు పడగొట్టింది. మరోవైపు.. టైటస్ సాధు, సయాలీ సట్ఘరే, మిన్ను మణి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సెంచరీతో రాణించిన ప్రతికా రావల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మహిళల వన్డే క్రికెట్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు👉ఐర్లాండ్పై రాజ్కోట్ వేదికగా 2025లో 304 పరుగుల తేడాతో గెలుపు👉ఐర్లాండ్పై పోచెఫ్స్ట్రూమ్ వేదికగా 2017లో 249 పరుగుల తేడాతో గెలుపు👉వెస్టిండీస్పై వడోదర వేదికగా 2024లో 211 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్పై డంబుల్లా వేదికగా 2008లో 207 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్పై కరాచీ వేదికగా 2005లో 193 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
టీమిండియా సరికొత్త చరిత్ర.. వన్డేల్లో అత్యధిక స్కోరు
ఐర్లాండ్తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన విధ్వంసానికి తోడు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ కూడా రాణించడంతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత యాభై ఓవర్లలో కేవలం ఐదు వికెట్లు నష్టపోయిన స్మృతి సేన ఏకంగా 435 పరుగులు సాధించింది. నాటి రికార్డు బ్రేక్తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు(Highest ODI total) సాధించిన భారత జట్టుగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉండేది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్తో జరిగిన వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 418 పరుగులు సాధించింది. తాజాగా స్మృతి సేన ఆ రికార్డును బద్దలు కొట్టి.. ఈ మేర సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు మరెన్నో రికార్డులు సొంతం చేసుకుంది.ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా సొంతగడ్డపై భారత మహిళా క్రికెట్ జట్టు ఐర్లాండ్(India Women Vs Ireland Women)తో తలపడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీ నేపథ్యంలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇదిలా ఉంటే.. రాజ్కోట్ వేదికగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు గెలిచిన భారత్.. సిరీస్ను 2-0తో గెలిచింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం నామమాత్రపు మూడో వన్డేలోనూ స్మృతి సేన ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ల ధనాధన్ శతకాలుటాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు ఓపెనర్లు స్మృతి, ప్రతికా రావల్(Pratika Rawal) శతక్కొట్టి అదిరిపోయే ఆరంభం అందించారు. స్మృతి 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 135 పరుగులు సాధించగా.. ప్రతికా భారీ సెంచరీతో దుమ్ములేపింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని ఇరవై ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఏకంగా 154 పరుగులు రాబట్టింది.హాఫ్ సెంచరీతో మెరిసిన రిచాఇక వన్డౌన్ బ్యాటర్ రిచా ఘోష్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతులు ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులు సాధించింది. మిగతా వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(25 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్ 15 రన్స్ చేసింది. జెమీమా రోడ్రిగెస్ 4, దీప్తి శర్మ 11 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్గా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా రికార్డు స్థాయిలో 435 పరుగులు స్కోరు చేసింది. ఐరిష్ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్గాస్ట్కు రెండు వికెట్లు దక్కగా.. అర్లెనీ కెల్లీ, ఫ్రెయా సార్జెంట్, జార్జియానా డెంప్సీ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఐర్లాండ్తో మూడో వన్డే సందర్భంగా స్మృతి సేన సాధించిన రికార్డులువుమెన్స్ వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు బాదిన జట్లలో మూడో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 712. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 593. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్కోట్- 57వుమెన్స్ వన్డేల్లో 400కిపైగా స్కోర్లు సాధించిన జట్లలో నాలుగో స్థానం1. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 491/42. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్- 1997- క్రైస్ట్చర్చ్- 455/53. న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్- 2018- డబ్లిన్- 440/34. ఇండియా వర్సెస్ ఐర్లాండ్- 2025- రాజ్కోట్- 435/5.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్ -
వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ‘తొలి ప్లేయర్’గా స్మృతి మంధాన చరిత్ర
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో తక్కువ బంతుల్లోనే శతకం బాదిన(Women's ODI Fastest Century) భారత తొలి మహిళా క్రికెటర్గా రికార్డు సాధించింది. ఐర్లాండ్తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా స్మృతి మంధాన ఈ ఘనత సాధించింది. అంతేకాదు.. మహిళల వన్డే క్రికెట్లో పది సెంచరీలు పూర్తి చేసుకుని మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది.కెప్టెన్గా, బ్యాటర్గా స్మృతి అదుర్స్ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు.. భారత్(India Women Vs Ireland Women)లో పర్యటిస్తోంది. ఈ మూడు వన్డేల సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ దూరం కాగా.. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఈ క్రమంలో కెప్టెన్గానూ, బ్యాటర్గానూ స్మృతి అద్బుత ప్రదర్శన కనబరుస్తోంది.రాజ్కోట్ వేదికగా సాగుతున్న ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు గెలిచిన టీమిండియా ఇప్పటికే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లలో స్మృతి వరుసగా 41, 73 పరుగులు సాధించి.. గెలుపులో తన వంతు పాత్ర పోషించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం జరుగుతున్న మూడో వన్డేలోనూ స్మృతి సూపర్ ఫామ్ను కొనసాగించింది.వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన శతక్కొట్టారు. స్మృతి 70 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. వుమెన్ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి ఇండియన్గా నిలిచింది. అంతేకాదు.. వన్డేల్లో పది సెంచరీలు సాధించిన భారత తొలి మహిళా క్రికెటర్గా, ఓవరాల్గా నాలుగో ప్లేయర్గా చరిత్రకెక్కింది.Led from the front and how 👏👏What a knock THAT 🙌Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/4dQVq6JTRm— BCCI Women (@BCCIWomen) January 15, 2025 ఇక స్మృతి మొత్తంగా ఈ మ్యాచ్లో 80 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్ ఓర్లా ప్రెండెర్గాస్ట్ బౌలింగ్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. అవా కానింగ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరుఇదిలా ఉంటే.. ఐర్లాండ్తో మూడో వన్డేలో మరో ఓపెనర్ ప్రతికా రావల్ భారీ శతకంతో మెరిసింది. 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులు సాధించింది. ప్రతికా ఇన్నింగ్స్లో ఏకంగా 20 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం విశేషం. మిగతా వాళ్లలో రిచా ఘోష్ 59 పరుగులతో రాణించగా.. తేజల్ హెసాబ్నిస్ 28, హర్లీన్ డియోల్ 14 రన్స్ చేశారు. ఇక జెమీమా 4, దీప్తి శర్మ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ 435 పరుగులు స్కోరు చేసింది. భారత్ తరఫున మహిళా, పురుష క్రికెట్లో వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.మహిళల వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత ప్లేయర్లు1. స్మృతి మంధాన- ఐర్లాండ్ వుమెన్స్పై- రాజ్కోట్(2025)లో- 70 బంతుల్లో శతకం2.హర్మన్ప్రీత్ కౌర్- సౌతాఫ్రికా వుమెన్స్పై- బెంగళూరు(2024)లో- 87 బంతుల్లో శతకం3. హర్మన్ప్రీత్ కౌర్- ఆస్ట్రేలియా వుమెన్స్పై- డెర్బీ(2017)లో- 90 బంతుల్లో శతకం4. జెమీమా రోడ్రిగ్స్- ఐర్లాండ్ వుమెన్స్పై- రాజ్కోట్(2025)లో- 90 బంతుల్లో శతకం5. హర్లీన్ డియోల్- వెస్టిండీస్ వుమెన్స్పై- వడోదర(2024)లో- 98 బంతుల్లో శతకం.మహిళల వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లుమెగ్ లానింగ్- 15సుజీ బేట్స్- 13టామీ బీమౌంట్- 10స్మృతి మంధాన- 10చమరి ఆటపట్టు- 9చార్లెట్ ఎడ్వర్డ్స్- 9నాట్ సీవర్ బ్రంట్- 9.MAXIMUM x 2⃣Captain Smriti Mandhana's elegance on display here in Rajkot!Updates ▶️ https://t.co/xOe6thhPiL#TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/wMlnuoUWIr— BCCI Women (@BCCIWomen) January 15, 2025 చదవండి: పంత్ క్లారిటీ ఇచ్చాడు... కానీ కోహ్లి మాత్రం ఇలా: డీడీసీఏ ఆగ్రహం -
టాప్ ఫోర్... వైల్డ్ ఫైర్
భారత మహిళల జట్టు సొంతగడ్డలో ఐర్లాండ్పై ‘వైల్డ్ ఫైర్’ అయ్యింది. టాప్–4 బ్యాటర్లు గర్జించడంతో మన జట్టు వన్డేల్లో తమ అత్యధిక రికార్డు స్కోరును నమోదు చేసింది. ఓవరాల్గా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో మూడో అత్యధిక స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ శతకంతో... ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్, వన్డౌన్లో హర్లీన్ డియోల్ ‘ఫిఫ్టీ’లతో చెలరేగారు. బౌలింగ్లో దీప్తి శర్మ, ప్రియా మిశ్రాలు ఐర్లాండ్ బ్యాటర్ల పని పట్టారు. దీంతో రెండో వన్డేలో స్మృతి మంధాన బృందం భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి రెండు వన్డేల్లో గెలుపుతో ద్వైపాక్షిక సిరీస్ను సొంతం చేసుకున్న భారత జట్టు ఈనెల 15న జరిగే చివరిదైన మూడో వన్డేలో క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాజ్కోట్: భారత టాపార్డర్ టాప్ లేపే ప్రదర్శనతో ఐర్లాండ్ మహిళల్ని చితగ్గొట్టింది. రెండో వన్డేలో ఓపెనింగ్ జోడీ సహా తర్వాత వచ్చిన మూడు, నాలుగో వరుస బ్యాటర్లూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రాజ్కోట్ వేదిక పరుగుల ‘పొంగల్’ చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 116 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్పై ఘనవిజయం సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (91 బంతుల్లో 102; 12 ఫోర్లు) తన కెరీర్లో తొలి శతకం సాధించగా... హర్లీన్ డియోల్ (84 బంతుల్లో 89; 12 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన (54 బంతుల్లో 73; 10 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రతీక రావల్ (61 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీస్కోరు చేసింది. గతంలో భారత జట్టు ‘బెస్ట్’ స్కోరు 358. 2017లో ఐర్లాండ్పై 358/2 చేసిన అమ్మాయిల జట్టు గత నెల విండీస్పై కూడా 358/5తో ఆ ‘బెస్ట్’ను సమం చేసింది. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులకు పరిమితమైంది. క్రిస్టీనా కూల్టర్ (113 బంతుల్లో 80; 10 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు. తొలి వన్డే గెలిచిన స్మృతి సేన తాజా విజయంతో 2–0తో సిరీస్ వశం చేసుకుంది. 15న చివరి వన్డే జరగనుంది. స్మృతి, ప్రతీక ఫైర్ బ్యాటింగ్కు దిగగానే ఓపెనర్లు స్మృతి, ప్రతీక ఐర్లాండ్ బౌలింగ్ను తుత్తునీయలు చేస్తూ భారీస్కోరుకు గట్టి పునాది వేశారు. దీంతో 7.2 ఓవర్లలో 50 స్కోరు చేసిన భారత్ 100కు (13 ఓవర్లలో) చేరేందుకు ఎంతోసేపు పట్టలేదు. స్మృతి 35 బంతుల్లో, ప్రతీక 53 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇలా ఓపెనర్లిద్దరే తొలి 19 ఓవర్లలో 156 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అదే స్కోరు వద్ద వరుస బంతుల్లో ఇద్దరు నిష్క్రమించారు. ఇక్కడ ముగిసింది సినిమాల్లోలాగా ఫస్టాఫే! అంటే విశ్రాంతి. తర్వాత శుభం కార్డు జెమీమా, హర్లీన్ల జోరు చూపించింది. దీంతో 28 ఓవర్ల పాటు (19.1 నుంచి 47.1 ఓవర్ వరకు) వాళ్లిద్దరు మూడో వికెట్కు జతచేసిన 183 పరుగుల భాగస్వామ్యం స్కోరును కొండంతయ్యేలా చేసింది. హర్లీన్ 58 బంతుల్లో ఫిఫ్టీ కొడితే... జెమీమా 62 బంతుల్లో 50... 90 బంతుల్లో సెంచరీ సాధించింది.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జార్జినా (బి) ప్రెండెర్గాస్ట్ 73; ప్రతీక (ఎల్బీడబ్ల్యూ) (బి) జార్జినా 67; హర్లీన్ (సి) లౌరా (బి) కెల్లీ 89; జెమీమా (బి) కెల్లీ 102; రిచా ఘోష్ (సి) ఫ్రెయా (బి) ప్రెండర్గాస్ట్ 10; తేజల్ (నాటౌట్) 2; సయాలీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 370. వికెట్ల పతనం: 1–156, 2–156, 3–339, 4–358, 5–368. బౌలింగ్: వోర్లా ప్రెండర్గాస్ట్ 8–0–75–2, అవా క్యానింగ్ 10–0–51–0, అర్లెన్ కెల్లీ 10–0–82–2, ఫ్రెయా సర్జెంట్ 9–0–77–0, అలానా డాల్జెల్ 5–0–41–0, జార్జినా 8–0–42–1. ఐర్లాండ్ ఇన్నింగ్స్: సారా (బి) దీప్తి 38; గాబీ లూయిస్ (సి) రిచా (బి) సయాలీ 12; క్రిస్టీనా (బి) టిటాస్ సాధు 80; వోర్లా (సి) సయాలీ (బి) ప్రియా 3; లౌరా (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి 37; లీ పాల్ (నాటౌట్) 27; కెల్లీ (బి) దీప్తి 19; అవ క్యానింగ్ (బి) ప్రియా 11; జార్జినా (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 21; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–32, 2–87, 3–101, 4–184, 5–188, 6–218, 7–234. బౌలింగ్: టిటాస్ సాధు 10–0–48–1, సయాలీ 9–1–40–1, సైమా ఠాకూర్ 9–0–50–0, ప్రియా మిశ్రా 10–0–53–2, దీప్తి శర్మ 10–0–37–3, ప్రతీక 2–0–12–0. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) అద్భుత ఫామ్ను కొనసాగిస్తోంది. ఐర్లాండ్ మహిళా జట్టుతో తొలి వన్డేలోనూ ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టింది. కేవలం 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించింది.ఈ క్రమంలో స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల మార్కు అందుకున్న తొలి మహిళా ప్లేయర్గా నిలిచింది. కాగా ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా మూడు వన్డేలు ఆడేందుకు ఐర్లాండ్ భారత్ పర్యటన(India Women vs Ireland Women)కు వచ్చింది.కెప్టెన్గా స్మృతిఈ సిరీస్కు భారత మహిళా జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ దూరం కాగా స్మృతి సారథ్య బాధ్యతలు చేపట్టింది. ఇక ఇరుజట్ల మధ్య శుక్రవారం రాజ్కోట్ వేదికగా వన్డే సిరీస్ ఆరంభమైంది. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది.ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత అర్ధ శతకం(92)తో చెలరేగగా.. మిడిలార్డర్లో లీ పాల్(59) కూడా హాఫ్ సెంచరీ సాధించింది. వీరిద్దరికి తోడు లోయర్ ఆర్డర్లో అర్లెనె కెలీ 28 పరుగులతో రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఐర్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. టైటస్ సాధు, దీప్ది శర్మ, సయాలీ సట్ఘరే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.నాలుగు వేల పరుగుల పూర్తిఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్(Pratika Rawal) శుభారంభం అందించారు. మంధాన 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్రేయా సార్జెంట్ బౌలింగ్లో ఓర్లా ప్రెండర్గాస్ట్ చేతికి క్యాచ్ ఇచ్చి అవుటైంది. అయితే, ఈ క్రమంలోనే స్మృతి వన్డేల్లో నాలుగు వేల పరుగుల మైలురాయిని అధిగమించింది.ఇంతకు ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించగా.. స్మృతి తాజాగా ఈ ఫీట్ నమోదు చేసింది. అయితే, మిథాలీ రాజ్ నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకోవడానికి 112 వన్డే ఇన్నింగ్స్ ఆడగా.. స్మృతి కేవలం 95 వన్డే ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించింది. తద్వారా అత్యంత వేగంగా 4 వేల వన్డే పరుగుల క్లబ్లో చేరిన భారత తొలి మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.వన్డేల్లో వేగంగా నాలుగు వేల పరుగుల మైలురాయికి చేరుకున్న మహిళా క్రికెటర్లు👉బెలిండా క్లార్క్- ఆస్ట్రేలియా- 86 ఇన్నింగ్స్👉మెగ్ లానింగ్- ఆస్ట్రేలియా- 87 ఇన్నింగ్స్👉స్మృతి మంధాన- ఇండియా- 95 ఇన్నింగ్స్👉లారా వొల్వర్ట్- సౌతాఫ్రికా- 96 ఇన్నింగ్స్👉కరేన్ రాల్టన్- ఆస్ట్రేలియా- 103 ఇన్నింగ్స్👉సుజీ బేట్స్- న్యూజిలాండ్- 105 ఇన్నింగ్స్👉స్టెఫానీ టేలర్- వెస్టిండీస్- 107 ఇన్నింగ్స్👉టస్మిన్ బీమౌంట్- ఇంగ్లండ్- 110 ఇన్నింగ్స్👉మిథాలీ రాజ్- ఇండియా- 112 ఇన్నింగ్స్👉డేబీ హాక్లీ- న్యూజిలాండ్- 112 ఇన్నింగ్స్ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్ ప్రతికా రావల్ 89 పరుగులతో చెలరేగగా.. తేజస్ హసాబ్నిస్ 53 పరుగులతో అజేయంగా నిలిచింది. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ తొలి వన్డేలో ఐర్లాండ్పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. -
స్మృతి సారథ్యంలో...
న్యూఢిల్లీ: ఐర్లాండ్తో స్వదేశంలో జరిగే మూడు వన్డేల సిరీస్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ టీమ్కు స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరిస్తుంది. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. వెస్టిండీస్తో ఇటీవల జరిగిన టి20 సిరీస్లో చివరి రెండు మ్యాచ్లకు స్మృతినే కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించింది. విండీస్తో వన్డే పోరులో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన పేస్ బౌలర్ రేణుకా సింగ్కు కూడా విరామం ఇచ్చారు. విండీస్తో సిరీస్లో అరంగేట్రం చేసిన ప్రతీక, తనూజ తమ స్థానాలను నిలబెట్టుకోగా... రాఘ్వీ బిస్త్కు తొలిసారి వన్డే టీమ్ పిలుపు దక్కింది. భారత వన్డే టీమ్లోకి ఎంపికైనా మ్యాచ్ ఆడని సయాలీ సత్ఘరేకు మరో అవకాశం దక్కింది. మరోవైపు ఇప్పటికే స్థానం కోల్పోయిన షఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్లపై మాత్రం సెలక్టర్లు ఇంకా విశ్వాసం ఉంచలేదు. రాజ్కోట్లో ఈ నెల 10, 12, 15 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఇప్పటి వరకు భారత్, ఐర్లాండ్ మధ్య 12 వన్డేలు జరగ్గా...అన్నీ భారత్ గెలిచింది. జట్టు వివరాలు: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్కెప్టెన్), ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి, రిచా ఘోష్, తేజల్ హసబ్నిస్, రాఘ్వీ బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజ కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, సయాలీ సత్ఘరే. -
ఐర్లాండ్తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్
వెస్టిండీస్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు మరో స్వదేశీ పోరుకు సిద్దమైంది.ఐర్లాండ్ మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్లో భారత్ తలపడేందుకు భారత్ సిద్దమైంది. జనవరి 10న రాజ్కోట్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఐరీష్తో వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్కు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్గా ఎంపికైంది. అదే విధంగా మరో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కూడా ఈ వన్డే సిరీస్కు దూరమైంది.కాగా మరోసారి స్టార్ ప్లేయర్ షెఫాలీ వర్మకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. షెఫాలీ వర్మ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్లో దుమ్ము లేపుతున్నప్పటికి సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా విండీస్తో సిరీస్లో ఆడిన ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్లు.. ఐరీష్ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు.ఐర్లాండ్ సిరీస్కు భారత మహిళల జట్టు ఇదే: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మంధన.. టీమిండియా భారీ స్కోర్
వడోదరా వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (డిసెంబర్ 22) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇన్నింగ్స్ చివర్లో భారత టెయిలెండర్లు తడబడ్డారు. లేకపోతే టీమిండియా ఇంకా భారీ స్కోర్ చేసుండేది. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది. కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టీ20 సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. ప్రస్తుతం వన్డే సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 24, 27 తేదీల్లో రెండు, మూడు వన్డేలు జరుగుతాయి. -
స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్గా
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అదరగొట్టిన మంధాన.. స్వదేశంలో వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్లోనూ అదే దూకుడు కనబరిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన మంధాన.. గురువారం జరిగిన ఆఖరి టీ20లోనూ తన బ్యాట్కు పనిచెప్పింది. ఈ మ్యాచ్లో స్మృతి విధ్వంసం సృష్టించింది. కేవలం 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మంధాన సాధించిన రికార్డులు ఇవే..👉మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 30 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ వెటరన్ సుజీ బేట్స్(29) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బేట్స్ ఆల్టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది.అత్యధిక పిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్లు వీరే..స్మృతి మంధాన (భారత్) -30సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 29బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 25స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)- 22సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 22👉అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్గా సైతం మంధాన రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 21 టీ20 ఇన్నింగ్స్లలో స్మృతి 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్లు (720 పరుగులు) పేరిట ఉండేది. -
విధ్వంసకర ఇన్నింగ్స్.. వరల్డ్ రికార్డు సమం
భారత క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసింది. తద్వారా ప్రపంచ రికార్డును రిచా సమం చేసింది. కాగా మూడు టీ20, మూడు వన్డేల సిరీస్లు ఆడేందుకు వెస్టిండీస్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.నవీ ముంబైలోఈ క్రమంలో నవీ ముంబై వేదికగా టీ20 సిరీస్ మొదలుకాగా.. ఆదివారం నాటి తొలి మ్యాచ్లో భారత్, రెండో టీ20లో విండీస్ జట్లు గెలిచాయి. దీంతో సిరీస్ 1-1తో సమం కాగా.. గురువారం నాటి మూడో టీ20 నిర్ణయాత్మకంగా మారింది. ఇక కీలక మ్యాచ్లో భారత మహిళా జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది.స్మృతి ధనాధన్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి రికార్డు స్థాయిలో 217 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 77, 13 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ అర్ధ శతకంతో చెలరేగగా.. జెమీమా రోడ్రిగ్స్(31), రాఘవి బిస్త్(31*) ఫర్వాలేదనిపించారు.రిచా ర్యాంపేజ్.. వరల్డ్ రికార్డు సమంఅయితే, ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ రాగానే.. ఒక్కసారిగా స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న రిచా.. మహిళల టీ20 క్రికెట్లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును సమం చేసింది. అంతకు ముందు సోఫీ డివైన్, లిచ్ఫీల్డ్ ఈ ఘనత సాధించగా.. రిచా వారి వరల్డ్ రికార్డును సమం చేసింది. అయితే, అలియా అలెన్ బౌలింగ్లో చినెల్లె హెన్రీకి క్యాచ్ ఇవ్వడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మెరుపు ఇన్నింగ్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 54 పరుగులు)కు తెరపడింది.రాధా యాదవ్ దూకుడుఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్కు భారత బౌలర్లుకు చుక్కలు చూపించారు. రాధా యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.వీరంతా కలిసి తమ అద్భుత బౌలింగ్తో వెస్టిండీస్ను 157 పరుగులకే కట్టడి చేయడంతో.. భారత మహిళా జట్టు 60 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రిచా ఘోష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.చదవండి: అశ్విన్ ‘వారసుడు’ ఎవరు?.. అతడికే అవకాశం ఎక్కువ A 60-run victory in the Third and Final T20I! 🥳#TeamIndia win the decider in style and complete a 2⃣-1⃣ series victory 👏👏Scorecard ▶️ https://t.co/Fuqs85UJ9W#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/SOPTWMPB3E— BCCI Women (@BCCIWomen) December 19, 2024 -
భారత మహిళల ‘రికార్డు’ విజయం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్తో జరిగిన టి20 సిరీస్ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్లో, ఆపై బౌలింగ్లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 2–1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, రాధ యాదవ్కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదింది. అలీన్ బౌలింగ్లో మరో భారీ సిక్స్తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1. 217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది. 18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది. 30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది. -
మంధన మెరుపు అర్ద శతకం.. ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైన టీమిండియా
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళల జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓ మోస్తరు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీమిండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధన 41 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసింది. వికెట్కీపర్ రిచా ఘోష్ 17 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసింది. దీప్తి శర్మ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు), జెమీమా రోడ్రిగెజ్ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు) రెండంకెల స్కోర్లు చేశారు. మంధన క్రీజ్లో ఉండగా భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. భారత ఇన్నింగ్స్లో ఉమా ఛెత్రి 4, రాఘ్వి బిస్త్ 5, సంజీవన్ సజనా 2, రాధా యాదవ్ 7, సైమా ఠాకోర్ 6 పరుగులు చేసి ఔటయ్యారు. టిటాస్ సాధు 1, రేణుకా ఠాకూర్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, చిన్నెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీ కాగా, స్మృతి మంధన టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనుంది. కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. స్మృతి మంధన తొలి మ్యాచ్లో కూడా అర్ద సెంచరీతో (54) మెరిసింది. -
టాప్-3లోకి టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో మంధన టాప్-3లోకి ప్రవేశించింది. వన్డే ర్యాంకింగ్స్లో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరిన మంధన.. టీ20 ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపర్చుకుని మూడో స్థానానికి చేరింది.ఆస్ట్రేలియా, వెస్టిండీస్ సిరీస్ల్లో ప్రదర్శనల ఆధారంగా మంధన ర్యాంక్లు మెరుగుపడ్డాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మంధన సూపర్ సెంచరీ (105) చేసింది. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో మెరుపు అర్ద సెంచరీ (54) సాధించింది.మరోవైపు వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బేమౌంట్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత బ్యాటర్ హర్లీన్ డియోల్ తొమ్మిది స్థానాలు మెరుగుపర్చుకుని 64వ స్థానానికి ఎగబాకింది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ బ్యాటర్ నతాలీ సీవర్ బ్రంట్, ఆసీస్ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండు స్థానాలు కోల్పోయి 13వ స్థానానికి పడిపోయింది.టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఓ స్థానం మెరుగపర్చుకుని 11వ స్థానానికి చేరగా.. భారత్కే చెందిన జెమీమా రోడ్రిగెజ్ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 15వ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా ప్లేయర్లు బెత్ మూనీ, తహిళ మెక్గ్రాత్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత్కు చెందిన దీప్తి శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని రెండో స్థానానికి ఎగబాకింది. ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. -
Ind vs WI: సిరీస్ విజయంపై కన్నేసిన భారత్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో శుభారంభం చేసిన భారత మహిళల జట్టు.. రెండో గెలుపుపై కన్నేసింది. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగే రెండో టీ20లో గెలిస్తే ఈ సిరీస్ హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఖాతాలో చేరుతుంది. మరోవైపు గత మ్యాచ్లో ఓటమి నుంచి కోలుకొని మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని విండీస్ మహిళలు భావిస్తున్నారు.ఇక ముంబై వేదికగా తొలి టీ20లో భారత బ్యాటర్లంతా రాణించడం చెప్పుకోదగ్గ సానుకూలాంశం. ఓపెనర్ స్మృతి మంధాన దూకుడుగా ఆడి అర్ధసెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో వన్డేల్లో చిత్తుగా ఓడిన తర్వాత స్వదేశంలో దక్కిన ఈ విజయం జట్టులో ఉత్సాహాన్ని పెంచింది. అయితే ఫీల్డింగ్లో టీమ్ కాస్త పేలవ ప్రదర్శన కనబర్చింది.తొలి మ్యాచ్లో భారత ఫీల్డర్లు మూడు సునాయాస క్యాచ్లు వదిలేశారు. బౌలింగ్లో దీప్తి శర్మ చక్కటి బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... టిటాస్ సాధు వికెట్లు పడగొట్టింది. ప్రధాన పేసర్ రేణుకా సింగ్ కూడా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లోపాలు ఉన్నా... బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టి ప్రదర్శనతో చెలరేగితే మరో విజయం కష్టం కాబోదు.మరోవైపు వెస్టిండీస్ కూడా బ్యాటింగ్లో బలంగానే ఉంది. ముఖ్యంగా డియాండ్రా డాటిన్ గత మ్యాచ్ తరహాలోనే ధాటిగా ఆడగల సమర్థురాలు. ఖియానా జోసెఫ్ కూడా తొలి టీ20లో రాణించింది. వీరితో పాటు కెప్టెన్, ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా తన స్థాయికి తగినట్లు ఆడితే విండీస్ బలం పెరుగుతుంది. -
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేయగా, బౌలింగ్లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
IND VS WI 1st T20: చెలరేగిపోయిన జెమీమా.. రాణించిన మంధన
నవీ ముంబై వేదికగా వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి విండీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. స్మృతి మంధన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెజ్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్లో ఉమా ఛెత్రి 24, రిచా ఘోష్ 20 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (13), సంజీవన్ సజనా (1) అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ రెండు వికెట్లు పడగొట్టగా.. డియాండ్రా డొట్టిన్ ఓ వికెట్ దక్కించుకుంది.కాగా, మూడు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో టీ20 మ్యాచ్లు డిసెంబర్ 15, 17, 19 తేదీల్లో జరుగనుండగా.. వన్డేలు 22, 24, 27 తేదీల్లో జరుగనున్నాయి. టీ20 మ్యాచ్లన్నీ నవీ ముంబైలో జరుగనుండగా.. మూడు వన్డే మ్యాచ్లకు వడోదర వేదిక కానుంది.ఇదిలా ఉంటే, భారత మహిళల క్రికెట్ జట్టు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో భారత్ మూడు మ్యాచ్ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొంది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత్.. రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 83 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. -
Ind vs WI: భారత టీ20, వన్డే జట్ల ప్రకటన.. స్టార్ పేసర్పై వేటు
వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో భారత మహిళల జట్టు ఎంపికలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ పేసర్ అరుంధతీ రెడ్డిపై సెలక్షన్ కమిటీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.అరుంధతీ రెడ్డిపై వేటు.. కారణం?కాగా సొంతగడ్డపై భారత్ వెస్టిండీస్ మహిళల జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనున్న తరుణంలో అనుభవజ్ఞురాలైన అరుంధతీ రెడ్డిని తప్పించారు. రెండు ఫార్మాట్లలోనూ ఆమెకు ఉద్వాసన పలకడం గమనార్హం. నిజానికి జట్టులో చోటు కోల్పోయేంత పేలవంగా ఆమె ప్రదర్శన అయితే లేదు. కుదురుగా బౌలింగ్ చేస్తున్న ఆమె వికెట్లు లేదంటే పరుగుల కట్టడితో ఆకట్టుకుంటోంది. అయినప్పటికీ వేటు వేయడం గమనార్హం.వారిద్దరికి తొలిసారి చోటుఇక విండీస్ సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో ముగ్గురు కొత్త ముఖాలకు చోటిచ్చారు. ప్రతిక రావల్, తనూజ కన్వర్లను తొలిసారి వన్డే జట్టులోకి తీసుకోగా... నందిని కశ్యప్, రాఘవి బిస్త్లను తొలిసారి టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. ఈ రెండు జట్లకు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌరే సారథ్యం వహించనుంది.టీ20 సిరీస్తో ఆరంభంముందుగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ నెల 15, 17, 19 తేదీల్లో టీ20 మ్యాచ్లు నిర్వహిస్తారు. అనంతరం వడోదరలో ఈ నెల 22, 24, 27 తేదీల్లో మూడే వన్డేల సిరీస్ జరుగుతుంది.ఇక ఈ రెండు సిరీస్లకు షఫాలీ వర్మను కూడా ఎంపిక చేయలేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్కు ఫామ్లో లేని షఫాలీకి ఉద్వాసన పలికారు. గాయాల కారణంగా యస్తిక భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పూనియాలను సెలక్షన్కు పరిగణించలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, సజన సజీవన్, రాఘవి బిస్త్, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్.వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, జెమీమా, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ, రేణుక సింగ్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు, సైమా ఠాకూర్, మిన్ను మణి, తేజల్ హసబ్నిస్, ప్రతిక రావల్, తనూజ కన్వర్. చదవండి: భారత్తో టీ20, వన్డే సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ఆల్రౌండర్ మిస్ -
ఆసీస్తో వన్డే సిరీస్.. భారత క్రికెట్ జట్టుకు మరో షాక్
భారత మహిళల క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో వైట్వాష్కు గురైన హర్మన్ సేనకు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) గట్టి షాకిచ్చింది. ఆసీస్తో బ్రిస్బేన్లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా స్లో ఓవర్రేట్కు పాల్పడటంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో కోత పడింది. నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు తక్కువ వేయడంతో ఓవర్కు 5 చొప్పున... భారత ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు రెఫరీ డేవిడ్ గిల్బర్ట్ వెల్లడించాడు.విచారణ లేకుండా నేరుగాఐసీసీ నియమావళిలోని 2.22 ఆర్టికల్ ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నాడు. భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తప్పు అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండా నేరుగా కోత విధించినట్లు తెలిపాడు. కాగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో భారత్ 3-0తో క్వీన్స్వీప్నకు గురైన విషయం తెలిసిందే.మూడో వన్డేలో స్మృతి ‘శత’క్కొట్టినా...పెర్త్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ ప్లేయర్లలో అనాబెల్ సదర్లాండ్ (95 బంతుల్లో 110; 9 ఫోర్లు, 4 సిక్స్లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్ తాలియా మెక్గ్రాత్ (56 నాటౌట్; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (50; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో మెరిశారు.ఒకదశలో 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ను అనాబెల్ తన అద్భుత ఇన్నింగ్స్తో ఆదుకుంది. మొదట గార్డ్నర్తో ఐదో వికెట్కు 96 పరుగులు జోడించిన అనాబెల్... ఆ తర్వాత తాలియాతో ఆరో వికెట్కు 95 బంతుల్లో 122 పరుగులు జతచేసి జట్టుకు భారీ స్కోరు అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీయగా... దీప్తి శర్మ ఒక వికెట్ దక్కించుకుంది.ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (109 బంతుల్లో 105; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు నుంచి ఆమెకు ఎటువంటి సరైన సహకారం లభించలేదు. ఒక్క హర్లీన్ డియోల్ (39; 4 ఫోర్లు) మినహా మిగతా వాళ్లు విఫలమయ్యారు.అండగా హర్లీన్ డియోల్స్మృతి–హర్లీన్ రెండో వికెట్కు 118 పరుగులు జోడించి జట్టుకు బలమైన పునాది వేసినా... తర్వాత వచ్చిన వాళ్లు అదే జోరును కొనసాగించలేకపోయారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ (12), రిచా ఘోష్ (2), జెమీమా రోడ్రిగ్స్ (16), దీప్తి శర్మ (0), మిన్ను మణి (8) విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా 45.1 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ కాగా.. కంగారూ జట్టు 83 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 5 వికెట్లు తీయగా... మేగన్ షుట్, అలానా కింగ్ రెండేసి వికెట్లు తీశారు. ఇక ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన అనాబెల్ సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
టీమిండియా వైస్ కెప్టెన్ ఖాతాలో మరో రికార్డు
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో సూపర్ సెంచరీతో మెరిసిన మంధన, ఓ క్యాలెండర్ ఇయర్లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ ఘనత సాధించే క్రమంలో మంధన మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న అతి పిన్న వయస్కురాలుగా (28 ఏళ్ల 146 రోజుల్లో) రికార్డు నెలకొల్పింది. మంధన వన్డేల్లో 3812 పరుగులు.. టీ20ల్లో 3568, టీ20ల్లో 629 పరుగులు చేసింది.ఆసీస్తో మూడో వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో మంధన సెంచరీతో (109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 105 పరుగులు) కదంతొక్కినప్పటికీ టీమిండియా 83 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్ల్యాండ్ (110) మెరుపు సెంచరీతో సత్తా చాటగా.. ఆష్లే గార్డ్నర్ (50), తహిళ మెక్గ్రాత్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్ చేయగా. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన సూపర్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధనతో పాటు హర్లీన్ డియోల్ (39) కాసేపు క్రీజ్లో గడిపింది. భారత ఇన్నింగ్స్లో మంధన, హర్లీన్తో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగెజ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (10-1-30-5) టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టింది. అలానా కింగ్, మెగాన్ షట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సదర్ల్యాండ్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ ఓటమితో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ను 0-3 తేడాతో కోల్పోయింది. -
పుష్ప సాంగ్తో స్మృతి మంధాన సెంచరీ సెలబ్రేట్ చేసిన ప్రియుడు(ఫొటోలు)
-
IND VS AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా వైస్ కెప్టెన్
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు మంధనతో పాటు బెలిండ క్లార్క్ (1997), మెగ్ లాన్నింగ్ (2016), ఆమీ సాటర్త్వైట్ (2016), సోఫీ డివైన్ (2018), సిద్రా అమీన్ (2022), నాట్ సీవర్ బ్రంట్ (2023), లారా వోల్వార్డ్ట్ (2024) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా ఓ క్యాలెండర్ ఇయర్లో తలో మూడు వన్డే సెంచరీలు చేశారు.తాజాగా మంధన తన తోటి వారందరినీ అధిగమించి ఈ ఏడాది నాలుగో వన్డే సెంచరీ చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన ఈ ఘనత సాధించింది. ఈ ఏడాది మంధన సౌతాఫ్రికాపై రెండు (117, 136), న్యూజిలాండ్ (100), ఆస్ట్రేలియాపై (105) తలో సెంచరీ చేసింది. మంధన ఈ ఏడాది చేసిన సెంచరీల్లో మూడు స్వదేశంలో సాధించినవి కాగా.. ఒకటి ఆస్ట్రేలియాలో చేసింది.ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో మంధన 109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 105 పరుగులు చేసింది. ఈ సెంచరీ మంధనకు వన్డేల్లో తొమ్మిదవది. ఆసీస్తో మ్యాచ్లో మంధన సెంచరీతో కదంతొక్కినా టీమిండియా ఓటమిపాలైంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. మంధన ఔట్ కాగానే చకచకా వికెట్లు కోల్పోయింది. 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 215 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ 0-3 తేడాతో కోల్పోయింది. -
మంధన సూపర్ సెంచరీ వృధా.. మూడో వన్డేలోనూ టీమిండియా పరాజయం
స్వదేశంలో భారత మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన మూడో వన్డేలో ఆసీస్ 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్ల్యాండ్ (110) మెరుపు సెంచరీతో సత్తా చాటగా.. ఆష్లే గార్డ్నర్ (50), తహిళ మెక్గ్రాత్ (56 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి (10-2-26-4) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఓ వికెట్ పడగొట్టింది. ఈ మ్యాచ్లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ (4) సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమైంది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. స్మృతి మంధన (105) సూపర్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్ నుంచి ఎవరూ సహకరించలేదు. మంధన ఔటైన అనంతరం భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మంధనతో పాటు హర్లీన్ డియోల్ (39) కాసేపు క్రీజ్లో గడిపింది. వీరిద్దరూ రెండో వికెట్కు 118 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్లో మంధన, హర్లీన్తో పాటు హర్మన్ప్రీత్ కౌర్ (12), జెమీమా రోడ్రిగెజ్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ (10-1-30-5) టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టింది. అలానా కింగ్, మెగాన్ షట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సదర్ల్యాండ్ ఓ వికెట్ దక్కించుకుంది. -
సూపర్ ఫామ్లో భారత ఓపెనర్.. ఆల్టైమ్ రికార్డుకు గురి
భారత మహిళా జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంటోంది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ వన్డేలో సెంచరీతో చెలరేగిన ఈ ముంబై బ్యాటర్.. మహిళల బిగ్బాష్ లీగ్-2024లోనూ ఫామ్ను కొనసాగించింది. ఈ ఆస్ట్రేలియా టీ20 లీగ్లో మొత్తంగా ఐదు మ్యాచ్లలో కలిపి 142కు పైగా స్ట్రైక్రేటుతో 144 పరుగులు సాధించింది.ఇక స్మృతి మంధాన తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో బిజీ కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ అరుదైన రికార్డు ముంగిట నిలిచింది. ఆసీస్తో ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో స్మృతి గనుక 310 పరుగులు సాధిస్తే.. వన్డేల్లో 4000 పరుగులు సాధించిన మహిళా క్రికెటర్ల క్లబ్లో చేరుతుంది. మిథాలీ రాజ్ ఆల్టైమ్ రికార్డుఅంతేకాదు భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్గా నిలుస్తుంది. కాగా ఇంతకు ముందు దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్... 112 మ్యాచ్లలో నాలుగు వేల పరుగుల మైలురాయిని అందుకుంది. రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్తో 2011నాటి వన్డేలో ఈ ఘనత సాధించింది.ఇక స్మృతి మంధాన ఇప్పటి వరకు 88 వన్డేలు ఆడి 3690 పరుగులు సాధించింది. ఇందులో ఎనిమిది శతకాలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో స్మృతి ఆసీస్తో సిరీస్ సందర్భంగా 310 రన్స్ చేస్తే.. మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలుకొట్టగలుగుతుంది. టాప్లో ఉన్నది వీరేకాగా ఓవరాల్గా మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగుల క్లబ్లో చేరిన క్రికెటర్లలో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ ముందు వరుసలో ఉంది. ఆమె 86 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ నమోదు చేసింది. బెలిండా తర్వాతి స్థానాల్లో... మెగ్ లానింగ్(89 ఇన్నింగ్స్), లారా వొల్వర్ట్(96 ఇన్నింగ్స్), కరేన్ రాల్టన్(103 ఇన్నింగ్స్), సుజీ బేట్స్(105 ఇన్నింగ్స్), స్టెఫానీ టేలర్(107 ఇన్నింగ్స్), టామీ బీమౌంట్(110 ఇన్నింగ్స్) ఈ జాబితాలో ఉన్నారు.ఇదిలా ఉంటే.. భారత మహిళా జట్టు మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. డిసెంబరు 5న బ్రిస్బేన్లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్లో ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న మంధన
మహిళల బిగ్బాష్ లీగ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. డబ్ల్యూబీబీఎల్లో అడిలైడ్ స్ట్రయికర్స్కు ఆడే మంధన పెర్త్ స్కార్చర్స్తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో మంధన అమండ జేడ్ బౌలింగ్లో కార్లీ లీసన్ క్యాచ్ను పట్టుకుంది. స్కార్చర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి లీసన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుంది. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరవతువుంది.WHAT A STUNNING CATCH BY SMRITI MANDHANA IN WBBL 🤯🔥 pic.twitter.com/byoJRzx69i— Johns. (@CricCrazyJohns) November 19, 2024మూడు క్యాచ్లు పట్టుకున్న మంధన ఈ మ్యాచ్లో మంధన మొత్తం మూడు క్యాచ్లు పట్టుకుంది. ఈ మూడు అద్భుతమైన క్యాచ్లే. మైదానంలో పాదరసంలా కదిలిన మంధన బ్యాట్తోనూ రాణించింది. 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసింది. మంధన బ్యాట్తో, ఫీల్డ్లో రాణించడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ 30 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. మంధన (41), కేటీ మ్యాక్(41), లారా వోల్వార్డ్ట్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. స్కార్చర్స్ బౌలర్లలో అలానా కింగ్ 3, కెప్టెన్ సోఫీ డివైన్ 2, క్లో ఐన్స్వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కార్చర్స్.. మెగాన్ షట్ (3/19), ముషాంగ్వే (2/35), అమండ జేడ్ వెల్లింగ్టన్ (2/26), తహిల మెక్గ్రాత్ (1/27) ధాటికి నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్లో బ్రూక్ హ్యాలీడే (47), సోఫీ డివైన్ (35), అలానా కింగ్ (29 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
మట్టికుండ చేసిన స్మృతి మంధాన.. ప్రతి పనిలోనూ పర్ఫెక్ట్ (ఫొటోలు)
-
టాప్-10లోకి హర్మన్.. సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ భారీగా లబ్ది పొందింది. గత వారం న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో మెరుగైన ప్రదర్శన చేసిన హర్మన్.. మూడు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరింది. న్యూజిలాండ్ సిరీస్ చివరి రెండు ఇన్నింగ్స్ల్లో హర్మన్ 83 పరుగులు చేసింది. ఇందులో సిరీస్ డిసైడర్లో చేసిన ఓ హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఈ సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.సెంచరీ చేసినా మంధనకు నిరాశే..!తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధనకు ఎలాంటి లబ్ది చేకూరలేదు. న్యూజిలాండ్ సిరీస్లోని చివరి మ్యాచ్లో సెంచరీ చేసినా మంధన ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆమె తన ర్యాంకింగ్ పాయింట్లను గణనీయంగా మెరుగుపర్చుకుంది. ఈ వారం ర్యాంకింగ్ పాయింట్స్లో మంధన 703 నుంచి 728 పాయింట్లకు ఎగబాకింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న మంధనకు మూడో ప్లేస్లో ఉన్న చమారీ ఆటపట్టుకు కేవలం ఐదు పాయింట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది.ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్కు చెందిన నాట్ సీవర్ బ్రంట్ టాప్లో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ రెండో స్థానంలో ఉంది. భారత ప్లేయర్లలో దీప్తి శర్మ 20వ స్థానంలో ఉండగా.. జెమీమా రోడ్రిగెజ్ 30వ స్థానంలో ఉంది.బౌలింగ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ సిరీస్లోని మూడు ఇన్నింగ్స్ల్లో ఆరు వికెట్లు తీసిన దీప్తి శర్మ రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్కు చెందిన సోఫీ ఎక్లెస్టోన్ టాప్లో తన హావా కొనసాగిస్తుంది. దీప్తికి సోఫీకి మధ్య 67 పాయింట్ల వ్యత్యాసం ఉంది. ఈ వారం ర్యాంకింగ్స్లో భారత పేసర్ రేణుక సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకగా.. మరో ఇద్దరు భారత బౌలర్లు ప్రియా మిశ్రా, సోయ్మా ఠాకోర్ టాప్-100లోకి ఎంటర్ అయ్యారు. -
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
స్మతి మంధాన రికార్డు సెంచరీ.. ప్రియుడి పోస్ట్ వైరల్(ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. ఆల్టైమ్ రికార్డు బ్రేక్
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డేల్లో దిగ్గజ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా భారత మహిళా జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు ఆడింది. తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన గెలవగా.. రెండో వన్డేలో సోఫీ డివైన్ బృందం ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది.భారత బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేసి.. 76 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మాబాద్లో మంగళవారం సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. 86 పరుగులతో బ్రూక్ హాలీడే కివీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచింది.వన్డేల్లో ఎనిమిదో సెంచరీఇక లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్ స్మృతి మంధాన శతకంతో మెరిసింది. తొలి రెండు వన్డేల్లో(5, 0) నిరాశపరిచిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. నరేంద్ర మోదీ స్టేడియంలో మాత్రం విశ్వరూపం ప్రదర్శించింది. 122 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది. కాగా వన్డేల్లో స్మృతికి ఇది ఎనిమిదో సెంచరీ.ఈ క్రమంలో మిథాలీ రాజ్ రికార్డును స్మృతి బ్రేక్ చేసింది. వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన భారత మహిళా బ్యాటర్గా అవతరించింది. కాగా గతంలో మిథాలీ రాజ్ 211 వన్డే ఇన్నింగ్స్ ఆడి ఏడు శతకాలు బాదగా.. స్మృతి తన 88వ మ్యాచ్లోనే ఎనిమిదో సెంచరీ చేసింది. ఇక ఈ జాబితాలో భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆరు శతకాలతో మూడో స్థానంలో ఉంది.2-1తో సిరీస్ కైవసంఇక మ్యాచ్ విషయానికొస్తే.. స్మృతితో పాటు హర్మన్ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్(59 నాటౌట్) మెరిసింది. ఫలితంగా భారత్ న్యూజిలాండ్ విధించిన లక్ష్యాన్ని 44.2 ఓవర్లలోనే ఛేదించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. సొంతగడ్డపై కివీస్తో వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక మూడో వన్డేలో సెంచరీ బాదిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్లో 100 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత.. కివీస్ పేసర్ హన్నా రోవ్ బౌలింగ్లో స్మృతి బౌల్డ్ అయింది.వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన భారత మహిళా క్రికెటర్లుస్మృతి మంధాన- 8*మిథాలీ రాజ్- 7హర్మన్ప్రీత్ కౌర్- 6*చదవండి: IPL 2025: అతడికి రూ. 18 కోట్లు.. గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకునేది వీరినే!That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
స్మృతి సెంచరీ.. కివీస్ను చిత్తు చేసిన భారత్.. సిరీస్ సొంతం
న్యూజిలాండ్తో నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. వైట్ ఫెర్న్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఆఖరి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత శతకంతో రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించింది.మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వుమెన్ టీమ్ భారత్కు వచ్చింది. తొలి వన్డేలో బౌలింగ్ ప్రదర్శనతో పర్యాటక జట్టును 59 పరుగుల తేడాతో ఓడించిన హర్మన్ప్రీత్ సేన.. రెండో వన్డేలో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రాణించిన బ్రూక్ హాలీడేఈ క్రమంలో మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ఇరుజట్లు మూడో వన్డేలో పోటీపడ్డాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. టాపార్డర్లో ఓపెనర్ సుజీ బేట్స్(4), వన్డౌన్ బ్యాటర్ లారెన్ డౌన్(1) విఫలం కాగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లెమ్మర్ 39 రన్స్ చేసింది.దీప్తి శర్మకు మూడు వికెట్లుకెప్టెన్ సోఫీ డివైన్(9) నిరాశపరచగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్రూక్ హాలీడే 96 బంతుల్లో 86 రన్స్తో అదరగొట్టింది. మిగతా వాళ్లలో ఇసబెల్లా గేజ్(25), లీ తుహుము(24 నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఈ క్రమంలో 49.5 ఓవర్లలో న్యూజిలాండ్ 232 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు కూల్చగా.. రేణుకా సింగ్, సైమా ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు. మిగతా నాలుగు వికెట్లు రనౌట్ల ద్వారా వచ్చినవే.సెంచరీతో చెలరేగిన స్మృతిఇక వైట్ ఫెర్న్స్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆరంభంలోనే భారత్కు షాక్ తగిలింది. ఓపెనర్ షఫాలీ వర్మ (12)ను కివీస్ పేసర్ హన్నా రోవ్ అవుట్ చేసింది. అయితే, వన్డౌన్ బ్యాటర్ యస్తికా భాటియా(35)తో కలిసి మరో ఓపెనర్ స్మృతి మంధాన స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. గత రెండు మ్యాచ్లలో పూర్తిగా విఫలమైన(5, 0) ఆమె ఈసారి మాత్రం బ్యాట్ ఝులిపించింది. మొత్తంగా 122 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సరిగ్గా వంద పరుగులు చేసింది. స్మృతి ఇన్నింగ్స్లో 10 ఫోర్లు ఉన్నాయి. హర్మన్ అర్ధ శతకంఇక కెప్టెన్ హర్మన్ సైతం అర్ధ శతకంతో చెలరేగింది. స్మృతి మంధానతో కలిసి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి ఫోర్తో భారత్ను విజయతీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్లో హర్మన్ 61 బంతులు ఎదుర్కొని 55 పరుగులు చేసింది.ఇక జెమీమా రోడ్రిగ్స్ సైతం ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 18 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసింది. ఈ క్రమంలో 44.2 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో వన్డే స్కోర్లు👉న్యూజిలాండ్- 232 (49.5)👉భారత్- 236/4 (44.2)👉ఫలితం- న్యూజిలాండ్పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయంచదవండి: Ind vs NZ: అతడిపై వేటు.. హర్షిత్ రాణా అరంగేట్రం ఫిక్స్!?That HUNDRED Feeling 💯🤗Live - https://t.co/pSVaIW4Deg#INDvNZ | @IDFCFIRSTBank | @mandhana_smriti pic.twitter.com/61zSBcOQ2H— BCCI Women (@BCCIWomen) October 29, 20243rd ODI ✅Series ✅#TeamIndia win the third and final #INDvNZ ODI by 6 wickets and complete a 2-1 series win over New Zealand 👏 Scoreboard ▶️ https://t.co/B6n070iLqu@IDFCFIRSTBank pic.twitter.com/grwAuDS6Qe— BCCI Women (@BCCIWomen) October 29, 2024 -
W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకే ఛాన్స్’
Mithali Raj on Women's T20 World Cup debacle: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో జట్టు వైఫల్యంపై కీలక వ్యాఖ్యలు చేసింది. లీగ్ దశలోనే నిష్క్రమణకు ప్రధాన కారణం గత మూడేళ్లుగా జట్టులో పురోగతే లేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దుబాయ్లో ఉన్న ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్యాటింగ్, ఫీల్డింగ్ వైఫల్యాలపై, క్రికెటర్లలో కొరవడిన పట్టుదలపై తన అభిప్రాయాలను పంచుకుంది.‘ప్రపంచకప్కు సన్నాహంగా ఆడిన ఆసియా కప్లో చిన్న జట్లతో ఆడేటప్పుడు రిజర్వ్ బెంచ్ను పటిష్టం చేసేందుకు వారికి అవకాశాలివ్వాలి. పురుషుల జట్టు చేస్తోంది అదే. మెగా ఈవెంట్లు, పెద్ద టోర్నీలకు ముందు ఈ కసరత్తు చాలా అవసరం. కానీ మన మహిళల జట్టు విషయంలో అలాంటిదేదీ ఉండదు. రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశాలివ్వరు. ఇది జట్టు నిర్మాణానికి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది’ అని వివరించింది.పలు ప్రశ్నలకు మిథాలీ ఇచ్చిన సమాధానాలు... టోర్నీలో టీమిండియా ప్రదర్శనపై మీ విశ్లేషణ? దీనిపై మాట్లాడాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆస్ట్రేలియాతో మ్యాచే గురించే! తప్పక గెలవాల్సిన పోరు అది. ఓ దశలో పటిష్ట స్థితిలో కనిపించినా... మళ్లీ కంగారే. మరో పాత కథే! గత రెండు, మూడేళ్లుగా జట్టు సాధించిన పురోగతి నాకైతే కనపించట్లేదు. గట్టి జట్లను ‘ఢీ’కొట్టేముందు చేసే కసరత్తు, ఆటలో ఎత్తుగడలేవీ మెప్పించడం లేదు. అంతర్జాతీయస్థాయిలో కొన్ని జట్లు క్రమంగా పుంజుకున్నాయి. దక్షిణాఫ్రికానే దానికి సరైన ఉదాహరణ.ఆస్ట్రేలియా కంటే కూడా న్యూజిలాండ్తో ఎదురైనా పరాజయమే భారత్ నిష్క్రమణకు కారణమని భావిస్తున్నారా? ఆశ్చర్యకర విషయం ఏమిటంటే మనం పరిస్థితులకు తగ్గట్లుగా వెంటనే మారకపోవడమే ఆ మ్యాచ్ ఓటమికి కారణం. మందకొడి వికెట్పై వన్డే ప్రపంచకప్లో అయితే ముందు నింపాదిగా ఆడి తర్వాత పుంజుకొని ఆడే సౌలభ్యం వుంటుంది. కానీ టీ20 ఫార్మాట్లో అలాంటి అవకాశం ఉండదు. త్వరితగతిన సందర్భాన్ని బట్టి ఆటతీరు మార్చుకోవాలి. సోఫీ డివైన్ చేసింది అదే. కానీ మనం మాత్రం అలా ఆడలేకపోయాం.తరుచూ బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం వల్ల ఆయా స్థానాల్లో స్పష్టత కొరవడిందా? జెమీమా, హర్మన్ప్రీత్లు తరచూ 3, 4 స్థానాలు మార్చుకోవడం కారణమని నేననుకోను. బ్యాటింగ్లో ఓపెనర్ల శుభారంభమే అత్యంత కీలకం. షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతుందని అందరికీ తెలుసు కానీ అలా జరగలేదు. ఓపెనర్లిద్దరు బాగా ఆడిఉంటే మిడిల్ ఓవర్లలో యథేచ్ఛగా ఆడే అవకాశముంటుంది. మొదట పవర్ ప్లే, ఆఖర్లో డెత్ ఓవర్లు మంచి స్కోరుకు బాట వేస్తాయి. అయితే దురదృష్టవశాత్తూ ఈ టోర్నీలోని కీలక మ్యాచ్ల్లో అలాంటి శుభారంభాలు, చివర్లో దూకుడు కరువయ్యాయి. ఆసియా కప్లో కనిపించిన లోపాలపై దృష్టి పెట్టాల్సింది. కానీ అలా ఏమీ జరగలేదు. ప్రపంచకప్ ముంగిట ఫీల్డింగ్ విభాగంపై దృష్టి సారించకపోవడం పెద్ద తప్పిదమని మీరు అంగీకరిస్తారా? ఈ విషయంలో ఆస్ట్రేలితో జరిగిన మ్యాచ్ నన్ను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ తప్ప 11 మందిలో మిగతా వారంతా మైదానంలో చురుగ్గా కనిపించలేదు. కీలకమైన మ్యాచ్లో ఇద్దరితో కట్టడి ఎలా సాధ్యమవుతుంది. ఫిట్నెస్ అతిముఖ్యం. దీనిపై మనం ఒక బెంచ్మార్క్ను పెట్టుకోవాల్సిందే. నిజాయితీగా అడుగుతున్నా ఏడాదంతా ఎంత మంది మన క్రికెటర్లు ఫిట్నెస్పై శ్రద్ధ పెడుతున్నారో చెప్పగలరా! ఆ శ్రద్ధలేకే మైదానంలో ఫీల్డింగ్ విభాగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. హర్మన్ప్రీత్ 2018 నుంచి కెప్టెన్ ఉన్నా... ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో సారథ్య మార్పు అవసరమా? ఒకవేళ సెలక్టర్లు కెప్టెన్ను మార్చాలనుకుంటే మాత్రం నేను యువ క్రికెటర్కు పగ్గాలివ్వాలని కోరుకుంటాను. సారథ్య మార్పునకు ఇదే సరైన సమయం. ఇంకా ఆలస్యం చేస్తే... మనం ఇంకో ప్రపంచకప్కూ దూరమవుతాం. చేస్తే ఇప్పుడే కొత్త సారథిని ఎంపిక చేయాలి. మరీ ప్రపంచకప్ సమీపంలో చేస్తే ఒరిగే ప్రయోజనం కూడా ఉండదు.స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే..వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అందుబాటులో ఉన్నప్పటికీ 24 ఏళ్ల జెమీమాకు పగ్గాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆమెకు ఎక్కువకాలం సారథిగా కొనసాగే వీలుంటుంది. పైగా మైదానంలో చురుకుదనం, ఫీల్డింగ్లో అందరిలో ఉత్తేజం నింపే శక్తి ఆమెకుంది. ఈ టోర్నీ ఆసాంతం ఆమె కనబరిచిన చురుకుదనం నన్ను బాగా ఆకట్టుకుంది. అలాంటి జెమీమాకు పగ్గాలిస్తే జట్టులో కొత్త ఉత్తేజాన్ని నింపినట్లవుతుంది. చదవండి: W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్ -
T20 WC 2024: శ్రీలంకతో మ్యాచ్.. భారత జట్టుకు గుడ్ న్యూస్
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం దుబాయ్ వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో టీమిండియా తలపడనుంది. తమ సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. భారీ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్ధానానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీలక పోరుకు కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండనుంది. ఆదివారం పాకిస్తాన్ జరిగిన మ్యాచ్లో కౌర్ గాయపడింది. మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో హర్మాన్ మెడకు గాయమైంది. దీంతో ఆమె 29 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగింది.ఆ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా భారత సారథి పాల్గోనలేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్కు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. హర్మాన్ గాయం అంత తీవ్రమైనది కాదని, ఆమె శ్రీలంకతో జరగనున్న మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నట్లు మంధాన తెలిపింది.మరోవైపు స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని, లంకతో మ్యాచ్కూ దూరమయ్యే అవకాశముందని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో పేర్కొంది. పాక్పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. -
అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాం.. మా టార్గెట్ అదే: మంధాన
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన డూ ఆర్డై మ్యాచ్లో పాకిస్తాన్ను 6 వికెట్ల తేడాతో భారత్ మట్టికరిపించింది. దీంతో తమ సెమీస్ ఆశలను భారత జట్టు సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టీమిండియా గ్రూపు-ఎ నుంచి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. అయితే భారత రన్రేట్(-1.217) ఇంకా మైనస్లోనే ఉంది. భారత్ కంటే ముందు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఉన్నాయి.భారీ విజయం సాధించి ఉంటే?అయితే పాక్పై భారత జట్టు భారీ విజయం సాధించి ఉంటే పాయింట్ల పట్టికలో మూడో స్ధానానికి చేరి ఉండేది. కానీ 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు హర్మాన్ సేన తీవ్రంగా చెమటోడ్చింది. ఈ లో టార్గెట్ను ఛేజ్ చేసందుకుందు భారత్ ఏకంగా 18.5 ఓవర్లు తీసుకుంది.దీంతో ఉమెన్ ఇన్ బ్లూ ఖాతాలో రెండు పాయింట్లు చేరినప్పటకి.. రన్రేట్ మాత్రం పెద్దగా మెరుగు పడలేదు. అయితే పాక్పై గెలిచినప్పటకి భారత్ సెమీస్ ఆశలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. అక్టోబర్ 9న దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్లో భారత్ కచ్చితంగా భారీ విజయం సాధించాలి.లంకపై కూడా సాధారణ విజయం సాధిస్తే భారత్ సెమీస్ ఆశలు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. ఒక వేళ అదే జరిగితే భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో చావో రేవో తెల్చుకోవాల్సిందే. అయితే మంగళవారం ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధిస్తే భారత్కు కొంత ఉపశమనం కలుగుతుంది.అందుకే స్లోగా బ్యాటింగ్ చేశాంఇక పాక్పై తమ బ్యాటింగ్ విధాన్ని భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సమర్థించింది. నేను, షఫాలీ బాల్ను సరిగ్గా టైం చేయలేకపోయాము. పిచ్ కాస్త స్లోగా ఉంది. మేము ఎక్కువగా వికెట్లు కోల్పోవాలని అనుకోలేదు. అందుకే స్లోగా ఆడాము. నెట్ రన్రేట్ కూడా మా ఆలోచనలో ఉంది. తర్వాతి మ్యాచ్ల్లో మేము మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాము. సెమీస్కు ఆర్హతసాధించడమే మా లక్ష్యం" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేషన్లో మంధాన పేర్కొంది. కాగా ఈ మ్యాచ్లో మంధాన కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది. -
భారత మహిళ క్రికెటర్లను సర్ప్రైజ్ చేసిన రానా దగ్గుబాటి (ఫొటోలు)
-
BBL: ధరలో స్మృతిని మించిపోయిన జెమీమా, దీప్తి, శిఖా (ఫొటోలు)
-
WBBL: స్మృతి కంటే జెమీమా, దీప్తి, శిఖాలకే ఎక్కువ ధర!
Womens Big Bash League Draft- మెల్బోర్న్: భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా ఆరుగురు భారత క్రికెటర్లు మహిళల బిగ్బాష్ టి20 లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో మెరిపించనున్నారు. ఓపెనర్ స్మృతి, ఆల్రౌండర్ శిఖా పాండే, టాపార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్లు ఇది వరకే ఈ లీగ్లో ఆడారు. అయితే కొత్తగా ఆల్రౌండర్ దయాళన్ హేమలత, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తిక భాటియాలకు తొలిసారిగా బిగ్బాష్ చాన్స్ లభించింది. కానీ భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను మాత్రం లీగ్ ఫ్రాంచైజీలు పక్కన బెట్టాయి.‘ప్లాటినమ్’ కేటగిరీలో జెమీమా, దీప్తిగతంలో మెల్బోర్న్ రెనిగేడ్స్, సిడ్నీ థండర్లకు ఆడిన అనుభవమున్న సీనియర్ బ్యాటర్పై ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఏ ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. హిట్టింగ్తో ఆదరగొట్టే బ్యాటర్ జెమీమాకు బ్రిస్బేన్ హీట్ ‘ప్లాటినమ్’ ఎంపిక ద్వారా పెద్దపీట వేసింది. ఐపీఎల్లో టాప్ 1, 2, 3 రిటెన్షన్ పాలసీలా డబ్ల్యూబీబీఎల్లో ప్లాటినమ్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ కేటగిరీలుంటాయి.మరో భారత ఆల్రౌండర్ దీప్తి శర్మకు మెల్బోర్న్ స్టార్స్ ‘ప్లాటినమ్’ కేటగిరీలో ఎంపిక చేసుకుంది. ఈ కేటగిరీలోకి ఎంపికైన క్రికెటర్లకు రూ. 62.41 లక్షలు (లక్షా 10 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు మొత్తంగా లభిస్తుంది. శిఖా పాండేకు రూ. 51 లక్షలు‘గోల్డ్’ కేటగిరీలో బ్రిస్బేన్ హీట్కు ఎంపికైన శిఖా పాండేకు రూ. 51 లక్షలు (90 వేల ఆసీస్ డాలర్లు), అడిలైడ్ స్ట్రయికర్స్కు స్మృతి మంధాన, పెర్త్ స్కార్చర్స్కు హేమలత, మెల్బోర్న్ స్టార్స్కు యస్తిక భాటియా సిల్వర్ కేటగిరీలో ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి రూ. 36.88 లక్షలు (65 వేల ఆసీస్ డాలర్లు) కాంట్రాక్టు ఫీజుగా లభిస్తుంది. ఈ సీజన్ మహిళల బిగ్బాష్ లీగ్ వచ్చే నెల 27న అడిలైడ్లో మొదలవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అడిలైడ్ స్ట్రయికర్స్తో బ్రిస్బేన్ హీట్ జట్టు తలపడుతుంది. -
స్మృతి కోసం చాలా ట్రై చేశాం.. ఎట్టకేలకు మా జట్టులో!(ఫొటోలు)
-
అడిలైడ్ స్ట్రయికర్స్తో జతకట్టిన మంధన.. బిగ్బాష్ లీగ్ డ్రాఫ్ట్లో 19 మంది భారత ప్లేయర్లు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన మహిళల బిగ్బాష్ లీగ్ సీజన్-10లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అడిలైడ్ స్ట్రయికర్స్తో జతకట్టనుంది. స్మృతి డబ్ల్యూబీబీఎల్ ప్రీ డ్రాఫ్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసిన తొలి ఓవర్సీస్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. మంధన గతంలో బ్రిస్బేన్ హీట్ (2016-17), హోబర్ట్ హరికేన్స్ (2018-19), సిడ్నీ థండర్ (2021) ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా మంధన 2022, 2023 ఎడిషన్లలో పాల్గొనలేదు. అడిలైడ్ స్ట్రయికర్స్లో మంధన ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్తో కలిసి పని చేయనుంది. లూక్ అడిలైడ్ స్ట్రయికర్స్కు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. మహిళల బిగ్బాష్ లీగ్ 2024 ఎడిషన్ అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానుంది.డ్రాఫ్ట్లో 19 మంది భారత ప్లేయర్లు..మహిళల బిగ్బాష్ లీగ్ ప్లేయర్స్ డ్రాఫ్ట్లో 19 మంది భారత క్రికెటర్లు పాల్గొననున్నారు. ప్లేయర్ల డ్రాఫ్ట్ వచ్చే ఆదివారం జరుగనుంది. డ్రాఫ్ట్లో పాల్గొంటున్న భారత స్టార్ ప్లేయర్లలో హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెజ్, దీప్తి శర్మ ముఖ్యులు. వీరితో పాటు శ్రేయాంక పాటిల్, టైటాస్ సాధు, ఆశా శోభన, రాధా యాదవ్, అమన్జోత్ కౌర్, యస్తికా భాటియా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలత దయాలన్, సంజన సంజీవన్, మన్నత్ కశ్యప్, మేఘన సబ్బినేని, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, మేఘన సింగ్ డ్రాఫ్ట్లో పాల్గొంటున్నారు. -
మూడో ర్యాంక్లో స్మృతి మంధాన
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్ లో స్మృతి 738 రేటింగ్ పాయింట్లతో మూడో ర్యాంక్కు చేరుకుంది. భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 648 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. దీప్తి శర్మ 20వ ర్యాంక్లో, జెమీమా 33వ ర్యాంక్లో ఉన్నారు. ఇంగ్లండ్కు చెందిన నటాలీ సివెర్ బ్రంట్ 783 పాయింట్లతో తన టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది. -
'మెరుపు తీగ' మంధన.. కళ్లు చెదిరే రనౌట్
మహిళల హండ్రెడ్ లీగ్లో సథరన్ బ్రేవ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రీతిలో ఓ అద్భుతమైన రనౌట్ చేసింది. ట్రెంట్ రాకెట్స్తో నిన్న (ఆగస్ట్ 10) జరిగిన మ్యాచ్లో మంధన.. బ్రైవోని స్మిత్ను డైరెక్ట్ త్రోతో పెవిలియన్ బాట పట్టించింది. మంధన మెరుపు విన్యాసానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరవలవుతంది. ఇన్నింగ్స్ తొలి బంతికే మంధన స్మిత్ను పెవిలియన్కు పంపడం విశేషం.A direct hit by Smriti Mandhana! 🎯pic.twitter.com/FIlRG1Jo4g— CricTracker (@Cricketracker) August 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రాకెట్స్ ఇన్నింగ్స్లో గ్రేస్ స్క్రీవెన్స్ (36) ఓ మోస్తరు పరుగులు చేయగా.. నటాషా (12), గార్డ్నర్ (18), హీథర్ గ్రహం (15) రెండంకెల స్కోర్లు చేశారు. సథరన్ బ్రేవ్ బౌలర్లలో లారెన్ బెల్ 3, లారెన్ చియాటిల్, ఆడమ్స్, క్లో టైరాన్ తలో వికెట్ పడగొట్టారు.156 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధన (27 బంతుల్లో 42; 7 ఫోర్లు), క్లో టైరాన్ (31 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ జార్జియా ఆడమ్స్ 29 బంతులు ఎదుర్కొని 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాకెట్స్ బౌలర్లలో స్టోన్హౌస్ 2, ఆష్లే గార్డ్నర్, హీథర్ గ్రహం తలో వికెట్ పడగొట్టారు. -
Asia Cup Final: రాణించిన స్మృతి.. చెలరేగిన జెమీమా, రిచా ఘోష్
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో టీమిండియా ఓ మోస్తరు స్కోర్ చేసింది. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్మృతి మంధన (47 బంతుల్లో 60; 10 ఫోర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగ్స్ (16 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (14 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగి ఆడారు. షఫాలీ వర్మ (16), ఉమా చత్రీ (9), హర్మన్ప్రీత్ కౌర్ (11) తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. పూజా వస్త్రాకర్ 5, రాధా యాదవ్ ఒక్క పరుగుతో అజేయంగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హరి 2, ప్రబోధిని, సచిని నిసంసల, చమారి అటపట్టు తలో వికెట్ పడగొట్టారు. తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
భారీ విజయంతో ఫైనల్లోకి భారత్
దంబుల్లా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో... భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో సంపూర్ణ ఆధిపత్యంతో నాకౌట్కు చేరిన టీమిండియా... శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. మహిళల ఆసియాకప్లో భారత జట్టు తుదిపోరుకు చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఐదుసార్లూ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (32), షోర్ణా అక్తర్ (19 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక, రాధ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (26 నాటౌట్) రాణించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. రేణుక అదుర్స్ మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ దిలారా అక్తర్ (6)ను అవుట్ చేసిన రేణుక, తన తదుపరి ఓవర్లో ఇస్మా (8)ను పెవిలియన్కు పంపించింది. ఆరో ఓవర్లో ముర్షిదా ఖాతూన్ (4) కూడా వెనుదిరిగింది. దీంతో పవర్ప్లే ముగిసేసరికి బంగ్లా 25/3తో నిలిచింది. ఈ మూడు వికెట్లు రేణుక ఖాతాలోకే వెళ్లాయి. ఇక అక్కడి నుంచి బంగ్లా మహిళల జట్టు కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరే చేసింది. ఇద్దరే కొట్టేశారు స్వల్ప లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. స్మృతి, షఫాలీ విజృంభణతో 11 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది. భారత అమ్మాయిలు అదరగొట్టిన చోట బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్మృతి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న మంధాన .. నాకౌట్ మ్యాచ్ల్లో నాలుగో హాఫ్ సెంచరీ తన పేరిట లిఖించుకుంది. అలాగే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానానికి చేరింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా అక్తర్ (సి) ఉమ (బి) రేణుక 6; ముర్షిదా ఖాతూన్ (సి) షఫాలీ (బి) రేణుక 4; ఇస్మా తన్జీమ్ (సి) తనూజ (బి) రేణుక 8; నిగార్ సుల్తానా (సి) దీప్తి (బి) రాధ 32; రుమానా (బి) రాధ 1; రాబియా ఖాన్ (సి) షఫాలీ (బి) పూజ 1; రీతు మోనీ (స్టంప్డ్) రిచా (బి) దీప్తి 5; షోర్ణా (నాటౌట్) 19; నహిద (బి) రాధ 0; మారుఫా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–21, 4–30, 5–33, 6–44, 7–80, 8–80. బౌలింగ్: రేణుక 4–1–10–3, పూజ 4–0–25–1, తనూజ 4–0–16–0, దీప్తి 4–0–14–1, రాధ 4–1–14–3. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 26; స్మృతి (నాటౌట్) 55; ఎక్స్ట్రాలు 2; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 83. బౌలింగ్: మారుఫా 2–0– 17–0, నహిద 3–0–34–0, జహనారా ఆలమ్ 3–0–17–0, రాబియా ఖాన్ 2–0–10–0, రుమానా అహ్మద్ 1–0–5–0.9 మహిళల ఆసియాకప్లో (వన్డే, టి20 ఫార్మాట్ కలిపి) భారత జట్టు ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి. ఇందులో ఏడుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. 2018లో రన్నరప్గా నిలిచింది.1 టి20 క్రికెట్లో రెండుసార్లు 20వ ఓవర్ మెయిడెన్ వేసిన తొలి బౌలర్గా రాధ యాదవ్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్గా పురుషుల క్రికెట్లో ఎనిమిది మంది, మహిళల క్రికెట్లో తొమ్మిది మంది బౌలర్లు ఇన్నింగ్స్ చివరి ఓవర్ను మెయిడెన్ చేశారు.3 టి20ల్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇటీవల దక్షిణాఫ్రికాపై 85 పరుగుల లక్ష్యాన్ని అజేయంగా ఛేదించిన భారత్.. 2019లో వెస్టిండీస్పై 104 పరుగుల టార్గెట్ను వికెట్ కోల్పోకుండా అధిగమించింది.2 మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3433) రెండోస్థానానికి దూసుకెళ్లింది. సూజీ బేట్స్ (4348; న్యూజిలాండ్) టాప్ ర్యాంక్లో ఉంది. -
ఫైనల్లో టీమిండియా
మహిళల ఆసియా టీ20 కప్-2024లో టీమిండియా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అజేయంగా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ సేన.. సెమీ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించింది. డంబుల్లా వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. పది వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్కు దూసుకువెళ్లింది.వుమెన్స్ ఆసియా కప్-2024 టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా జట్లు పోటీపడ్డాయి. గ్రూప్-ఏ టాపర్గా భారత్ నిలవగా.. రెండో స్థానంలో పాకిస్తాన్ ఉంది.గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ తొలి రెండుస్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి సెమీ ఫైనల్ జరిగింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ఆది నుంచే విరుచుకుపడ్డారు.చెలరేగిన భారత బౌలర్లుపేసర్ రేణుకా సింగ్ టాపార్డర్ను కకావికలం చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు దిలారా అక్తర్(6), ముర్షీదా ఖతూన్(4), వన్డౌన్ బ్యాటర్ ఇష్మా తంజీమ్(8)కు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేసింది. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ నిగర్ సుల్తానా కెప్టెన్ ఇన్నింగ్స్తో రాణించింది. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 32 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. భారత స్పిన్నర్ రాధా యాదవ్ నిగర్ను బోల్తా కొట్టించడంతో బంగ్లా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లోయర్ ఆర్డర్లో ష్రోనా అక్తర్ 19 పరుగులతో కాసేపు పోరాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 80 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్ మూడు చొప్పున వికెట్లు కూల్చగా.. పేసర్ పూజా వస్త్రాకర్, స్పిన్నర్ దీప్తి శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు.ఓపెనర్లే పూర్తి చేశారుస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆడుతూ పాడుతూ పని పూర్తి చేసింది. ఓపెనర్లలో స్మృతి మంధాన అర్ధ శతకంతో చెలరేగగా.. షఫాలీ వర్మ సైతం రాణించింది.స్మృతి 39 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులు.. షఫాలీ 28 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 11 ఓవర్లలో 83 పరుగులు చేసిన టీమిండియా.. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్లోశ్రీలంక- పాకిస్తాన్ తలపడనున్నాయి.చదవండి: IND vs SL: గంభీర్ కొత్త ప్రయోగం.. స్పిన్నర్గా మారిన హార్దిక్ పాండ్యా -
టీమిండియా కెప్టెన్కు విశ్రాంతి.. కారణం?
వుమెన్స్ ఆసియా టీ20 కప్-2024లో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన తొలి రెండు మ్యాచ్లలో భారీ విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో నేపాల్తో మంగళవారం నాటి మ్యాచ్లో మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్తో పాటు ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్కు విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టింది. హర్మన్, పూజా స్థానాల్లో బ్యాటింగ్ ఆల్రౌండర్ ఎస్.సజన, ఫాస్ట్ బౌలర్ అరుంధతిరెడ్డి తుదిజట్టులో స్థానం దక్కించుకున్నట్లు తెలిపింది.డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ షెఫాలీ వర్మ పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 19 బంతులు ఎదుర్కొని 32 పరుగులు సాధించింది.మరో ఓపెనర్ దయాలన్ హేమలత 17 బంతుల్లో 15 రన్స్ చేసింది. ఈ క్రమంలో ఆరు ఓవర్లు(పవర్ ప్లే) పూర్తయ్యేసరికి టీమిండియా హాఫ్ సెంచరీ మార్కు అందుకుంది. యాభై పరుగులు పూర్తి చేసుకుంది.ఇండియా వుమెన్ వర్సెస్ నేపాల్ వుమెన్ తుదిజట్లుభారత్షెఫాలీ వర్మ, స్మృతి మంధాన (కెప్టెన్), దయాలన్ హేమలత, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, ఎస్ సజానా, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్, అరుంధతి రెడ్డి.నేపాల్సంఝనా ఖడ్కా, సీతా రాణా మగర్, కబితా కున్వర్, ఇందు బర్మా (కెప్టెన్), డాలీ భట్టా, రుబీనా ఛెత్రి, పూజా మహతో, కబితా జోషి, కాజల్ శ్రేష్ఠ (వికెట్ కీపర్), సబ్నమ్ రాయ్, బిందు రావల్.గ్రూప్-ఏ పాయింట్ల పట్టిక ఇలాఆసియా కప్-2024లో గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. భారత్ ఇప్పటి వరకు పాకిస్తాన్, యూఏఈలపై గెలిచి టాపర్(నెట్ రన్రేటు +3.298)గా ఉంది.ఇక తొలి మ్యాచ్లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. తర్వాత నేపాల్, యూఏఈలపై విజయం సాధించింది. తద్వారా మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్రేటు + 1.158)లో కొనసాగుతోంది.ఇక శ్రీలంక, థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. శ్రీలంక, థాయ్లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.నేపాల్తో భారత్ మ్యాచ్ ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారుకానున్నాయి. -
మంచి మనసు చాటుకున్న స్మృతి మంధాన.. వీడియో
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన గొప్ప మనసు చాటుకుంది. తన చిన్నారి అభిమానిని సంతోష పెట్టేందుకు బహుమతినిచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీలంక క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వుమెన్స్ ఆసియా టీ20 కప్ ఆడేందుకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకకు వెళ్లిన విషయం తెలిసిందే.శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసి తొలి మ్యాచ్లోనే గెలుపు నమోదు చేసింది.పాక్ను చిత్తు చేసిన భారత్పాకిస్తాన్ విధించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ(29 బంతుల్లో 40), స్మృతి మంధాన (31 బంతుల్లో 45) రాణించారు.ఇక పాక్ను 108 పరుగులకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించిన భారత స్పిన్ బౌలర్ దీప్తి శర్మ(3/20)కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.స్పెషల్ ఫ్యాన్ఇదిలా ఉంటే.. డంబుల్లా వేదికగా జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ను చూసేందుకు ఓ ‘ప్రత్యేకమైన’ చిన్నారి స్టేడియానికి వచ్చింది. ఆమె పేరు ఆదీషా హెరాత్.ఆదీషాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే భారత క్రికెటర్ స్మృతి మంధాన అంటే మరీ ఇష్టం. అందుకే తన అభిమాన ప్లేయర్ను కలుసుకునేందుకు ఆదీషా తల్లి సాయంతో మ్యాచ్ వేదిక వద్దకు వచ్చింది.స్పెషల్ ఏబుల్డ్ చైల్డ్ అయినా ఆదీషాను తన తల్లి వీల్చైర్లో తీసుకువచ్చారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం స్మృతి మంధాన ఆదీషా దగ్గరికి వెళ్లి పలకరించింది. అంతేకాదు తనకు మొబైల్ ఫోన్ను బహుమతిగా అందించింది.సంతోషంగా ఉందిఈ విషయంపై స్పందించిన ఆదీషా తల్లి మాట్లాడుతూ.. ‘‘అనుకోకుండా ఇక్కడికి వచ్చాం. మ్యాచ్ కచ్చితంగా చూడాలంటూ నా కూతురు పట్టుబట్టింది. భారత జట్టు క్రికెటర్ మంధానను కలిశాం.ఆమె నా కూతురికి ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. తనలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి బహుమతి మేము అస్సలు ఊహించలేదు. నిజంగా ఈ విషయంలో నా కూతురు అదృష్టవంతురాలే’’ అని హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా భారత్ తదుపరి ఆదివారం నాటి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో తలపడనుంది.చదవండి: IND Vs SL: సెంచరీలు చేసినా పట్టించుకోరా?.. నాకైతే అర్థం కావడం లేదుAdeesha Herath's love for cricket brought her to the stadium, despite all the challenges. The highlight of her day? A surprise encounter with her favorite cricketer, Smriti Mandhana, who handed her a mobile phone as a token of appreciation 🥺𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐬 𝐥𝐢𝐤𝐞 𝐭𝐡𝐞𝐬𝐞… pic.twitter.com/iqgL2RNE9v— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 20, 2024 -
లేడీ కోహ్లి.. ఆర్సీబీకి టైటిల్ అందించిన క్వీన్ (ఫొటోలు)
-
స్మృతి మంధాన ఐదో ర్యాంక్ యథాతథం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. తాజా ర్యాంకింగ్స్లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 729 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంక్లో కొనసాగుతోంది. భారత కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ మూడు స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్లో.. షఫాలీ వర్మ రెండు స్థానాలు పురోగతి సాధించి 15వ ర్యాంక్లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ 738 పాయింట్లతో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. రాధా యాదవ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్కు చేరుకుంది. -
T20I: టీమిండియా ఘన విజయం.. ఇలా ఇది మూడోసారి
India Women vs South Africa Women, 3rd T20I: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను 1–1తో సమంగా ముగించింది. చెన్నై వేదికగా మంగళవారం జరిగిన చివరిదైన మూడో టీ20 మ్యాచ్లో.. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా.. 10 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది.తొలి టీ20లో దక్షిణాఫ్రికా నెగ్గగా... రెండో టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇక 2006 నుంచి ఇప్పటి వరకు 187 టీ20 మ్యాచ్లు ఆడిన భారత జట్టుకిది 100వ విజయం కావడం విశేషం. ప్రత్యర్థి జట్టుపై టీమిండియా 10 వికెట్లతో నెగ్గడం ఇది మూడోసారి.ఈ మ్యాచ్ కంటే ముందు భారత జట్టు 2016లో ఆస్ట్రేలియాపై, 2019లో వెస్టిండీస్పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. సిరీస్ను సమం చేయాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో టాస్ నెగ్గిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది.పూజ వస్త్రకర్కు 4 వికెట్లుభారత పేస్ బౌలర్ పూజా వస్త్రకర్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు, స్పిన్నర్ రాధా యాదవ్ 6 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశారు. అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.అనంతరం 85 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. 10.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 88 పరుగులు చేసి టీమిండియా గెలిచింది. Series Levelled ✅#TeamIndia and @ProteasWomenCSA share the honours in the T20I series. 🤝 🏆#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/RS3yCOjH2Q— BCCI Women (@BCCIWomen) July 9, 2024 స్మృతి మంధాన (40 బంతుల్లో 54 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా... షఫాలీ వర్మ (25 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) కూడా రాణించింది. పూజా వస్త్రకర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. A clinical 🔟-wicket win in the 3rd T20I 🥳The @IDFCFIRSTBank #INDvSA series is drawn 1⃣-1⃣Scorecard ▶️ https://t.co/NpEloo6GAm#TeamIndia pic.twitter.com/f1wcGPWWKo— BCCI Women (@BCCIWomen) July 9, 2024 -
టీ20లో భారత్ ఘనవిజయం (ఫొటోలు)
-
స్మృతి మంధాన మనసులో చోటు దక్కించుకున్న వ్యక్తి ఇతడే..(ఫొటోలు)
-
గుడ్న్యూస్ చెప్పిన స్మృతి మంధాన.. ఇతడే..
భారత మహిళా క్రికెట్ జట్టు సూపర్ స్టార్ స్మృతి మంధాన అభిమానులకు శుభవార్త అందించింది. తన మనసులో చోటు దక్కించుకున్న ప్రత్యేకమైన వ్యక్తి ఇతడేనంటూ సంకేతాలు ఇచ్చింది.అనుబంధానికి ఐదేళ్లుసంగీతకారుడు, ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్తో తన అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించింది. స్మృతితో కలిసి కేక్ కట్ చేసిన పలాష్.. ‘‘ఐదు’’ అంటూ హార్ట్ ఎమోజీ జత చేశాడు. తమ ప్రేమ బంధానికి ఐదు వసంతాలు నిండాయన్న అర్థంలో క్యాప్షన్ జతచేశాడు.మీ జంట సూపర్ అంటూఇందుకు స్పందనగా.. స్మృతి మంధాన లవ్ సింబల్స్తో తన సంతోషాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో మీ జంట సూపర్ అంటూ సెలబ్రిటీలు రుబీనా దిలాయక్, పార్థ్ సమర్థన్ సహా అభిమానులు స్మృతి- పలాష్లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక పలాష్ సోదరి పాలక్ సైతం వీరి బంధాన్ని ధ్రువీకరించేలా కామెంట్ చేయడం గమనార్హం. కాగా భారత టీ20 జట్టు కెప్టెన్ స్మృతి మంధాన 1996 జూలై 18న ముంబైలో జన్మించింది. తొమ్మిదేళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టిన ఈ లెఫ్టాండర్.. 2014లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చింది.భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగి మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్న మంధాన.. ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకుంది.అంతేకాదు వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక ధర(రూ. 3 కోట్ల 40 లక్షలు)కు అమ్ముడుపోయిన క్రికెటర్గా మంధాన చరిత్ర సృష్టించింది. తాజా డబ్యూపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విజేతగా నిలిపి కెప్టెన్గా నీరాజనాలు అందుకుంది.ఎవరీ పలాష్ ముచ్చల్?ఇక మంధాన వ్యక్తిగత జీవితానికి వస్తే.. 29 ఏళ్ల మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్తో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ సోదరుడే పలాష్.సూపర్ స్టార్లు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ సినిమాల్లో పాలక్ పాడగా.. మ్యూజిక్ కంపోజర్గా పలాష్ అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. టీ- సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీ, పాల్ మ్యూజిక్ వంటి కంపెనీలతో మమేకమై 40కి పైగా మ్యూజిక్ వీడియోలు చేశాడు.అంతేకాదు.. అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే నటించిన ఖేలే హమ్ జీ జాన్ సే చిత్రంలోనూ పలాష్ కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా వెబ్ సిరీస్ డైరెక్టర్గానూ పేరు తెచ్చుకున్నాడు పలాష్ ముచ్చల్. View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) View this post on Instagram A post shared by Palaash Muchhal (@palash_muchhal) -
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శించుకున్న స్టార్ క్రికెటర్ స్మృతి మందాన (ఫొటోలు)
-
భారత మహిళా క్రికెటర్లా మజాకా!..జూలు విదిల్చిన శివంగులు (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్గా ఉండింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..భారత్- 603/6ఆస్ట్రేలియా- 575/9ఆస్ట్రేలియా- 569/6ఆస్ట్రేలియా- 525న్యూజిలాండ్- 517/8కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.భారత ఇన్నింగ్స్లో మరిన్ని హైలైట్స్..2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది.292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. -
షఫాలీ విశ్వరూపం
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది. ఈ మ్యాచ్ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్ప్రీత్ బృందం సఫారీపై సూపర్గా ఆడింది. చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది. పరుగు... ప్రవాహమైందిలా! టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్కు సంబంధించిన వెబ్సైట్లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది. 194 బంతుల్లో ‘ద్విశతకం’ ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. 73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450. బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది. 2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది. 292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. 525 టెస్టు క్రికెట్లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.చరిత్ర సృష్టించిన టీమిండియా..ఇక ఈ మ్యాచ్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.అంతకుముందు 2002లో బంగ్లాదేశ్పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. -
సౌతాఫ్రికాతో మ్యాచ్.. టీమిండియా ఓపెనర్ల సెంచరీలు
మహిళల క్రికెట్లో భాగంగా సౌతాఫ్రికా వుమన్స్ టీమ్తో ఇవాళ (జూన్ 28) మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్లు స్మృతి మంధన (149), షఫాలీ వర్మ (165) సెంచరీల మోత మోగించారు. స్మృతి. షఫాలీ సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. స్మృతి, శుభ సతీష్ (15) ఔట్ కాగా.. షఫాలీ, జెమీమా రోడ్రిగెజ్ (1) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో డి క్లెర్క్, డెల్మి టక్కర్ తలో వికెట్ పడగొట్టారు.భీకర ఫామ్లో స్మృతి..సౌతాఫ్రికాతో సిరీస్లలో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరివీర భయంకర ఫామ్లో ఉంది. వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు, ఓ 90 ప్లస్ స్కోర్ చేసిన మంధన.. తాజాగా టెస్ట్ల్లో సెంచరీ చేసింది. మంధనకు టెస్ట్ల్లో ఇది రెండో సెంచరీ. స్మృతితో పాటు సెంచరీ చేసిన షఫాలీ వర్మకు టెస్ట్ల్లో ఇది తొలి సెంచరీ.మ్యాచ్ హైలైట్స్..టెస్ట్ల్లో స్మృతి మంధనకు రెండో సెంచరీ (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా)టెస్ట్ల్లో షఫాలీ వర్మకు తొలి సెంచరీప్రస్తుత భారత మహిళల క్రికెటర్లలో స్మృతి మంధనవే అత్యధిక సెంచరీలు (2)మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు)భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున అత్యధిక భాగస్వామ్యం (స్మృతి, షఫాలీ-292 పరుగులు) -
హ్యాట్రిక్ సెంచరీలు మిస్ అయిన టీమిండియా వైస్ కెప్టెన్.. అయినా రికార్డే..!
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 23) జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. Smriti Mandhana smashed 3rd consecutive fifty plus score. 💯pic.twitter.com/mjYpYckhy6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024హ్యాట్రిక్ సెంచరీలు మిస్ఈ మ్యాచ్లో 90 పరుగుల వద్ద ఔటైన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన హ్యాట్రిక్ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈ సిరీస్ మొత్తంలో (3 మ్యాచ్ల్లో) 343 పరుగులు (117. 136, 90) చేసిన స్మృతి.. మహిళల మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేసుంటే, హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కేది.మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ లారా వొల్వార్డ్ట్ (61) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ ఓ మోస్తరు స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో తంజిమ్ బ్రిట్స్ (38), డి క్లెర్క్ (26), డి రిడ్డర్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దీప్తి శర్మ (10-0-27-2) దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా.. అరుంధతి రెడ్డి 2, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు.నామమాత్రపు లక్ష్య ఛేదనలో భారత్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో మంధనతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ (42) రాణించగా.. షఫాలీ వర్మ (25), ప్రియా పూనియా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, తుమి సెకుఖునే, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు. -
చరిత్రపుటల్లోకెక్కిన ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్
మహిళల క్రికెట్లో భాగంగా నిన్న (జూన్ 19) జరిగిన భారత్-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ చరిత్రపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్లో ఏకంగా నలుగురు బ్యాటర్లు సెంచరీల మోత మోగించారు. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో తొలుత భారత బ్యాటర్లు స్మృతి మంధన (136), హర్మన్ప్రీత్ కౌర్ (103 నాటౌట్) శతక్కొట్టగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా ప్లేయర్లు లారా వాల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజన్ కాప్ (114) సెంచరీలతో విరుచుకుపడ్డారు.మ్యాచ్ విషయానికొస్తే.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓటమిపాలైంది. లారా వోల్వార్డ్ట్, మారిజన్ కాప్ సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. పూజా వస్త్రాకర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఫలితంగా భారత్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్ చేయగా.. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 321 పరుగులకు పరిమితమైంది. ఈ సిరీస్లో నామమాత్రపు మూడో వన్డే జూన్ 23న జరుగనుంది. -
అటు హర్మన్...ఇటు స్మృతి
బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ సమరంలో రికార్డులు హోరెత్తాయి. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారి హోరాహోరీగా సాగిన మ్యాచ్లో చివరకు భారత్దే పైచేయి అయింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 పరుగుల స్వల్ప తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డేల్లో భారత్కు ఇది మూడో అత్యధిక స్కోరు. కెప్టెన్, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు సెంచరీ సాధించగా, స్మృతి మంధాన (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్స్లు) వరుసగా రెండో వన్డేలోనూ శతకంతో చెలరేగింది.అనంతరం సఫారీ టీమ్ చివరి వరకు పోరాడి ఓడింది. 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 6 వికెట్లకు 321 పరుగులు సాధించింది. కెపె్టన్ లారా వోల్వార్ట్ (135 బంతుల్లో 135 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్లు), మరిజాన్ కాప్ (94 బంతుల్లో 114; 11 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీలు సాధించారు. పూజ వస్త్రకర్ వేసిన ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి 2 బంతుల్లో 5 పరుగులు వచ్చాయి. అయితే తర్వాతి 2 బంతులకు 2 వికెట్లు పడ్డాయి. ఆఖరి 2 బంతుల్లో 1 బై మాత్రమే వచ్చింది. సిరీస్ను 2–0తో భారత్ సొంతం చేసుకోగా, మూడో వన్డే ఆదివారం జరుగుతుంది. 4 మహిళల వన్డేలో నలుగురు బ్యాటర్లు సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. 646 ఇరు జట్లు కలిపి చేసిన పరుగులు. ఇది రెండో అత్యధికం. గతంలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్లో 678 పరుగులు నమోదయ్యాయి 7 వన్డేల్లో ఏడో సెంచరీ సాధించిన స్మృతి...భారత్ తరఫున మిథాలీ రాజ్ (7)ని సమం చేసింది. హైదరాబాద్కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసింది. భారత్ తరఫున ఆమె ఇప్పటికే 26 టి20లు ఆడింది. -
సుడిగాలి శతకంతో విరుచుకుపడిన టీమిండియా సారధి
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్లో (మహిళలు) టీమిండియా బ్యాటర్లు పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ స్మృతి మంధన, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. ఇవాళ (జూన్ 19) జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక్కొట్టింది (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు).సుడిగాలి శతకంతో విరుచుకుపడిన హర్మన్ఈ మ్యాచ్లో వైస్ కెప్టెన్ మంధన మెరుపు శతకంతో విరుచుకుపడితే.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సుడిగాలి సెంచరీతో (88 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అలరించింది. కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్లో మంధన, హర్మన్ సెంచరీలతో విజృంభించగా.. షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24), రిచా ఘోష్ (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లాస్ ఓ వికెట్ పడగొట్టారు.CAPTAIN HARMANPREET KAUR COMPLETED HUNDRED WITH 4,6,4 🥶 pic.twitter.com/y26g5HRhDK— Johns. (@CricCrazyJohns) June 19, 2024చివరి ఓవర్లో సెంచరీ పూర్తి చేసుకున్న హర్మన్49వ ఓవర్ 2వ బంతి ఎదుర్కొనే సమయానికి 85 బంతుల్లో 88 పరుగులు చేసిన హర్మన్ ఆ తర్వాత మూడు బంతులను వరుసగా 4, 6, 4 బాది సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో హర్మన్కు ఇది 6వ సెంచరీ. టీమిండియా తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో హర్మన్ మూడో స్థానంలో నిలిచింది. ఇదే మ్యాచ్లో సెంచరీ చేసిన మంధన భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ రికార్డును (7) సమం చేసింది. -
వరుసగా రెండో మ్యాచ్లో శతక్కొట్టిన మంధన.. మిథాలీ రాజ్ రికార్డు సమం
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన వరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు సాధించి, పలు రికార్డులు బద్దలు కొట్టింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మంధన తొలి రెండు వన్డేల్లో శతక్కొట్టి, అరుదైన రికార్డులు నెలకొల్పింది.బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. తాజాగా అదే బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ మెరుపు సెంచరీతో (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిసింది.SMRITI MANDHANA - THE QUEEN. 👑 pic.twitter.com/jsadqWhYlr— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2024మంధన మెరుపు శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికాతో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మంధనతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (87 నాటౌట్) కూడా చెలరేగి ఆడుతుండటంతో 48 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 3 వికెట్ల నష్టానికి 302గా ఉంది. భారత ఇన్నింగ్స్లో మంధన, షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24) ఔట్ కాగా.. హర్మన్కు జతగా రిచా ఘెష్ (18) క్రీజ్లో ఉంది.తొలి భారత క్రికెటర్గా రికార్డువరుసగా రెండు మ్యాచ్ల్లో సెంచరీలు చేయడంతో మంధన ఖాతాలో పలు రికార్డులు చేరాయి. మహిళల వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్గా మంధన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో సెంచరీతో మంధన మరో రికార్డును సమం చేసింది. భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ, మంధన ఇద్దరు వన్డేల్లో 7 సెంచరీలు చేశారు. మంధన 7 వన్డే సెంచరీలను కేవలం 84 ఇన్నింగ్స్ల్లో చేస్తే.. మిథాలీ రాజ్కు 7 సెంచరీలు సాధించేందుకు 211 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. -
మూడో ర్యాంక్లో స్మృతి మంధాన (ఫొటోలు)
-
టీమిండియా వైస్ కెప్టెన్ అరుదైన ఘనత.. ఏకైక ఆసియా క్రికెటర్గా రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో టాప్-5లో చోటు దక్కించుకున్న ఏకైక ఆసియా క్రికెటర్గా రికార్డు నెలకొల్పింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో మంధన మూడు (వన్డేల్లో), ఐదు (టీ20ల్లో) స్థానాల్లో నిలిచింది.రెండు రోజుల కిందట (జూన్ 16) సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో శతక్కొట్టడంతో (117) మంధన వన్డే ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఐదు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. టీ20ల విషయానికొస్తే.. మంధన గత వారంలో ఉన్న ఐదో స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది.ఆసియా జట్ల నుంచి వన్డే ర్యాంకింగ్స్లో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. టీ20 ర్యాంకింగ్స్లో ఆమె ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ మంధన తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ (11వ స్థానం), దీప్తి శర్మ (20) టాప్-20లో ఉన్నారు. టీ20ల్లో మంధన తర్వాత హర్మన్ప్రీత్ (13), షఫాలీ వర్మ (15), జెమీమా రోడ్రిగెజ్ (19) టాప్-20లో ఉన్నారు.ఇదిలా ఉంటే, మహిళల జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా వన్డేల్లో ఐదు, టీ20ల్లో మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా రెండు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది. -
చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, ఆశా శోభన
భారత క్రికెటర్ స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. తద్వారా మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత రెండో మహిళా క్రికెటర్గా స్మృతి మంధాన నిలిచింది.దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో స్మృతి ఈ ఘనత సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన మంధాన.. శతకంతో మెరిసింది. 127 బంతులు ఎదుర్కొని 117 పరుగులు సాధించింది. వన్డేల్లో ఆమెకిది ఆరో సెంచరీ.ఈ క్రమంలో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మంధాన.. మిథాలీ రాజ్(10868 రన్స్) తర్వాత ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్గా నిలిచింది. మంధాన తర్వాత ఈ లిస్టులో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(6870 రన్స్) ఉంది.దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయంకాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగింది.వన్డేల్లో స్మృతికి ఇదో ఆరో శతకం కాగా... భారత గడ్డపై మొదటిది కావడం విశేషం. ఒకదశలో భారత్ 99/5తో కష్టాల్లో నిలిచింది. అయితే లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ (48 బంతుల్లో 37; 3 ఫోర్లు), పూజ వస్త్రకర్ (42 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు) స్మృతికి సహకరించారు.5 వికెట్లు చేజార్చుకున్న తర్వాత కూడా భారత మహిళల బృందం 166 పరుగులు జోడించగలగడం తమ వన్డే చరిత్రలోనే అత్యధిక కావడం ప్రస్తావనాంశం. అనంతరం దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. సూన్ లూస్ (58 బంతుల్లో 33; 4 ఫోర్లు), సినాలో జఫ్తా (27 నాటౌట్), మరిజాన్ కాప్ (24) కొద్ది సేపు ప్రతిఘటించగలిగారు. కెరీర్లో తొలి వన్డే ఆడిన కేరళకు చెందిన లెగ్ స్పిన్నర్ ఆశా శోభన (4/21) ప్రత్యర్థిని పడగొట్టగా... దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి. ఆశా శోభన రికార్డుఅతి పెద్ద వయసులో (33 ఏళ్ల 92 రోజులు) భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన ప్లేయర్గా ఆశా శోభన నిలిచింది. రెండో వన్డే బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది. -
INDW Vs SAW Photos: దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్లో టీమిండియా బోణీ కొట్టింది. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ వెళ్లింది. 266 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్లు దాటికి 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. దీప్తీ శర్మ రెండు, పూజా, రేణుకా సింగ్, తలా వికెట్ పడగొట్టారు. ప్రోటీస్ బ్యాటర్లలో సునీ లూస్(33) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది.టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది.ఈ మ్యాచ్లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు. -
సెంచరీతో చెలరేగిన మంధాన.. దక్షిణాఫ్రికా ముందు భారీ టార్గెట్
చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది. 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ను మంధాన తన విరోచిత సెంచరీతో ఆదుకుంది. ఈ మ్యాచ్లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు.మంధాన అరుదైన రికార్డుఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన మంధాన ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో భారత మహిళల జట్టు తరపున అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా స్మృతి(6 సెంచరీలు) రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో హర్మన్ ప్రీత్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(7) ఉంది. -
సౌతాఫ్రికాతో సిరీస్ల కోసం భారత జట్టు ప్రకటన
వచ్చే నెల (జూన్) 13 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ల సిరీస్ల కోసం భారత మహిళా క్రికెట్ జట్టును నిన్న (మే 30) ప్రకటించారు. భారత పర్యటనలో సౌతాఫ్రికా ఓ వన్డే వార్మప్ మ్యాచ్తో పాటు మూడు వన్డేలు, ఏకైక టెస్ట్, మూడు టీ20లు ఆడనుంది.మూడు ఫార్మాట్లలో హర్మన్ప్రీత్ కౌర్ టీమిండియా సారధిగా ఎంపిక కాగా.. అన్ని ఫార్మాట్లలో స్మృతి మంధన హర్మన్కు డిప్యూటీగా వ్యవహరించనుంది. జెమీమా రోడ్రిగెజ్, పూజా వస్త్రాకర్లను మూడు ఫార్మాట్లలో జట్టుకు ఎంపికైనప్పటికీ.. ఫిట్నెస్ పరీక్ష నెగ్గితేనే వారికి తుది జట్టులో అవకాశం ఉంటుంది.భారత పర్యటనలో సౌతాఫ్రికన్లు తొలుత బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవెన్తో వన్డే వార్మప్ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్ జూన్ 13న బెంగళూరు వేదికగా జరుగనుంది. అనంతరం సౌతాఫ్రికా-భారత్లు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 16న తొలి వన్డే, 19న రెండవది, 23న మూడో వన్డే జరుగుతుంది. మూడు మ్యాచ్లకు బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ అనంతరం భారత్-సౌతాఫ్రికాలు ఏకైక టెస్ట్లో తలపడతాయి. చెన్నై వేదికగా జూన్ 28 నుంచి జులై 1 ఈ మ్యాచ్ జరుగనుంది. దీని తర్వాత ఇరు జట్లు టీ20 సిరీస్లో తలపడతాయి. జులై 5, 7, 9 తేదీల్లో ఈ మూడు మ్యాచ్లు జరుగుతాయి. టీ0 సిరీస్ మొత్తానికి చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.వన్డే సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్కీపర్), ఉమా చెత్రి (వికెట్కీపర్), దయాళన్ హేమలత, రాధా యాదవ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, ప్రియా పునియాఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, శుభా సతీష్, జెమిమా రోడ్రిగ్స్ *, రిచా ఘోష్ (వికెట్కీపర్), ఉమా చెత్రి (వికెట్కీపర్), దీప్తి శర్మ, స్నేహ రాణా, సైకా ఇషాక్, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్ *, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, ప్రియా పునియాటీ20 సిరీస్ కోసం భారత జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దయాళన్ హేమలత, ఉమా చెత్రి (వికెట్కీపర్), రిచా ఘోష్ (వికెట్కీపర్), జెమిమా రోడ్రిగ్స్ *, సజన సజీవన్, దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, ఆశా శోభన, పూజా వస్త్రాకర్ *, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డిస్టాండ్బై: సైకా ఇషాక్ -
డబ్ల్యూపీఎల్ ఫైనల్, ఐపీఎల్ ఫైనల్ అచ్చుగుద్దినట్లు ఒకేలా.. ఇలా ఎలా..!
క్రికెట్ గణాంకాలకు సంబంధించిన ఆట కాబట్టి అప్పుడప్పుడు ఒకే రకమైన గణాంకాలను చూడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మనం చూడబోయే గణాంకాలు మాత్రం క్రికెట్ అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తున్నాయి. ఈ గణాంకాల ముందు యాదృచ్చికం అనే మాట చిన్నబోతుంది. అంతలా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఈ గణాంకాలు.వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జరిగిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్).. తాజాగా నిన్న ముగిసిన ఐపీఎల్కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది మార్చి 17న జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్ల ధాటికి ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆర్సీబీ సైతం తడబడినా మరో మూడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరగలిగింది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా భారతీయ ప్లేయరైన (టీ20 ఫార్మాట్లో భారత కెప్టెన్) స్మృతి మంధన నేతృత్వంలో ఆర్సీబీ తొలి సారి టైటిల్ కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 ఫైనల్లోనూ అలాగే..నిన్న జరిగిన పురుషుల ఐపీఎల్ ఫైనల్లోనూ కొన్ని విషయాల్లో అచ్చుగుద్దినట్లు ఇలానే జరగడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. కేకేఆర్తో నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ కెప్టెన్ (ఆసీస్ కెప్టెన్) పాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మహిళల ఐపీఎల్లోనూ ఇలాగే ఆసీస్ కెప్టెన్ (మెగ్ లాన్నింగ్) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ ఫైనల్లో కమిన్స్ ప్రత్యర్ది భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్డెన్ (ఢిల్లీ కెప్టెన్) ప్రత్యర్ది భారత ప్లేయరే (మంధన).2024 WPL Final:- Aussie Captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian captain's team won by 8 wickets.IPL 2024 Final:- Aussie captain Vs Indian captain.- Aussie captain took batting.- Team 113/10 in 18.3 overs.- Indian… pic.twitter.com/jH07ZzmAEO— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024ఐపీఎల్ 2024 ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ కాగా.. నాటి డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ టాస్ గెలిచిన ఢిల్లీ (ఆసీస్ కెప్టెన్) 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్లో భారత ప్లేయర్ అయిన శ్రేయస్.. ఆసీస్ కెప్టెన్ నేతృత్వంలోని సన్రైజర్స్ను 8 వికెట్ల తేడాతో ఓడగొట్టగా.. డబ్ల్యూపీఎల్ ఫైనల్లోనూ ఆసీస్ కెప్టెన్ లాన్నింగ్ నేతృత్వంలోని ఢిల్లీని భారత ప్లేయర్ సారథ్యంలోని ఆర్సీబీ అదే 8 వికెట్ల తేడాతోనే ఓడగొట్టింది. ఇన్ని విషయాల్లో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్, ఐపీఎల్కు పోలికలు ఉండటంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
పేరు మార్చుకున్న ఆర్సీబీ... కన్నడలో మాట్లాడిన కోహ్లి.. వీడియో
Royal Challengers Bangalore Has A New Name Ahead Of IPL 2024: ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కీలక ప్రకటన చేసింది. తమ పేరును Royal Challengers Bangalore నుంచి 'Royal Challengers Bengaluru'గా మార్చుకుంటున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ‘‘ఈ పట్టణ సంస్కృతి, వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు('Royal Challengers Bengaluru') ఇది మీ జట్టు.. మీ ఆర్సీబీ’’ అంటూ కొత్త లోగో, నూతన జెర్సీని రివీల్ చేసింది. ఇక ఈ కార్యక్రమానికి టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, మహిళా జట్టు సారథి స్మృతి మంధాన సహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్సీబీకి తొలి టైటిల్ అందించిన వుమెన్ ప్రీమియర్ లీగ్-2024 చాంపియన్ స్మృతి మంధాన సేనకు పురుష జట్టు నుంచి గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. Guard of Honour for our WPL Champions at Johnnie Walker presents RCB Unbox powered by @Kotak_Life and @Duroflex_world 🫡👏#PlayBold #ನಮ್ಮRCB #WPL2024 pic.twitter.com/ikwL5Mx0E1 — Royal Challengers Bengaluru (@RCBTweets) March 20, 2024 ఇదిలా ఉంటే.. అన్బాక్స్ ఈవెంట్ సందర్భంగా విరాట్ కోహ్లి కన్నడలో మాట్లాడటం హైలైట్గా నిలిచింది. ‘‘మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. ఆర్సీబీ చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం’’ అని కోహ్లి అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని పేర్కొన్నాడు. Virat Kohli speaking Kannada. - "THE NEW CHAPTER OF RCB" 👑pic.twitter.com/KQWk4Wdab8 — Johns. (@CricCrazyJohns) March 19, 2024 దీంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో హోరెత్తిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా పదహారేళ్లుగా ఆర్సీబీ పురుష జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో రెండుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్ లాంఛనం పూర్తి చేయలేకపోయింది. RCB is red Now kissed with blue We’re ready with our new armour To Play Bold for you! Presenting to you, Royal Challengers Bengaluru’s match livery of 2024! 🤩 How good is this, 12th Man Army? 🗣️#PlayBold #ನಮ್ಮRCB #RCBUnbox #IPL2024 pic.twitter.com/2ySPpmhrsq — Royal Challengers Bengaluru (@RCBTweets) March 19, 2024 ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్కు ముందు పేరు మార్పుతో బరిలోకి దిగనుండటంతో ఈసారైనా రాత మారుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. WPL టైటిల్ గెలవడం శుభసూచకమంటూ మహిళా జట్టును ప్రశంసిస్తూనే.. ఫాఫ్ బృందం కూడా ట్రోఫీ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. -
టైటిల్ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు
WPL 2024 Winner- RCBW: టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లితో తనను పోల్చడం సరికాదని భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పేర్కొంది. జాతీయ జట్టు తరఫున కోహ్లి సాధించిన విజయాలు వెలకట్టలేనివని కొనియాడింది. కేవలం టైటిల్ గెలవడం ఒక్కటే గొప్ప కెప్టెన్ అన్న పదానికి నిర్వచనం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని స్మృతి మంధాన అందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్తో పాటు మహిళల కోసం బీసీసీఐ నిర్వహిస్తున్న వుమెన్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీని విజేతగా నిలిపింది. WPL 2024లో ఆర్సీబీకి టైటిల్ అందించింది. పదహారేళ్లుగా ఆర్సీబీతోనే ఉన్న విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఘనతను స్మృతి సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోలికల గురించి ప్రస్తావనకు రాగా స్మృతి మంధాన హుందాగా స్పందించింది. ‘‘మా ఇద్దరిని పోల్చి చూడటం సరైంది కాదు. ఆయన సాధించిన విజయాలు గొప్పవి. ఎంతో మందికి కోహ్లి ఆదర్శం. టైటిల్ గెలిస్తేనే గొప్ప కెప్టెన్ అంటే ఒప్పుకోను. విరాట్ని గౌరవించడం కూడా మనకు గౌరవం లాంటిదేనని భావిస్తా. ఇక మా ఇద్దరి జెర్సీల వెనకాల 18 ఉండటాన్ని కూడా పెద్దగా పోల్చి చూడాల్సిన పనిలేదు. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే. నా పుట్టినరోజు 18న కాబట్టి నేను ఆ నంబర్ను నా జెర్సీ మీద వేయించుకున్నా. అంతేగానీ ఆ నంబర్ వేసుకున్నంత మాత్రాన నా ఆటను విశ్లేషించే తీరు మారకూడదు. అయినా గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టైటిల్ గెలవనంత మాత్రానా వారి ప్రదర్శనను తక్కువ చేసి చూడకూడదు. ఆర్సీబీ అనేది ఒక ఫ్రాంఛైజీ. ఇక్కడ మహిళా, పురుష జట్లను వేర్వేరుగానే పరిగణించాలి’’ అని స్మృతి మంధాన మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించింది. pic.twitter.com/SOWpkfIDny — priyam ~ media account (@dunkimedia) March 19, 2024 No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 -
Smriti Mandhana: ఆటలోనే కాదు అందంలోనూ చాంపియన్.. స్మృతి మంధాన (ఫొటోలు)
-
ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా: స్మృతి మంధాన భావోద్వేగం
Womens Premier League 2024 Winner RCB: ‘‘ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకోవడం కష్టంగా ఉంది. ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్పగలను.. ఇదంతా సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. మా జట్టును చూసి నిజంగా గర్వంగా ఉంది’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన ఉద్వేగానికి లోనైంది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 బీసీసీఐ ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక టీ20 టోర్నీ వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చాంపియన్గా ఆర్సీబీ నిలవడంతో స్మృతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రయాణంలో మేము ఎత్తుపళ్లాలెన్నో చూశాం. ఏదేమైనా ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబడటం అద్భుతంగా అనిపిస్తోంది. చివరి లీగ్ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ వంటిదైతే.. సెమీస్.. ఈరోజు ఫైనల్.. ఇలా ప్రధాన మ్యాచ్లన్నింటినిలోనూ సరైన సమయంలో సరైన విధంగా రాణించగలిగాం. గత సీజన్ మాకెన్నో పాఠాలు నేర్పింది. ముఖ్యంగా ప్లేయర్గా, కెప్టెన్గా నేనెంతో నేర్చుకున్నా. కష్టకాలంలో మేనేజ్మెంట్ నాకు అండగా నిలబడింది. ఇప్పుడు వారి కోసం మేము ట్రోఫీ గెలిచాం. జట్టులో ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్సీబీ ఫ్రాంఛైజీ కప్ గెలవడం ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. ఆర్సీబీ అభిమానులు అందరిలోకెల్లా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు. జట్టుకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తారు. వారి కోసం ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. ‘ఈసారి కప్ మనకే అంటారు కదా.. అవును ఈసారి కప్ మనదే’.. నా మాతృభాష కన్నడ కాకపోయినప్పటికీ.. అభిమానుల కోసం కచ్చితంగా ఇది మాత్రం కన్నడలో చెప్పాల్సిందే’’ అని హర్షం వ్యక్తం చేసింది. కాగా అరుణ్జైట్లీ స్టేడియంలో ఆదివారం జరిగిన WPL 2024 ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తద్వారా WPL రెండో ఎడిషన్ విజేతగా అవతరించింది. పదహారేళ్లుగా కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ, ఫ్యాన్స్ కలను నెరవేర్చింది స్మృతి మంధాన సేన!! No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 గత సీజన్లో విఫలం కాగా గతేడాది స్మృతి మంధాన బ్యాటర్గా పూర్తిగా విఫలమైన విషయం తెలిసిందే. మొత్తంగా ఎనిమిది మ్యాచ్లు ఆడి కేవలం 149 పరుగులు చేసింది. తాజా ఎడిషన్లో 10 మ్యాచ్లలో 300 పరుగులు చేసి టాప్-4లో నిలిచింది. -
ఫైనల్లో ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కెప్టెన్! వీడియో వైరల్
డబ్ల్యూపీఎల్ ట్రోఫీని తొలిసారి ముద్దాడాలని కలలలు గన్న ఢిల్లీ క్యాపిటల్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో వరుసగా రెండో సారి టైటిల్కు అడుగు దూరంలో ఢిల్లీ నిలిచిపోయింది. గతేడాది కూడా ఢిల్లీ తుది పోరులోనే ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి టైటిల్ చేజారడంతో ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ కన్నీటిపర్యంతమైంది. ఉబికి వస్తున్న కన్నీరును ఆమె ఆపుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది లానింగ్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఫైనల్లో ఓడినప్పటికీ లీగ్ మొత్తం బాగా ఆడారు అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సైతం ఆమెకు సపోర్ట్గా నిలిచింది. ఎప్పుడూ నీవు మా రానివే అంటూ లానింగ్ ఫోటోను ఢిల్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Meg Lanning 💔 Chin up, champ 🐐 📸 - JioCinema#WPLFinal #WPL2024 pic.twitter.com/FzvlbN2nVe — shreya (@shreyab27) March 17, 2024 -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్
డబ్ల్యూపీఎల్-2024 ఛాంపియన్స్గా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ పోరులో 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ ఖాతాలో తొలి టైటిల్ చేరింది. ఐపీఎల్లో గత 16 ఏళ్లగా ఆర్సీబీ పురుషుల జట్టు నిరాశపరుస్తుండగా.. మహిళల జట్టు మాత్రం కేవలం రెండో సీజన్లోనే టైటిల్ సాధించి సత్తాచాటింది. ఇక 16 ఏళ్ల తర్వాత ఆర్సీబీకి డబ్ల్యూపీఎల్ రూపంలో తొలి టైటిల్ రావడంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలిపోయారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి వంటి దిగ్గజ క్రికెటర్లు ఆర్సీబీ మహిళల జట్టును అభినందించారు. బాయ్ ఫ్రెండ్తో స్మృతి.. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బాయ్ ఫ్రెండ్ స్మృతి పలాష్ ముచ్చల్ సందడి చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ పలాష్ కన్పించాడు. అదే విధంగా విజయనంతరం స్మృతి పలాష్ ముచ్చల్తో కలిసి ట్రోఫీతో ఫోటలోకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 2023లో చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణం గెలిచినప్పుడు కూడా పలాష్ స్మృతితో పోజులిచ్చింది. ఇక గత కాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. బాలీవుడ్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గాపేరు గాంచిన పలాస్కు.. ఓ ఈవెంట్లో మంధానతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. -
స్మృతి మంధానకు వీడియో కాల్ చేసిన కోహ్లి.. వీడియో వైరల్
'ఈ సాల్ కప్ నమదే'.. ప్రతీ ఏడాది ఐపీఎల్ సీజన్కు ముందు ఆర్సీబీ అభిమానుల నుంచే వినిపించే మాట. కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి ఊరించి ఊసురుమన్పించడం ఆర్సీబీకి పరిపాటిగా మారిపోయింది. తమ ఆరాద్య జట్టు ఒక్కసారి ట్రోఫీని ముద్దాడితే చూడాలని పరితపించారు. అయితే ఎట్టకేలకు అభిమానుల కల నేరవేరింది. 16 ఏళ్లుగా ఐపీఎల్లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని టైటిల్ను డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లోనే అమ్మాయిల జట్టు సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు ఆటగాళ్లు సైతం సంబరాల్లో మునిగితేలిపోయారు. తొలిసారి టైటిల్ను సొంతం చేసుకున్న ఆర్సీబీ మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించాడు. సూపర్ ఉమెన్ అంటూ తన ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అదేవిధంగా టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వీడియో కాల్ కూడా చేశాడు. మంధానతో పాటు మిగితా ప్లేయర్స్తో విరాట్ కాసేపు సంభాషించాడు. విరాట్ను చూడగానే ఆర్సీబీ ప్లేయర్లు ఆనందంతో గంతులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా 2008 తొలి సీజన్ నుంచి ఆర్సీబీకి విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: WPL 2024: డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా? #RCBUnbox Virat Kohli was literally dancing on the video call. This Trophy matters sooo much to him#ViratKohli𓃵 pic.twitter.com/uFbIxF037d — SAMAR♡︎ (@119_bholi) March 18, 2024 -
డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్లో అమ్మాయిలు నెరవేర్చారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ బౌలర్ల జోరుకు 113 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో అదరగొట్టగా.. మోలినెక్స్ 3, ఆశ శోభన 2 రెండో వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్గా నిలిచిన ఫ్రైజ్ మనీ ఎంత? ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కింది? ఇటువంటి విషయాలపై ఓ లూక్కేద్దం. విజేతకు ఎంతంటే? డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్గా నిలిచిన క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆరెంజ్ క్యాప్ విజేత పెర్రీ.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్గా ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ శ్రేయంక అదేవిధంగా అత్యధిక ఈ ఏడాది సీజన్లో వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ పర్పుల్ క్యాప్ హోల్డర్గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్గా ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన శ్రేయంక.. 13 వికెట్లు పడగొట్టింది. మిగితా అవార్డులు దక్కించుకున్న వారు వీరే.. ప్లేయర్ ఆఫ్ది సిరీస్-దీప్తి శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ - శ్రేయాంక పాటిల్ (బెంగళూరు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - దీప్తి శర్మ (యూపీ) బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ - సజన సజీవన్ (ముంబై) ఫెయిర్ ప్లే టీమ్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు A special moment to celebrate @imVkohli @mandhana_smriti pic.twitter.com/NkEI6iDIjq — CricTracker (@Cricketracker) March 17, 2024 -
WPL 2024: సూపర్ స్మృతి...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోరీ్నలో తొలి అంచెపోటీలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్, కెపె్టన్ స్మృతి మంధాన (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్స్లు), టాపార్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్పై గెలుపొందింది. ఈ లీగ్లో ఆర్సీబీకిది మూడో విజయం. మొదట బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిరీ్ణత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28; 5 ఫోర్లు)తో ఒపెనింగ్ వికెట్కు చకచకా 51 పరుగులు జతచేసిన స్మృతి ఆ తర్వాత పెరీ అండతో దూకుడు పెంచింది. ఇద్దరు ధనాధన్ ఆటతీరు కనబరచడంతో యూపీ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. రెండో వికెట్కు 10.4 ఓవర్లలో 95 పరుగులు జతచేశారు. మంధాన 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 146 పరుగుల వద్ద స్మృతి ని్రష్కమించగా, 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన పెరీ ఆఖరి ఓవర్లో అవుటైంది. రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించింది. ఆంధ్ర అమ్మాయి అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేయగలిగింది. కెపె్టన్, ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్స్లు) పవర్ప్లేలో దంచేసింది. మరో ఓపెనర్ కిరణ్ నవ్గిరే (18) సహా చమరి ఆటపట్టు (8), గ్రేస్ హారిస్ (5), శ్వేత సెహ్రావత్ (1) స్వల్ప వ్యవధిలో ని్రష్కమించడంతో యూపీ లక్ష్యానికి దూరమైంది. దీప్తి శర్మ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్), పూనమ్ (24 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు పోరాడారు. నేటి నుంచి ఢిల్లీ వేదికపై రెండో అంచె పోటీలు జరుగుతాయి. మంగళవారం జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. -
మెరుపులు మెరిపించిన మంధన.. ఆర్సీబీ భారీ స్కోర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్లో భాగంగా యూపీ వారియర్జ్తో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధన మెరుపులు మెరిపించింది. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనకు ఎల్లిస్ పెర్రీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో సబ్బినేని మేఘన (28), రిచా ఘోష్ (21 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించారు. వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, అంజలి శర్వాణి, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ పడగొట్టారు. Mandhana's magic in Chinnaswamy!#WPL2024 pic.twitter.com/rMncZXmSzx — OneCricket (@OneCricketApp) March 4, 2024 అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్.. రేణుక సింగ్ వేసిన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఆతర్వాత రెండు ఓవర్లలో మాత్రం వారియర్జ్ ఓపెనర్లు అలైసా హీలీ (13), కిరణ్ నవ్గిరే (17) రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో వారియర్జ్ 3 ఓవర్లలో 40 పరుగులు చేసింది. తొలి ఓవర్ మొయిడిన్గా మలిచిన రేణుకా సింగ్, ఆతర్వాతి ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకుంది. కారు అద్దాలు పగలగొట్టిన పెర్రీ.. ELLYSE PERRY HAS BROKE THE GLASS OF THE CAR...!!! 🤯 - The reaction of Perry was priceless!! pic.twitter.com/zaxiQLLN1r — Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024 -
స్మృతి మెరుపులు వృథా
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలని ఆశించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు నిరాశ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు జట్టు 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ప్లేయర్లు మరిజాన్ కాప్, జెస్ జొనాసెన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ లీగ్లో ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన బెంగళూరుకు ఇదే మొదటి పరాజయం కావడం గమనార్హం. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి ఓడిపోయింది. స్మృతి మంధాన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్ల భరతం పట్టిన స్మృతి 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 74 పరుగులు చేసింది. సోఫీ డివైన్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్లు)తో తొలి వికెట్కు 77 పరుగులు జోడించిన స్మృతి... రెండో వికెట్కు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) జత చేసింది. మరిజాన్ కాప్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి గురి తప్పిన స్మృతి క్లీన్ బౌల్డ్ అయింది. అప్పటికి బెంగళూరు స్కోరు 112. స్మృతి అవుటయ్యాక వచ్చిన బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు విజయతీరానికి చేరలేకపోయింది. ఢిల్లీ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మరిజాన్ కాప్ (2/35), జెస్ జొనాసెన్ (3/21), అరుంధతి రెడ్డి (2/38) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు సాధించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (17 బంతుల్లో 11; 2 ఫోర్లు) విఫలమైనా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. రెండో వికెట్కు 83 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక మరిజాన్ కాప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్లు), జెస్ జొనాసెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మెరిపించి ఢిల్లీకి భారీ స్కోరును అందించారు. నేడు జరిగే మ్యాచ్లో యూపీ వారియర్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడుతుంది. -
బెంగళూరు ధనాధన్...
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ధనాధన్ ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. 7.3 ఓవర్లు మిగిలుండగానే స్మృతి మంధాన బృందం లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసింది. ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బంతుల్లో 22; 3 ఫోర్లు), హేమలత (25 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక సింగ్ (2/14) స్వింగ్ బౌలింగ్కు మేటి బ్యాటర్లు బెత్ మూనీ (8), లిచ్ఫీల్డ్ (5) తలవంచారు. వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నర్ (7)లు కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్ (3/25) గుజరాత్ను కోలుకోని విధంగా దెబ్బతీసింది. ఆర్సీబీ ఏకంగా ఏడుగురు బౌలర్లను ప్రయోగించింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగింది. సహచర ఓపెనర్ సోఫీ డివైన్ (6) ఆరంభంలోనే నిష్క్రమించినా... వన్డౌన్ బ్యాటర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (28 బంతుల్లో 36 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి చకాచకా పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో తనూజ (1/20) స్మృతి వేగానికి కళ్లెం వేసింది. అయితే మేఘన, ఎలీస్ పెరీ (14 బంతుల్లో 23 నాటౌట్; 4 ఫోర్లు) మరో వికెట్ పడకుండా తమ కెపె్టన్లాగే ధనాధన్ ఆటతీరును కొనసాగించారు. దాంతో 13వ ఓవర్ పూర్తికాకముందే బెంగళూరు విజయతీరాలకు చేరుకుంది. నేడు జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో యూపీ వారియర్స్ తలపడుతుంది. -
మంధాన క్రేజ్.. తెలుగమ్మాయి ఫిఫ్టీ.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్
WPL 2024- RCBW Vs UPW: మహిళల ప్రీమియర్ లీగ్-2024 ఎడిషన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తొలి మ్యాచ్లో యూపీ వారియర్స్తో తలపడుతోంది. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూపీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య ఆర్సీబీ ఆరంభంలోనే ఓపెనర్ సోఫీ డివైన్(1) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన.. వన్డౌన్ బ్యాటర్, తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. Captain Smriti Mandhana on fire. 🔥pic.twitter.com/vfvhMozwsk — Mufaddal Vohra (@mufaddal_vohra) February 24, 2024 ఈ నేపథ్యంలో రెండో ఓవర్ మూడు, నాలుగో బంతుల్లో వరుసగా సిక్సర్, ఫోర్తో చెలరేగింది. కానీ.. మంధాన మెరుపులు కాసేపటికే మాయమయ్యాయి. ఆరో ఓవర్ తొలి బంతికే మెగ్రాత్ బౌలింగ్లో వ్రిందా దినేశ్కు క్యాచ్ ఇచ్చి స్మృతి మంధాన 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించింది. ఆమె తర్వాత మరో స్టార్ ప్లేయర్ ఎలిస్ పెర్రీ(8) కూడా ఇలా వచ్చి అలా పెవిలియన్కు చేరింది. ఈ క్రమంలో సబ్బినేని మేఘన, వికెట్ కీపర్ రిచా ఘోష్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మేఘన 44 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. Brilliant half-century for Sabbhineni Meghana in front of a massive crowd! Can she power @RCBTweets to a match-winning total? Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/geoj3JWH61 — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 Richa Gosh reaches her maiden FIFTY for #RCB 💪🔥 Match Centre 💻📱 https://t.co/kIBDr0FhM4#TATAWPL | #RCBvUPW pic.twitter.com/9QtU8s27Hk — Women's Premier League (WPL) (@wplt20) February 24, 2024 ఇలా మేఘన జట్టుకు అవసరమైన సమయంలో అర్ధ శతకం బాదితే.. రిచా ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టింది. 37 బంతుల్లోనే 12 ఫోర్ల సాయంతో 62 రన్స్ చేసింది. మిగతా వాళ్లలో జార్జియా వరేహం డకౌట్ కాగా.. సోఫీ మొలినెక్స్ 9, శ్రెయాంక పాటిల్ 8 పరుగులతో అజేయంగా నిలిచారు. స్మృతి రాగానే హోరెత్తిన చిన్నస్వామి స్టేడియం ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ మహిళా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. యూపీ వారియర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హ్యారిస్, తహిలా మెగ్రాత్, సోఫీ ఎక్లిస్టోన్, దీప్తి శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే.. టాస్ సమయంలో స్మృతి మంధాన రాగానే చిన్నస్వామి స్టేడియం హోరెత్తిపోయింది. అదే విధంగా ఆమె బ్యాట్ ఝులించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. Smriti Mandhana was impressed with Home Crowd 😂❤️ ❤️#RCB pic.twitter.com/4vbwccmhDG — RCB Xtra. (@Rcb_Xtra) February 24, 2024 -
ఏకైక టెస్టులో ఆసీస్ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర
India Women vs Australia Women, Only Test: భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. కాగా భారత్ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు పూజా వస్త్రాకర్ నాలుగు, స్నేహ్ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన భారత్కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్లో రిచా ఘోష్ 52, జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్లో 406 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యంలో నిలిచింది. చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్ పోరాడినా ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్ పప్పులు ఉడకలేదు. టాపార్డర్, మిడిలార్డర్ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. స్నేహ్ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్ అయింది. మొట్టమొదటి టెస్టు గెలుపు ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసింది. మంధాన ఫోర్ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్- ఆసీస్ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్ డ్రా అయింది. చదవండి: WFI: క్రీడా శాఖ సంచలన నిర్ణయం.. కొత్తగా ఎన్నికైన డబ్ల్యూఎఫ్ఐపై వేటు 𝙃𝙄𝙎𝙏𝙊𝙍𝙔 𝙄𝙉 𝙈𝙐𝙈𝘽𝘼𝙄! 🙌#TeamIndia women register their first win against Australia in Test Cricket 👏👏 Scorecard ▶️ https://t.co/7o69J2XRwi#INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/R1GKeuRa69 — BCCI Women (@BCCIWomen) December 24, 2023 -
ఆసీస్ బౌలర్లకు చుక్కలు.. బ్యాట్తో చెలరేగిన దీప్తి, పూజ
ఆస్ట్రేలియాతో టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు రెండో రోజు కూడా ఆధిపత్యం కనబరిచింది. ఓపెనర్ స్మృతి మంధానకు తోడు రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ(70- నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆసీస్పై పైచేయి సాధించింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. కాగా ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో భారత వుమెన్ టీమ్ ఏకైక టెస్టులో తలపడుతోంది. వాంఖడే స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ పూజా వస్త్రాకర్ నాలుగు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇతర బౌలర్లలో స్నేహ్ రాణా మూడు, ఆల్రౌండర్ దీప్తి శర్మ రెండు వికెట్లు తీశారు. ఈ క్రమంలో ఆసీస్ మహిళా జట్టు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో తొలి రోజే ఆసీస్ను ఆలౌట్ చేసిన భారత్.. ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో భాగంగా ఓపెనర్ స్మృతి మంధాన 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైంది. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రిచా ఘోష్ 52 పరుగులతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 73 పరుగులతో అదరగొట్టింది. అయితే, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. గార్డ్నర్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగింది. యస్తికా భాటియా సైతం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న దీప్తి శర్మ ఓపికగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి 147 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా పూజా వస్త్రాకర్ సైతం 33 పరుగులతో క్రీజులో ఉంది. వీరిద్దరు కలిసి 102 పరుగుల అజేయ భాగస్వామ్యంతో భారత్ 157 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇదిలా ఉంటే.. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆష్లీ గార్డ్నర్కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కగా.. కిమ్గార్త్ ఒకటి, జెస్ జొనాసెన్ ఒక వికెట్ పడగొట్టారు. కిమ్ గార్త్, గార్డ్నర్ కలిసి స్మృతి మంధానను రనౌట్ చేశారు. -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్కు షూటింగ్లోనే రెండు కాంస్యాలు, రోయింగ్లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
వాలీబాల్లో భారత్ సంచలనం
హాంగ్జూ (చైనా): మూడున్నర దశాబ్దాల పతక నిరీక్షణకు తెరదించాలనే లక్ష్యంతో ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల వాలీబాల్ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. గ్రూప్ ‘సి’లో టాప్ ర్యాంక్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించింది. మంగళవారం కంబోడియా జట్టును ఓడించిన భారత జట్టు బుధవారం పెను సంచలనం సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 27వ స్థానంలో ఉన్న దక్షిణ కొరియా జట్టును భారత్ బోల్తా కొట్టించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో భారత జట్టు 25–27, 29–27, 25–22, 20–25, 17–15తో దక్షిణ కొరియాపై గెలిచింది. 1966 నుంచి ప్రతి ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో ఏదో ఒక పతకం సాధిస్తూ వస్తోంది. భారత జట్టు చివరిసారి 1986 సియోల్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచింది. కొరియాతో 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో భారత జట్టు సమష్టి ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా అమిత్ అత్యధికంగా 24 పాయింట్లు స్కోరు చేశాడు. వినిత్ కుమార్, అశ్వల్ రాయ్ 19 పాయింట్ల చొప్పున సాధించారు. మనోజ్ ఎనిమిది పాయింట్లు, ఎరిన్ వర్గీస్ ఏడు పాయింట్లు అందించారు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కొరియా రజత పతకం నెగ్గగా, భారత్ 12వ స్థానంలో నిలిచింది. రోయింగ్లో జోరు... రోయింగ్లో భారత క్రీడాకారులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశి‹Ùలతో కూడిన భారత పురుషుల జట్టు కాక్స్లెస్ ఫోర్ ఈవెంట్లో ఫైనల్కు చేరింది. మహిళల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్లో అశ్వతి, మృణమయి సాల్గావ్కర్, ప్రియా దేవి, రుక్మిణి, సొనాలీ, రీతూ, వర్ష, తెన్దోన్తోయ్ సింగ్, గీతాంజలిలతో కూడిన భారత జట్టు కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు మలేసియాతో భారత మహిళల పోరు మహిళల టి20 క్రికెట్లో భారత నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో నేడు జరిగే పోరులో స్మృతి మంధాన బృందం బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీఫైనల్కు చేరడంతోపాటు పతకం రేసులో నిలుస్తుంది. ఉదయం గం. 6:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
బిగ్బాష్ లీగ్కు స్మృతి మంధాన దూరం!
భారత్లో మహిళల ప్రీమియర్ లీగ్ కంటే ఎంతో ముందుగా ఆ్రస్టేలియాలో ప్రారంభమై ఆలరిస్తోన్న మహిళల బిగ్బాష్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్) ప్లేయర్ల తుది జాబితా (డ్రాఫ్ట్) సిద్ధమైంది. 2023–24 కొత్త సీజన్ కోసం సెప్టెంబర్ 3న లీగ్ ఫ్రాంచైజీలు ఈ జాబితాలో ఉన్న క్రికెటర్లతో ఒప్పందాలు చేసుకుంటాయి. భారత్ నుంచి 18 మంది క్రికెటర్లు ఈ డ్రాఫ్ట్లో ఉన్నారు. అయితే భారత స్టార్ ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన తన పేరును ఇందులో నమోదు చేసుకోలేదు. గతంలో డబ్ల్యూబీబీఎల్లో స్మృతి బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్ జట్లకు ఆడింది. -
చైనాకు భారత్ నుంచి భారీ బృందం.. 634 మంది! క్రికెట్ జట్లు ఇవే!
Asian Games 2023: ఆసియా క్రీడలు-2023 నేపథ్యంలో భారత్ 634 అథ్లెట్లతో భారీ బృందాన్ని పంపించనుంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 38 క్రీడాంశాల్లో ఈ బృందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. చైనాలో హాంగ్జూలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. కాగా.. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 572 మంది పాల్గొన్న విషయం విదితమే. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కు 34 మంది పురుషులు, 31 మంది మహిళలు మొత్తంగా 65 మంది అథ్లెట్లు.. పురుష, మహిళా జట్లకు సంబంధించి 44 మంది ఫుట్బాలర్లు.. హాకీ జట్టు నుంచి మొత్తంగా 36 మంది, క్రికెట్ జట్ల నుంచి 30 మంది ఆసియా క్రీడల్లో భాగం కానున్నారు. స్టార్లంతా ఇక షూటింగ్ విభాగంలో భారత్ నుంచి 30 మంది, సెయిలింగ్ కోసం 33 మంది చైనాకు వెళ్లనున్నారు. అయితే, వెయిట్లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, రగ్బీ తదితర విభాగాలకు సంబంధించి లిస్ట్ వెల్లడి కావాల్సి ఉంది. ఆసియా క్రీడల్లో స్టార్లు నీరజ్ చోప్రా, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛెత్రి, హర్మన్ప్రీత్ సింగ్, బజరంగ్ పూనియా తదితరులు భాగం కానున్నారు. క్రికెట్ జట్లు ఇవే! ఈసారి భారత్ నుంచి మహిళా, పురుష క్రికెట్ జట్లు కూడా ఆసియా క్రీడల్లో పాల్గొనుండటం విశేషం. చైనాకు క్రికెటర్లను పంపించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వుమెన్ టీమ్లోని ప్రధాన క్రికెటర్లంతా ఈ మెగా టోర్నీలో భాగం కానుంగా.. మెన్స్ నుంచి ద్వితీయ శ్రేణి జట్టును హాంగ్జూకు పంపనున్నారు. అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో పాల్గొనే జట్టుకు ముంబై బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసింది. టీ20 స్టార్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్ తదితరులతో కూడిన ఈ జట్టు ఆసియా బరిలో దిగనుంది. ఆసియా క్రీడలకు భారత పురుషుల జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివం దూబే, ప్రభ్షిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్). స్టాండ్బై ప్లేయర్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్. మహిళా క్రికెట్ జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దేవికా వైద్య, అంజలి శ్రావణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిన్ను మణి, కనికా అహుజా, ఉమా చెత్రి (వికెట్ కీపర్), అనూష బారెడ్డి స్టాండ్బై ప్లేయర్లు: హర్లీన్ డియోల్, కష్వీ గౌతమ్, స్నేహ్ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్ -
అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్
స్మృతి మంధాన భారత క్రికెట్ జట్టులో ప్రముఖ క్రీడాకారిణి. మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గ్రౌండ్లోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే . క్రీజ్లో ఉన్నప్పుడు దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాదు, మైదానం బయట కూడా అంతే చురుగ్గా కనిపించే ఈతరం అమ్మాయి. భారత ఓపెనర్గా ఎన్నో చూడచక్కటి ఇన్నింగ్స్లు ఆడిన స్మృతి సోషల్మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్య తను బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అయిన పలాష్ ముచ్చల్తో డేటింగ్లో ఉన్నట్లు తరుచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా తన పుట్టినరోజును జులై 18న ఢాకాలో జరుపుకుంది. భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనలో ఉండటంతో ఆమె అక్కడే ఈ వేడుకలను జరుపుకుంది. ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ పలాష్ ముచ్చల్ కూడా ఢాకా వెళ్లి స్మృతి మంధానకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పాడు. అది బాగా వైరల్ అయింది. (ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్ టైటిల్తో వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ!) ఈ వార్త మరిచిపోక ముందే తాజాగా పలాష్ ముచ్చల్తో సినిమా షూటింగ్ స్పాట్లో స్మృతి మంధాన కనిపించింది. బాలీవుడ్ కమెడియన్, నటుడు రాజ్పాల్ యాదవ్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ప్రకటన కార్యక్రమంలో ఆమె మరోసారి తన బాయ్ఫ్రెండ్తో కనిపించింది. ఈ చిత్రానికి పలాష్ ముచ్చల్ మ్యూజిక్ కంపోజర్గానే కాకుండా డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా కూడా మారనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఫోటోలను కమెడియన్ రాజ్పాల్ యాదవ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఇవి ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. రెండు నెలల క్రితం, పలాష్ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు, అతను తన చేతిపై 'SM 18' అని పచ్చబొట్టును గుర్తుగా రాపించాడు. స్మృతి మందన క్రికెట్ జెర్సీ నంబర్ '18' అనేది అందరికీ తెలిసిందే. అందుకే వీరిద్దరి డేటింగ్ చర్చ బాగా పాపులర్ అయింది. కానీ ఈ విషయంపై వీరద్దరూ బహిరంగంగా ఇప్పటికి వరకు ఒప్పుకోలేదు. అన్నీ సజావుగా జరిగితే వీరిద్దరూ త్వరలో శుభం కార్డుతో ఈ పుకార్లకు ఫుల్స్టాఫ్ పెడతారని సమాచారం. View this post on Instagram A post shared by Rajpal Naurang Yadav (@rajpalofficial) -
హర్మన్పై వేటు.. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించేది ఎవరు?
భారత మహిళల జట్టు రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై ఐసీసీ రెండు మ్యాచ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హర్మన్ సహనం కోల్పోయి బ్యాట్తో వికెట్లను విరగొట్టడం.. అంపైర్తో అనుచితంగా ప్రవర్తించడం ఐసీసీ తప్పుబట్టింది. అనుచిత ప్రవర్తనకు గానూ హర్మన్ ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. దీని ప్రకారం ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో భారత్ ఆడే తొలి రెండు మ్యాచ్లకు హర్మన్ దూరం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా గేమ్స్లో టీమిండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్లకు వైస్కెప్టెన్ అయిన స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. కాగా ఆసియా గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూ పట్టణంలో జరగనున్నాయి. ఇక ర్యాంకింగ్స్ ఆధారంగా టీమిండియా మహిళల జట్టు నేరుగా ఆసియా గేమ్స్కు క్వాలిఫై అయింది. సెప్టెంబర్ 24న భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా హర్మన్ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ.. అనుచిత ప్రవర్తనకు గానూ ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆమెకు మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెపె్టన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. చదవండి: FIFA World Cup: ప్రపంచకప్లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా.. వరల్డ్ కప్లో భారత్-పాక్ మ్యాచ్ రీ షెడ్యూల్.. భద్రతా కారణాల దృష్ట్యా..! -
'ప్రధాన కోచ్ లేకుంటే ఏంటి?.. బాగానే ఆడుతున్నాం కదా!'
టీమిండియా మహిళా జట్టు ప్రస్తుతం హెడ్కోచ్ లేకుండానే సిరీస్లు ఆడుతోంది. గతేడాది డిసెంబర్లో రమేశ్ పవార్ను ఎన్సీఏకు పంపించినప్పటి నుంచి మహిళల హెడ్కోచ్ పదవి ఖాళీగానే ఉంది. ఈ మధ్యలో భారత మహిళల జట్టు కోచ్ లేకుండానే టి20 వరల్డ్కప్ ఆడింది. తాజాగా బంగ్లాదేశ్తో సిరీస్ను కూడా కోచ్ లేకుండానే ఆడుతుంది. సరైన వ్యక్తి కోసం బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహిళల జట్టుకు కొత్త కోచ్ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో టీమిండియా వుమెన్స్ వైస్కెప్టెన్ స్మృతి మంధాన ప్రధాన కోచ్ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఇప్పటివరకు 1-1తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. కీలకమైన మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. అయితే మ్యాచ్కు ముందు స్మృతి మంధాన మీడియా సమావేశంలో పాల్గొంది. మంధాన మాట్లాడుతూ.. ''సరైన ప్రధాన కోచ్ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. జట్టు కోసం సుధీర్ఘంగా సేవలు అందించే కోచ్ను ఎంపిక చేయాలనేది బోర్డు ఉద్దేశం. ఆటగాళ్ల నుంచి చూస్తే మాకు కోచ్ లేకపోవడం వల్ల ఇప్పటికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. నాణ్యమైన క్రికెట్ ఆడినంత కాలం కోచ్ లేకపోయినా టీమిండియా మహిళా జట్టుకు గెలిచే సత్తా ఉంటుంది. ప్రధాన కోచ్ లేకపోయినప్పటికి ఇతర కోచింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారి సూచనలు తీసుకుంటూ ముందు సాగుతున్నాం. వారిచ్చే సూచనలు మాకు ఉపయోగపడుతున్నాయి. మా చుట్టూ ఏం జరుగుతుందనేది జట్టుగా మాకు ముఖ్యం కాదు. మైదానంలో ఎలా ఆడుతున్నామన్నదే కీలకం. ఈ సిరీస్ ముగిసేలోగా జట్టు ప్రధాన కోచ్ విషయమై బీసీసీఐ నుంచి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వేచి చూడాలి. ప్రధాన కోచ్గా ఎవరొచ్చినా వారి సూచనలు, సలహాలు తీసుకొని జట్టును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం'' అంటూ తెలిపింది. చదవండి: Emerging Asia Cup:'నువ్వు మొదలెట్టావ్.. నేను పూర్తి చేశా; లెక్క సరిపోయింది' దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! -
ఆరో స్థానానికి ఎగబాకిన మంధాన.. 17వ ర్యాంక్కు పడిపోయిన సింధు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్లో స్మృతి 704 రేటింగ్ పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. భారత కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండు స్థానాలు పడిపోయి 702 పాయింట్లతో ఎనిమిదో ర్యాంక్కు చేరుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్లో రాజేశ్వరి గైక్వాడ్ తొమ్మిదో ర్యాంక్లో, ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ ఏడో ర్యాంక్లో ఉన్నారు. 17వ ర్యాంక్కు పడిపోయిన సింధు ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ప్రదర్శన ఆమె ర్యాంకింగ్స్పై ప్రభావం చూపిస్తోంది. గతవారం యూఎస్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన పీవీ సింధు... మంగళవారం విడుదల చేసిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో ఐదు స్థానాలు పడిపోయింది. గతవారం 12వ ర్యాంక్లో నిలిచిన సింధు తాజాగా 17వ ర్యాంక్కు చేరుకుంది. గత పదేళ్లలో సింధు అత్యల్ప ర్యాంక్ ఇదే కావడం గమనార్హం. సింధు చివరిసారి 2013 జనవరిలో 17వ ర్యాంక్లో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 టోర్నీలు ఆడిన సింధు మాడ్రిడ్ మాస్టర్స్ టోరీ్నలో రన్నరప్గా నిలిచింది. మలేసియా మాస్టర్స్ టోర్నీ, కెనడా ఓపెన్లో సెమీఫైనల్కు చేరుకుంది. ప్రస్తుతం కొరియా ఓపెన్ టోరీ్నలో సింధు బరిలో ఉంది. కొత్త కోచ్గా హఫీజ్ హషీమ్ పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ప్రారంభం కావడంతో పీవీ సింధు కొత్త వ్యక్తిగత కోచ్ను నియమించుకుంది. 2003 ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, మలేసియా మాజీ ప్లేయర్ మొహమ్మద్ హఫీజ్ హషీమ్ తన వ్యక్తిగత కోచ్గా వ్యవహరిస్తాడని మంగళవారం సింధు ట్విటర్ వేదికగా ప్రకటించింది. -
Smriti Mandhana : అందమైన క్రికెటర్ స్మృతి మంధానకు హ్యాపీ బర్త్డే (ఫొటోలు)
-
రాణించిన మంధన.. మెరిసిన హర్మన్.. టీమిండియా ఘన విజయం
3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇవాళ (జులై 9) జరిగిన తొలి టీ20లో భారీ విజయం సాధించింది. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు తలో చేయి వేయడంతో టీమిండియా అలవోకంగా బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న భారత్.. ప్రత్యర్ధిని 114 పరుగుల స్వల్ప స్కోర్కే (5 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. పూజా వస్త్రాకర్ (4-1-16-1), షఫాలీ వర్మ (3-0-18-1), మిన్నూ మణి (3-0-20-1) పొదుపుగా బౌలింగ్ చేసి తలో వికెట్ తీయగా.. ఆంధ్రప్రదేశ్ (అనంతపురం) అమ్మాయి బారెడ్డి అనూష (4-0-24-0) పర్వాలేదనిపించింది. బంగ్లా ఇన్నింగ్స్లో షాతి రాణి (22), శోభన మోస్టరీ (23), షోర్ణా అక్తెర్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం బరిలోకి దిగిన భారత్.. 16.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలింతగా 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రాణించిన మంధన.. మెరిసిన హర్మన్ 115 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ ఆరంభంలోనే షఫాలీ వర్మ (0) వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగా ఆడింది. 38 పరుగులతో స్మృతి మంధన రాణించగా, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (54 నాటౌట్) అర్ధసెంచరీతో మెరిసింది. జెమీమా రోడ్రిగెస్ (11) నిరాశపర్చగా, యస్తికా భాటియా (9 నాటౌట్) సహకారంతో హర్మన్ టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 2 వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తెర్ ఓ వికెట్ దక్కించుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 జులై 11న జరుగుతుంది. -
WPL 2023: స్మృతి మంధన చేసిన ఒక్కో పరుగు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
డబ్ల్యూపీఎల్లో అత్యంత ఖరీదైన ప్లేయర్గా (రూ. 3.4 కోట్లు) రికార్డు నెలకొల్పిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధన.. ప్రస్తుత సీజన్లో చేసిన ఒక్కో పరుగు విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. డబ్ల్యూపీఎల్-2023లో మంధన సాధించిన పరుగుల ప్రకారం ఆమె ఒక్కో పరుగు విలువ రూ. 2. 28 లక్షలవుతుంది. ఈ సీజన్లో ఆమె ఆడిన 8 మ్యాచ్ల్లో 18.62 సగటున, 111.19 స్ట్రయిక్రేట్తో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో ఒక్కటంటే ఒక్క అర్ధసెంచరీ కూడా లేకపోగా ఓ సారి డకౌట్ కూడా అయ్యింది. మంధన అత్యధిక వ్యక్తిగత స్కోర్ (37) గుజరాత్ జెయింట్స్పై నమోదు చేసింది. ఆమె ఆడిన 8 ఇన్నింగ్స్ల్లో 7 సార్లు స్పిన్నర్ల చేతిలో ఔటై, స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తానెంత పూరో నిరూపించుకుంది. కాగా, డబ్ల్యూపీఎల్-2023 సీజన్ తుది దశకు చేరింది. పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ (8 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు, 1.856 రన్రేట్), ముంబై ఇండియన్స్ (8 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు, 1.711 రన్రేట్), యూపీ వారియర్జ్ (8 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు, -0.200 రన్రేట్) ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు, -1.137 రన్రేట్), గుజరాత్ జెయింట్స్ (8 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు, -2.220 రన్రేట్) ఫ్రాంచైజీలు లీగ్ను ఎలిమినేట్ అయ్యాయి. మార్చి 24న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ వారియర్జ్.. ముంబై ఇండియన్స్తో తలపడనుండగా, ఈ మ్యాచ్లో విన్నర్ మార్చి 26న జరిగే ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొంటుంది. -
అన్నింటా విఫలం.. కెప్టెన్గా పనికిరాదా?
స్మృతి మంధాన.. టీమిండియా మహిళల క్రికెట్లో ఒక సంచలనం. దూకుడైన ఆటతీరుకు నిర్వచనంగా చెప్పుకునే మంధాన బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023)లో మాత్రం నిరాశజనక ప్రదర్శన నమోదు చేసింది. పైగా స్టార్ క్యాంపెయినర్ హోదా కట్టబెట్టి వేలంలో ఆర్సీబీ.. భారత మహిళల జట్టులో అందరికంటే ఎక్కువగా రూ.3.40 కోట్లు మంధానపై గుమ్మరించి కొనుగోలు చేసింది. అంతేకాదు ఏదో చేస్తుందని చెప్పి ఆమెను కెప్టెన్గా ఎంపిక చేశారు. ఇలా కెప్టెన్ అయిందో లేదో ఒత్తిడిలో పడిన స్మృతి మంధాన బ్యాటర్గా, కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యింది. కెప్టెన్గా అనుభవలేమి ఆమెలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్సీబీ కెప్టెన్గా వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటములు చవిచూసిన మంధాన బ్యాటర్గానూ పూర్తిగా విఫలమైంది. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని ఈమె ఎనిమిది మ్యాచ్లు కలిపి 18.6 సగటుతో కేవలం 149 పరుగులు మాత్రమే చేసింది. ఇక కెప్టెన్గానూ ఆమె అంతగా సక్సెస్ కాలేకపోయింది. సోఫీ డివైన్ వల్ల ఒక మ్యాచ్.. రిచా ఘోష్ వల్ల మరొక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీకి కెప్టెన్గా మంధాన చేసిందేమి లేదు. అందుకే వచ్చే సీజన్లో మంధానను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే మంచిదని చాలా మంది అభిప్రాయపడ్డారు. డబ్ల్యూపీఎల్లో కెప్టెన్గా నిరాశపరిచిన మంధాన భవిష్యత్తులో టీమిండియా వుమెన్ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలను కూడా పోగొట్టుకుంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోతేనే ఆమె బాగా ఆడతుంది అన్న ముద్రను మరింత సుస్థిరం చేసుకుంది. ఇన్నాళ్లు డబ్ల్యూపీఎల్లో కెప్టెన్గా, బ్యాటర్గా విఫలమైన మంధాన తాజాగా బౌలింగ్లోనూ దారుణ ప్రదర్శన ఇచ్చింది. రాక రాక బౌలింగ్కు వచ్చిన ఆమె ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఒకే ఒక్క ఓవర్ వేసిన ఆమె ఓవర్ను కూడా పూర్తిగా వేయలేకపోయింది. ఐదు వైడ్లు వేసి ప్రత్యర్థి జట్టును గెలిపించింది. కేవలం మూడు బంతులు మాత్రమే సరిగ్గా వేసిన ఆమె మిగతా ఐదు బంతులు వైడ్లు వేయడం గమనార్హం. ఇక మంధానను విరాట్ కోహ్లితో కొంత మంది పోల్చారు. కోహ్లి కూడా తన తొలి ఐపీఎల్ సీజన్లో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. ఆ తర్వాత సీజన్ నుంచి మాత్రం దుమ్మురేపే ప్రదర్శనతో సుస్థిరంగా పరుగులు సాధిస్తూ వచ్చాడు. మంధాన కూడా కోహ్లి లాగే తొలి సీజన్లో విఫలమైందని.. మలి సీజన్ నుంచి మాత్రం తన బ్యాటింగ్ పవర్ చూపిస్తుందని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. A season to forget for Smriti Mandhana. pic.twitter.com/shh9eGOTDg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2023 Both Virat Kohli (IPL) and Smriti Mandhana (WPL) have failed to score a fifty in their inaugural season for RCB. 📸: IPL/WPL pic.twitter.com/K1Pu5CORHD — CricTracker (@Cricketracker) March 21, 2023 చదవండి: ఓటమితో ముగింపు.. ఆర్సీబీకి తప్పని నిరాశ -
ఓటమితో ముగింపు.. ఆర్సీబీకి తప్పని నిరాశ
వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ముంబై ఇండియన్స్ తమ లీగ్ దశను విజయంతో ముగిస్తే.. ఆర్సీబీ మాత్రం ఓటమితో ఇంటిబాట పట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కావడంతో మ్యాచ్కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. అయినప్పటికి గెలుపుతో టోర్నీని ముగిద్దామని భావించిన ఆర్సీబీ వుమెన్కు నిరాశే ఎదురైంది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 16.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. తొలి వికెట్కు హేలీ మాథ్యూస్(24 పరుగులు), యస్తికా బాటియా(30 పరుగులు) 50 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరు ఔట్ అవ్వడం.. ఆ తర్వాత ముంబై వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ ట్రాక్ ఎక్కినట్లే కనిపించింది. కానీ అమేలియా కెర్(31 నాటౌట్).. పూజా వస్త్రాకర్(19 పరుగులు) కీలక భాగస్వామ్యం ఏర్పరిచి జట్టును గెలిపించింది. ఆర్సీబీ బౌలింగ్లో కనికా అహుజా రెండు వికెట్లు తీయగా.. శ్రేయాంక్ పాటిల్, ఎల్లిస్ పెర్రీ, మేఘన్ స్కా్ట్, ఆశా శోభనా తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో హర్మన్ సేన 8 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో టాప్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే అందుకున్న ఆర్సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో 36 బంతుల్లో 99 పరుగులతో విధ్వంసం సృష్టించిన సోఫీ డివైన్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగింది. ఎల్లిస్ పెర్రీ 29 పరుగులు, రిచా ఘోష్ 29 పరుగులు, స్మృతి మంధార 24 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ వుమెన్ బౌలర్లలో అమెలియా కెర్ మూడు వికెట్లు తీయగా.. నట్-సివర్ బ్రంట్ రెండు, ఇసీ వాంగ్, సయికా ఇషాకీ చెరొక వికెట్ తీశారు. చదవండి: కఠిన ప్రశ్న.. పుజారాను నమ్ముకుంటే అంతే! మెస్సీకి చేదు అనుభవం.. -
ఉపయోగం లేని మ్యాచ్.. టాప్ ప్లేస్ కోసం మాత్రమే
వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఇవాళ లీగ్ మ్యాచ్లకు ఆఖరిరోజు. నేటితో లీగ్ మ్యాచ్లు ముగియనున్న వేళ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉపయోగం లేని మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఏంచుకుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ సహా ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్, యూపీ వారియర్జ్లు ప్లేఆఫ్కు క్వాలిఫై కాగా.. ఆర్సీబీ, గుజరాత్లు ఎలిమినేట్ అయ్యాయి. ఈ మ్యాచ్లో గెలిచి ముంబై టాప్ ప్లేస్ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఆర్సీబీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. గత మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆర్సీబీ ముంబైతో మ్యాచ్లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది. ముఖ్యంగా గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో 36 బంతుల్లో 99 పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సోఫీ డివైన్పై మరోసారి దృష్టి నెలకొంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించి టాప్ప్లేస్తో లీగ్ దశను ముగియాలని చూస్తుంది. ఇక తొలి రౌండ్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ వుమెన్: యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నటాలీ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్. ఆర్సీబీ వుమెన్: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, ఆశా శోభన, మేగన్ షుట్, ప్రీతి బోస్ 🚨 Toss Update 🚨@mipaltan win the toss and elect to field first against @RCBTweets. Follow the match ▶️ https://t.co/BQoiFCRPhD#TATAWPL | #RCBvMI pic.twitter.com/AfbXXSf7la — Women's Premier League (WPL) (@wplt20) March 21, 2023 -
సూపర్ సోఫీ...
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఫామ్లోకి వచ్చింది. ఆడిన తొలి ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయిన బెంగళూరు జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. గుజరాత్ జెయింట్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మహిళల ఫ్రాంచైజీ క్రికెట్లో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. బెంగళూరుకు ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్ సోఫీ డివైన్ (36 బంతుల్లో 99; 9 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం పరుగు తేడాతో సెంచరీని కోల్పోయింది. స్మృతి (31 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్), సోఫీ తొలి వికెట్కు 9.2 ఓవర్లలో 125 పరుగులు జోడించడం విశేషం. సోఫీ అవుటయ్యాక ఎలీస్ పెరీ (12 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు), హీథెర్ నైట్ (15 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) దూకుడు కొనసాగిస్తూ బెంగళూరు జట్టును విజయతీరానికి చేర్చారు. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేసింది. లౌరా వోల్వార్ట్ (42 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్స్లు), యాష్లే గార్డ్నర్ (26 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముంబై ఇండియన్స్కు తొలి ఓటమి ఆడిన ఐదు మ్యాచ్ల్లో గెలిచి అజేయంగా ఉన్న ముంబై ఇండియన్స్కు తొలి ఓటమి ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టును ఓడించింది. తొలుత ముంబై జట్టు 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. హేలీ మాథ్యూస్ (35; 1 ఫోర్, 3 సిక్స్లు), ఇసీ వాంగ్ (32; 4 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్ప్రీత్ కౌర్ (25; 3 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ (3/15), రాజేశ్వరి (2/16), దీప్తి శర్మ (2/35) రాణించారు. అనంతరం యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. తాలియా మెక్గ్రాత్ (38; 6 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (39; 7 ఫోర్లు) మెరిపించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీప్తి శర్మ (13 నాటౌట్; 1 ఫోర్), సోఫీ ఎకిల్స్టోన్ (16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) యూపీ జట్టు విజయాన్ని ఖాయం చేశారు. -
హమ్మయ్య,.. మొత్తానికి ఆర్సీబీ గెలిచింది
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో ఆర్సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం యూపీ వారియర్జ్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ వుమెన్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. కనికా అహుజా 46 పరుగులతో టాప్ స్కోరర్గా గెలవగా.. రిచా ఘోష్ 31 నాటౌట్, హెథర్నైట్ 24 పరుగులు చేశారు. ఆఖర్లో కనికా అహుజా ఔట్ అయినప్పటికి రిచా ఘోష్ జట్టును గెలిపించింది. యూపీ వారియర్జ్ బౌలింగ్లో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.. గ్రేస్ హారిస్, దేవికా వైద్య తలా ఒక వికెట్ తీశారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయింది. హారిస్ గ్రేస్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. దీప్తి శర్మ 22, కిరణ్ నవగిరె 22 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆశా శోభన, సోఫీ డివైన్లు చెరొక రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఇతర మ్యాచ్ ఫలితాలపై మాత్రమే ఆర్సీబీ ప్లేఆఫ్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
WPL 2023: యూపీ వారియర్జ్తో మ్యాచ్.. ఆర్సీబీ ఇవాళైనా
వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఇంతవరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్. ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ ఓటమిపాలైన స్మృతి మంధాన సేన ఒక్క విజయం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన ఆర్సీబీ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్తో మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. మరోవైపు యూపీ వారియర్జ్ తాము ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండింట గెలిచి.. మరో రెండింటిలో ఓడిపోయి మూడో స్థానంలో ఉంది. ఇక తొలి రౌండ్ మ్యాచ్లో ఆర్సీబీపై యూపీ వారియర్జ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్లో ఎల్లిస్ పెర్రీ మినహా మిగతావారు పెద్దగా రాణించడం లేదు. స్మృతి మంధాన అయితే అటు కెప్టెన్గా.. ఇటు బ్యాటర్గా దారుణంగా విఫలమవుతూ వస్తోంది. ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. రిచా ఘోష్, సోఫీ డివైన్, హెథర్ నైట్లు బ్యాట్ ఝులిపించలేకపోతున్నారు. ఇక యూపీ వారియర్జ్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ అలిస్సా హేలీ ఫామ్లో ఉండడం సానుకూలాంశం. అయితే ఆమె మినహా మిగతావారు రాణించకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఆర్సీబీ వుమెన్ తుదిజట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, కనికా అహుజా యూపీ వారియర్జ్ తుదిజట్టు: అలిస్సా హీలీ(కెప్టెన్/వికెట్ కీపర్), దేవికా వైద్య, కిరణ్ నవ్గిరే, గ్రేస్ హారిస్, తహ్లియా మెక్గ్రాత్, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్ వైరల్గా మారిన రిషబ్ పంత్ చర్య -
WPL 2023: మారని ఆర్సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి
మారని ఆర్సీబీ ఆటతీరు.. వరుసగా ఐదో ఓటమి వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ వుమెన్ కథ మారడం లేదు. లీగ్లో వరుసగా ఐదో పరాజయాన్ని మూటగట్టుకుంది. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. అలైస్ క్యాప్సీ(38 పరుగులు), కాప్(32 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ 32 పరుగులు, జెస్ జొనాసెన్ 25 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు తీయగా.. ప్రీతిబోస్, మేఘన్ స్కాట్ చెరొక వికెట్ తీశారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది. నాలుగో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతున్న జెమీమా రోడ్రిగ్స్(32) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. కాప్ 16, జొనాసెన్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 37 పరుగులు కావాలి. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 90/3 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ మూడు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ 18, కాప్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు కెప్టె్న్ మెగ్ లానింగ్ 15 పరుగులు చేసి ఆశా శోభనా బౌలింగ్లో హెథర్నైట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ అలైస్ క్యాప్సీ(38) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులుగా ఉంది. మెగ్ లానింగ్ 3 పరుగులతో క్రీజులో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 151 ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 67 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రిచా ఘోష్ 37 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నొరిస్ ఒక వికెట్ పడగొట్టింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్.. ప్రస్తతం ఢిల్లీ 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. 12 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 62/2 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 23, హెథర్ నైట్ 11 పరుగులతో ఆడుతున్నారు. 8 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 38/1 ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగుతుంది. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది. క్రీజులో ఎలిస్ పెర్రీ 10, సోఫీ డివైన్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు స్మృతి మంధాన 8 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. స్మృతి మంధాన ఔట్.. తొలి వికెట్ డౌన్ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వైఫల్యం కొనసాగుతుంది. ఢిల్లీ వుమెన్తో మ్యాచ్లో 8 పరుగులు మాత్రమే చేసిన మంధాన శిఖా పాండే బౌలింగ్లో రోడ్రిగ్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం ఆర్సీబీ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఇవాళ ఆర్సీబీ వుమెన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఏంచుకుంది. తొలి రౌండ్ మ్యాచ్ల్లో వరుసగా ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ ఓటమిపాలైన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట గెలిచి.. ఒక్క ఓటమితో ఆరు పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఆర్సీబీ వుమెన్స్ ఎంత మేరకు నిలువరిస్తుందనేది చూడాలి. ఇక తొలి రౌండ్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ): స్మృతి మంధన(కెప్టెన్), సోఫీ డివైన్, హీథర్ నైట్, దిషా కసత్, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ): షఫాలీ వర్మ, మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), మరిజాన్ కప్, జెమీమా రోడ్రిగెస్, అలైస్ క్యాప్సీ, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (వికెట్కీపర్), అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, తారా నోరిస్ -
'బ్యాటర్గా విఫలం.. ఓటములకు పూర్తి బాధ్యత నాదే'
వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ ఓటమిపాలైంది. శుక్రవారం యూపీ వారియర్జ్తో మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటములకు పూర్తి బాధ్యత తానే వహిస్తున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. మ్యాచ్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన స్మృతి మంధాన.. ''గత నాలుగు మ్యాచ్లుగా ఇదే జరుగుతుంది. ప్రతీ మ్యాచ్లో మంచి ఆరంభం లభించినప్పటికి.. ఆ తర్వాత వికెట్లు కోల్పోతున్నాం. ఇది మ్యాచ్లపై ప్రభావం చూపిస్తోంది. మా గేమ్ ప్లాన్ సరిగా లేకపోవడంతోనే వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాం. ఈ ఓటములకు పూర్తి బాధ్యత నాదే. ఒక బ్యాటర్గా నేను పూర్తిగా ఫెయిలవుతున్నా. టాపార్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. ఓటములతో గడిచిన వారం మాకు కఠినంగా అనిపించింది. నా ఫ్యామిలీ ఎప్పుడు నాకు సపోర్ట్గా ఉంటుంది.. కానీ నా నమ్మకం ఏంటంటే ఒక్కరమే ఒంటరిగా కూర్చొని ఓటమికి గల కారణాలను వెతికి సరిచేసుకోవడమే'' అని చెప్పుకొచ్చింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ వుమెన్స్ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఎలిస్ పెర్రీ 52 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. సోఫి డివైన్ 36 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. యూపీ వారియర్జ్ బౌలర్లలో ఎసెల్స్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిసా హేలీ (47 బంతుల్లో 96 నాటౌట్, 18 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించగా.. దేవికా వైద్య 36 పరుగులతో సహకరించింది. Stay strong, captain! Let’s turn it around. 🙌#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 pic.twitter.com/LRvv9pXaAi — Royal Challengers Bangalore (@RCBTweets) March 10, 2023 చదవండి: Cristiano Ronaldo: ఇదే తగ్గించుకుంటే మంచిది.. 41 బంతుల్లోనే శతకం.. అతిపెద్ద టార్గెట్ను చేధించి ప్లేఆఫ్స్కు -
గుజరాత్కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి
గుజరాత్కు తొలి గెలుపు.. ఆర్సీబీకి హ్యాట్రిక్ ఓటమి ఆర్సీబీ ఆటతీరు మారడం లేదు. వరుసగా మూడో ఓటమితో లీగ్లో హ్యాట్రిక్ నమోదు చేసింది. 202 పరుగల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సోఫీ డివైన్ 45 బంతుల్లో 66 పరుగులు, హెథర్నైట్ 11 బంతుల్లో 30 పరుగులు నాటౌట్ రాణించినప్పటికి చేయాల్సిన స్కోరు ఎక్కువగా ఉండడం.. మిగతావారు విఫలం కావడంతో ఆర్సీబీకి ఓటమి ఎదురైంది. గుజరత్ బౌలర్లలో అష్లే గార్డనర్ మూడు వికెట్లు తీయగా.. అన్నాబెల్ సదర్లాండ్ రెండు, మాన్సీ జోషీ ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్నైట్లు చెరో రెండు వికెట్లు తీశారు. 14 ఓవర్లలో ఆర్సీబీ 118/2 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 51 పరుగులతో, రిచా ఘోష్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 88 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 24, సోఫీ డివైన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లలో ఆర్సీబీ 74/1 9 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ 16, సోఫీ డివైన్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ స్మృతి మంధాన(18) రూపంలో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అష్లే గార్డనర్ బౌలింగ్లో మాన్సీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. టార్గెట్ 202.. ధీటుగా బదులిస్తున్న ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆర్సీబీ ధాటిగా ఆడుతుంది. 5 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసిది. సోఫీ డివైన్ 18 బంతుల్లో 31, మంధాన 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. దంచికొట్టిన గుజరాత్.. ఆర్సీబీ టార్గెట్ 202 ఆర్సీబీతో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సోఫియా డంక్లీ(28 బంతుల్లో 65 పరుగులు) విధ్వంసానికి తోడుగా హర్లిన్ డియోల్(45 బంతుల్లో 67 పరుగులు) మెరుపులు మెరిపించింది. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శ్రేయాంక్ పాటిల్ బౌలింగ్ బాగా వేయడంతో గుజరాత్ స్కోరు కాస్త తగ్గింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్, హెథర్నైట్లు చెరో రెండు వికెట్లు తీశారు. దంచికొడుతున్న గుజరాత్.. 14 ఓవర్లలో 136/3 ఆర్సీబీ వుమెన్తో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 42, దయాలన్ హేమలత ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. 18 బంతుల్లోనే అర్థశతకం.. గుజరాత్ జెయింట్స్ ఓపెనర్ డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందుకుంది. ప్రీతీ బోస్ వేసిన ఇన్నింగ్స్ 5వ ఓవర్లో డంక్లీ వీరవిహారం చేసింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్తో 22 పరుగులు పిండుకున్న డంక్లీ 18 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం గుజరాత్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. డంక్లీ 54, హర్లీన్ డియోల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆర్సీబీ వుమెన్తో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 8 పరుగులు చేసిన సబ్బినేని మేఘన స్కౌట్ బౌలింగ్లో రిచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్తుతం గుజరాత్ మూడు ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బుధవారం ఆర్సీబీ వుమెన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. కాగా సీజన్లో ఇప్పటివరకు ఇరుజట్లు తాము ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమి పాలయ్యి పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లలో ఏ జట్టు భోణీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరుజట్లలో గుజరాత్ జెయింట్స్ కాస్త ఫెవరెట్గా కనిపిస్తోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్లో కూడా స్నేహ్ రాణానే కెప్టెన్గా గుజరాత్ను నడిపించనుంది. ఆర్సీబీ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూనమ్ ఖేమ్నార్, కనికా అహుజా, శ్రేయాంక పాటిల్, మేగాన్ షుట్, రేణుకా ఠాకూర్ సింగ్, ప్రీతి బోస్ గుజరాత్ జెయింట్స్(ప్లేయింగ్ XI): స్నేహ్ రాణా(కెప్టెన్) సబ్బినేని మేఘన, సోఫియా డంక్లీ, హర్లీన్ డియోల్, అన్నాబెల్ సదర్లాండ్, సుష్మా వర్మ(వికెట్ కీపర్), అష్లీగ్ గార్డనర్, దయాళన్ హేమలత, కిమ్ గార్త్, మాన్సీ జోషి, తనూజా కన్వర్ -
RCB: సప్తవర్ణశోభితం.. హోలీ వేడుకల్లో స్మృతి సేన! శాశ్వతంగా ఉండిపోదు కదా!
WPL 2023 RCB- Holi 2023: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా క్రికెటర్లు రంగుల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగు చల్లుకుంటూ హోలీ పండుగను సంబరంగా జరుపుకొన్నారు. కెప్టెన్ స్మృతి మంధాన సహా విదేశీ ప్లేయర్లు ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, హీథర్ నైట్ ఈ వేడుకల్లో భాగమయ్యారు. శాశ్వతంగా ఉండిపోతుందా? తమ ప్లేయర్లంతా సప్తవర్ణశోభితమై ఉన్న ఫొటోలను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆసీస్ క్రికెటర్ ఎలిస్ పెర్రీ.. ‘‘ఇప్పటికే రెండుసార్లు హెయిర్ వాష్ చేశా! ఒకవేళ ఈ రంగు శాశ్వతంగా ఉండిపోదు కదా!’’ అంటూ గులాల్తో నిండిపోయిన జుట్టుతో ఉన్న ఫొటోను షేర్ చేసి సరదాగా కామెంట్ చేసింది. రెండింటిలోనూ ఓటమి బీసీసీఐ తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆర్సీబీ ఫ్రాంఛైజీ జట్టును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు లీగ్లోనే అత్యధికంగా 3.4 కోట్ల రూపాయల భారీ ధర చెల్లించి ఆమెను కొనుగోలు చేసింది. ఇక స్మృతిని కెప్టెన్గా నియమించిన ఆర్సీబీ.. టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాను తమ మెంటార్గా నియమించి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఆర్సీబీ ఓడిపోవడం గమనార్హం. ఆరంభ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 60 పరుగులు, రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో బుధవారం (మార్చి 8) గుజరాత్ జెయింట్స్తో మ్యాచ్లో గెలిచి విజయ ప్రస్థానాన్ని ఆరంభించాలని పట్టుదలగా ఉంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్. చదవండి: Saeed Anwar-PM Modi: ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. Ind Vs Aus: నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్న టీమిండియా.. యువ బ్యాటర్పై ద్రవిడ్ ప్రత్యేక శ్రద్ధ -
వారికి 7 కోట్లు.. వీరికి 50 లక్షలు! నిర్ణయాలు భేష్! మరీ కోట్లలో వ్యత్యాసమేల?!
International Women's Day- BCCI- IPL 2023:భారత క్రికెట్ నియంత్రణ మండలి గత ఆర్నెళ్ల కాలంలో రెండు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. లింగ వివక్షను రూపుమాపే క్రమంలో సరికొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టింది. మహిళా క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు గొప్ప ముందడుగు వేసింది. అందులో మొదటిది.. మ్యాచ్ ఫీజులు.. అవును.. పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు చెల్లించే ఫీజులు అసలు లెక్కలోకే రావు! దీంతో మిగతా రంగాల మాదిరే క్రికెట్లోనూ అమ్మాయిల పట్ల ఉన్న వివక్షను తొలగించాలని.. మ్యాచ్ ఫీజుల విషయంలో ఉన్న అంతరాన్ని తొలగించాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇందుకు అనుగుణంగా గతేడాది అక్టోబరులో బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఇక నుంచి భారత మహిళల జట్టు కాంట్రాక్ట్ క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లిస్తామని అక్టోబరు 27న బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లకు టెస్టు మ్యాచ్కు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు, టి20 మ్యాచ్కు రూ. 3 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు బోర్డు తెలిపింది. మహిళా క్రికెట్ను మరోస్థాయికి తీసుకువెళ్లేలా.. క్రికెటర్లుగా ఎదగాలని కోరుకునే అమ్మాయిల ఆశలకు ఊపిరిలూదుతూ బీసీసీఐ తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చిన రోజును ‘రెడ్ లెటర్ డే’గా అభివర్ణిస్తూ హర్షం వ్యక్తమైంది. సచిన్ టెండుల్కర్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయంలోనూ తొలుత న్యూజిలాండే! మహిళా క్రికెట్లో తొలి టీ20 లీగ్ను ప్రవేశపెట్టింది న్యూజిలాండ్. వుమెన్స్ సూపర్ స్మాష్ పేరిట 2007 నుంచి నేటికీ లీగ్ను కొనసాగిస్తోంది. తర్వాత వెస్టిండీస్ ట్వంటీ20 బ్లేజ్ పేరుతో 2012 నుంచి లీగ్ను నిర్వహిస్తోంది. ఇక ఆస్ట్రేలియా.. విజయవంతమైన బిగ్బాష్ లీగ్(పురుషులు)లో మహిళా క్రికెటర్లను భాగం చేసేందుకు 2015లో వుమెన్స్ బిగ్బాష్ లీగ్ను ప్రవేశపెట్టింది. నాటి నుంచి నేటిదాకా ఈ టోర్నీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లండ్లో చార్లెట్ ఎడ్వర్డ్స్ కప్(2021 నుంచి), భారత్లో వుమెన్స్ టీ20 చాలెంజ్(2018-2022), వెస్టిండీస్లో ట్వంటీ20 బ్లేజ్(2012-), వుమెన్స్ కరేబియన్ లీగ్(2022-), జింబాబ్వేలో వుమెన్స్ టీ20(2020), పాకిస్తాన్లో పీసీబీ ట్రయాంగులర్ ట్వంటీ20(2020), సౌతాఫ్రికాలో వుమెన్స్ టీ20 సూపర్లీగ్(2019-), శ్రీలంకలో వుమెన్స్ సూపర్ ప్రొవెన్షియల్ టీ20 టోర్నమెంట్(2019-).. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహిళా టీ20 లీగ్లు ఉన్నాయి. అయితే, ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగెస్, పూజా వస్త్రాకర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ తదితరులు పేరెన్నికగన్న బిగ్బాష్ లీగ్లో ఆడారు. ఐపీఎల్తో పాటు డబ్ల్యూపీఎల్ అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుష టీ20లీగ్లను తలదన్నేలా క్యాష్ రిచ్ లీగ్ను రూపొందించిన.. బీసీసీఐ కాస్త ఆలస్యంగానైనా వుమెన్ ప్రీమియర్ లీగ్ను ప్రవేశపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా (దేశీ, విదేశీ) ఎంతో మంది పురుష క్రికెటర్లకు లైఫ్నిచ్చిన ఐపీఎల్తో పాటు డబ్ల్యూపీఎల్ను నిర్వహించేందుకు సమాయత్తమైంది. మార్చి 4, 2023న ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ మ్యాచ్తో ఈ మహిళా ప్రీమియర్ లీగ్కు తెరలేచింది. ఇద్దరు భారత కెప్టెన్లు(హర్మన్ప్రీత్ కౌర్(ముంబై), స్మృతి మంధాన), ముగ్గురు విదేశీ కెప్టెన్లు(మెగ్ లానింగ్, బెత్మూనీ, అలిసా హేలీ) ఈ లీగ్లో ఆయా జట్లను ముందుకు నడిపిస్తున్నారు. హర్షణీయమే కానీ.. కోట్లలో తేడా అంటే దారుణం! తొలుత మ్యాచ్ ఫీజుల విషయం.. ఇప్పుడు ఇలా టీ20 లీగ్.. మరి నిజంగానే భారత్లో పురుష, మహిళా క్రికెటర్ల మధ్య అంతరాలు పూర్తిగా తొలగిపోయినట్లేనా? అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఫీజుల విషయంలో సమానత్వాన్ని అమలు చేసేందుకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షణీయమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిజానికి న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్న రెండో బోర్డుగా బీసీసీఐ ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో కూడా వ్యత్యాసం కొనసాగుతున్న వేళ ఇలాంటి నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, కాంట్రాక్టుల విషయంలో ఇంకా ఆ వ్యత్యాసం అలాగే ఉండిపోవడం, ఈ అంశంపై బీసీసీఐ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. చరిత్ర సృష్టించిన షఫాలీ సేన 2017 వన్డే వరల్డ్కప్లో ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు.. ఇటీవలి ప్రపంచకప్లో సెమీస్ వరకు చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన అండర్-19 మహిళా టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో ఏకంగా చాంపియన్గా నిలిచి చరిత్రకెక్కింది. యువ కెరటం షఫాలీ వర్మ సారథ్యంలో ఈ అద్భుతం జరిగింది. వాళ్లకు కోట్లు.. వీళ్లకు లక్షలు అయితే, బోర్డు ఇంతవరకు కాంట్రాక్ట్ మొత్తం విషయంలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. పురుష క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్లలో వరుసగా రూ. 5 కోట్లు, రూ. 3 కోట్లు, రూ. 1 కోటితో పాటు ‘ఎ’ ప్లస్ కేటగిరీలో రూ. 7 కోట్లు చెల్లించే బీసీసీఐ.. మహిళా క్రికెటర్లలో ‘ఎ’ గ్రేడ్కు రూ. 50 లక్షలు, ‘బి’, ‘సి’ గ్రేడ్లకు రూ. 30 లక్షలు, రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తోంది. పురుషుల క్రికెట్కు ఉన్న ఆదరణ, స్పాన్సర్లు, ప్రేక్షకులు, రేటింగ్లు, బ్రాండ్ వాల్యూ దృష్ట్యా వారికి అంతమొత్తం చెల్లిస్తున్నారన్న మాట కాదనలేని వాస్తవమే. ఆరు రెట్లు అధికం అయితే, ఇరువురి కాంట్రాక్టుల విషయంలో కోట్లల్లో వ్యత్యాసం ఉండటం మరీ దారుణం. ప్రపంచంలోనే సంపన్న బోర్డు అయిన బీసీసీఐపై.. పురుషుల క్రికెట్ స్థాయికి చేరేలా మహిళా క్రికెట్ను మరింత ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. ఇక డబ్ల్యూపీఎల్ విషయానికొస్తే.. ఐదు జట్లలో అత్యధికంగా ముగ్గురు విదేశీ కెప్టెన్లే! వేలంలో అత్యధిక 3.40 కోట్ల రూపాయలు. ఐపీఎల్ వేలంలో 18 కోట్ల పైచిలుకు ధర పలికే ఆటగాళ్ల కంటే దాదాపు ఆరు రెట్లు తక్కువ. ఒకవేళ లీగ్ భారీగా సక్సెస్ అయితే.. ఈ ధరలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కానీ.. కాంట్రాక్ట్ విషయంలో మాత్రం బోర్డు తలచుకుంటేనే మహిళా క్రికెటర్ల భవితవ్యం మారుతుంది. ఆట మీద ప్రేమతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్న వాళ్లు ఆర్థికంగా మరింత నిలదొక్కుకునే ఆస్కారం ఉంటుంది. కూతుళ్లను క్రికెటర్లు చేయాలనుకునే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు సైతం కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ‘‘యా దేవి సర్వభూతేశు, శక్తి రూపేన సమస్థితా’’ అంటూ మహిళా శక్తిని చాటేలా గీతం రూపొందించిన బీసీసీఐ.. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఓ మ్యాచ్ను మైదానంలో ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించిన బోర్డు.. వచ్చే ఏడాది తిరిగేలోపు కాంట్రాక్టుల విషయంలో మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షిద్దాం!! -సాక్షి, వెబ్డెస్క్ చదవండి: IPL 2023: కోహ్లికి ముచ్చెమటలు పట్టించిన బౌలర్ను తెచ్చుకోనున్న ముంబై ఇండియన్స్ WPL 2023: రెండు ముంబై ఇండియన్స్ జట్లు.. రెండు వేర్వేరు ఆరంభాలు View this post on Instagram A post shared by Women's Premier League (WPL) (@wplt20) -
MI Vs RCB: ఓటమికి ప్రధాన కారణం అదే.. అయినా: స్మృతి మంధాన
Same Results Memes Trolls On RCB: ‘‘మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. మెరుగైన స్కోరు నమోదు చేయాల్సింది. ఓటమిని అంగీకరించకతప్పదు. అయితే, కచ్చితంగా లోపాలు సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటాం. నిజానికి నాతో సహా ఇద్దరు- ముగ్గురు బ్యాటర్లు కనీసం 20 పరుగులు చేయగలిగారు. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాం. నిజం చెప్పాలంటే.. మా బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. 6-7 మంచి ఆప్షన్లు ఉన్నాయి. కానీ బ్యాటర్లు మెరుగైన స్కోరు నమోదు చేయనపుడు వారు మాత్రం ఏం చేయగలుగుతారు. కాబట్టి ఇందుకు వాళ్లను బాధ్యులను చేయడం సరికాదు. ఫ్రాంఛైజ్ క్రికెట్లో మనకు శుభారంభాలు లభించినా.. మ్యాచ్ గెలుస్తున్నామనిపించినా.. ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందో అంచనా వేయలేం. అయితే, ఈ రోజు మ్యాచ్లో టాపార్డర్ విఫలమైన వేళ కనిక, శ్రియాంక బ్యాటింగ్ చేసిన తీరు మాకు అత్యంత సానుకూల అంశం. వాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన పేర్కొంది. ముంబై ఇండియన్స్ వుమెన్తో పోరులో ఓటమికి బాధ్యత వహించిన స్మృతి.. బ్యాటర్ల వైఫల్యమే పరాజయానికి ప్రధాన కారణమని తెలిపింది. PC: RCB కాగా మహిళా ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్లోనూ ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన 23, వికెట్ కీపర్ రిచా ఘోష్ 28, లోయర్ ఆర్డర్లో కనికా అహుజా 22, శ్రియాంక పాటిల్ 23, మేగన్ షట్ 20 పరుగులు చేయగలిగారు. మిగిలిన వాళ్లు కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆర్సీబీ ఆలౌట్ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి టార్గెట్ ఛేదించింది. ముంబై ఓపెనర్ హేలీ మాథ్యూస్ 77 పరుగులతో అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ యస్తికా భాటియా 23 పరుగులు చేసింది. వన్డౌన్ బ్యాటర్ నటాలీ సీవర్- బ్రంట్ 55 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హేలీ మాథ్యూస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకుంది. ఇక వరుసగా రెండు మ్యాచ్లలో ఓడటంతో ఆర్సీబీపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇక ఆర్సీబీ రాత మారదని, కోహ్లి వారసత్వాన్ని స్మృతి కొనసాగిస్తుందంటూ మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ ఇందుకు ధీటుగానే బదులిస్తున్నారు. కేవలం రెండు మ్యాచ్లతో అంచనా వేయొద్దని హితవు పలుకుతున్నారు. ఇక స్మృతి సేన మార్చి 8న గుజరాత్తో తదుపరి మ్యాచ్ ఆడనుంది. చదవండి: WPL 2023 GG Vs RCB: మహిళా దినోత్సవ కానుక.. బీసీసీఐ బంపరాఫర్.. అందరికీ ఉచిత ప్రవేశం! Shubman Gill: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గిల్.. సారా అలీఖాన్ కాదు! ఆమే నా క్రష్ అంటూ.. Every Year Same Story For RCB Fans And Meme Material For MI And CsK Fans pic.twitter.com/sgKFfQOqPt — Captain Jack Sparrow (@ImVivaan45) March 6, 2023 Virat Kohli Legacy is Followed By #SmritiMandhana🤣🤣 Haarcb ☕☕#RCBWvsMIW . #MIvsRCB . #WPL2023 pic.twitter.com/dBB11lv8GY — क्रिकेट प्रेमी (Cricket Premi) VK18 💓 (@cricaddicted18) March 6, 2023 -
ఆర్సీబీ రాత ఇంతేనా.. మహిళల ఐపీఎల్లోనూ నిరాశ తప్పదా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ (2008) నుంచి ఏ యేటికి ఆ యేడు ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు, ప్రతి సీజన్లోనూ ఉసూరుమనిపిస్తూ ఫ్రాంచైజీ అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తున్న విషయం విధితమే. పేరులో రాయల్, జట్టు నిండా స్టార్లు ఉన్నారనే మాట తప్పించి, ఆర్సీబీ 15 ఎడిషన్లలో సాధించింది ఏమీ లేదు. 2009, 2011, 2016 ఎడిషన్లలో రన్నరప్గా నిలిచిన ఆ జట్టు.. ప్రతి యేడు 'ఈ సాలా కప్ నమ్మదే' అనడం తప్ప ఒక్కసారి కూడా టైటిల్ సాధించింది లేదు. 2009 ఎడిషన్లో రాస్ టేలర్, 2011లో క్రిస్ గేల్, 2016లో విరాట్ కోహ్లి ఒంటిరిగా విజృంభించడంతో ఈ మూడు ఎడిషన్లలో ఫైనల్కు చేరింది తప్పిస్తే.. ఈ జట్టు మూకుమ్మడిగా ఆడి, గెలిచింది ఎప్పుడూ లేదు. కనీసం మహిళల ఐపీఎల్ (WPL)లో అయినా ఫేట్ మారుతుందని ఆశించిన ఆర్సీబీ అభిమానులకు ఇక్కడ కూడా నిరాశ తప్పడం లేదు. మెన్స్ టీమ్కు తాము ఏమాత్రం తక్కువ కాదన్నట్లు, మహిళల టీమ్ పోటీపడి మరీ వరుస పరాజయాలు మూటగట్టుకుంటుంది. డబ్ల్యూపీఎల్-2023లో ఆర్సీబీ వుమెన్స్ టీమ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలై, మెన్స్ ఆర్సీబీని గుర్తు చేస్తుంది. మెన్స్ ఆర్సీబీ లాగే వుమెన్స్ ఆర్సీబీ కూడా స్టార్లతో కళకళలాడుతున్నప్పటికీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడుతుంది.కోట్లు కుమ్మరించి ఏరికోరి ఎంచుకున్న కెప్టెన్ మంధన వ్యూహాలు రచించడంలో దారుణంగా విఫలమవుతుండగా.. ఢిల్లీ, ముంబైలతో జరిగిన మ్యాచ్ల్లో అంతర్జాతీయ స్టార్లు సోఫీ డివైన్, రిచా ఘోష్, రేణుకా సింగ్ పూర్తిగా చేతులెత్తేశారు. ఢిల్లీతో మ్యాచ్లో ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, మెగాన్ షట్ పర్వాలేదనిపించగా.. కెప్టెన్ మంధన రెండు మ్యాచ్ల్లో బ్యాట్తో ఓకే అనిపించింది. లీగ్లో తదుపరి మ్యాచ్ల్లో కూడా ఆర్సీబీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే, మెన్స్ ఆర్సీబీలాగే ఈ జట్టు పరిస్థితి కూడా పేపర్పై పులిలా తయారవుతుంది. కాగా, డబ్ల్యూపీఎల్ అరంగ్రేటం సీజన్లో భారీ అంచనాల నడుమ బరిలో నిలిచిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో, రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్ల్లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించినా, ఆతర్వాత వచ్చే ప్లేయర్లు దారుణంగా విఫలమయ్యారు. బ్యాటింగ్ విషయంలో వరుస ఇదైతే, బౌలింగ్లో ఆర్సీబీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఢిల్లీతో మ్యాచ్లో షఫాలీ, లాన్నింగ్లకు కనీసం డాట్ బాల్ వేయలేక ఆర్సీబీ బౌలర్లు అష్టకష్టాలు పడ్డారు. ఆ మ్యాచ్లో తొలి ఓవర్ మినహాయించి, 19 ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు బౌండరీలు, సిక్సర్లు సమర్పించుకున్నారు. ముంబైతో మ్యాచ్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగింది. దాదాపుగా అందరూ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రెండు మ్యాచ్ల్లో కలిపి ఆర్సీబీ బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. -
MI Vs RCB: పరుగుల వరద.. ముంబైపై ఆర్సీబీ గెలుపు ఖాయం!
Womens Premier League 2023 RCB VS MI: మహిళా ప్రీమియర్ లీగ్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తప్పక గెలుస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ముంబై ఇండియన్స్ మహిళా జట్టుపై స్మృతి సేన పైచేయి సాధిస్తుందని జోస్యం చెప్పాడు. ఇరు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగడం ఖాయమని.. ఆర్సీబీని విజయం వరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే, టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవాలని సూచించాడు. ఇక ముంబై టాపార్డర్ పటిష్టంగా ఉన్నపటికీ ఆర్సీబీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు విశ్లేషిస్తూ తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘బెంగళూరు మొదటి మ్యాచ్లో ఓడిపోయింది. అయితే, ఆ మ్యాచ్ జరిగింది బ్రబౌర్న్ స్టేడియంలో అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబైతోనూ అదే మైదానంలో పోటీపడనుంది. ఇప్పటికే బ్రబౌర్న్లో ఆడినందు వల్ల అక్కడి పరిస్థితులపై ఆర్సీబీ ప్లేయర్లకు అవగాహన ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవేళ గత ప్రదర్శనలు గమనిస్తే అందరూ ముంబై వైపే మొగ్గు చూపుతారు. కానీ నేను మాత్రం ఈసారి ఆర్సీబీకే ఓటు వేస్తున్నా. స్మృతి రాణిస్తేనే అయితే, స్మృతి భారీ స్కోరు నమోదు చేయాల్సి ఉంది. ముఖ్యంగా ముంబై స్పిన్ ఆల్రౌండర్ హైలీ మాథ్యూస్ను సమర్థవంతంగా ఎదుర్కోగలగాలి. ఈ ఆఫ్ స్పిన్నర్ కచ్చితంగా స్మృతిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి స్మృతి మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ఇక సోఫీ డివైన్ కూడా బ్యాట్ ఝులిపించాల్సి ఉంది. ఇక ఆర్సీబీ పేస్ ఆల్రౌండర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్ సేవలను మరింత మెరుగ్గా వాడుకోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అదే విధంగా ముంబై బ్యాటింగ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ముంబై టాపార్డర్ అత్యద్భుతంగా ఉంది. హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్, అమేలియా కెర్.. ఆ తర్వాత పూజా వస్త్రాకర్లతో పటిష్టంగా కనపడుతోంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందన్న ఆకాశ్ చోప్రా.. ‘‘బ్రబౌర్న్ పిచ్ ఫ్లాట్గా ఉంది. మరో భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోవాలి. పిచ్ ఫ్లాట్గా ఉంటుంది.. కాబట్టి ఒకవేళ ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటే కనీసం 200 పరుగులు స్కోరు చేస్తేనే గెలిచే అవకాశాలు ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా డబ్ల్యూపీఎల్-2023 సీజన్ ఆరంభ మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో తలపడ్డ ముంబై.. 143 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో హర్మన్ప్రీత్ సేన ఆకాశమే హద్దుగా చెలరేగి తొలి మ్యాచ్లోనే అద్భుత విజయం సాధించింది. మరోవైపు.. తమ తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ టీమ్తో తలపడ్డ ఆర్సీబీ.. 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక గత మ్యాచ్లో ముంబై కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా.. ఆర్సీబీ సారథి స్మృతి 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 35 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో సోమవారం (మార్చి 6) మ్యాచ్ జరుగనుంది. చదవండి: Virat Kohli: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన సచిన్ ప్రపంచంలో మేటి బ్యాటరే.. కానీ..! షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు -
WPL 2023: నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు.. కనీసం: స్మృతి మంధాన
WPL 2023- Smriti Mandhana: ఇంతవరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా సరే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న క్రేజే వేరు. రోజురోజుకు ఆర్సీబీ అభిమానగణం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణం టీమిండియా స్టార్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్సీబీ నాయకుడిగా జట్టును ముందుండి నడిపించిన కోహ్లి ట్రోఫీ గెలవకపోయినా తన అద్భుత ఆట తీరుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. గత సీజన్తో కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన కోహ్లి ప్రస్తుతం ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్మృతి సారథ్యంలో ఇదిలా ఉంటే.. భారత మహిళా క్రికెట్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మహిళా ప్రీమియర్ లీగ్ మార్చి 4న ఆరంభమైన విషయం తెలిసిందే. ఐదు జట్లు పోటీపడుతున్న ఈ టీ20 లీగ్లో ఆర్సీబీ వుమెన్ టీమ్కు టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్తో మార్చి 5న మ్యాచ్ పూర్తి చేసుకున్న స్మృతి సేన.. సోమవారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లితో తనను పోలుస్తూ వస్తున్న వార్తలపై విలేకరుల ప్రశ్నకు స్మృతి ఈ విధంగా సమాధానమచ్చింది. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పోలికలు నాకు అస్సలు నచ్చవు. ఎందుకంటే కోహ్లి తన కెరీర్లో ఇప్పటికే ఎన్నో అద్భుత రికార్డులు సాధించాడు. నేను ఆ స్థాయికి చేరుకోవాలని కోరుకోవడమే తప్ప.. కనీసం కోహ్లి రికార్డులకు దరిదాపుల్లో కూడా లేను. ముఖ్యంగా ఆర్సీబీకి కోహ్లి అందిస్తున్న సేవలు అమోఘం. నేను కూడా తనలా ఉండేందుకు, జట్టును గొప్ప స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తా’’ అని స్మృతి పేర్కొంది. కాగా డబ్ల్యూపీఎల్-2023 వేలంలో భాగంగా ఆర్సీబీ అత్యధికంగా 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్మృతి మంధానను కొనుగోలు చేసింది. ఇక కోహ్లి, స్మృతి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం. ఇదిలా ఉంటే డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లి ఘనత.. ఇక 2013 నుంచి ఆర్సీబీ కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి.. 2021 సీజన్ తర్వాత నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. సారథిగా 140 మ్యాచ్ల్లో 66 విజయాలు.. 70 పరాజయాలు నమెదు చేశాడు. మరో 4 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. కోహ్లి సారథ్యంలో ఆర్సీబీ 2016లో రన్నరప్గా నిలిచింది. మరో మూడుసార్లు ప్లేఆఫ్స్(2015, 2020, 2021 )చేరింది. ఇక సుదీర్ఘకాలం తర్వాత ఫామ్లోకి వచ్చిన ఈ రన్మెషీన్ అంతర్జాతీయ క్రికెట్లో 74 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. చదవండి: WPL 2023: ఎంఎస్డీ పేరును బ్యాట్పై రాసుకుని హాఫ్ సెంచరీ బాదిన యూపీ వారియర్జ్ బ్యాటర్ Ind Vs Aus: ‘అసలు సెలక్టర్లు ఏం చేస్తున్నారు.. వాళ్లు రాజీనామా చేయాల్సిందే’.. టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు వైరల్ -
ముంబై ఇండియన్స్ రికార్డు బద్దలు కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఇవాళ (మార్చి 5) జరుగుతున్న మ్యాచ్ విధ్వంసానికి, పరుగుల ప్రవాహానికి వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మెగ్ లాన్నింగ్ (43 బంతుల్లో 72; 14 ఫోర్లు) మెరుపు హాఫ్సెంచరీలతో విరుచుకుపడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. షఫాలీ, లాన్నింగ్లను హీథర్ నైట్ ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపడంతో స్కోర్ కాస్త మందగించింది. ఒకవేళ వీరిద్దరూ చివరి వరకు క్రీజ్లో ఉండి ఉంటే సీన్ వేరేలా ఉండేది. ఆఖర్లో మారిజాన్ కాప్ (17 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగెస్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) కూడా చెలరేగి ఆడారు. డీసీ ఇన్నింగ్స్లో తొలి ఓవర్ మినహాయించి ప్రతి ఓవర్లో కనీసం ఓ బౌండరీ నమోదైందంటే డీసీ బ్యాటర్ల విధ్వంసం ఏ రేంజ్ సాగిందో ఇట్టే అర్ధమవుతుంది. ఈ మ్యాచ్లో డీసీ 223 పరుగులు చేయడంతో గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నెలకొల్పిన 207 పరుగుల టీమ్ టోటల్ రికార్డు బద్దలైంది. ముంబై సాధించిన స్కోర్ కంటే డీసీ జట్టు 16 పరుగులు అధికంగా సాధించింది. డీసీ ఓపెనర్లు, ముఖ్యంగా షఫాలీ వర్మ వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరీలకు తరలించి, ఐపీఎల్కు డబ్ల్యూపీఎల్ ఏమాత్రం తీసిపోదని చెప్పకనే చెప్పింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం డీసీ తరహాలోనే రెచ్చిపోవడంతో మ్యాచ్లో విధ్వంసకర వాతావరణం కొనసాగింది. 4 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. కాగా, డబ్ల్యూపీఎల్-2023 తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. -
'చిన్నప్పుడు నువ్వు పెద్ద టార్చ్బేరర్..'
టీమిండియా వుమెన్స్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఇప్పుడు బాగా పాపులర్. సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ స్టైల్ను తలపించే స్మృతి మంధాన ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తాజాగా వుమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023)లో భాగంగా మంధాన ఆర్సీబీ వుమెన్స్ కెప్టెన్గా ఎంపికైంది. రికార్డు స్థాయిలో రూ.3.4 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది. ఆర్సీబీ నాయకురాలిగా జట్టును నడిపించనున్న మంధాన ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్తో అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఆర్సీబీ.. జట్టు మెంటార్గా టెన్నిస్ మాజీ స్టార్ సానియా మీర్జాను నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు సన్నద్దమవుతున్న నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన, సానియా మీర్జాలు ఒకరినొకరు ఇంటర్య్వూ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ సందర్భంగా సానియా, మంధానలు కెరీర్ పరంగా ఎదిగిన తీరు, ఒత్తిడిని తట్టుకొని ఆడిన మ్యాచ్లు, ఆర్సీబీ లాంటి స్టార్ ఫ్రాంచైజీకి వివిధ హోదాల్లో ప్రాతినిధ్యం వహించడం గురించి పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. స్మృతి మంధాన మాట్లాడుతూ..'' నా ఇంట్లో సానియా మీర్జాను ఆదర్శంగా తీసుకున్నారు. సానియా ఎదుగుదల చూసి క్రికెట్ కంటే టెన్నిస్ ఆటను ఏంచుకోవాలంటూ ఎంకరేజ్ చేసేవారు. కానీ నా దృష్టంతా క్రికెట్పైనే ఉండేది. అందుకే నా చిన్నప్పుడు సానియా పెద్ద టార్చ్బేరర్లా కనిపించేది. ఎందుకంటే ప్రతి మహిళా అథ్లెట్ మరో సానియాలా తయారవుదామనుకునేవారు. అప్పట్లో ఇది బాగా ట్రెంట్ అయింది. 9 లేదా 10 ఏళ్లు అనుకుంటా నాకు బాగా గుర్తు.. మా అమ్మ నాతో ఒక విషయం చెప్పింది. ఎందుకు నువ్వు టెన్నిస్ను ఏంచుకోకూడదు.. అని ప్రశ్నించింది. దానికి నాకు క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి.. ఇప్పటికిప్పుడు క్రికెట్ నుంచి టెన్నిస్లోకి రాలేను. అందుకే క్రికెట్లో రాణించి మరో సానియాలా పేరు తెచ్చుకుంటా అని అమ్మకు మాటిచ్చా'' అంటూ తెలిపింది. మంధాన మాటలకు స్పందించిన సానియా.. ''థ్యాంక్ గాడ్ బతికించావు.. లేకుండా నాకు పోటీగా మరొకరు వచ్చేవారేమో(నవ్వుతూ)'' పేర్కొంది. ఇక మంధాన జెర్సీ నెంబర్ 18 ధరించడంపై సానియా ప్రశ్నించింది. టీమిండియాలో నెంబర్-18కి ప్రత్యేక స్థానం ఉంది. అది కోహ్లి జెర్సీ.. ఆర్సీబీ కూడా కోహ్లికి 18వ నెంబర్ కేటాయించింది. క్రికెట్ చరిత్రలోనే కోహ్లి బెస్ట్ క్రికెటర్గా పేరు పొందాడు. మరి అలాంటి జెర్సీ నువ్వు ధరించడంపై ఏమంటావు అని సానియా అడిగింది. దీనికి మంధాన స్పందిస్తూ.. ''గత పదేళ్లుగా నా జెర్సీ నెంబర్ సంఖ్య కూడా 18. అయితే యాదృశ్చికంగా కింగ్ కోహ్లి జెర్సీ కూడా అదే. అతనితో నా ఆటను పోల్చలేను. కానీ ఆర్సీబీ కోహ్లి అంత పేరు తెచ్చుకోవాలని అదే జెర్సీ నెంబర్ను నాకు కంటిన్యూ చేసింది. దీనిని నేను స్వాగతిస్తా.'' అంటూ ముగించింది. The Smriti Mandhana Sania Mirza Interview On Bold Diaries, Sania and Smriti caught up to discuss cricket, tennis, pressure, privilege, RCB, women and other inspiring anecdotes.#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 pic.twitter.com/AFS9M6MFKa — Royal Challengers Bangalore (@RCBTweets) March 5, 2023 చదవండి: హై స్కోరింగ్ మ్యాచ్ల కోసం ఇంత దిగజారాలా? -
టీ20 ర్యాంకింగ్స్లో దుమ్మురేపిన శ్రీలంక బ్యాటర్, ఇంగ్లండ్ ఆల్రౌండర్
Women's T20 Rankings: తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్లో శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్ ప్లేయర్స్ దుమ్మురేపారు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్కప్ సంచలన ప్రదర్శన నమోదు చేసిన శ్రీలంక యంగ్ గన్ విష్మి గుణరత్నే తాజా ర్యాంకింగ్స్లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 169 ప్లేస్కు చేరుకుంది. 17 ఏళ్ల విష్మి.. టీ20 వరల్డ్కప్ రన్నరప్ సౌతాఫ్రికాపై 35 పరుగులు, సిక్స్ టైమ్ వరల్డ్ ఛాంపియన్, ప్రస్తుత జగజ్జేత ఆస్ట్రేలియాపై 24 పరుగులు సాధించడం ద్వారా తన ర్యాంక్ను గణనీయంగా మెరుగుపర్చుకుంది. బ్యాటర్ల విభాగంలో విష్మితో పాటు ర్యాంక్లను మెరుగుపర్చుకున్న ప్లేయర్స్లో విండీస్కు చెందిన రషదా విలియమ్స్ (50 స్థానాలు), పాకిస్తాన్కు చెందిన ఫాతిమా సనా (36 స్థానాలు), బంగ్లా బ్యాటర్ నహిదా అక్తర్ (33 స్థానాలు), విండీస్ ప్లేయర్ చిన్నెల్ హెన్రీ (30 స్థానాలు) ఉన్నారు. ఈ విభాగంలో ఆసీస్ తహీల మెక్గ్రాత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. బెత్ మూనీ, స్మృతి మంధన, మెగ్ లాన్నింగ్, సోఫీ డివైన్, లారా వొల్వార్డ్ట్, ఆష్లే గార్డెనర్, సూజీ బేట్స్, అలైసా హీలీ, నతాలీ సీవర్ టాప్ 10లో ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. సోఫీ ఎక్లెస్స్టోన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మ్లాబా, డార్సీ బ్రౌన్, సారా గ్లెన్, దీప్తి శర్మ, మెగాన్ షట్, షబ్మిమ్ ఇస్మాయిల్, లీ తహుహు, రేణుకా సింగ్, ఆష్లే గార్డెనర్ టాప్-10లో ఉన్నారు. ఈ విభాగంలో ఇంగ్లండ్ స్పిన్నర్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 77 స్థానాలు ఎగబాకగా.. లారెన్ బెల్ (ఇంగ్లండ్) 60 స్థానాలు, కరిష్మా రామ్హరాక్ (విండీస్) 49 స్థానాలు, హన్నా రోవ్ (బంగ్లాదేశ్) 35 స్థానాలు, జార్జీనా డెంప్సీ (ఐర్లాండ్) 33 స్థానాలు మెరుగుపర్చుకుని, కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్లకు చేరుకున్నారు. ఆల్రౌండర్ల్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ చార్లీ డీన్ రికార్డు స్థాయిలో 103 స్థానాలు మెరుగుపర్చుకోగా.. తుబా హసన్ (పాక్) 47 స్థానాలు, కరిష్మా రమహరాక్ (విండీస్) 36 స్థానాలు, సాదియా ఇక్బాల్ (పాక్) 34 స్థానాలు, చిన్నెల్ హెన్రీ (విండీస్) 31 స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్స్కు చేరుకున్నారు. ఈ విభాగంలో ఆష్లే గార్డెనర్ టాప్లో కొనసాగుతుండగా.. హేలీ మాథ్యూ, దీప్తి శర్మ, అమెలియా కెర్ర్, నతాలీ సీవర్, సోఫీ డివైన్, నిదా దార్, క్యాథరీన్ బ్రైస్, ఎల్లిస్ పెర్రీ, సల్మా ఖాతూన్ టాప్-10లో ఉన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
WPL 2023: మహిళా ప్రీమియర్ లీగ్ 5 జట్లు, కెప్టెన్లు, హెడ్కోచ్లు వీరే!
Women's Premier League 2023 All 5 WPL Squads: భారత క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్కు రంగం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య శనివారం (మార్చి 4) నుంచి మహిళా క్రికెటర్ల పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్-2023కి సంబంధించిన జట్ల పూర్తి వివరాలు మీకోసం.. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు, కెప్టెన్లు, హెడ్కోచ్లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన- బెన్ సాయెర్ 2. ఢిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్- జొనాథన్ బాటీ 3. యూపీ వారియర్స్- అలిసా హేలీ- జాన్ లూయీస్ 4. గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ- రేచల్ హెయిన్స్ 5. ముంబై ఇండియన్స్- హర్మన్ప్రీత్ కౌర్- చార్లెట్ ఎడ్వర్డ్స్ 5 జట్ల సభ్యులు వీరే! 1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్ 2. ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. 3. యూపీ వారియర్స్ అలిసా హేలీ (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, సిమ్రన్ షేక్. 4. గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్. 5. ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. -
World Cup 2023 Semi Final: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్
India Women Vs Australia Women Live Updates: పోరాడి ఓడిన భారత్.. టోర్నీ నుంచి ఔట్ మహిళల టీ20 ప్రపంచకప్-2023లో టీమిండియా ప్రయాణం ముగిసింది. కేప్టౌన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత జట్టు పోరాడి ఓడింది. ఆసీస్ చేతిలో 5 పరుగుల తేడాతో ఓటమి చవి చూసిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. అయితే భారత విజయం ఖాయం అనుకున్న దశలో.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రనౌట్గా వెనుదిరిగడం మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్ రనౌట్గా వెనుదిరిగింది. హర్మన్ పాటు జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 43 పరుగులు) రాణించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రౌన్,గార్డనర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా స్కాట్, జానసెన్ తలా వికెట్ సాధించారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. హర్మన్ప్రీత్ ఔట్ 133 పరుగులు వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. అద్భుతంగా ఆడుతున్న భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(52) రనౌట్గా వెనుదిరిగింది. భారత విజయానికి 28 బంతుల్లో 39 పరుగులు కావాలి. 14 ఓవర్లకు భారత స్కోర్: 124/4 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. భారత విజయానికి 36 బంతుల్లో 49 పరుగులు కావాలి. క్రీజులో హర్మన్ప్రీత్ కౌర్(43), రిచా ఘోష్(14) పరుగులతో ఉన్నారు. 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(39), హర్మన్ప్రీత్ కౌర్(33) పరుగులతో అద్భుతంగా ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్ 15 పరుగులు వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్మృతి మంధాన.. గార్డనర్ బౌలింగ్లో ఔటయ్యంది. తొలి వికెట్ కోల్పోయి భారత్ 173 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన షఫాలీ వర్మ.. స్కాట్ బౌలింగ్లో పెవిలియన్కు చేరింది. చెలరేగిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం భారత్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెత్ మూనీ(54),మెగ్ లానింగ్(49 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు, రాధా యాదవ్, దీప్తి శర్మ తలా వికెట్ సాధించారు. 18 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 142/3 18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. క్రీజులో మెగ్ లానింగ్(28), హ్యారీస్(1) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ 89 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన బెత్ మూనీ.. శిఖాపాండే బౌలింగ్లో షఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 12 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 89/2 తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ►54 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన అలిస్సా హీలీ రాధాయాదవ్ బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగింది. 11 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్: 78/1 ►4 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(19),మూనీ(7) పరుగులతో ఉన్నారు. ►2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో అలిస్సా హీలీ(8),మూనీ(6) పరుగులతో ఉన్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2023 తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అస్వస్థతకు గురైన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. జెస్ జోనాస్సెన్, వికెట్ కీపర్ అలిస్సా హీలీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ కూడా తమ జట్టులో మూడు మార్పులు చేసింది. యస్తిక భాటియా,స్నేహ రానా, రాధాయాదవ్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, యాస్తికా భాటియా, స్నేహ రాణా, శిఖా పాండే, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్ ఆస్ట్రేలియా : అలిస్సా హీలీ(వికెట్ కీపర్), బెత్ మూనీ, మెగ్ లానింగ్(కెప్టెన్), ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, తహ్లియా మెక్గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్హామ్, జెస్ జోనాస్సెన్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్ -
T20 WC 2023: ఆసీస్తో సెమీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్!
ICC Womens T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ మ్యాచ్కు ముందు టీమిండియాకు బ్యాడ్న్యూస్! కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్, ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ కీలక టీ20కి దూరమైనట్లు సమాచారం. అనారోగ్య కారణాల వల్ల వీరిద్దరు గురువారం(ఫిబ్రవరి 23) నాటి మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని ఇండియన్ ఎక్స్ప్రెస్ తన కథనంలో పేర్కొంది. కాగా వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియాతో తలపడనుంది. పటిష్ట కంగరూ జట్టును ఓడించి టైటిల్ గెలిచే దిశగా మరో ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. గతంలో రెండు కీలక సందర్భాల్లో తమను ఓడించిన ఆసీస్కు సెమీస్లోనే చెక్ పెట్టాలన్న తలంపుతో ఉంది భారత మహిళా జట్టు. అస్వస్థతకు గురై ఈ క్రమంలో హర్మన్, పూజ అనారోగ్యం బారిన పడటం ఆందోళన రేకెత్తించింది. అస్వస్థతకు గురై బుధవారం ఆస్పత్రిలో చేరిన వీరిద్దరు డిశ్చార్జ్ అయినప్పటికీ మ్యాచ్ ఆడతారా లేదా అన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. కాగా కెప్టెన్ హర్మన్ వరల్డ్కప్ తాజా ఎడిషన్లో నాలుగు మ్యాచ్లలో కలిపి 66 పరుగులు చేసింది. ఒకవేళ ఆమె జట్టుకు దూరమైతే యస్తికా భాటియా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. మరోవైపు.. ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ స్థానంలో దేవిక వైద్య ఆడే ఛాన్స్ ఉంది. హర్మన్ ఆడనట్లయితే వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుంది. టీ20 వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..! BGT 2023: ఆసీస్తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత -
వారెవ్వా.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉంది. మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా పాక్తో పోరుకు దూరంగా ఉన్న మంధాన ఆ తర్వాత వరుసగా రెండు అర్థసెంచరీలతో చెలరేగింది. ముఖ్యంగా ఐర్లాండ్తో జరిగిన చివరి లీగ్లో మ్యాచ్లో తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది మంధాన. 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. మ్యాచ్లో మంధాన గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడడం విశేషం. లెఫ్ట్ హ్యాండర్ అయిన స్మృతి మంధాన పుల్ షాట్స్, కవర్ డ్రైవ్, లాఫ్టడ్ ఆఫ్ డ్రైవ్స్తో అభిమానులకు కనువిందు కలిగించింది. తాజాగా మంధాన ఆటను గంగూలీతో పోలుస్తూ ఐసీసీ షేర్ చేసిన వీడియో ఆసక్తి కలిగించింది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫ్రంట్ఫుట్ వచ్చి కొట్టే సిక్సర్కు అయితే లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. తాజాగా మంధాన ఐర్లాండ్తో మ్యాచ్లో యాదృశ్చికమో లేక అలా జరిగిందో తెలియదు కానీ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దాదానే తలపించింది. ఆఫ్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్, స్ట్రెయిట్ షాట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింట్లోనూ దాదా స్టైల్ను అచ్చు గుద్దింది మంధాన. ఐసీసీ వీడియోను చూసిన అభిమానులు మళ్లీ దాదా ఆటను గుర్తుచేసింది.. అంటూ కామెంట్ చేశారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. ఐర్లాండ్పై డక్వర్త్ లూయిస్ పద్దతిలో ఐదు పరుగుల తేడాతో విజయం అందుకున్న టీమిండియా వుమెన్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 23న(గురువారం) పటిష్టమైన ఆస్ట్రేలియాతో తొలి సెమీఫైనల్లో తలపడనుంది. బలమైన ఆసీస్ను టీమిండియా మట్టి కరిపిస్తే గనుక కచ్చితంగా ఈసారి ట్రోఫీ మనదే అని అభిమానులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ఇక్కడ రోహిత్ సేన సూపర్.. అక్కడ మీరు కూడా ఆసీస్ను ఓడించి..
ICC Womens T20 World Cup 2023 - India vs Australia: ‘‘ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. వాళ్లతో మ్యాచ్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. ఇరు జట్లకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా బ్యాటింగ్ చేస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతాం’’ అని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. సెమీస్లో ఆసీస్తో అమీ తుమీ తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఐర్లాండ్ను ఓడించింది. స్మృతి అద్భుత ఇన్నింగ్స్తో దక్షిణాఫ్రికాలోని సెయింట్ జార్జ్ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో డక్వర్త్ లూయీస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది హర్మన్ప్రీత్ సేన. స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కీలక మ్యాచ్లో గెలుపొంది సెమీస్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కేప్టౌన్లోని న్యూలాండ్స్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. గొప్ప విషయం ఈ నేపథ్యంలో ఐర్లాండ్తో మ్యాచ్ ముగిసిన అనంతరం భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఓపెనర్ స్మృతి మంధానపై ప్రశంసలు కురిపించింది. ‘‘కీలక మ్యాచ్లో స్మృతి ఆడిన అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడింది. తను శుభారంభం అందించిన ప్రతిసారి మేము భారీ స్కోరు చేయగలుగుతాం. ఈసారి కూడా అదే జరిగింది. సెమీస్ చేరడం ఎంతో గొప్ప విషయం. రోహిత్ సేన మాదిరే మీరు కూడా! ఇక్కడిదాకా చేరుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇక సెమీస్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉంది. వాళ్లతో పోటీలో మజా ఉంటుంది. ఫైనల్ చేరేందుకు మేము వందకు వంద శాతం ప్రయత్నిస్తాం’’ అని హర్మన్ప్రీత్కౌర్ చెప్పుకొచ్చింది. ఇక స్వదేశంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను చిత్తు చేస్తూ.. రోహిత్ సేన వరుస విజయాలు సాధిస్తున్న వేళ.. మహిళా జట్టు సైతం ఆసీస్ను వరల్డ్కప్ సెమీస్లో ఓడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హర్మన్ప్రీత్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఐర్లాండ్తో మ్యాచ్లో భారత క్రికెటర్ల రికార్డులు ►ఐర్లాండ్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్లో 150 మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రికార్డు నెలకొల్పింది. 2009 తొలి టి20 ప్రపంచకప్లో మొదటి మ్యాచ్ ఆడిన హర్మన్ 2023లో టి20 ప్రపంచకప్లోనే తన 150వ మ్యాచ్ ఆడటం విశేషం. ►అంతర్జాతీయ మహిళల టి20ల్లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో క్రికెటర్గా, భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్గా హర్మన్ప్రీత్ గుర్తింపు పొందింది. టాప్–3లో సుజీ బేట్స్ (3,820–న్యూజిలాండ్), మెగ్ లానింగ్ (3,346–ఆస్ట్రేలియా), స్టెఫానీ టేలర్ (3,166–వెస్టిండీస్) ఉన్నారు. ►టి20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు సెమీఫైనల్ చేరుకోవడం ఇది ఐదోసారి. 2009, 2010, 2018లలో సెమీఫైనల్లో ఓడిన భారత్ 2020లో రన్నరప్గా నిలిచింది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ స్కోర్లు ఇండియా- 155/6 (20) ఐర్లాండ్ 54/2 (8.2) చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది? ఆస్ట్రేలియా క్రికెట్లో కలవరం.. తర్వాత ఎవరు? Women T20 WC: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్కప్ మనదే..! -
'నా కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్'
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా స్టార్ స్మృతి మంధాన ఐర్లాండ్తో మ్యాచ్లో తన టి20 కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడింది. అయితే తన కెరీర్లోనే అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ ఇదేనని మంధాన మ్యాచ్ అనంతరం పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐర్లాండ్తో మ్యాచ్లో స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 87 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మధ్యలో వేలికి గాయమైనప్పటికి మంధాన తన జోరును ఎక్కడా ఆపలేదు. మధ్యలో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించింది. మ్యాచ్ విజయం అనంతరం స్మృతి మంధాన మాట్లాడుతూ.. ''వర్షం కారణంగా మ్యాచ్ జరిగిన సెంట్జార్జీ పార్క్ బ్యాటింగ్కు ప్రతికూలంగా మారింది. గాలికి బంతి దిశ మారుతూ వికెట్ల మీదకు దూసుకువస్తుండడంతో బ్యాటింగ్ చేయడం కష్టమైపోయింది. బహుశా నా కెరీర్లోనే ఇది అత్యంత కఠినమైన ఇన్నింగ్స్ అనుకుంటున్నా. వేలికి గాయం అయినప్పటికి పెద్దగా ఏం కాలేదు.. అంతా ఓకే. షఫాలీ వర్మతో సమన్వయం చేసుకున్నా. ఇద్దరం కలిసి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాలని ముందే నిశ్చయించుకున్నాం. ఒకరు స్ట్రైక్ రొటేట్ చేస్తే సరిపోతుందని భావించాం. అందుకే జాగ్రత్తగా ఆడాం. మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును సెమీస్ చేర్చినందుకు సంతోషంగా ఉంది. అయితే ఇంగ్లండ్తో మ్యాచ్లో మేం ఆడాల్సిన పద్దతిలో ఆడలేదు. అందుకే ఓడిపోయాం'' అంటూ చెప్పుకొచ్చింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ఐర్లాండ్తో సోమవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్గా నిలిచింది.156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. A crucial knock with a big six! This Smriti Mandhana moment could be featured in your @0xFanCraze Crictos Collectible packs! Visit https://t.co/8TpUHbQikC to own iconic moments from the #T20WorldCup pic.twitter.com/Plp5oUH1j4 — ICC (@ICC) February 20, 2023 చదవండి: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్కప్ మనదే.. -
దర్జాగా సెమీస్కు...
కెబేహ (దక్షిణాఫ్రికా): ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా, ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్లో నేరుగా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్తో సోమవారం జరిగిన గ్రూప్–2 చివరి లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (56 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టాప్ స్కోరర్గా నిలిచింది. టి20 కెరీర్లో స్మతికిదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. స్మృతి మూడుసార్లు ఇచ్చిన క్యాచ్లను ఐర్లాండ్ ఫీల్డర్లు వదిలేయడం గమనార్హం. షఫాలీ వర్మ (29 బంతుల్లో 24; 3 ఫోర్లు)తో తొలి వికెట్కు 62 పరుగులు జోడించిన స్మృతి... హర్మన్ప్రీత్ (20 బంతుల్లో 13)తో రెండో వికెట్కు 52 పరుగులు జత చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 54 పరుగులు సాధించిన సమయంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వర్షం తగ్గకపోవడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. ‘డక్వర్త్ లూయిస్’ పద్ధతి ప్రకారం 8.2 ఓవర్లలో ఐర్లాండ్ విజయసమీకరణం 59 పరుగులుగా ఉంది. అయితే ఆ జట్టు ఐదు పరుగులు వెనుకపడి ఉండటంతో భారత విజయం ఖరారైంది. ఈ టోర్నీలో ఐర్లాండ్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓడిపోవడం గమనార్హం. ఈ గెలుపుతో భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్–2లో రెండో స్థానంతో సెమీఫైనల్ చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, గ్రూప్–1 టాపర్ ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది. పాకిస్తాన్తో నేడు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్న ఇంగ్లండ్ ఆరు పాయింట్లతో ఇప్పటికే గ్రూప్–2 నుంచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. రన్రేట్ పరంగా భారత్ (0.253) కంటే ఇంగ్లండ్ (1.776) మెరుగ్గా ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోయినా గ్రూప్–2లో ఆ జట్టే ‘టాప్’లో నిలుస్తుంది. గ్రూప్–2 టాపర్ హోదాలో ఇంగ్లండ్ శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్–1లో రెండో స్థానంలో నిలిచే అవకాశమున్న న్యూజిలాండ్ లేదా దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. గ్రూప్–1లో న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకొని 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు బంగ్లాదేశ్తో చివరి మ్యాచ్ ఆడనున్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాలి. అలా జరిగితే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక 4 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలుస్తాయి. ఈ దశలో న్యూజిలాండ్, శ్రీలంకకంటే మెరుగైన రన్రేట్ ఉన్న దక్షిణాఫ్రికా సెమీస్ చేరుకుంటుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) అమీ హంటర్ (బి) లౌరా డెలానీ 24; స్మృతి మంధాన (సి) గ్యాబీ లూయిస్ (బి) ఒర్లా ప్రెండర్గాస్ట్ 87; హర్మన్ప్రీత్ కౌర్ (సి) ప్రెండర్గాస్ట్ (బి) లౌరా డెలానీ 13; రిచా ఘోష్ (సి) గ్యాబీ లూయిస్ (బి) లౌరా డెలానీ 0; జెమీమా రోడ్రిగ్స్ (స్టంప్డ్) వాల్డ్రోన్ (బి) కెల్లీ 19; దీప్తి శర్మ (సి) డెంప్సీ (బి) ప్రెండర్గాస్ట్ 0; పూజా వస్త్రకర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–62, 2–114, 3–115, 4–143, 5–143, 6–155. బౌలింగ్: ఒర్లా ప్రెండర్గాస్ట్ 4–0–22–2, డెంప్సీ 3–0–27–0, కెల్లీ 4–0–28–1, లెహ్ పాల్ 3–0–27–0, కారా ముర్రే 2–0–16–0, లౌరా డెలానీ 4–0–33–3. ఐర్లాండ్ ఇన్నింగ్స్: అమీ హంటర్ (రనౌట్) 1; గ్యాబీ లూయిస్ (నాటౌట్) 32; ప్రెండర్గాస్ట్ (బి) రేణుక సింగ్ 0; లౌరా డెలానీ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 4; మొత్తం (8.2 ఓవర్లలో 2 వికెట్లకు) 54. వికెట్ల పతనం: 1–1, 2–1. బౌలింగ్: రేణుక 2–0–10–1, శిఖా పాండే 2.2–0 –14–0, దీప్తి 1–0–11–0, రాజేశ్వరి 1–0–5–0. -
ఆర్సీబీ కెప్టెన్గా స్మృతి మంధాన
వచ్చే నెలలో ముంబైలో జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్గా స్మృతి మంధానను నియమించారు. భారత జట్టు వైస్ కెప్టెన్ అయిన స్మృతిపై ఇటీవల జరిగిన వేలం కార్యక్రమంలో ఆర్సీబీ రూ. 3 కోట్ల 40 లక్షలు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. స్మృతికి ఆర్సీబీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పురుషుల ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ కెప్టెన్గా ఉన్న డు ప్లెసిస్, మాజీ సారథి విరాట్ కోహ్లి ట్విటర్లో ప్రకటించడం విశేషం. -
Womens T20 World Cup 2023: రేణుక, స్మృతి మెరుపులు వృథా
కెబేహ (దక్షిణాఫ్రికా): మహిళల టి20 ప్రపంచకప్లో భారత జోరుకు ఇంగ్లండ్ బ్రేకులేసింది. గ్రూప్–2లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 11 పరుగుల తేడాతో ఓడింది. ఇంగ్లండ్ ఈ మెగా టోర్నీలో ‘హ్యాట్రిక్’ విజయాలతో సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. రేణుకా సింగ్ (4–0–15–5) అద్భుతమైన బౌలింగ్తో టాపార్డర్ బ్యాటర్లు సోఫియా (10), వ్యాట్ (0), అలైస్ క్యాప్సీ (2)లను బెంబేలెత్తించింది. సీవర్ బ్రంట్ (42 బంతుల్లో 50; 5 ఫోర్లు), ఆఖర్లో అమీ జోన్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఆరంభంలో ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), ఆఖరిదాకా రిచా ఘోష్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) పోరాడారు. కానీ మిగతా బ్యాటర్లు షఫాలీ (8), జెమీమా (13), హర్మన్ప్రీత్ (4), దీప్తి శర్మ (7)ల వైఫల్యంతో జట్టు ఓడింది. నేడు వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయి... రేపు ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై గెలిస్తేనే భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లపై పాక్ గెలిచి... ఐర్లాండ్ను భారత్ కూడా ఓడిస్తే... భారత్, ఇంగ్లండ్, పాక్ ఆరు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. మెరుగైన రన్రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుకుంటాయి. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సోఫియా (బి) రేణుక 10; వ్యాట్ (సి) రిచా (బి) రేణుక 0; అలైస్ (బి) రేణుక 3; సీవర్ బ్రంట్ (సి) స్మృతి (బి) దీప్తి 50; హీథెర్ (సి) షఫాలీ (బి) శిఖా 28; అమీ జోన్స్ (సి) రిచా (బి) రేణుక 40; ఎకిల్స్టోన్ (నాటౌట్) 11; కేథరిన్ (సి) రాధ (బి) రేణుక 0; సారా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–1, 2–10, 3–29, 4–80, 5–120, 6–147, 7–147. బౌలింగ్: రేణుక సింగ్ ఠాకూర్ 4–0–15–5, శిఖా పాండే 4–0–20–1, పూజ వస్త్రకర్ 2–0–24–0, దీప్తి శర్మ 4–0–37–1, రాజేశ్వరి గైక్వాడ్ 1–0–12–0, షఫాలీ 1–0–11–0, రాధ 4–0– 27–0. భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) సీవర్ (బి) సారా 52; షఫాలీ (సి) బ్రంట్ (బి) బెల్ 8, జెమీమా (సి) బ్రంట్ (బి) సారా 13; హర్మన్ప్రీత్ (సి) అలైస్ (బి) ఎకిల్స్టోన్ 4; రిచా (నాటౌట్) 47; దీప్తి (రనౌట్) 7; పూజ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 140. వికెట్ల పతనం: 1–29, 2–57, 3–62, 4–105, 5–119. బౌలింగ్: కేథరిన్ 3–0–39–0, బెల్ 4–0–22–1, చార్లీ 3–0–23–0, ఎకిల్స్టోన్ 4–0–14–1, సారా 4–0–27–2, బ్రంట్ 2–0–15–0. -
సూపర్ స్మృతి మంధాన.. సిక్సర్తో ఫిఫ్టీ
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో స్మృతి మంధాన సూపర్ ఫిఫ్టీతో ఆకట్టుకుంది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్మృతి సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 41 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 52 పరుగులు చేసింది. కాగా స్మతి కెరీర్లో ఇది 21వ అర్థశతకం. అయితే ఫిఫ్టీ కొట్టిన మరుసటి బంతికే గ్లెన్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి బ్రంట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా వుమెన్స్కు తొలి ఓటమి ఎదురైంది. గ్రూప్-బిలో భాగంగా ఇంగ్లండ్తో మ్యాచ్లో హర్మస్ సేన ఒత్తిడికి తలొగ్గి 11 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. రిచా ఘోష్ 34 బంతుల్లో 47 పరుగులు నాటౌట్ ఆఖరి వరకు ఉన్నప్పటికి జట్టును గెలిపించలేకపోయింది. స్మృతి మంధాన 52 పరుగులతో ఆకట్టుకుంది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీస్కు దాదాపు అర్హత సాధించగా.. టీమిండియా వుమెన్స్కు అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మిగతా రెండు మ్యాచ్లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
WPL 2023: ఆర్సీబీ కెప్టెన్ ఆమే.. ప్రకటించిన కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్
WPL 2023- RCB- Smriti Mandhana: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్గా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఎంపికైంది. బీసీసీఐ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళా ప్రీమియర్ లీగ్ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ మేరకు టీమిండియా వైస్ కెప్టెన్కు అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రకటన చేసిన కోహ్లి, ఫాఫ్ ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్తో స్మృతి మంధాన కెప్టెన్గా నియమితురాలైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. స్మృతికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వీరిద్దరు ఇచ్చిన సందేశానికి సంబంధించిన వీడియోను ఫ్రాంఛైజీ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాము ఊహించిందే నిజమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నంబర్ 18 తమకు ప్రత్యేకమంటూ కోహ్లితో ముడిపెట్టి మీమ్స్తో సందడి చేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్ ఓపెనర్గా మంధానకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థాంక్యూ... ఇక ఈ విషయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన.. ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్ అని హర్షం వ్యక్తం చేసింది. విరాట్, ఫాఫ్ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుందన్న స్మృతి.. తాను కూడా ఆర్సీబీని విజయవంతంగా ముందు నడిపిస్తానని పేర్కొంది. మేనేజ్మెంట్ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. ఇందుకు అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది. అత్యధిక ధరకు డబ్ల్యూపీఎల్ వేలం-2023లో స్మృతి కోసం 3.4 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఆర్సీబీ. ఈ క్రమంలో తొలి వుమెన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్గా స్మృతి మంధాన పేరు రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇటీవలే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తమ మెంటార్గా నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 4 నుంచి వుమెన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానుంది. చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్.. కానీ పాపం.. IND vs AUS: రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్ దూరం! From one No. 18 to another, from one skipper to another, Virat Kohli and Faf du Plessis announce RCB’s captain for the Women’s Premier League - Smriti Mandhana. #PlayBold #WPL2023 #CaptainSmriti @mandhana_smriti pic.twitter.com/sqmKnJePPu — Royal Challengers Bangalore (@RCBTweets) February 18, 2023 -
వచ్చీ రావడంతో స్టన్నింగ్ క్యాచ్తో..
మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో మ్యాచ్లో భారత స్టార్ స్మృతి మంధాన స్టన్నింగ్ క్యాచ్తో మెరిసింది. వేలి గాయం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు దూరంగా ఉన్న మంధాన విండీస్తో మ్యాచ్కు ఎంట్రీ ఇచ్చింది. ఇక 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 75 పరుగులతో విండీస్ పటిష్టంగా కనిపించింది. ఈ దశలో దీప్తి శర్మ బౌలింగ్కు వచ్చింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మూడో బంతిని క్యాంప్బెల్లె రివర్స్ స్వీప్ ఆడాలని ప్రయత్నించింది. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్కు తాకడంతో స్లిప్లో పడింది. అయితే ఇక్కడే మంధాన తన మెరుపు ఫీల్డింగ్ను ప్రదర్శించింది. క్యాంప్బెల్లె ఆడిన బంతి కాస్త ముందుకు పడడంతో మంధాన డైవ్ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ తీసుకుంది. దీంతో 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టన్నింగ్ క్యాచ్తో మెరిసిన స్మృతి మంధాన పేరు స్టేడియంలో మార్మోగిపోయింది. -
అందాలన్నీ ఆర్సీబీలోనే.. స్మృతి, సానియా, ఎల్లిస్..!
మహిళల ఐపీఎల్ (WPL)లో అందమైన జట్టు ఏది అంటే..? ఏమాత్రం తడుంకోకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పాలి. విధ్వంసకర ఆటతో పాటు మతి పోగొట్టే అందాలన్నీ ఆర్సీబీ సొంతమయ్యాయనడం అతిశయోక్తి కాదు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన, ఆసీస్ ఆల్రౌండర్ ఎల్లిస్ పెర్రీ, ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్, ఆసీస్ పేసర్ మెగాన్ షట్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ సోఫీ డివైన్, టీమిండియా పేసర్ రేణుకా సింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు నిండా అందాలే ఉన్నాయి. ఇన్ని అందాలు చాలవన్నట్లు.. ఆర్సీబీ తమ కుటుంబంలోకి క్రికెటేతర అందాన్ని కూడా ఆహ్వానించింది. బెంగళూరు ప్రాంచైజీ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను మెంటార్గా నియమించుకుంది. జట్టు అందాల పూతోటగా మారడం పట్ల ఆర్సీబీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అందాలన్నీ ఒకే చోట చేరినట్లుందని సంబురపడిపోతున్నారు. అందంతో పాటు తమ ప్లేయర్స్ ఆటలోనూ మహరాణులంటూ మురిసిపోతున్నారు. ఆటతో పాటు అందాలను ఆస్వాదించే వారికి ఆర్సీబీ వంద శాతం కనువిందు కలిగిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నారు. కాగా, ఫిబ్రవరి 13న జరిగిన WPL మెగా వేలంలో ఆర్సీబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అందాలన్నిటినీ ఏకం చేసింది. వేలంలో స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకున్న ఆర్సీబీ యాజమాన్యం.. రిచా ఘోష్ను 1.9 కోట్లకు, ఎల్లిస్ పెర్రీని 1.7 కోట్లకు, రేణుకా సింగ్ను 1.5 కోట్లకు, సోఫీ డివైన్ను 50 లక్షలకు, హీథర్ నైట్ను 40 లక్షలకు, మెగాన్ షట్ను 40 లక్షలకు, కనిక అహుజను 35 లక్షలకు, డేన్ వాన్ నికెర్క్ను 30 లక్షలకు, ఎరిన్ బర్న్స్ను 30 లక్షలకు, ప్రీతి బోస్ను 30 లక్షలకు, కోమల్ జంజద్ను 25 లక్షలకు, ఆశా శోభనను 10 లక్షలకు, దిశా కాసత్ను 10 లక్షలకు, ఇంద్రాణి రాయ్ను 10 లక్షలకు, పూనమ్ ఖేమ్నర్ను 10 లక్షలకు, సహన పవార్ను 10 లక్షలకు, శ్రేయాంక పాటిల్ను 10 లక్షలకు సొంతం చేసుకుంది. The pioneer in Indian sports for women, a youth icon, someone who has played Bold and broken barriers throughout her career, and a champion on and off the field. We are proud to welcome Sania Mirza as the mentor of the RCB women’s cricket team. 🤩#PlayBold @MirzaSania pic.twitter.com/eMOMU84lsC — Royal Challengers Bangalore (@RCBTweets) February 15, 2023 వేలంలో మొత్తంగా 18 ప్లేయర్లను (12 మంది స్వదేశీ, ఆరుగురు విదేశీ ప్లేయర్లు) కొనుగోలు చేసిన ఆర్సీబీ.. తాజాగా తమ హెడ్ కోచ్గా న్యూజిలాండ్కు చెందిన బెన్ సాయర్ను నియమించుకుంది. ఆర్సీబీ పర్స్లో ఇంకా 10 లక్షలు మిగిలాయి. -
వేలంలో జాక్పాట్.. ఆర్సీబీ కెప్టెన్గా స్మృతి మంధాన!
ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కోట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. దీంతో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్గా మంధాన నిలిచింది. ఇక ఆర్సీబీ మెనెజెమెంట్ తమ జట్టు కెప్టెన్గా స్మృతి మంధాన నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఆర్సీబీ క్రికెట్ డైరక్టర్ మైక్ హెస్సన్ స్పందించాడు. కొన్ని మ్యాచ్లలో భారత జట్టుకు సారథ్యం వహించిన మంధానకు తమ జట్టును నడిపించే సత్తా ఉంది అని హెస్సన్ అభిప్రాయపడ్డాడు. వేలం అనంతరం హెస్సన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. స్మృతికి కెప్టెన్సీ అనుభవం ఎక్కువగా ఉంది. ఆమె భారత్కు చెందిన క్రికెటర్ కాబట్టి, అక్కడ పరిస్థితులు బాగా తెలుసు. కాబట్టి మా జట్టు పగ్గాలు ఆమెకు అప్పజెప్పె ఛాన్స్ ఎక్కువగా ఉంది. అదే విధంగా మా జట్టులో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి వీరిందరూ కలిసి జట్టును విజయ పథంలో నడిపిస్తారని భావిస్తున్నాను అని అతడు పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో మంధానతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఎలీస్ పెర్రీ, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ వంటి సీనియర్ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో ఆర్సీబీ దక్కించుకున్నక్రికెటర్ల జాబితా ఇదే ►స్మృతి మంధాన- రూ.3.40 కోట్లు ►రిచా ఘోష్- రూ.1.90 కోట్లు ►ఎలీస్ పెర్రీ- రూ.1.70 కోట్లు ►రేణుక సింగ్- రూ.1.50 కోట్లు ►సోఫీ డివైన్- రూ.50 లక్షలు ►హీతెర్ నైట్- రూ.40 లక్షలు ►మేగన్ షుట్- రూ.40 లక్షలు ►కనిక అహుజ- రూ.35 లక్షలు ►డేన్వాన్ నికెర్క్- రూ.30 లక్షలు ►ఎరిన్ బర్న్స్ - రూ.30 లక్షలు ►ప్రీతి బోస్ - రూ.30 లక్షలు ►కోమల్ జంజద్ - రూ.25 లక్షలు ►ఆశ శోభన- రూ.10 లక్షలు ►దిశ కాసత్ - రూ.10 లక్షలు ►ఇంద్రాణి రాయ్- రూ.10 లక్షలు ►పూనమ్ ఖేమ్నర్- రూ.10 లక్షలు ►సహన పవార్- రూ.10 లక్షలు ►శ్రేయాంక పాటిల్- రూ.10 లక్షలు ►మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6 చదవండి: WPL 2023: బాబర్ కంటే మంధానకి రెండున్నర రెట్లు ఎక్కువ.. పాక్ ప్లేయర్లు ఇప్పుడేమంటారో? -
Viral: భారత క్రికెట్కు సంబంధించిన ఆసక్తికర విషయం
WPL Auction 2023: మహిళల తొట్టతొలి ఐపీఎల్ వేలం తర్వాత భారత క్రికెట్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాదృచ్ఛికంగా జరిగిందో లేక ఆయా ఫ్రాంచైజీల ప్రణాళికల ప్రకారం జరిగిందో తెలీదు కానీ.. భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా జట్టు సారధి హర్మన్ప్రీత్ కౌర్లు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో ఉన్నారు. నిన్న జరిగిన వేలంలో హర్మన్ను ముంబై ఇండియన్స్ 1.8 కోట్ల ధర వెచ్చింది సొంతం చేసుకోగా.. రోహిత్ 2011 నుంచి ఈ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ ముంబైతో జతకట్టే సమయానికి టీమిండియా కెప్టెన్గా లేడు. ఇటీవలే అతను కోహ్లి నుంచి ఆ బాధ్యతలను తీసుకున్నాడు. ఏదిఏమైనప్పటికీ భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్ల కెప్టెన్లు ముంబై ఇండియన్స్లో చేరడం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ విషయం నిన్నటి నుంచి సోషల్మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఉన్న రోహిత్.. ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలిపాడు. హర్మన్ కూడా అదే రేంజ్లో సక్సెస్ సాధిస్తుందని ఆశిద్దాం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టులోని జెర్సీ నంబర్ 18 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్నారు. నిన్న జరిగిన వేలంలో ఆర్సీబీ వుమెన్ జెర్సీ నంబర్ 18 స్మృతి మంధనను 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. WPLలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఇక పురుషుల క్రికెట్లో జెర్సీ నంబర్ 18 విరాట్ కోహ్లి ఐపీఎల్ పుట్టుక నుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నారు. ఐపీఎల్ మరే ఇతర క్రికెటర్ కోహ్లిలా ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించింది లేదు. అయితే కోహ్లికి ఒక్క లోటు మాత్రం ఉంది. అతను ఒక్కసారి కూడా ఆర్సీబీని ఛాంపియన్గా నిలబెట్టలేకపోయాడు. మొత్తంగా టీమిండియా కెప్టెన్లు, జెర్సీ నంబర్ 18 ఐపీఎల్లో వేర్వేరు జట్లుగా విడిపోవడం ఆసక్తికర పరిణామం. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్-ఆర్సీబీల పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందో WPLలో కూడా ఈ రెండు జట్ల మధ్య అంతే రసవత్తర పోరులు సాగే అవకాశం ఉంది. WPLలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్లు.. స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు) రిచా ఘోష్ (రూ.1.90 కోట్లు) ఎలీస్ పెర్రీ (రూ.1.70 కోట్లు) రేణుక సింగ్ (రూ.1.50 కోట్లు) సోఫీ డివైన్ (రూ.50 లక్షలు) హీతెర్ నైట్ (రూ.40 లక్షలు) మేగన్ షుట్ (రూ.40 లక్షలు) కనిక అహుజ (రూ.35 లక్షలు) డేన్వాన్ నికెర్క్ (రూ.30 లక్షలు) ఎరిన్ బర్న్స్ (రూ.30 లక్షలు) ప్రీతి బోస్ (రూ.30 లక్షలు) కోమల్ జంజద్ (రూ.25 లక్షలు) ఆశ శోభన (రూ.10 లక్షలు) దిశ కాసత్ (రూ.10 లక్షలు) ఇంద్రాణి రాయ్ (రూ.10 లక్షలు) పూనమ్ ఖేమ్నర్ (రూ.10 లక్షలు) సహన పవార్ రూ.10 లక్షలు శ్రేయాంక పాటిల్ రూ.10 లక్షలు WPLలో ఆర్సీబీ సొంతం చేసుకున్న ప్లేయర్స్.. నటాలీ సివర్ (రూ.3.20 కోట్లు) పూజ వస్త్రకర్ (రూ.1.90 కోట్లు) హర్మన్ప్రీత్ కౌర్ (రూ.1.80 కోట్లు) యస్తిక భాటియా (రూ.1.50 కోట్లు) అమేలియా కెర్ (రూ.1 కోటి) అమన్జోత్ కౌర్ (రూ.50 లక్షలు) హేలీ మాథ్యూస్ (రూ.40 లక్షలు) క్లొయ్ ట్రియాన్ (రూ.30 లక్షలు) హిదెర్ గ్రాహమ్ (రూ.30 లక్షలు) ఇసాబెలె వోంగ్ (రూ.30 లక్షలు) ప్రియాంక బాల (రూ.20 లక్షలు) ధార గుజ్జార్ (రూ.10 లక్షలు) హుమైరా కాజి (రూ.10 లక్షలు) జింతిమని కలిత (రూ.10 లక్షలు) నీలమ్ బిష్త్ (రూ.10 లక్షలు) సయిక ఇషాక్ (రూ.10 లక్షలు) సోనమ్ యాదవ్ (రూ.10 లక్షలు) -
బాబర్ కంటే మంధానకి రెండున్నర రెట్లు ఎక్కువ.. పాక్ ప్లేయర్లు ఇప్పుడేమంటారో?
ప్రపంచ క్రికెట్లో ఎన్ని టీ20 ఫ్రాంచైజీ లీగ్లు పుట్టికొచ్చినా.. ఏదీ ఐపీఎల్కి సాటి రాదు. కాసుల వర్షం కురిపించే ఈ క్యాష్ రిచ్ లీగ్లో భాగం కావాలని ప్రతీ ఒక్కరూ కలలు కంటుంటారు. ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన చరిత్ర ఐపీఎల్కు ఉంది. కాగా కొంత మంది పాక్ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం ఐపీఎల్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ బెటర్ అంటూ గొప్పలు పలుకుతుంటారు. అయితే బీసీసీఐ ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరోసారి తేలిపోయింది. తాజాగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ వేలంతో ఇది మరోసారి రుజువైంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలంలో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్గా మంధాన నిలిచింది. రూ.3.4 కోట్ల భారీ ధరకు ఈ స్టార్ ఓపెనర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్లో కెప్టెన్ బాబర్ ఆజం, షాహీన్ ఆఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లు కంటే మంధాన ఎక్కువ మొత్తాన్ని అందుకోవడం విశేషం. బాబర్ కంటే ఎక్కువే.. పీఎస్ఎల్లో బాబర్ ఆజం ప్లాటినం కేటిగిరిలో ఉన్నాడు. ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకి పాకిస్తాన్ కరెన్సీలో 3.60 కోట్లు అందుతుంది. కాగా ఈ కేటగిరీ బాబర్ ఒక్కడే ఉండడం గమానర్హం. అంటే బాబర్ ఈ ఏడాది సీజన్కు గాను రూ. 3.60 కోట్ల మొత్తాన్ని అందుకున్నాడు. బాబర్ అందుకునే మొత్తం రూ. 3 కోట్ల 60 లక్షలు... అదే భారత కరెన్సీలో వచ్చేసరికి రూ. కోటి 23 లక్షలు మాత్రమే. అంటే పీఎస్ఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న బాబర్ కంటే స్మృతి మంధాన రెండున్నరెట్లు ఎక్కువ మొత్తాన్ని మహిళల ప్రీమియర్ లీగ్ ద్వారా అందుకోబోతోంది. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్-2023 సోమవారం నుంచి ప్రారంభమైంది. చదవండి: NZ Vs Eng: న్యూజిలాండ్కు భారీ ఎదురుదెబ్బ.. కీలక పేసర్ దూరం! సీఎస్కే కలవరం.. Playing in the Indian leagues comes with its perks 🤩💰#CricketTwitter #WPL pic.twitter.com/4isgGH76go — Sportskeeda (@Sportskeeda) February 14, 2023 -
RCB: స్మృతి మంధాన సహా ఆర్సీబీ కొన్న ప్లేయర్లు వీరే.. పర్సులో ఎంత ఉందంటే?
WPL 2023 Auction- RCB Women Squad: మహిళా ప్రీమియర్ లీగ్-2023 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అత్యధిక ధర వెచ్చించి స్మృతి మంధానను సొంతం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ను భారీ మొత్తం చెల్లించి హైలైట్గా నిలిచింది. ముంబైలో సోమవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఈ వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ప్లేయర్లు వీరే.. ►స్మృతి మంధాన- రూ.3.40 కోట్లు ►రిచా ఘోష్- రూ.1.90 కోట్లు ►ఎలీస్ పెర్రీ- రూ.1.70 కోట్లు ►రేణుక సింగ్- రూ.1.50 కోట్లు ►సోఫీ డివైన్- రూ.50 లక్షలు ►హీతెర్ నైట్- రూ.40 లక్షలు ►మేగన్ షుట్- రూ.40 లక్షలు ►కనిక అహుజ- రూ.35 లక్షలు ►డేన్వాన్ నికెర్క్- రూ.30 లక్షలు ►ఎరిన్ బర్న్స్ - రూ.30 లక్షలు ►ప్రీతి బోస్ - రూ.30 లక్షలు ►కోమల్ జంజద్ - రూ.25 లక్షలు ►ఆశ శోభన- రూ.10 లక్షలు ►దిశ కాసత్ - రూ.10 లక్షలు ►ఇంద్రాణి రాయ్- రూ.10 లక్షలు ►పూనమ్ ఖేమ్నర్- రూ.10 లక్షలు ►సహన పవార్- రూ.10 లక్షలు ►శ్రేయాంక పాటిల్- రూ.10 లక్షలు ►మొత్తం ప్లేయర్లు: 18 విదేశీ ప్లేయర్లు: 6 ఈ మేరకు ప్లేయర్ల కొనుగోలు ఖర్చు చేసిన మొత్తం పోగా.. ఆర్సీబీ పర్సులో రూ. 10 లక్షలు మిగిలిపోయాయి. -
WPL 2023: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం..
WPL 2023 Auction Details In Telugu: అద్భుతమైన ఆట... నాయకత్వ ప్రతిభ... మార్కెటింగ్కు అవకాశం ఉన్న ప్రచారకర్త... ఒక మహిళా క్రికెటర్లో ఈ మూడు లక్షణాలు ఉంటే ఆమె కోసం జట్లు పోటీ పడటం సహజమే... ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. తొలి మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో అందరికంటే ఎక్కువ విలువతో భారత స్టార్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన శిఖరాన నిలిచింది. వేలంలో అందరికంటే ముందుగా ఆమె పేరు రాగా... ముంబై, బెంగళూరు స్మృతిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీ పడ్డాయి. చివరకు రూ. 3 కోట్ల 40 లక్షలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ స్టార్లు యాష్లే గార్డ్నర్, నటాలీ సివర్ రూ. 3 కోట్ల 20 లక్షలతో రెండో స్థానంలో నిలిచారు. ఆశ్చర్యకరంగా భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు మాత్రం ఆశించిన విలువ దక్కలేదు. నాలుగు టీమ్లు హర్మన్ కోసం ప్రయత్నించినా...చివరకు రూ. 1 కోటి 80 లక్షల వద్దే హర్మన్ వేలం ముగిసింది. మొత్తంగా చూస్తే పురుషుల ఐపీఎల్ తరహాలో కొన్ని సంచలనాలు, కొంత ఆశ్చర్యం, మరికొంత అనూహ్యం కలగలిపి తొలి మహిళల లీగ్ వేలం సాగింది. అయితే డబ్బుల విలువ, అంకెలను పక్కన పెట్టి చూస్తే భారత మహిళల క్రికెట్లో కొత్త లీగ్, అందు కోసం సాగిన వేలం కొత్త ప్రస్థానానికి పునాది వేసింది. ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మొదటిసారి నిర్వహించబోతున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మొదటి అంకమైన ప్లేయర్ల వేలం ఘనంగా ముగిసింది. మొత్తం 448 మంది వేలంలోకి రాగా... ఐదు జట్లలోకి కలిపి మొత్తం 87 మంది ఎంపికయ్యారు. నిబంధనల ప్రకారం గరిష్టంగా టీమ్కు 18 మంది చొప్పున మొత్తం 90 మందికి అవకాశం ఉన్నా.... యూపీ 16 మందికి, ముంబై 17 మందికే పరిమితమయ్యాయి. మిగిలిన మూడు జట్లు బెంగళూరు, ఢిల్లీ, గుజరాత్ 18 మంది చొప్పున తీసుకున్నాయి. టాప్–10 జాబితాలో వేలంలో ఎక్కువ మొత్తం పలికిన టాప్–10 జాబితాలో భారత్ నుంచి స్మృతి మంధానతో పాటు దీప్తి శర్మ (రూ.2 కోట్ల 60 లక్షలు), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2 కోట్ల 20 లక్షలు), షఫాలీ వర్మ (రూ. 2 కోట్లు), పూజ వస్త్రకర్ (రూ.1 కోటి 90 లక్షలు), రిచా ఘోష్ (రూ. 1 కోటి 90 లక్షలు), హర్మన్ప్రీత్ కౌర్ (రూ. 1 కోటి 80 లక్షలు) ఉన్నారు. త్రిషకు మొండిచేయి సీనియర్ జట్టుకు ఆడిన షఫాలీ, రిచా కాకుండా ఇటీవల అండర్–19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు అమ్మాయిలకు లీగ్లో అవకాశం దక్కింది. అయితే అండర్–19 ప్రపంచకప్లో రాణించిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిషను వేలంలో ఎవరూ తీసుకోలేదు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలోని రెండు వేదికల్లో డబ్ల్యూపీఎల్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయి. మహిళల ప్రీమియర్ లీగ్ కావడంతో వేలం కార్యక్రమాన్ని కూడా మహిళనే నిర్వహించడం విశేషం. 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమం చేసిన మల్లిక సాగర్ డబ్ల్యూపీఎల్ వేలంను నిర్వహించింది. వేలం విశేషాలు... అందుకే స్మృతి కోసం పోటీ భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధానకు భారీ విలువ పలకవచ్చనే అంచనా తప్పలేదు. ఇప్పటికే మహిళల బిగ్బాష్ లీగ్, ‘హండ్రెడ్’ లీగ్లలో ఆడి ఆమె సత్తా చాటింది. దాంతో సహజంగానే ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. భారీ షాట్లు ఆడగల రిచా ఘోష్పై కూడా జట్లు నమ్మకం ఉంచాయి. టీమిండియా టాప్ ప్లేయర్లలో దీప్తి శర్మ తన సొంత రాష్ట్రం జట్టు యూపీ తరఫున ఆడనుంది. ప్రస్తుతం టి20 క్రికెట్లో వరల్డ్ నంబర్వన్ ఆల్రౌండర్ అయిన యాష్లే గార్డ్నర్పై కూడా టీమ్లు ఆసక్తి చూపించాయి. వారికి కూడా తక్కువేం కాదు ఆసీస్ ఇతర అగ్రశ్రేణి ప్లేయర్లు అలీసా హీలీ, మెగ్ లానింగ్లకు కూడా మంచి విలువ దక్కింది. గుర్తింపు ఉన్నా ఇక.. మహిళల టి20 క్రికెట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకొని లీగ్ వేలంలో అమ్ముడు పోకుండా మిగిలిన అగ్రశ్రేణి ప్లేయర్లలో డానీ వ్యాట్, కేథరీన్ బ్రంట్, అమీ జోన్స్, అలానా కింగ్, సుజీ బేట్స్, చమరి అటపట్టు తదితరులు ఉన్నారు. హర్మన్ విషయంలో మాత్రం ►భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కోసం గుజరాత్ మినహా మిగతా నాలుగు జట్లూ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఊహించిన మొత్తం మాత్రం ఆమెకు దక్కలేదు. ►అసోసియేట్ దేశాల నుంచి ఒకే ఒక ప్లేయర్ తారా నోరిస్ (అమెరికా) ఎంపికైంది. లెఫ్ట్ఆర్మ్ పేసర్ అయిన తారా స్వస్థలం ఫిలడెల్ఫియా. ►యూఏఈకి చెందిన మనిక గౌర్ కోసం గుజరాత్ ఆసక్తి చూపించింది. అయితే వారి కోటా పూర్తి అయిందని తేలడంతో ఆ జట్టు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ►16 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పేస్ బౌలర్ షబ్నమ్ షకీల్ ఈ వేలంలో ఎంపికైన అతి పిన్న వయస్కురాలు. స్మృతి తర్వాత వేలంలో టాప్–10 ►యాష్లే గార్డ్నర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►నటాలీ సివర్ -రూ. 3 కోట్ల 20 లక్షలు ►దీప్తి శర్మ -రూ. 2 కోట్ల 60 లక్షలు ►జెమీమా రోడ్రిగ్స్ - రూ. 2 కోట్ల 20 లక్షలు ►బెత్ మూనీ -రూ. 2 కోట్లు ►షఫాలీ వర్మ -రూ. 2 కోట్లు ►పూజ వస్త్రకర్ -రూ. 1 కోటి 90 లక్షలు ►రిచా ఘోష్ -రూ. 1 కోటి 90 లక్షలు ►సోఫీ ఎకిల్స్టోన్- రూ. 1 కోటి 80 లక్షలు ►హర్మన్ప్రీత్ - రూ. 1 కోటి 80 లక్షలు – సాక్షి క్రీడా విభాగం చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. Womens T20 WC 2023: ఇండియా-పాకిస్తాన్ వరల్డ్కప్ మ్యాచ్లో ఘోర తప్పిదం -
వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 క్రికెటర్లు వీరే..
మహిళల ప్రీమియర్ లీగ్-2023 సంబంధించిన వేలం సోమవారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ. 59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. అయితే ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్లపై ఓ లూక్కేద్దం. స్మృతి మంధాన ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు జాక్పాట్ తగిలింది. మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్గా మంధాన నిలిచింది. ఆష్లీ గార్డనర్ ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లీ గార్డనర్కు ఊహించని ధర దక్కింది. ఆమెను రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్గా గార్డనర్ నిలిచింది. అదే విధంగా వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్గా గార్డనర్ నిలిచింది. నాట్ స్కివర్ ఇంగ్లండ్కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ నాట్ స్కివర్పై కూడా కాసుల వర్షం కురిసింది. ఈ వేలంలో స్కివర్ను రూ. 3.20 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ప్లేయర్గా గార్డనర్తో కలిసి సంయుక్తంగా నిలిచింది. దీప్తి శర్మ భారత స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్జ్ రూ. 2.60 కోట్లకు సొంతం చేసుకుంది. దీప్తి శర్మను ఉత్తరప్రదేశ్ వారియర్జ్ తమ కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది. జెమీమా రోడ్రిగ్స్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ను దిల్లీ క్యాపిటల్స్ రూ. 2.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు 97 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రోడ్రిగ్స్ 13 అర్ధసెంచరీలు చేసింది. చదవండి: WPL Auction: లేడీ సెహ్వాగ్కు భారీ ధర.. ఎన్ని కోట్లంటే? -
స్మృతి మంధానకు జాక్ పాట్.. ఎన్ని కోట్లంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన జాక్ పాట్ కొట్టింది. ముంబై వేదికగా జరుగుతోన్న ఈ వేలంలో స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మంధాన కోసం ఆది నుంచే ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరికి బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. కాగా ఈ వేలంలో మంధాన తన బేస్ ప్రైస్ రూ.50లక్షలగా నిర్ణయించుకుంది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను రూ. 1.8 కోట్లకు మంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ యాష్ గార్డెనర్ను రూ.3.2 కోట్ల భారీ ధరకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకోంది. ఇక ఈ వేలంలో మొత్తం 90 బెర్త్ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు. Join us in welcoming the first Royal Challenger, Smriti Mandhana! 😍 Welcome to RCB 🔥#PlayBold #WeAreChallengers #WPL2023 #WPLAuction pic.twitter.com/7q9j1fb8xj — Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2023 చదవండి: Hardik Pandya: ఆమె అతడిని నమ్మింది! అతడు వమ్ము చేయలేదు! కోటలో తన ‘రాణి’తో మరోసారి.. -
T20 World Cup: పాక్తో కీలకపోరు.. భారత స్టార్ ఓపెనర్ దూరం
సౌతాఫ్రికా వేదికగా మహిళల టి20 వరల్డ్కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం గ్రూప్-బిలో బిగ్ఫైట్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్లు తలపడనున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్ కావడంతో ఇరుజట్లు మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే మ్యాచ్కు ముందే భారత్కు బిగ్షాక్ తగిలింది. వేలికి గాయంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన మ్యాచ్ ఆడడం లేదని సమాచారం. ''ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మంధాన గాయపడింది. అయితే.. ఆమె మొత్తానికే వరల్డ్ కప్ టోర్నీకి దూరం కానుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. పాకిస్థాన్ మ్యాచ్కు మాత్రం తాను అందుబాటులో ఉండదు'' అని బీసీసీఐ తెలిపింది. గ్రూప్ – బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆదివారం (ఫిబ్రవరి 12న) వరల్డ్ కప్ తొలి పోరులో తలపడనున్నాయి. ఓపెనర్గా శుభారంభం అందించే మంధాన తొలి మ్యాచ్ ఆడకపోవడం భారత్ను కలవర పెడుతోంది. అయితే వెస్టిండీస్తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్కు మంధాన అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా మంధాన గాయపడింది. ఆమె ఎడమచేతి మధ్య వేలికి గాయం అయింది. దాంతో, బంగ్గాదేశ్తో బుధవారం జరిగిన రెండో వామప్ మ్యాచ్కు మంధాన దూరమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటోంది. ఈమధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో హర్మన్ప్రీత్ భుజానికి గాయం అయింది. అయితే.. ''నా శరీరం ఇప్పుడు బాగానే ఉంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇబ్బందిగా అనిపించడం''లేదు అని హర్మన్ తెలిపింది. చదవండి: క్రికెట్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్