-
ఇజ్రాయెల్లో బాంబుల మోత.. రాకెట్లతో హెజ్బుల్లా దాడి..
ఇజ్రాయెల్లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులకు తెగబడింది. రాకెట్ల దాడులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ, తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.అయితే, హెజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ తలెబ్ సమీ అబ్ధుల్లా హత్యకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్పై దాడులు చేసినట్టు హెజ్బుల్లా ప్రకటించింది. దాదాపు 170 రాకెట్లతో హెజ్బుల్లా.. ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన ఇదే అతిపెద్ద దాడి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, ఇప్పటి వరకు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించినట్టు సమాచారం. #Hezbollah fires dozens of suicide drone 🚀 to attack #zionist Military division headquarters in Nahariya . All the drones Destroyed their designated target and the military headquarters are burning 🔥 now . #Lebanon #israel war #FreePalestine https://t.co/4rRHLtIQ4v— Hasib Holy (@HasibHoly) June 13, 2024 మరోవైపు.. హెజ్బుల్లా దాడుల నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ సైతం దాడులను తీవ్ర తరం చేసింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో చర్చనీయాంశంగా మారింది. Israeli soldiers attack Hezbollah forces using ancient Roman war weapons "Catapult" on the Israel-Lebanon border. pic.twitter.com/HzgQsnFEV4— James Wuttichai (@Military9News) June 13, 2024 -
ఊహించని చర్యలు.. ఇజ్రాయెల్కు హెజ్బుల్లా హెచ్చరిక
హమాస్ మిలిటెంట్ల అంతమే లక్ష్యంగా గాజాలో దాడులు చేస్తున్న ఇజ్రయెల్కు హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్పై ఊహించని చర్యలు తీసుకుంటామని ఇరాన్ మద్దతు గల హెజ్జుల్లా సంస్థ జనరల్ సెక్రటరీ హసన్ నస్రల్లా వార్నింగ్ ఇచ్చారు. 24వ రెసిస్టెన్స్ అండ్ లిబరేషన్ డే (లెబనాన్) కార్యక్రమంలో భాగంగా హసన్ నస్రల్లా టీవీలో శుక్రవారం ప్రసంగించారు.‘‘ మా ప్రతిఘటన నుంచి ఇజ్రాయెల్ ఊహించని ఆశ్చర్యాలు ఎదుర్కొటుంది. ఇజ్రాయెల్ తన ఊహాత్మక లక్ష్యాలను సాధించటంలో దారుణం విఫలమైంది( ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ త్జాచి హనెగ్బి ఉద్దేశించి). ఇజ్రాయెల్ ఏం సాధించలేదని, దాని లక్ష్యాలు సాధ్యం కాదు. దానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇది ఇజ్రాయెల్కు తీవ్రమైన ఎదురుదెబ్బ’’ అని హసన్ నస్రల్లా తెలిపారు.అంతర్జాతీయంగా పాలస్తీనా ప్రత్యేక దేశంగా గుర్తింస్తు పలు దేశాల మద్దతు పెరుగుతోందన్నారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ తీర్మానాలను ఉల్లంఘిస్తోందని, సైనిక చర్యలను నిలిపివేయాలని అంతర్జాతీయ స్థానం ఆదేశించినప్పటికీ రఫాలో హింసాత్మక కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఆరోపించారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను హెజ్జుల్లా మిలిటెంట్ సంస్థ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేస్తున్న విషయం తెలిసిందే. -
ఇజ్రాయెల్కు హిజ్బుల్లా ముప్పు.. అధునాతన ఆయుధాలతో దాడులు
యుద్ధ వాతావరణం మధ్య ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. తాజాగా లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్లోని మిలిటరీ పోస్ట్పై డ్రోన్, క్షిపణి దాడులను చేసింది. హిజ్బుల్లా దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ మీడియాకు తెలిపింది. హిజ్బుల్లా గత ఏడు నెలలుగా ఇజ్రాయెల్పై నిరంతరం దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్ గగనతలం నుండి హిజ్బుల్లా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ దాడులలో హిజ్బుల్లా అధునాతన ఆయుధాలను ఉపయోగించిందని సమాచారం.ఇటీవలి కాలంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులను తీవ్రతరం చేయడం గమనార్హం. గాజా స్ట్రిప్లోని దక్షిణ నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చొరబాటు అనంతరం హిజ్బుల్లా ఇజ్రాయెల్ అంతర్గత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ వస్తోంది. గత ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచి సరిహద్దు వెంబడి హిజ్బుల్లా కాల్పులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, హిజ్బుల్లా దాడులు తీవ్రమయ్యాయి.రఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్య అనంతరం హిజ్బుల్లా ఈ విధమైన దాడులకు పాల్పడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దూకుడు వైఖరిని అవలంబిస్తూ దాడులు కొనసాగిస్తే ఉత్తర ఇజ్రాయెల్ నివాసితులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నంత కాలం తమ బృందం పోరాడుతూనే ఉంటుందని హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. లెబనీస్ ఫ్రంట్, గాజా మధ్య సంబంధాలు స్థిరమైనవని, వాటిని ఎవరూ డీ లింక్ చేయలేరని హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. -
హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. వీడియో విడుదల
సిరియాలో ఉన్న హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్కు సంబంధించిన స్థావరాలపై దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. దాడికి సంబంధించి ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్కు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులకు తెగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరియాలో విస్తరించిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్పై కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే పదేపదే హెచ్చరించింది. ‘సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా దాడి చేశాము’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపైబుధవారం తెల్లవారుజామున దాడి చేసినట్లు తెలిపే ఓ విడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. צה"ל תקף לפני זמן קצר תשתית צבאית שהוצבה בחזית שטח סוריה, אשר ממידע מודיעיני עולה כי שימשה את ארגון הטרור חיזבאללה. צה"ל רואה במשטר הסורי אחראי לכל אשר קורה בשטחו ולא יאפשר ניסיונות אשר יובילו להתבססות ארגון הטרור חיזבאללה בחזיתו>> pic.twitter.com/Eh2W5LRyYH — צבא ההגנה לישראל (@idfonline) April 9, 2024 హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సిరియా తన భూభాగంలో జవాబుదారిగా ఉంటుంది. కానీ సిరియా దేశం అవతల హిజ్బుల్లా దాడులు చేసే ప్రయత్నాలను అనుమంతిచబోమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అదే విధంగా దక్షిణ లెబనాన్లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించటం గమనార్హం. దక్షిణ లెబనాన్లోని ధైరా, తైర్ హర్ఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్ దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. -
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు
బీరుట్: లెబనాన్లోని ఈశాన్య ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆదివారం(మార్చ్ 24) తెల్లవారుజామున వైమానిక దాడులు జరిపింది. మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లాకు గట్టిపట్టున్న ప్రాంతమైన బల్బీక్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు బల్బీక్ మేయర్ తెలిపారు. ఇజ్రాయెల్ మిసైల్ రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్పై డ్రోన్లతో దాడులు జరిపినట్లు హెజ్బొల్లా ప్రకటించిన గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి 50 రాకెట్లు తమవైపు వచ్చినందునే దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ రాకెట్లలో కొన్నింటిని కూల్చివేశామని, మరికొన్ని మనుషులు లేని చోట పడిపోయాయని వెల్లడించింది. కాగా, మార్చ్ 12న బల్బీక్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందగా 20 మంది దాకా గాయపడ్డారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి లెబనాన్లోని మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు పెరిగిపోయాయి. ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
ఇజ్రాయెల్పై హెజ్బొల్లా క్షిపణి దాడి
జెరూసలేం: ఇజ్రాయెల్పై హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన యాంటీ ట్యాంక్ క్షిపణి దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. బాధితులంతా కేరళకు చెందిన వారే. ఉత్తర సరిహద్దులకు సమీపంలోని గలిలీ ప్రాంతంలో ఉన్న మర్గలియోట్ సామూహిక వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పౌల్ట్రీఫాంలో ఉన్న పాట్ నిబిన్ మాక్స్వెల్ (31) చనిపోగా జోసెఫ్ జార్జి(31), పౌల్ మెల్విన్(28) అనే వారు గాయపడ్డారు. మాక్స్వెల్ది కేరళలోని కొల్లం జిల్లా. క్షిపణి దాడిలో మాక్స్వెల్ గాయపడినట్లు సోమవారం సాయంత్రం తమకు ఇజ్రాయెల్లోని బంధువులు తెలిపారని తండ్రి పాత్రోస్ చెప్పారు. ఆ తర్వాత అతడు చనిపోయినట్లు అర్ధరాత్రి సమాచారమిచ్చారని గద్గద స్వరంతో మీడియాకు చెప్పారు. తన పెద్ద కుమారుడు ఇజ్రాయెల్లోనే ఉంటున్నారని ఆయన వివరించారు. గతంలో మస్కట్, దుబాయ్కి వెళ్లి వచ్చిన మాక్స్వెల్ రెండు నెలల క్రితమే ఇజ్రాయెల్ వెళ్లాడని తెలిపారు. కోలుకుంటున్న క్షతగాత్రులు: ‘క్షిపణి దాడిలో గాయపడిన జార్జిని పెటా టిక్వాలోని బీలిన్సన్ ఆస్పత్రికి తరలించాం. అతడి ముఖం, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. భారత్లోని కుటుంబ సభ్యులతో అతడు మాట్లాడొచ్చు’అని అధికార వర్గాలు తెలిపాయి. మెల్విన్కు స్వల్ప గాయాలైనట్లు ఇజ్రాయెల్ అధికారవర్గాలు తెలిపాయి. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సాయం అందిస్తామని చెప్పాయి. ఘటనపై ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మిలిటెంట్ల దాడిని పిరికిపంద చర్యగా పేర్కొంది. కాగా, సోమవారం హెజ్బొల్లా మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒకరు చనిపోగా మొత్తం ఏడుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించింది. గత ఏడాది అక్టోబర్ 8వ తేదీ నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పోరులో హమాస్కు మద్దతుగా లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు రాకెట్లు, డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై దాడులకు పాల్పడుతున్నారు. -
గర్భవతైన భార్యను, కూతురును వదిలి ఇజ్రాయెల్కు.. అంతలోనే
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొన్ని నెలలుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇజ్రయెల్పై సోమవారం ఓ క్షిపణి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దుల్లో జరిగిన ఈ దాడి.. లెబనాన్కు చెందిన హెజ్జుల్లా మిలిటెంట్ గ్రూప్ పనిగా తేలింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేరళకు చెందిన ఓ భారతీయుడు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ముగ్గురే కేరళకు చెందిన వారే కావడం గమనార్హం. మరణించిన వ్యక్తిని కేరళలోని కొల్లంకు చెందిన పాట్ నిబిన్ మాక్స్మెల్గా గుర్తించగా.. గాయపడిన ఇద్దరిని జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్లుగా గుర్తించారు, ఇద్దరు ఇడుక్కికి చెందగా..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా 31 ఏళ్ల పాట్ నిబిన్ రెండు నెలల కిత్రమే ఇజ్రాయెల్ వెళ్లారు. అతడి భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి. వీరికి అయిదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే తన భర్త, తండ్రికి అవే చివరి చూపులు అవుతాయని ఇద్దరూ ఊహించి ఉండరేమో.. ఈ దాడిపై నిబిన్ తండ్రి పాథ్రోస్ మాట్లాడుతూ.. తన పెద్ద కొడుకు ఇజ్రాయెల్ వెళ్లడంతో చిన్న కుమారుడైన నిబిన్ కూడా వారం రోజుల వ్యవధిలోనే అక్కడికి వెళ్లినట్లు తెలిపారు. ముందు మస్కట్, దుబాయ్ వెళ్లి ఇంటికి వచ్చిన అతడు అనంతరం రెండు నెలల కిత్రం ఇజ్రాయెల్ వెళ్లినట్లు తెలిపారు. తన కోడలు ద్వారా కొడుకు మృతి చెందినట్లు తెలిసినట్లు చెప్పారు. ‘సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె నాకు ఫోన్ చేసి, నిబిన్ దాడిలో గాయపడి ఆసుపత్రిలో ఉన్నారని చెప్పారు. తరువాత అర్ధరాత్రి 12.45 గంటలకు, అతను మరణించినట్లు మాకు సమాచారం వచ్చింది. నిబిన్ నాలుగున్నరేళ్ల కుమార్తెను, అతని భార్య(ఏడు నెలల గర్భవతి)ని వదిలి ఇజ్రాయెల్ వెళ్లాడు. అన్ని లాంఛనాలు పూర్తయ్యాక నిబిన్ మృతదేహాన్ని నాలుగు రోజుల్లో కేరళకు తీసుకురానున్నారు’ అని పేర్కొన్నారు. భారత్ అడ్వైజరీ జారీ ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో తొలిసారి భారతీయ వ్యక్తి మరణించడంతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్లో ఉంటున్న భారతీయ పౌరులు.. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న వారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరిపి.. భద్రత కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఖండించిన ఇజ్రాయెల్ ఈ దాడిని భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఖండించింది. పండ్లతోటను సాగు చేస్తున్న వ్యవసాయ కార్మికులపై షియా ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా జరిపిన ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలోన్ మాక్స్వెల్ సోదరుడితో మాట్లాడి, అతనికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. -
హెజ్బుల్లా దాడిలో భారతీయుడు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
ఇజ్రాయెల్పై లెబనాన్కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ చేసిన యాంటీ ట్యాంక్ క్షిపణీ దాడిలో కేరళకు చెందని ఓ భారతీయుడు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులోని మార్గాలియోట్ ప్రాంతంలో ఉన్న పండ్లతోటలో ఈ దాడి చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు కూడా భారతదేశంలోని కేరళకు చెందినవారుగా తెలుస్తోంది. సోమవారం 11 గంటల సమయంలో ఈ క్షిపణిదాడి జరిగిందని.. మాగెన్ డేవిడ్ ఆడమ్ రెస్క్యూ సర్వీసెస్ ప్రతినిధి జాకీ హెల్లర్ తెలిపారు. ఈ దాడిలో కేరళలోని ఇడుక్కికి చెందిన పట్నిబిన్ మాక్స్వెల్ మృతిచెందాడు. మరో ఇద్దరు జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్లు తీవ్రంగా గాయపడగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జోసెఫ్, పాల్ మెల్విన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక.. లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ అక్టోబర్ 8 నుంచి ఇజ్రాయెల్పై తరచూ దాడులకు తెగపడుతన్న విషయం తెలిసిందే. గాజాలోని పాలస్తీనా ప్రజలు, హమాస్ నేతలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. దాడిపై స్పందించిన ఇజ్రాయెల్... భారతీయులుపై జరిగిన హెజ్బుల్లా దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. ‘ ఈ దాడి మాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తీవ్రవాదం కారణంగా గాయపడిన లేదా మరణించిన ఇజ్రాయెల్ లేదా విదేశీ పౌరులందరినీ తాము ఇజ్రాయెల్ పౌరులుగానే పరిగణిస్తాం. గాయపడిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము’ అని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. We are deeply shocked and saddened by the death of one Indian national and the injury of two others due to a cowardly terror attack launched by Shia Terror organization Hezbollah, on peaceful agriculture workers who were cultivating an orchard at the northern village of Margaliot… — Israel in India (@IsraelinIndia) March 5, 2024 చదవండి: Nepal: నేపాల్లో రాజకీయ సంక్షోభం? -
Israeli-Hezbollah War: కాల్చేసే కాంతిపుంజం!
లెబనాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? పక్కలో బల్లెంలా మారిన హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకుందా? హెజ్బొల్లా ఉగ్రవాదుల డ్రోన్లు, రాకెట్లను కూల్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఐరన్ బీమ్’ తొలిసారిగా రంగప్రవేశం చేయనుందా? ఇజ్రాయెలీలకు ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. హెజ్బొల్లాతో యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని రోజులపాటు విద్యుత్ సంక్షోభం తప్పదన్న హెచ్చరికల పత్రం దేశ న్యాయ శాఖలో రౌండ్లు కొడుతున్నట్టు ‘ద జెరూసలెం పోస్ట్’ ఓ కథనం ప్రచురించింది. చాలా ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు రోజుల దాకా కరెంటు సరఫరా ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ అథారిటీ కూడా పేర్కొంది. ప్రజలు ఆహారం, నీరు, బ్యాటరీ వంటివి దగ్గరుంచుకోవాలని సూచించింది...! ప్రపంచంలోనే తొలిసారి! ఐరన్ బీమ్. ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి క్షణాల్లో కాల్చి బూడిదగా మార్చే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. తీవ్రమైన కాంతిపుంజపు ఉష్ణశక్తితో కూడిన ఈ వినూత్న సాంకేతిక ఆయుధాల గురించి వినడమే తప్ప ఇప్పటిదాకా ఏ దేశమూ ప్రయోగించలేదు. చెప్పాలంటే ప్రయోగాత్మక దశలో ఉన్న టెక్నాలజీ ఇది. ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్సుడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇది స్టార్ ట్రెక్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని ఆయుధాల్లా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ‘డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ కొంగొత్త వ్యవస్థను 2014 ఫిబ్రవరి 11న సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు. పాలస్తీనీ హమాస్, లెబనీస్ హెజ్బొల్లా ఉగ్ర సంస్థలతో తాజా ఘర్షణలు, యుద్ధం నేపథ్యంలో దీన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించనుందని తెలుస్తోంది. ఇలా పని చేస్తుంది... యారో–2, యారో–3, డేవిడ్స్ స్లింగ్, ఐరన్ డోమ్ తర్వాత ఇజ్రాయెల్ అమ్ములపొదిలో సరికొత్త ఆగ్నేయాస్త్రం ఐరన్ బీమ్. ఇది ఫైబర్ లేజర్ ఆధారంగా పనిచేస్తుంది. ఐరన్ డోమ్తో పోలిస్తే ఐరన్ బీమ్ చిన్నది, తేలికైనది. రహస్యంగా ప్రయోగించడానికి, ఒక చోట నుంచి మరో చోటికి తరలించడానికి మరింత అనువైనది. ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయెల్ స్వల్పశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థే. కానీ ఇటీవలి హమాస్ రాకెట్ దాడులను నిలువరించడంలో విఫలమైంది. ఇప్పుడు డోమ్కు బీమ్ను జతచేసి సత్ఫలితాలు రాబట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఐరన్ బీమ్కూ పరిమితులు లేకపోలేదు. తడి వాతావరణ పరిస్థితుల్లో ఈ లేజర్ వ్యవస్థ పనిచేయదు. ఎంతటి సానుకూల పరిస్థితులున్నా వాతావరణంలోని తేమ వల్ల 30% నుంచి 40% వరకు శక్తిని లేజర్ కోల్పోతుంది. అలాగే ధ్వంసం చేయాల్సిన లక్ష్యం ఐరన్ బీమ్ దృష్టి రేఖకు సూటిగా ఉండాలి. నేరుగా కంటికి కనిపించకుండా, బీమ్కు సూటిగా కాకుండా లక్ష్యం ఎక్కడో నక్కి ఉంటే లేజర్ కిరణాలతో నాశనం చేయడం అసాధ్యం. పైగా ఐరన్ బీమ్ ఫైరింగ్ రేటు కూడా తక్కువ. లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి సరిపోయేంత లేజర్ శక్తిని ప్రయోగించాలంటే కనీసం 5 సెకన్లు, అంతకు మించి సమయం కావాలి. అయినప్పటికీ శత్రు క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని కూల్చేసే సంప్రదాయ ఇంటెర్సెప్టర్ క్షిపణులతో పోలి్చతే ఐరన్ బీమ్ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. ‘ఖర్చు తక్కువ, పనితీరు ఎక్కువ’ అన్నది దీని సూత్రం. పైగా దీన్ని ఎన్నిసార్లైనా పేల్చవచ్చు. ఒక్కో షాట్కు అయ్యే వ్యయమూ తక్కువ. ఐరన్ డోమ్లో ఒక్కో ఇంటెర్సెప్టర్ రాకెట్కు 60 వేల డాలర్ల దాకా అవుతుండగా ఐరన్ బీమ్లో మాత్రం ఆ ఖర్చు కేవలం కొన్ని డాలర్లే. అంతేకాదు, ఈ వ్యవస్థలో శత్రు క్షిపణిని ఢీకొట్టాక ఇంటెర్సెప్టర్ శకలాలు పడే ముప్పు కూడా ఉండదు. 7 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు, మోటార్ షెల్స్ వంటివాటిని ఐరన్ బీమ్ క్షణాల్లో నిరీ్వర్యం చేయగలదు. దీన్ని 2025 నాటికి మోహరించాలని ఇజ్రాయెల్ భావించినా యుద్ధం అవసరాలతో ఇప్పుడే రంగంలో దించేలా ఉంది. ఐరన్ బీమ్ X లైట్ బీమ్! ఈ రెండు హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలనూ రఫేల్ సంస్థే అభివృద్ధి చేస్తోంది. లైట్ బీమ్ 7.5 కిలోవాట్ల ఇంటెర్సెప్టర్. రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్నపాటి మానవరహిత వైమానిక వాహనాలు, నేలమీద అత్యాధునిక మందుపాతరలు, పేలని మందుగుండు తదితరాలను ఇది నిర్వీర్యం చేయగలదు. ఐరన్ బీమ్ 100 కిలోవాట్ల తరగతికి చెందిన హై ఎనర్జీ లేజర్ సిస్టమ్. ఇది రాకెట్లు, శతఘ్నులు, యూఎవీలను కూల్చగలదు. – జమ్ముల శ్రీకాంత్ -
ఇజ్రాయెల్పైకి హెజ్బొల్లా రాకెట్లు
బీరుట్: లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు శనివారం ఇజ్రాయెల్పైకి పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. బీరుట్లో ఉన్న హమాస్ అగ్ర నేత సలెహ్ అరోరీని చంపినందుకు ప్రతీకారం తప్పదంటూ శుక్రవారం హెజ్బొల్లా నేత సయ్యద్ హస్సన్ నస్రల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం 62 రాకెట్లను ఇజ్రాయెల్లోని మౌంట్ మెరోన్లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. ఇవి ఆ కేంద్రాన్ని నేరుగా తాకాయని పేర్కొంది. మెరోన్ వైపు 40 రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, నష్టం గురించి ప్రస్తావించలేదు. ఇలా ఉండగా, 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై జరిపిన దాడుల్లో 122 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 22,722కు చేరుకుందని పేర్కొంది. మృతుల్లో మూడింట రెండొంతుల మంది చిన్నారులు, మహిళలేనని వెల్లడించింది. మరో 58,166 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది. -
Iraq: హెజ్బొల్లా స్థావరాలపై అమెరికా దాడులు
వాషింగ్టన్: ఇరాక్లోని హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా దాడులకు దిగింది. ఉత్తర ఇరాక్లో మిలిటెంట్లు జరిపిన దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు గాయపడడంతో అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు హెజ్బొల్లాపై దాడులకు దిగినట్లు దేశ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ చెప్పారు. ‘ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా గ్రూపునకు చెందిన మూడు స్థావరాలపై ఇరాక్లోని మా బలగాలు దాడులు జరిపాయి. ఖచ్చితమైన లక్ష్యాలను ఎంచుకుని వరుస దాడులు జరిపాం. ఇరాక్, సిరియాల్లో మా బలగాలపై ఇటీవల మిలిటెంట్లు తరచుగా దాడులు జరుపతున్నారు. దీనికి ప్రతిగా అధ్యక్షుడి ఆదేశాలతో మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశాం’ అని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్న హమాస్తో పాటు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్న హౌతీ మిలిటెంట్లు, ఇరాక్లోని హెజ్బొల్లా గ్రూపు మిలిటెంట్ల వెనుక ఇరానే ఉందని అమెరికా ఆరోపిస్తుండటం గమనార్హం. ఇదీచదవండి..అమెరికా ఎన్నికలు.. ట్రంప్ క్యాంపెయిన్లో ఆమె కీ రోల్ ! -
Hezbollah: ఇజ్రాయెల్ సైన్యానికి హెచ్చరిక
హమాస్ను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకరమైన దాడులను కొనసాగిస్తోంది. అయితే మరోవైపు లెబనాన్లోని పాలస్తీనా గ్రూప్లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. గత అక్టోబర్ 7 నుంచి హమాస్-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హిజ్బుల్లా సంస్థ, ఇజ్రాయెల్కు మధ్య కూడా కాల్పులు జరుగుతున్నాయి. సోమవారం ఇజ్రాయెల్ సైన్యాన్ని హిజ్బుల్ సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. సామాన్య ప్రజలపై దాడికి చేస్తే.. అంతకంతకు భారీ మూల్యం చెల్లించుకుంటారని తెలిపింది. అంత్యక్రియల సమయంలో సామన్య ప్రజలపై దాడులు చేస్తే పర్యావసానాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని మండిపడింది. సోమవారం ఓ ఫైటర్ అంత్యక్రియలను హిజ్బుల్లా సంస్థ నిర్వహించింది. అయితే ఈ అంత్యక్రియల్లో పాల్గొనే సామాన్య జనాలే లక్ష్యంగా సమీపంలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. ఇటువంటి సమయంలో సామాన్య ప్రజలపై దాడులకు దిగితే.. తాము కూడా అదే స్థాయిలో ప్రతికారం తీర్చుకుంటామని హిజ్బుల్లా సంస్థ.. ఇజ్రాయెల్ సైన్యాన్ని హెచ్చరించింది. చదవండి: Israel-Hamas war: 24 గంటల్లో 110 మంది దుర్మరణం -
హిజ్బుల్లా చీఫ్ వార్నింగ్పై ఇజ్రాయెల్ సెటైర్లు
ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలపై నేరుగా ప్రసంగించిన హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాపై ఇజ్రాయెల్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పిరికిపందలా బంకర్లో దాక్కుని.. సుదీర్ఘమైన నిస్సారమైన ప్రసంగాన్ని ప్రపంచానికి అందించారంటూ ఎద్దేవా చేసింది. ‘‘హసన్ నజ్రల్లా సుదీర్ఘమైన ప్రసంగం మేం విన్నాం. అది ఏమాత్రం ఆసక్తిగా లేదని నేను భావిస్తున్నా. ఆయనకు ప్రసంగాలు రాసే మనిషి.. బహుశా ఉత్తరాన ఇజ్రాయెల్ రక్షణ బలగాలు జరిపిన దాడుల్లో మరణించి ఉన్నాడని భావిస్తున్నా. ప్రాణభయంతో ఒక పిరికిపందలా నస్రల్లా బంకర్లో దాక్కుని ప్రసంగించారు. పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే హమాస్ను సమర్థిస్తూ సుమారు గంటసేపు ప్రసంగించారాయన. ఆ స్థానంలో నేను ఉంటే.. అసలు నా ముఖం జనాలకు చూపించేవాడినే కాదు’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఎయిలోన్ లెవీ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం వర్చువల్ ప్రసంగించిన హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా.. యుద్ధ ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన కేవలం హమాస్ దాడుల్ని ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్, అగ్రరాజ్యం అమెరికాను ప్రశ్నించారంతే. గొప్పగా గోప్యతను పాటించి.. పక్కా ప్రణాళికతో అక్టోబర్ 7వ తేదీ నాటి ఇజ్రాయెల్ దాడుల్ని సమర్థవంతంగా నిర్వహించిందంటూ హమాస్ను అభినందించారు. ఇజ్రాయెల్ సైనిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో ఈ దాడులతో స్పష్టమైందని అన్నారాయన. అలాగే.. ఆ దాడుల్లో హిజ్బుల్లా ప్రమేయం లేదని కూడా తేల్చి చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో 9,000 మందికిపైగా మరణించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నస్రల్లా.. గాజా దాడుల్లో ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్న అమెరికాపైనా మండిపడ్డారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా చేస్తున్న హెచ్చరికలను తాము పట్టించుకోబోమని నస్రల్లా తెగేసిచెప్పారు. ‘‘అమెరికా నౌకలు మధ్యదరా సముద్రంలో ఉన్నాయి. అయినా భయపడం. అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం. మేం ఇప్పటికే పాలస్తీనా కోసం యుద్ధం చేస్తున్నాం. అది మరింతగా విస్తరించొచ్చు. హమాస్కు అండగా ఉంటాం. గాజాపై దాడులను మీరు(అమెరికా) ఆపగలరు. ప్రాంతీయ యుద్ధం తలెత్తకుండా ఉండాలని భావిస్తున్న వారు ఎవరైనా సరే.. ముందుగా ఇజ్రాయెల్ను నిరోధించాలి’’ అని ఆయన అమెరికాకు సూచించారు. టెలివిజన్ ద్వారా నస్రల్లా చేసిన ఈ ప్రసంగాన్ని అరబ్బుదేశాల్లోని లక్షలమంది వీక్షించారు. లెబనాన్లోని పాలస్తీనా గ్రూప్లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ గత కొంతకాలంగా టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. పైగా హిజ్బుల్లా ఉద్యమానికి ఇరాన్ మద్దతు కూడా ఉంది. -
‘సరైన సమయంలో హమాస్తో కలుస్తాం’
ఇజ్రాయెల్తో జరుగుతున్న పోరులో హమాస్తో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని.. అందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామని లెబనాన్కు చెందిన హిజ్బుల్లా సంస్థ ప్రకటించింది. ‘‘జరుగుతున్న పోరులో భాగం అయ్యేందుకు హిజ్బుల్లా సిద్ధంగా ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు మేం రంగంలోకి దిగుతాం. ఇజ్రాయెల్ వ్యతిరేక పోరులో హమాస్తో చేతులు కలుపుతాం. మా ప్రణాళిక ప్రకారమే మేం ముందుకు వెళ్తాం’’ అని హిజ్బుల్లా డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీమ్, బీరూట్లో జరిగిన ఓ ర్యాలీలో ప్రకటించారు. ‘‘చాలా దేశాలు, అరబ్ దేశాలు, ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్తలు ప్రత్యక్షంగా.. పరోక్షంగా హిజ్బుల్లాను యుద్ధానికి దూరంగా ఉండమని కోరుతున్నాయి. కానీ, ఆ పిలుపును మేం పట్టించుకోం. ఏం చేయాలో హిజ్బుల్లాకు బాగా తెలుసు. సరైన సమయంలో రంగంలోకి దిగుతాం’’ అని ఖాసీమ్ తెలిపారు. లెబనాన్లోని పాలస్తీనా గ్రూప్లతో కూటమిగా ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ గత కొంతకాలంగా టార్గెట్ చేసి దాడులు చేస్తోంది. పైగా హిజ్బుల్లా ఉద్యమానికి ఇరాన్ మద్దతు కూడా ఉంది. సోమవారం.. ఇజ్రాయెల్ దాడుల్లో తమ సభ్యులు ముగ్గురు మరణించారని హిజ్బుల్లా ప్రకటించుకుంది. మంగళవారం.. హిజ్బుల్లా పోస్టుల మీద దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. అదే సమయంలో హమాస్ విభాగం తమపై రాకెట్ దాడి జరిగిందని ప్రకటించింది. బుధవారం.. లెబనాన్ గ్రామం ధైరా వద్ద మోహరించిన ఇజ్రాయెల్ బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపినట్లు హిజ్బుల్లా ప్రకటించుకుంది. అయితే.. ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో హిజ్బుల్లాకు చెందిన ముగ్గురు గాయపడ్డారట. ఈ దాడుల పర్వంలో.. శుక్రవారం దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో రాయిటర్కు చెందిన జర్నలిస్ట్ దుర్మరణం పాలవ్వగా.. మరికొందరు జర్నలిస్టులు గాయపడ్డారు. అయితే ఈ పరిణామంపై ఇజ్రాయెల్ బలగాలు స్పందించాయి. ఇజ్రాయెల్ వైపు జరిగిన దాడులకు ప్రతిగానే.. హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో ఇది చోటు చేసుకుందని తెలిపింది. మరోవైపు శుక్రవారం దక్షిణ బీరూట్లో వెయ్యి మంది హిజ్బూల్లా మద్దతుదారులు.. పాలస్తీనా జెండాలతో, బ్యానర్లతో ఊరేగింపు నిర్వహించారు. భగవంతుడే మిమ్మల్ని రక్షిస్తాడంటూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. -
ఇజ్రాయెల్కు కొత్త ముప్పు.. హమాస్తోపాటు మరో రెండు దేశాలతో పోరాటం
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులతో ఇజ్రాయెల్ అతలాకులతమవుతోంది. గాజాస్ట్రిప్ ద్వారా దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబడిన ఉగ్రవాదులు ‘ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్’ పేరుతో మెరుపు దాడి చేపట్టింది. కేవలం 20 నిమిషాల్లోనే దాదాపు 5 వేల రాకెట్లతో విరుచుపడింది. హమాస్ విధ్వంసానికి దిగడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. హమాస్ ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటిస్తూ ఐడీఎఫ్ దళాలను రంగంలోకి దింపింది. ఉగ్రదాడులను ధీటుగా ఎదుర్కొంటూ గాజాపై బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతోంది. హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. గత అయిదు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరువర్గాలకు చెందిన 3000 మంది మరణించారు. చదవండి: పఠాన్కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్లో హతం తాజాగా ఇజ్రాయెల్కు మరో ముప్పు పొంచుకొచ్చింది. హమాస్తోపాటు లెబనాన్, సిరియా రెండు దేశాల నుంచి కూడా దాడులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకున్న హమాస్ ఉగ్రవాద దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్, సిరియా, లెబనాన్లోని షియా ఇస్లామిస్ట్ గ్రూప్ హిజ్బుల్లాతో కూడిన ప్రాంతీయ కూటమి.. మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్తో అమెరికా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో హమాస్ దాడికి కొన్ని రోజులకే లెబనాన్కు చెందిన హిజ్బుల్లా ఇజ్రాయెల్ ట్యాంక్పై గైడెడ్ క్షిపణిని ప్రయోగించింది. పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఈ దాడికి పాల్పడించింది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉంది. తాజాగా తమ ఆయుధ నిల్వలు ఏ స్థాయిలో ఉంటాయో అంచనా వేయలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ధ్య 2006లో తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. దీని తర్వాత లెబనాస్- ఇజ్రాయెల్ సరిహద్దులో హింస అత్యంత తీవ్రంగా మారిది. కాగా ఇస్లామిక్ విప్లవాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి, ఇజ్రాయెల్ దళాలతో పోరాడటానికి హిజ్బుల్లాను 1982లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్థాపించారు. మరోవైపు సిరియా నుంచి కూడా ఇజ్రాయెల్పై దాడులు మొదలయ్యాయి. సిరియా వైపు నుంచి జరుగుతున్న దాడులకు ఇజ్రాయెల్ సైన్యం కూడా దీటుగానే సమాధానం చెబుతోంది. సిరియా నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి అనేక దాడులు జరుగుతున్నట్లు సైన్యం చెబుతోంది. ముఖ్యంగా సిరియా నుంచి మోర్టార్ షెల్స్, శతఘ్ని గుండ్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే 1967లో ఆరు రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ సిరియా నుంచి గోలన్ హైట్స్ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ రెండు దేశాలు మధ్య వైరుద్ధం ఏర్పడింది. -
Israeli-Palestinian Conflict: రంగంలోకి లెబనాన్ హెజ్బుల్లా మిలిటెంట్లు
టెల్ అవివ్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోకి లెబనాన్కు చెందిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కూడా అడుగుపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం దక్షిణ ఇజ్రాయెల్ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ తీవ్రవాదుల మధ్య పరస్పరం కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్ జవాన్లతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. దీనివల్ల ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్కు బద్ధ శత్రువులైన హెజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ అండగా నిలుస్తోంది. ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తోంది. హెజ్బుల్లా వద్ద వేలాది రాకెట్లు, ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో హెజ్బుల్లా మిలిటెంట్లు మకాం వేశారు. ఆదివారం ఒక్కడి నుంచి మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు.ప్రతిగా ఇజ్రాయెల్ సాయుధ డ్రోన్లు ప్రయోగించింది. దీంతో లెబనాన్ వైపు ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఉత్తర సరిహద్దులో ప్రస్తుతం సాధారణ పరిస్థితులుండగా దక్షిణ ప్రాంతంలో పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ పేర్కొంది. -
లెబనాన్లో దౌత్యకార్యాలయం వద్ద దాడి
బిరూట్: ఆత్మాహుతి దాడులతో మంగళవారం లెబనాన్ ఉలిక్కిపడింది. దేశరాజధాని బీరూట్లోని ఇరాన్ దౌత్యకార్యాలయం సమీపంలో జరిగిన బాం బు దాడుల్లో 23 మంది మృతిచెందగా, 146 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి అక్కడిభవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మోటారుసైకిల్పై, కారులో వచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్లు ఆర్మీ చెప్పింది.