Raghuveera Reddy Yadav
-
‘బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్’
సాక్షి, హైదరాబాద్ : మోసకారి నరేంద్ర మోదీ రాక్షస పాలనకు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మే 26న రణ శంఖారావం పూరించనున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఇందిరాభవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 100 రోజుల్లో నల్లధనం వెలికితీస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసిన మోదీ సన్నిహితులు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీలు విదేశాల్లో దర్జాగా ఉన్నారన్నారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి, వ్యాపం కుంభకోణం మోదీ హయాంలోనే వెలుగు చూశాయన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణం. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బ్యాంకుల్లో క్యాష్ నిల్, బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్గా పరిస్థితి మారింది. దళిత, ఎస్టీ, మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణ కొరవడింది. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తుంగలో తొక్కి గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఎమ్మెల్యేలను కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మోదీ పాలన రాక్షస పాలన. దీన్నిఅంతమొందించాల’ని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని, మోదీ ముక్త్ బీజేపీ కోసం ఆ పార్టీకి చెందిన వారే ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రైతుల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. 40 వేల కోట్ల రూపాయల రొయ్యలను మన దేశ రైతులు ఎగుమతి చేస్తే, అందులో సగం రాష్ట్ర రైతులే ఎగుమతి చేశారని తెలిపారు. రొయ్యల ధర పడిపోవడంతో 4 వేల కోట్ల రుపాయల నష్టం వాటిల్లిందని, దీనిపై మాత్రం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేవుడి మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. వ్యక్తి, పూజారి మీద కోపంతో దేవాలయాల మీద కక్ష కట్టొద్దని, వ్యవస్థ మీద బేషజాలకు పోకుండా వివాదం తొలగించాల’ని హితవు పలికారు. -
టీటీడీ బోర్డు కూర్పు అహంకార పూరిత చర్య
సాక్షి, అనంతపురం : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. మడకశిరలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలకవర్గ సభ్యుల్లో అర్హులు కానీ వారిని, అన్యమతస్తులను నిమమించి ప్రభుత్వం అపచారం చేసిందని అన్నారు. ఇది పొరపాటు కాదని, అహంకార పూరిత చర్యని ఆయన వాఖ్యానించారు. తాను ఇతర మతాల వారిని, వారి ఆచారాలను గౌరవిస్తానని, ఇది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. భేషజాలకు పోకుండా వివాదాస్పదులను తొలగించి, అర్హులైన వారిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు బీజేపీతో బహిరంగ కాపురం చేసిన ప్రాంతీయ పార్టీలు, నేడు దొంగ చాటుగా కాపురం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ మంత్రి భార్యకి టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించడమే ఇందుకు నిదర్శనమని రఘవీరా ఆరోపించారు. -
ఏపీ బంద్ను విజయవంతం చేయండి
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16న తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టిన బంద్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. కేంద్రంపై ఒత్తిడి తేచ్చేందుకే దీక్షలు, నిరసనలు ప్రారభించినట్టు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళనం చేయడమే అని విమర్శించారు. బంద్లో తెలుగు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రఘువీరా కోరారు. కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవహరించిన తీరుకు నిరసనగా సాధన సమితి 16వ తేదీన బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
రఘువీరారెడ్డి అరెస్ట్.. పీఎస్కు తరలింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేస్తున్నవారిని సీఎం చంద్రబాబు అరెస్ట్ చేయించడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. చంద్రబాబు తన కేసుల కోసమే కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సిగ్గుంటే ముందు తన కేంద్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. హైవేపై ఆగిన ట్రాఫిక్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడప-తిరుపతి జాతీయ రహదారిని కాంగ్రెస్ నాయకులు దిగ్బంధించారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
‘ప్రధానిగా రాహుల్ తొలి సంతకం దానిపైనే’
సాక్షి, కడప: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి పోరాడుతూనే ఉందని చెప్పారు. చట్టసవరణ చేసైనా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. పార్లమెంట్లో విభజన హామీలపై చర్చ జరపకుంటే చరిత్ర హీనులవుతారని ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానాన్ని చివరి అస్త్రంగా ఉపయోగిస్తామన్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతారని చెప్పారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అవకాశవాది: సీఆర్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మొదటి లేఖ రాసింది సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు అధిక సంఖ్యలో వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాదని, అవకాశాన్ని బట్టి ఆయన మారిపోతుంటారని దుయ్యబట్టారు. భూములు కబ్జా చేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. -
ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదు
నంద్యాల ఓటమిపై పీసీసీ భేటీలో చర్చ సమావేశానికి హాజరైన దిగ్విజయ్సింగ్ సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఘోర పరాజయంపై వాడివేడి చర్చ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ కొంతమేరకైనా బలపడకపోతే ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘోర ఓటమిపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దిగ్విజయ్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యనేతల్ని ఢిల్లీకి రావాలని ఆయన సూచించినట్టు సమాచారం. నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఓటమికి నైతికి బాధ్యత తనదేనని రఘువీరారెడ్డి అన్నట్లు సమాచారం. ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాల పేరిట అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు ప్రతి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పేదలకు ఇందిరమ్మ హయాంలో అందించిన ఫలాల గురించి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు వీలుగా అక్టోబర్ 2 నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్తామని చెప్పారు. నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు ఎన్నికలే కావని, అవి పూర్తిగా అనైతికంగా జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ, అనుబంధాల సంఘాల ఎన్నికల ప్రక్రియ 80 శాతం పూర్తయిందని, పీసీసీ చీఫ్తోపాటు మిగిలిన పదవులకు ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు కేవీపీ రామచంద్రారావు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, సి.రామచంద్రయ్య, కమలమ్మ, కాసు వెంకటకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'నంద్యాల ఉప ఎన్నిక రద్దు చేయాలి'
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికతో రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేసిందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాలలో ఎన్నికలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత లాభం కోసమే చంద్రబాబు, జగన్.. ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తున్నారని ఆరోపించారు. దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా
విజయవాడ: బాధిత దళితులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో రాష్ట్రంలో దళితలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై టీడీపీ నేతల దాడులని ఖండిస్తున్నామని చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని రఘువీరా ధ్వజమెత్తారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను మూడేళ్లయిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హాదాపై ఇచ్చిన మాటను ప్రధాని నరేంద్ర మోదీ తప్పారని విమర్శించారు. మోదీ మాట తప్పినందుకు రేపు (సోమవారం) నిరసన కార్యక్రమాలు చేపడతామని రఘువీరారెడ్డి తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మోదీకి నిరసన రాఖీలు పంపనున్నట్లు వెల్లడించారు. -
‘పేరు మార్చుకున్న చంద్రబాబు’
అమరావతి: ‘టీడీపీ, బీజేపీ మూడేళ్ళ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరును అబద్ధాల నాయుడుగా మార్చుకున్నారు. టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. అవినీతి, దోపిడి, అరాచకాల్లో ఏపీ నంబర్వన్గా మారింద’ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ మూడేళ్ల పాలనపై ఈ రోజు ఆయన ‘దోపిడి బాబు’ పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదబాబు, చినబాబు, టీడీపీ నేతలు కలిసి ఇసుకలో రూ. 29 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. చంద్రబాబు మూడేళ్ళుగా అన్నం తినడం లేదు ఇసుక తింటున్నారని ఎద్దేవా చేశారు. ‘సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను 34 వేల కోట్ల నుంచి 74 వేల కోట్లకు పెంచేశారు. భూములు కోసం టీడీపీ మంత్రులు వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఎమ్మెల్సీలు జైలుకు పోతున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య రాజీ కోసమే చంద్రబాబు త్రిసభ్య కమిటీ వేశారు. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగితే దానిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. తన అవినీతి వల్లే ప్రత్యేక హోదాపై రాజీపడ్డారు. ఏపీలో చినబాబుకు ఒక్కడికే జాబ్ వచ్చింది. బ్యాంకులకు టీడీపీ నాయకులు వేల కోట్లు ఎగ్గొట్టారు. టీడీపీ ఆర్థిక నేరస్థులను పెంచిపోషిస్తోంది. టీడీపీ నేతలు అధికారలోకి వచ్చిన తరువాత రూ. 3 లక్షల కోట్లు దోచుకున్నారు. బాబు మీడియా గొంతు నొక్కుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాను అనేక ఇబ్బందులు పెడుతున్నార’ని రఘువీరా మండిపడ్డారు. -
ఏపీసీసీ ఛీఫ్ మౌనదీక్ష
మడకశిర: రాష్ట్రంలో ప్రస్తుతమున్నది తీవ్ర దుర్భిక్షమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలోని గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు దీక్ష సాగింది. తొలుత స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు, దేశ వ్యాప్తంగా లౌకికవాదానికి ముప్పు, రైతు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ఈ దీక్ష చేపట్టానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. హిందువులకు కూడా శాంతి లేదన్నారు. రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఉందని ఆయన తెలిపారు. ఐదు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 12 లక్షల మంది కూలీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. యంత్రాలతో ఉపాధి పనులను చేపడుతుండటంతో కూలీల వలసలు పెరిగాయన్నారు. గతేడాది రాష్ట్రంలో 580 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. హేవళంబి సంవత్సరంలో రాష్ట్ర ప్రజలను పాలకులు పెద్దఎత్తున మోసం చేస్తారని పంచాంగం చెబుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ చేవూరు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం
హైదరాబాద్: స్థానిక సంస్థలకు జరిగే ఉప ఎన్నికల్లో పరిశీలకులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మార్చి 17న ఇందిరాభవన్లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్/కార్పొరేషన్, వార్డుల ఉప ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలు, వాటి పరిశీలకుల వివరాలను ఓ ప్రకటనలో ఏపీసీసీ వెల్లడించింది. జిల్లా పేరు పరిశీలకులు 1. విజయనగరం --- ద్రోణం రాజు శ్రీనివాస్(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 2. విశాఖపట్నం --- ఎస్.ఎన్.రాజా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 3. తూర్పు గోదావరి --- పక్కాల సూరిబాబు (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 4. పశ్చిమ గోదావరి --- నరహరశెట్టి నరసింహారావు(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 5. కృష్ణా ---- సుందరరామ శర్మ (ఎపీసీసీ లీగల్ సెల్ చైర్మన్) 6. గుంటూరు ---- కె. బాపిరాజు (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 7. నెల్లూరు ----- మస్తాన్వలీ (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 8. చిత్తూరు ------ డాక్టర్ సాకె శైలజానాధ్ (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) 9. కడప ----- షాజహన్ బాషా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 10. కర్నూలు ----- డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 11. అనంతపురం ------ అహ్మదుల్లా ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) -
‘ఏపీలో విచ్చలవిడిగా అవినీతి దందా’
విజయవాడ: శాసనసభా సమావేశాలను కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మరోసారి తీర్మానం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ తీర్మానంతో పాటు అఖిలపక్ష నాయకులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దందా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఇష్టానుసారంగా అంచనాలు పెంచేసి దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు వెనుకాడుతోందని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. -
ఏపీసీసీ నూతన కార్యదర్శిగా షేక్ షానవాజ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా షేక్ షానవాజ్ ను, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటేష్ను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూల ప్రసాద్ లను నియమించారు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరారెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక ఉత్తర్వులను అనంతపురం జిల్లా ఇన్చార్జి కె.రవిచంద్రారెడ్డి చేతుల మీదగా నేతలు అందుకున్నారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్న నేతలు, అవకాశం ఇచ్చిన పార్టీ చీఫ్ రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
'ప్రత్యేక హోదా కోసం మౌనదీక్ష'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో 26వ తేదీన మౌనదీక్ష చేపట్టాలని ఏపీసీసీ నిర్ణయించింది. ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు అని, ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం చేశాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. బీజేపీ, టీడీపీల మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులు గాంధీజీ విగ్రహాల వద్ద జాతీయ జెండాలను చేతబూని, నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష చేపడతాయని రఘువీరారెడ్డి వెల్లడించారు. -
‘మోదీతో పోటీ పడుతున్న చంద్రబాబు’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన సమయంలో కరువు నివేదికలు పంపకపోవడంతో కేంద్రం నుంచి సహాయం అందడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. రైతాంగానికి ప్రభుత్వం హాలిడే ప్రకటించిందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీతో పోటీ పడి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరం రైలు ప్రమాద బాధితులకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆయన సంతాపం తెలిపారు. -
దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
విజయవాడ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మృతి చెంది ఏడాది గడిచినా ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ విషయంలో న్యాయం జరిగేవరకు తమ పార్టీ పోరాడుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా వాసి అయిన రోహిత్ మరణంపై టీడీపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని చెప్పారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠిన చట్టాలు ఉన్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వైఖరి ప్రభుత్వాలకు దళితులపై ఉన్న చిత్తశుద్దికి అద్దం పడుతుందన్నారు. రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని అంటూ.. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కేసును తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. రోహిత్ వేముల చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు. -
శేఖర్రెడ్డి.. చంద్రబాబు బినామి: ఏపీసీసీ చీఫ్ రఘువీరా
విజయవాడ: అక్రమ ఆస్తుల వ్యవహారంలో పట్టుబడిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బినామీ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చెన్నైలో చంద్రబాబుకు చాలా మంది ఆప్తులు ఉన్నప్పటికీ వారిని కాదని బినామీ కాబట్టే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇచ్చారని అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కష్టాలకు నిరసనగా ‘ప్రశ్నిద్దాం రండి’ పేరుతో తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 23న చలో వెలగపూడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. తాత్కాలిక సచివాలయానికి సమీపంలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుందని, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సామాన్యుల ఇళ్లలో డబ్బులు లేక పెళ్లిళ్లు వాయిదా పడుతుంటే, మరోపక్క బీజేపీ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం ప్రజలు రోడ్లపై నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. పాత పెద్ద నోట్ల రద్దు తన వలనే అని చెప్పుకుంటున్న చంద్రబాబు 2 వేల రూపాయల నోట్లు రద్దు చేయాలని ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేదని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. -
పెద్ద నోట్ల రద్దుతో పేదలకు ఇబ్బందులు
ప్రధానికి లేఖ రాసిన రఘువీరా సాక్షి, హైదరాబాద్: నల్లధనం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, వాస్తవాలను ప్రజలకు అందించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖలోని అంశాలను ఇందిరభవన్లో గురువారం విలేకరులకు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కావలసిన వారికి, బీజేపీకి ఎన్నికల్లో ఆర్థికంగా ఉపయోగపడిన నల్ల కుబేరులకు సంబంధించి రూ.1.20 లక్షల కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసింది నిజం కాదా.. ఆ మొత్తాన్ని రద్దు చేసిన నల్లకుబేరుల పేర్లను బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. -
ఎవరి కోసం రద్దు చేశారు: రఘువీరారెడ్డి
గుంటూరు: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని వాపోయారు. బడాబాబుల కోసమే 2 వేల రూపాయల నోటు చెలామణిలోకి తెచ్చారని ఆరోపించారు. 2 వేల రూపాయల నోటుతో సామాన్య, పేద ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పెద్ద నోటుకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నోట్ల కష్టాలతో దేశవ్యాప్తంగా 70 మంది చనిపోయారని, వీరి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
‘రూ. 2 వేల నోటు చెల్లని నోటే’
విజయవాడ: ప్రత్యామ్నాయం చూపకుండా అనాలోచితంగా పాత పెద్ద నోట్లు రద్దు చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొలేదని గుర్తు చేశారు. 14 లక్షల కోట్ల రూపాయల 500, వెయ్యి నోట్లు రద్దు చేశారని, కొత్తగా ఎన్నినోట్లు విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో మీరు చెప్పిన లక్ష్యం నెరవేరిందా అని ప్రశ్నించారు. కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీవి రావని గ్యారెంటీ ఇవ్వగలరా అని అడిగారు. కొత్తగా చెలామణిలోకి తెచ్చిన 2 వేల రూపాయల నోటు చెల్లని 500, వెయ్యితో సమానమని వ్యాఖ్యానించారు. 2 వేల నోటు సామాన్యులకు ఉపయోగపడడం లేదు, చిల్లర దొరకడం లేదని తెలిపారు. 2 వేల నోటు దాచుకోవడానికే పనికొస్తోందని ఎద్దేవా చేశారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ రాకముందే 2 వేల నోట్లు ప్రింట్ చేశారా అని ప్రశ్నించారు. నోట్ల కోసం క్యూలో నిలబడిన వారిలో 70 మంది మృతి చెందారని, వీరి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన తల్లిని క్యూలో నిలబెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. -
‘రూ. 2 వేల నోటు చెల్లని నోటే’
-
‘2 వేల రూపాయల నోట్లను రద్దుచేయండి’
-
‘2 వేల రూపాయల నోట్లను రద్దుచేయండి’
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతపురంలో ఎస్ బీఐ ఎదుట ఆయన ధర్నాకు దిగారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులు తమ వారిని కాపాడుకున్నాకే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. దోపీడీ దొంగలు అంతా దాచుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని అన్నారు. తాను లేఖ రాస్తే పెద్ద నోట్లు రద్దు చేశారని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక్క సంతకంతో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. బ్యాంకుల్లో విత్ డ్రా దరఖాస్తులను కూడా అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రతి బ్యాంకు, ఏటీఎంలో సరిపడా వందనోట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రేపు అన్ని బ్యాంకుల వద్దకు వెళ్లి ప్రజలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రఘువీరారెడ్డి పిలుపుయిచ్చారు. -
'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది'
⇒ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అమరావతిః స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలకు శిక్షణ పేరుతో ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు విషయాలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యం అని హోదా కోసం మహానాడులో తీర్మానాలు చేసిన చంద్రబాబుకు హోదా తెచ్చే శక్తిలేక, తన సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేసేందుకు ప్యాకేజీ జపం చేస్తున్నారన్నారని విమర్శించారు. శిక్షణా తరగతులు అంటూ ప్యాకేజీపై ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లకు చెప్పడం వెనుక ఆయనకు ఉన్న భయమేమిటో అర్థం అవుతోందన్నారు. హోదా విషయంలో తన రక్తం మరిగిపోతుందని, ఎంతటి పోరాటానికైనా సిద్ధం అన్న చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించడంలో తన సొంత ప్రయోజనాలకే పెద్దపీఠ వేశారని తేటతెల్లమైందన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు భయపడే టీడీపీ నాయకులకు శిక్షణ పేరుతో ప్యాకేజీ పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు హోదా...నేడు ప్యాకేజీ అంటున్న చంద్రబాబును ప్రజలు గమనిస్తున్నారని ఇందులో భాగంగానే ప్రజల వద్దకే కాంగ్రెస్ అంటూ తిరుపతిలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. -
'చంద్రబాబు రాజకీయ ఆయుష్షు మూడేళ్లే'
- టీడీపీ అవినీతిపై పోరాటం ఉధృతం - ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విజయవాడ సెంట్రల్ (కృష్ణా జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆయుష్షు మూడేళ్లలో ముగియనుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆంధ్రరత్న భవన్లో జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2050 వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. అవినీతి సంపాదన మితిమీరడంతో చంద్రబాబు అహంకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అడవి పందులతో పోల్చిన బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో హామీలను గాలికి వదిలేశారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ గుర్తింపును రద్దుచేయాలని కోరతామన్నారు. చంద్రబాబు నుంచి జన్మభూమి కమిటీల వరకు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. దీనిపై కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేయనున్నట్లు తెలిపారు. త్వరలో రాహుల్గాంధీ విశాఖ మన్యంలో భరోసాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తిరువనక్కరసు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కోపంగా ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గాలవారీగా పునశ్చరణ తరగతులు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు అందని అర్హుల తరఫున పోరాటం చేయాలని, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని, ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకు ఇతరపార్టీల మద్దతు కూడగట్టాలని సమన్వయ కమిటీ తీర్మానించింది. మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ ఏర్పాటు చేయాల్సిందే..
లేదంటే ఉద్యమిస్తాం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నరసరావుపేట : మండలంలోని కాకాని వద్ద కాకినాడ జవహల్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం నరసరావుపేటకు వచ్చిన ఆయన పీసీసీ క్రమశిక్షణ సంఘ చైర్మన్, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి సూచన మేరకు జేఎన్టీయూకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.50 కోట్ల విలువైన 87 ఎకరాల స్థలాన్ని జేఎన్టీయూకు కేటాయిస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే ఇదే స్థలాన్ని పారిశ్రామిక వాడ కోసం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నల్ల జీవో ఇచ్చిందని, దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జేఎన్టీయూపై చంద్రబాబు హామీ ఇచ్చిన మూడు నెలలకే..ఏపీఐఐసీకి అప్పగించడం దారుణమన్నారు. పారిశ్రామిక వాడల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడుతుందని విమర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జున రావు స్థానిక నాయకులు ఉన్నారు. -
కాంగ్రెస్ కరువు యాత్ర
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులను సమీక్షించేందుకు పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బృందం మే 14,15 తేదీల్లో జిల్లాల్లో పర్యటించనుంది. 14వ తేదీ ఉదయం 10 గంటలకు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపాలెం మండలంలోని కొత్తూరు గ్రామం, అనంతరం సాయంత్రం 4 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలోని మండపం గ్రామాల్లో పర్యటించనున్నారు. 15 వ తేదీన ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని చింతలపూడి గ్రామంలో పర్యటించనున్నారు. -
ఓటింగ్తో వాళ్ల నిజాయితీ తెలుస్తుంది: రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదాపై పీసీసీ చీఫ్ రఘువీరా న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్తో బీజేపీ, టీడీపీ నిజాయితీ ఏంటో బయటపడుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇతర పార్టీలను కోరినట్టు వివరించారు. ఓటింగ్ జరిగే 13వ తేదీన కాంగ్రెస్ సభ్యులందరూ హాజరవ్వాలని పార్టీ విప్ జారీచేస్తుందని, దీనిపై ఇప్పటికే సోనియాగాంధీ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ప్రైవేటు బిల్లు ఓటింగ్కు రాకుండా అడ్డుకోవాలని బీజేపీ, టీడీపీ కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి రాజధాని లేదని, నిర్మాణంలో తగిన సాయం చేయాలని ఆయన కోరారు. -
‘ప్రత్యేక’ నినాదమే మనకు దిక్కు!
ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు... రాష్ట్ర విభజన పాపం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పార్టీపరంగా రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కన్పించడం లేదు. ఆఖరుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏడాదిలోనే రెండు సార్లు అనంతపురం జిల్లా పర్యటనకు తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పార్టీకి గ్రామ స్థాయి నాయకులు కూడా కరువయ్యారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఎలాగూ నష్టపోయాం...ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆ నినాదంతోనే ముందుకెళ్తే బాగుంటుందని భావిస్తున్నారు. హోదా ఇవ్వాలనే డిమాండ్పై ఇప్పటికే కోటి సంతకాలు, ఎస్ఎంఎస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం పార్లమెంటు జరుగుతున్నందున రాష్ట్రం నుంచి కనీసం రెండు వందల మంది నాయకులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. అంతో ఇంతో పార్టీ ప్రజల్లో ఉండాలంటే ఈ నినాదమే దిక్కు అని నేతలు భావిస్తున్నారు. -
చలో ఢిల్లీ పోస్టర్ విడుదల చేసిన రాహుల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం అమలు కోసం కోటి సంతకాల సేకరణకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. న్యూఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇందుకు సంబంధించి గురువారం ఓ పోస్టర్ విడుదల చేశారు. కోటి సంతకాల సేకరణతో మార్చి 12న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేయనున్నట్లు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కన్నారు. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జైరాం రమేష్, పార్టీ ఎంపీలు కేవీపీ రామచందర్ రావు, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, జేడీ శీలం, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పార్టీ నిర్మాణంలో నిర్లక్ష్యం చేశాం
పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశామని, రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో పార్టీ మరింత బలహీనపడిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్లో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి ఎంపికచేసిన 70 మంది ముఖ్య కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి వివరించడంతో పాటు ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలకు ఈ శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 15 వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు శిక్షణ తరగతులు ఉపకరిస్తాయన్నారు. -
'24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్: ఎస్సీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల్లోగా దళితులకు క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దళితులను చంద్రబాబు తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ కమిషన్ ను పూర్తిస్థాయిలో నియమించలేదని తెలిపారు. బీసీ కమిషన్ కు ఇంతవరకు సభ్యులను నియమించలేదని, కనీసం కార్యాలయం కూడా లేదని అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అవసరమయితే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సూచించారు. -
దారుల మూత.. నేతల నిర్బంధం
♦ ఎయిర్పోర్టులో రఘువీరా, చిరంజీవి అరెస్టు, విడుదల ♦ విమానాశ్రయంలోనే బొత్స, ఉమ్మారెడ్డిల నిర్బంధం ♦ హోటల్ నుంచి దాసరిని కదలనీయని పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ/కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు, సంఘీభావం తెలిపేందుకు కిర్లంపూడి వస్తున్న ప్రతిపక్ష నేతలను రాష్ర్టప్రభుత్వం అడుగడుగునా ఆటంకపరిచింది. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయంలో వారిని నిర్బంధించింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవిలను అక్కడే అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కూడా విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్ నుంచి కిర్లంపూడి వస్తున్న కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణరావును అడుగడుగునా అడ్డుకున్నారు. కిర్లంపూడికి దారితీసే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. కిర్లంపూడి వెళ్లేందుకు రాజమహేంద్రవరం వచ్చి ఓ హోటల్లో బస చేసిన దాసరిని పోలీసులు బయటకు రానీయలేదు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమన్నా ఉగ్రవాదినా’ అని ఆయన మీడియా వద్ద వాపోయా రు. సాయంత్రం దాసరి కిర్లంపూడిలో ముద్రగడను కలిసివెళ్లారు. ప్రభుత్వ తీరుపై చిరంజీవి తీవ్రంగా స్పందించారు. ‘మమ్మల్ని నిర్బంధిం చే హక్కు ఎవరు ఇచ్చారు’ అని ప్రశ్నించారు. విమానాశ్రయంలోనే ...: వైఎస్సార్సీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ సీనియర్ నేత బొత్సలను విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ దీక్ష విరమించిన తర్వాత గానీ వారిని వదలలేదు. అక్కడ నుంచి బొత్స విజయనగరం, ఉమ్మారెడ్డి గుంటూరు బయలుదేరి వెళ్లారు. -
'మీడియాను రానివ్వకుండా మమ్మల్ని నిర్బంధించారు'
రాజమండ్రి: కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమను సోమవారం రాజమండ్రి విమానాశ్రయంలో అరెస్ట్ చేసి నిర్బంధించడం పట్ల కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, చిరంజీవి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అరాచకాలు జరుగుతాయని తమను ఎయిర్పోర్టులోనే నిర్బంధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ.. 'రాజమండ్రి విమానాశ్రయానికి ఉదయం 11.30కి చిరంజీవితో కలసి వచ్చాం. సి.రామచంద్రయ్య, పళ్లంరాజు, వట్టి వసంతకుమార్ కలిసి కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పరామర్శించాలనుకున్నాం. కాపు రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వస్తే, అతి దుర్మార్గంగా మమ్మల్ని ముందస్తుగా అరెస్టు చేశారు. కనీసం మీడియాను కూడా రానివ్వకుండా గంటన్నర పాటు నిర్బంధించారు. ఇది ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట. దీన్ని ఖండిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పించాలి. ఇది కేవలం కాపులకు సంబంధించిన సమస్య కాదు.. మొత్తం ప్రజాస్వామ్య సమస్య. మాకు, ప్రజలకు మధ్య గోడ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మేం కిర్లంపూడి వెళ్లి తీరాలి. వెళ్లకుండా వెనుదిరిగే ప్రసక్తి లేదు' అని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. 'కాపు ఉద్యమసారథి ముద్రగడను పరామర్శించి, సంఘీభావం తెలిపేందుకు మేమంతా వచ్చాం. కిర్లంపూడి వెళ్లి సామరస్యంగా మాట్లాడదామని వచ్చాం. ఏ అరాచకాలు, గందరగోళం జరుగుతాయని మమ్మల్ని ఎయిర్పోర్టులోనే నిర్బంధించారు. ఇది అప్రజాస్వామికం. సీఎం ఏం చూసి భయపడి ఇలా నిర్బంధిస్తున్నారో అర్థంకావడం లేదు. మేమంతా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులమే. మేం ప్రభుత్వానికి, ఉద్యమ పెద్దలకు మధ్య వారధిగా ఉండి ప్రయోజనాత్మక సలహాలు ఇవ్వాలని వస్తే ఇలా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు? కేవలం వాళ్ల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, మా నోళ్లు మూయించడానికి జరుగుతున్న ప్రయత్నం. మేం రెచ్చగొట్టేవాళ్లం కాదు' అని చెప్పారు. -
రఘువీరా, చిరంజీవి అరెస్ట్
రాజమండ్రి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు రాజమండ్రి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలను పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఇరువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల పెద్ద ఎత్తున బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎయిర్ పోర్టు నుంచి రఘువీరారెడ్డి, చిరంజీవిని పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ముద్రగడను పరామర్శించేందుకు తమ నేతలను వెళ్లనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ముద్రగడను కలిసేందుకు వచ్చిన రఘువీరారెడ్డి, చిరంజీవిని 151 చట్టం కింద అరెస్టు చేశారని ఆరోపించారు. ముద్రగడతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ప్రజలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, మానవ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. రఘువీరా, చిరంజీవి అరెస్ట్ ను పీసీసీ ఖండించింది. -
'ఎట్టి పరిస్థితుల్లోనూ కిర్లంపూడికి వెళతాం'
హైదరాబాద్: కాపు ఉద్యమకారులతో ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. సోమవారం ఉదయం చిరంజీవితో కలిసి కిర్లంపూడి వెళ్లేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి పయనమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమను రాజమండ్రిలో అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోన కిర్లంపూడికి వెళ్లి తీరతామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర ఆలస్యంగా జస్టిస్ మంజునాథ కమిషన్ వేసిన ప్రభుత్వం ఇప్పటికీ సభ్యులను నియమించలేదని విమర్శించారు. 2 నెలల్లో కాపుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించవచ్చని తెలిపారు. తుని ఘటన సహా ఉద్యమానికి సంబంధించిన అన్ని ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. -
'గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి'
అనంతపురం : జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం అనంతపురంలో రఘువీరా మాట్లాడుతూ... హెచ్సీయూ విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులను తొలగించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలకు వ్యతిరేకమని... అందుకే వారిపట్ల వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు. హెచ్సీయూ వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గాడ్సే , గాంధీ వారసుల మధ్య సైద్ధాంతిక పోరు జరుగుతుందని రఘువీరా తెలిపారు. -
'ఆంధ్రాకు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని, ఈ విషయంలో తాము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అన్నారు. ప్రత్యేక హోదా అమలు ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందనీ, వివిధ మార్గాల ద్వారా అధిక మొత్తంలో నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా విశేషమైన లబ్ధి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం డెహ్రాడూన్లో ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ, హోంమంత్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా వల్ల విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు రావడంతోనే పురోగతి సాధించామని, ప్రారిశ్రామిక ప్రోత్సాహకాల వల్ల పారిశ్రామికంగా వృద్ధి చెందామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇలాంటి చర్యల ఫలితంగా గడచిన 16 ఏళ్లలో తమ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి రేటు నమోదు అయ్యిందనీ, ప్రస్తుతం తాము అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి రఘువీరారెడ్డికి వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులకు కోత పెట్టేందుకు యత్నించినా సమర్థంగా వ్యతిరేకించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ సోనియా గాంధీ సమక్షంలోనే తీర్మానించామని ఆ విషయంలో ఏపీకి సంపూర్ణ మద్దతిస్తామని రఘువీరాకు ముఖ్యమంత్రి రావత్ స్పష్టం చేశారు. -
మా వాళ్ల ఓట్లు అక్కర్లేదా?
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల సందడి మొదలైనా ప్రచారంలో పాల్గొనాలని మాటమాత్రంగానైనా ఆహ్వానించకపోవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు గుర్రుమంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచార వ్యూహంపై పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టారు. అయితే, తనకు పిలుపు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము ప్రచారం చేస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉన్నా దిగ్విజయ్సింగ్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఏపీకి చెందిన ముఖ్యనేతలు ఇందిర భవన్లో చర్చించుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామనే ఆకాంక్షను ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించాలని ఏపీ పీసీసీ చీఫ్ ముందుగా అనుకున్నప్పటికీ తెలంగాణ నాయకుల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఆ విషయాన్ని ప్రకటించకుండా వాయిదా వేయాల్సి వచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
'చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తుంటే నీరో చక్రవర్తి గుర్తుకు వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉంటే చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే సెక్షన్ 84 కింద కేంద్ర జలవనరులు సంఘం అనుమతి ఉండాలని, కేంద్ర జలవనరుల శాఖ సిఫారసు అయినా ఉండాలని తెలిపారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై చంద్రబాబు అభ్యంతరం చెప్పకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సరికాదన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుతో రూ.2 లక్షలు కూడా రాష్ట్రానికి రావని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు రఘువీరా రెడ్డి లేఖ రాశారు. -
'చంద్రబాబు గొప్పలు హాస్యాస్పదం'
కడప: నదుల అనుసంధానంపై చంద్రబాబు, ఆయన బృందం గొప్పులు చెప్పుకోవడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడేళ్ల క్రితమే కృష్ణా నీటిని హాంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా పెన్నాకు అనుసంధానం చేశామని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ద్వారా నదులను అనుసంధానం చేస్తే అది నిజమైన అనుసంధానం అని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నవన్నీ తాత్కాలిక పనులేనని అన్నారు. చంద్రబాబుది అంతా ఇంకుగుంతల జాతకమని, ఆయన ఎప్పుడూ ప్రాజెక్టులకు వ్యతిరేమని రఘువీరా పేర్కొన్నారు. -
'చంద్రబాబుది ఇంకుడు గుంత జాతకం'
కాకినాడ: పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. పోలవరానికి పట్టిసీమ ప్రాజెక్టు ప్రత్యామ్నాయం అయితే పోలవరాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వచ్చేనెల లోపు రాయలసీమకు నీళ్లు ఇవ్వకుంటే టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ బతుకే ఇంకుడుగుంత బతుకు.. చంద్రబాబు జాతకం కూడా ఇంకుడు గుంతేనని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిన మోదీ, వెంకయ్య, చంద్రబాబు నేరస్థులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిపై ఈనెల 7, 8, 9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తులు పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని చెప్పారు. -
'డేటు, టైమ్ ఫిక్స్ చేయండి'
హైదరాబాద్: ప్రత్యేకహోదాపై బహిరంగ చర్చకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. వేదిక, తేదీ, సమయం చంద్రబాబే నిర్ణయించాలని సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధాని మోదీని అడిగిన మాట వాస్తవం అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానికి చంద్రబాబు ఇచ్చిన వినతిపత్రంలో ఏం అడిగారో తనకు తెలియదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం చంద్రబాబు రహస్య పాలనకు అద్దం పడుతోందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఏపీకి మూడు మాత్రమే ఇవ్వడంపై వివరణ ఇవ్వాలన్నారు. ఏపీలో టీడీపీ పాలన దారుణంగా ఉందనడానికి ఎలుక కరిచిన ఘటనలో చిన్నారి చనిపోవడమే నిదర్శనమని రఘువీరారెడ్డి అన్నారు. -
'చంద్రబాబుపై అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు'
హైదరాబాద్: ఢిల్లీ వెళ్తున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకుని రావాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మోసం చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ప్రత్యేకహోదా అంశాన్ని నీరుగారిస్తే ప్రధాని మోదీ, చంద్రబాబుపై అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు పెడతామని హెచ్చరించారు. రాజధాని భూములను తాకడానికి వీల్లేదన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేసేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీలోని అన్ని మండలాలు, కలెక్టరేట్ల ఆఫీసుల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
'సీఎంను అవమానించేలా వెంకయ్య వ్యాఖ్యలు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను లేకపోతే దిక్కులేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వెంకయ్య వ్యాఖ్యలు ప్రజలను నిరాశపరిచేలా, ముఖ్యమంత్రిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే చంద్రబాబు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాని రఘువీరా డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు
మోదీ, వెంకయ్య, బాబులపై కేసులు పెడతాం వైఎస్ జగన్ ధర్నా హర్షణీయం కాంగ్రెస్ పోరు సభలో రఘువీరారెడ్డి, చిరంజీవి వెల్లడి 11న రాష్ట్ర బంద్కు పిలుపు తిరుపతి మంగళం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడం ఆంధ్రుల హక్కు అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో శనివారం పోరు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చెబితే అలా కుదరదు కనీసం పదేళ్లయినా ఇవ్వాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రత్యేక హోదా కల్పించకపోవడం శోచనీయమని విమర్శించారు. హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలో కేసులు పెడతామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 11న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా చేపడుతుండడం హర్షణీయమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.బలిదానాలతో కాకుండా పోరాటాలతో ప్రత్యేక హోదా సాధిద్దామని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతికి చెందిన మునికోటి అనే యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని చెప్పారు.సభలో కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి, జేడీ శీలం, పల్లంరాజు, కిల్లి కృపారాణి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ తరపున మీడియాతో మాట్లాడేది వీరే
హైదరాబాద్ సిటీ: కాంగ్రెస్ తరపున మీడియాతో మాట్లాడేందుకు 18 మందితో కూడిన ప్రతినిధుల జాబితాను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సోమవారం విడుదల చేశారు. జాబితాలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, సాకే శైలజానాథ్, కొండ్రు మురళీమోహన్, పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, ఆనం వివేకానందరెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు జంగా గౌతం, గిడుగు రుద్రరాజు, ద్రోణంరాజు శ్రీనివాస్లు ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్.తులసిరెడ్డి, తూర్పు గోదావరి, చిత్తూరు పీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, కంచన వేణుగోపాల్రెడ్డి, విజయవాడ, గుంటూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణువర్ధన్రావు, షేక్ మస్తాన్ వలి, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ కిసాన్, ఎస్సీ సెల్ చైర్మన్లు కె.రవిచంద్రారెడ్డి, సీహెచ్ సుందరరామ శర్మలను ఈ కమిటీలో వేశారు. -
'అబద్ధపు హామీలతో పూర్తిగా ముంచారు'
విశాఖపట్నం: అనంతపురం జిల్లా ఉరవకొండలో యువరైతు ఆత్మహత్యకు టీడీపీ సర్కారే కారణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. అబద్ధపు హామీలతో రైతులను పూర్తిగా ముంచేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో రూ. 50 లక్షలతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం, ఓటుకు కోట్లు కేసుపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని ఆయన తెలిపారు. -
వారే టీడీపీలో చేరారు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో మేము తప్ప ఎవ్వరూ మిగలరని ప్రకటించిన వాళ్లే టీడీపీలో చేరి పదవులు అనుభవిస్తున్నారని జేసీ సోదరులను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి పోయిన తర్వాత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సోమవారం అనంతపురంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ నేతలతో రఘువీరా సమావేశం
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో అనంతపురం జిల్లా మడకశిరలో సమావేశమయ్యారు. రాహుల్ పాదయాత్రపై వారు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ జూన్ నెలాఖరులో అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. అలాగే అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణం అన్న బలమైన వాదన సీమాంధ్ర ప్రజల్లో గూడు కట్టుకుని ఉంది. దాంతో గత ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే కానీ... ఓ ఎంపీ కానీ ఎన్నిక కాలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పునర్జీవింప చేయాలని సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర నేతలు రాహుల్ పర్యటన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా పావులు కదిపారు. రాహుల్ పాదయాత్ర చేసేందుకు అంగీకరించారు. అదికాక తన సొంత జిల్లాలో రాహుల్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు... ఆ పాదాయత్రను ఎలాగైనా విజయవంతం చేయాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఇప్పటికే రాహుల్ పరామర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు సమాయత్తమైయ్యారు. -
'పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'
విశాఖపట్నం : పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే మాజీ పీసీసీ చీఫ్ బోత్స సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు విధించిందని ఆయన తెలిపారు. శుక్రవారం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రఘువీరా విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇతర పార్టీల్లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు తమ పార్టీ చేయలేదని రఘువీరా వెల్లడించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బొత్స సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేసింది. -
'ఎదురుదాడితో నిప్పులాంటి మనిషి కాలేరు'
హైదరాబాద్: 'ఓటుకు నోటు'పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో చంద్రబాబు ఎదురుదాడి చేయడం తగదని హితవు పలికారు. ఎదురుదాడితో నిప్పులాంటి మనిషి కాలేరని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రమేయం ఉందా, లేదా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. నవ నిర్మాణ దీక్షలో ప్రజలతో చంద్రబాబు అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 65 మంది మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో దించడాన్ని చంద్రాబు ప్రశ్నించడం శోచనీయమన్నారు. 14 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ ఎందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీ పెట్టిందని నిలదీశారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషి కాదని, చెదలు పట్టిన మనిషిని రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. -
హామీలు హాంఫట్
- 600 వాగ్దానాలు తుంగలోకి... - ఇదీ చంద్రబాబు ఘనత - రఘువీరా ఎద్దేవా అల్లిపురం(విశాఖ): తెలుగుదేశం మేనిఫెస్టోలో పేర్కొన్న 600 హామీలను అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీలు సంయుక్తంగా బుధవారం దసపల్లా హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇదే చంద్రబాబు ఏడాది పాలనలో సాధించిన ఘనత అని, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానానికి రూ.5 కోట్లు ఎర చూపి నీచ సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. హుద్హుద్ తుఫానులో కోట్లాది రూపాయల వసూలు చేసి హాంఫట్ చేశారన్నారు. పట్టెసీమ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు అందుకున్నారన్నారు. వీటన్నింటిని దగానాడుకు రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. దేశం ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ 8 వతేదీ వరకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తుందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన 10 లక్షల 25 వేల సంతకాలతో కూడిన పుస్తకాలను ఆయనకు అంద జేశారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వట్టి వసంతకుమార్, పి.బాలరాజు, డి.వి.రామమెహన్, బచ్చు మహేశ్వరరావు, కొండా మురళి, తులసీరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, పేడాడ రమణకుమారి, కొండా రాజీవ్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'బాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి'
పశ్చిమగోదారి(ఏలూరు): తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా అరెస్ట్ చేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రఘువీరా పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలం సీసలిలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తమ బాసే ఈ డబ్బును పంపించారని పదే పదే ఒప్పుకున్నారని ఆయన అన్నారు. డబ్బులిచ్చిన చంద్రబాబుపై మొదటిముద్దాయిగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. గోదావరి జిల్లాల డబ్బులే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు చంద్రబాబు పంపారని దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం.. 'అదిరిందయ్యా చంద్రం'
హైదరాబాద్: చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు అని కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని ఆయన సూచించారు. చంద్రబాబు ఏడాది పాలనపై వ్యంగ్యంగా రూపొందించిన 'అదిరిందయ్యా చంద్రం' సీడీని ఇందిరాభవన్ లో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబుపై తమ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఈ సీడీలను టీడీపీ కార్యాలయానికి పంపుతున్నామని చెప్పారు. మహానాడుకు హాజరయ్యే 60 వేల మందికి ఈ సీడీని చూపించాలన్నారు. మాట తప్పుతున్న చంద్రబాబుకు ఎన్నికల హామీలను గుర్తు చేసేందుకే ఈ సీడీనీ రూపొందించామన్నారు. తమ లేఖ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఇదే అంశంపై మహానాడులో తీర్మానం పెట్టాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
సొమ్మసిల్లిన రఘువీరా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బ తగిలింది. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఆయన కొద్ది సేపటికి సొమ్మసిల్లిపడ్డిపోయారు. దాంతో కాంగ్రెస్ నాయకులు కంగారు పడ్డారు. వారు వెంటనే స్పందించి... వైద్యులను డీసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రఘువీరాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రఘువీరా రెడ్డికి వడదెబ్బ తగిలిందని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. -
మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పేర్కొంటే... కాదు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాడిన సంగతి తెలిసిందే. విభజన జరిగి ఏడాది కావస్తున్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు నాన్చుడు ధోరణి అవలంబించడంపై రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా కోసం..
ఆనందపేట (గుంటూరు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు గుంటూరును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడుతోంది. బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్త్తూ ఈనెల 2వ తేదీ స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బళ్ళారి రాఘవ ఆడిటోరియంలో సామూహిక దీక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి జిన్నాటవర్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ, సభా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హిందూకళాశాల సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఐదు రోజులపాటు నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు రెండు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు ఒంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి గుంటూరులో సామూహిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు, పార్టీ రాష్ట్రముఖ్య నాయకులు హాజరు కానున్నారని జిల్లా నాయకులు వెల్లడించారు. -
'నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పు'
- వచ్చే నెల 2న గుంటూరులో మహా దీక్ష -దీక్ష విజయవంతంపై నేతలతో చర్చించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో మహా దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ దీక్షను విజయవంతం చేసే విషయమై ఆదివారం రఘువీరా హైదరాబాద్లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రాష్ట్రానికి మోసం చేయడం దారుణమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీనే ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోందని మొదట్లో భావించామని అయితే చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో టీడీపీ, బీజేపీ ఎంపీలతో సమావేశమై ప్రత్యేక హోదా గురించి ఇక మరచిపోండని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అంటూ వారికి హితబోధ చేయడాన్ని బట్టి చూస్తే బాబు... ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన విషయం బహిర్గతమైందన్నారు. చంద్రబాబు, మోడీ జోడీ అద్భుతం అంటూ ఇటు టీడీపీ అటు బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం మినహా రాష్ట్ర ప్రయోజాలను కాపాడే చర్యలేవీ చేపట్టలేదనే విషయాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలని ప్రార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పుడు మాత్రం విభజన అడ్డగోలుగా చేశారని, తెలంగాణలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని పట్టుకుని వేళాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తే తెలుగుదేశం పార్టీకే మంచి పేరు వస్తుంది తప్ప కాంగ్రెస్కు కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో ఏడాదికి లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 5 లక్షల కోట్లు వస్తే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనంతగా ఆంధ్రప్రదేశ్ ముందుంటుందన్నారు. మాట్లాడితే ప్రత్యేక హోదా విషయమై చట్టంలో ఎందుకు పొందుపరచలేదని టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని దేశంలో ఇప్పటి వరకు ప్రత్యేక హోదా కల్పించి అన్ని రాష్ట్రాల్లో కూడా చట్టం చేయడం వల్ల రాలేదని కేవలం కేబినెట్ నిర్ణయాలతోనే ప్రత్యేక హోదా ఇచ్చాన్నారు. నాయకులు, కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అని మిగిలిన పార్టీలకు ఆ శక్తి లేదని మహబూబ్నగర్ జిల్లా బహిరంగ సభలో చంద్రబాబు వెల్లడించడాన్ని ఆయన తప్పు పట్టారు. నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పాలంటూ చంద్రబాబును ప్రశ్నించారు. దీక్ష విజయవంతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు కేవీపీ రామచంద్రారావు, సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. -
'కమీషన్ల కోసం కాలువ గట్లపై నిద్ర'
అనంతపురం: కమీషన్ల కోసం కాలువ గట్లపై నిద్ర చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. రూ. 300 కోట్ల ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతున్నారని అన్నారు. పట్టిసీమకు బదులు పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీల అమలులో విఫలమయ్యారు. -
నేనేం చేస్తున్నది ప్రజలకు తెలుసు
తనను కలసిన ఏపీ కాంగ్రెస్ నేతలతో నరసింహన్ ఎంట్రీ ట్యాక్స్ ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్కు కాంగ్రెస్ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: ‘‘నా గురించి బయట ఏవేవో మాట్లాడుతున్నారు.. నేనేం చేస్తున్నది ప్రజలకు బాగా తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య ఏదైనా కావచ్చు. నా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి నాకున్న అధికార పరిధిలో చేయాల్సింది చేస్తున్నాను.. ఏమి చేసిందీ నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది’’ అంటూ తనను కలసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై రుసుం వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకొని దానిని ఉపసంహరించుకునేలా చూడాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గవర్నర్తో మాట్లాడుతూ.. రుసుం వసూలుపై కోర్టు జోక్యం కంటే కూడా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై గవర్నర్ తీవ్రంగా స్పందిస్తూ పైవిధంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. హైకోర్టుతో పాటు ఆర్బీఐ, నాబార్డు సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్లోనే ఉన్నందున వాహనాలపై ప్రవేశ రుసుం విధించడం సరైన చర్య కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చట్టం ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గవర్నర్ను కోరారు. అదేవిధంగా ఏపీలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా లక్షలాది మంది పేద కూలీలు వలసలు పోతున్నారని.. దానిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 5 వేల గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాలకు సరఫరా చేసే నీటి ట్యాంకర్లలో కూడా జన్మభూమి కమిటీల జోక్యం కారణంగా టీడీపీకి మద్దతివ్వని గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గవర్నర్ను కలసిన వారిలో కె.చిరంజీవి, పల్లంరాజు, మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుధాకర్బాబు తదితరులు ఉన్నారు. -
'ఆ రెండు పార్టీల దొంగాట'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి శుక్రవాంర చిత్తూరులో నిప్పులు చెరిగారు. ప్రత్యేక ఆంధ్రకు ఇవ్వాల్సిన ప్యాకేజీపై టీడీపీ, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి మేలు చేస్తుంది.. అలాంటి ప్రాజెక్టును వదిలి పెట్టి...పట్టిసీమ అంటూ టీడీపీ ఎందుకు పాకులాడుతుందో అర్థం కావడం లేదని రఘువీరా అశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాన్నికి ఉన్న చిత్తశుద్ధి ఎంత వరకు ఉందో బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. -
'పట్టిసీమ' బెంగతోనే కర్రి శంకరయ్య మృతి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి... పోలవరం ప్రాజెక్టుకి నిధులు వెంటనే విడుదల చేయాలని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో రాయలసీమకు ప్రయోజనం శూన్యమన్నారు. పట్టిసీమ వద్దు, పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని రఘువీరారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో బీజేపీ కుంటి సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. పట్టిసీమ పథకంతో భూమి కోల్పోనున్నమన్న బెంగతో మృతి చెందిన రైతు కర్రి శంకరయ్యది సర్కార్ హత్యే అని రఘువీరా ఆరోపించారు. శంకరయ్య కుటుంబాన్ని ఆదుకుని... రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు. -
రెండో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
ఆనందపేట (గుంటూరు): ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. రెండోరోజు శిబిరానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు బీజేపీ విషబీజాన్ని నాటిందని, తెలుగుదేశం పార్టీ ఆ విష వృక్షాన్ని నీరు పోసి పెంచి పోషించిందని ఆరోపించారు.రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపిన తరువాతే కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకుందన్నారు. విభజన తరువాత రాష్ట్రానికి మేలు జరిగేలా అనేక అంశాలతో ఆర్డినెన్స్ జారీ చేశామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయాలని, రూ.5 లక్షల కోట్లతో పథకాలను రూపొందించాలని చట్టం రూపంలో చేశామని ఆయన వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టనవసరం లేదని, విభజన చట్టంలోని అంశాలను అమలుచేస్తే చాలని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీలు వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్పార్టీ జిల్లా పరిశీలకుడు ఆకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్వలి, మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు, చదలవాడ జయరాంబాబు, యర్రం వెంకటేశ్వరరెడ్డి, జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ కూచిపూడి విజయ, కాంగ్రెస్పార్టీ నాయకులు కూచిపూడి సాంబశివరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, కొరివి వినయ్కుమార్, మిరియాల రత్నకుమారి, ఈరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పు సరిదిద్దుకుందాం
కాంగ్రెస్ మేధోమథనంలో దిగ్విజయ్ కోటి సంతకాలను ముమ్మరం చేయాలి తొలి రోజు నాలుగు గ్రూపుల చర్చ నేడు కూడా కొనసాగనున్న సదస్సు విజయవాడ సెంట్రల్ : రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తొలి మేధోమథన సదస్సు నగరం కేంద్రంగా జరిగింది. శుక్రవారం హనుమాన్పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సదస్సును ఎపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. అనంతరం ఒక గంట బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కోరిన తర్వాతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని చెప్పారు. మిగిలిన పార్టీలు విభజన వల్ల రాజకీయ లబ్ధిపొందితే, కాంగ్రెస్ చేయని తప్పుకు నింద మోస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నాయకులకు సూచించారు. పార్టీ విధి విధానాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు వివరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఆరు గ్రూపులుగా చేశారు. మొదటి నాలుగు కమిటీలు తొలిరోజు చర్చలు సాగించాయి. మిగిలిన రెండు కమిటీలు శనివారం చర్చలు సాగించనున్నాయి. ముమ్మరంగా కోటి సంతకాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు శాసనమండలి ఫ్లోర్లీడర్ సి.రామచంద్రయ్య వెల్లడించారు. సాయంతం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సదస్సు వివరాలను తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాప్రతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పార్టీకి దూరమైన వర్గాలను ఆకట్టుకొనేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కోటి సంతకాలకు మద్దతు తెలుపుదామనుకొనే వారు 7842434121 నంబర్కు మిస్డ్కాల్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు తిరువనక్కరసు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కొండ్రు మురళీ, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, సిటీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, బుచ్చిబాబు, నేతలు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్కుమార్, అవినాష్, మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
విభజన తప్పే.. క్షమించండి: రఘువీరా
తిరుపతి: రాష్ర్ట విభజన విషయంలో తప్పు చేశామని, ప్రజలు క్షమించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కోరారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం ఎంఆర్పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల అంగీకారంతో విభజన చేశామని, ఇప్పుడు ఆ పాపం కాంగ్రెస్ నెత్తిన వేస్తున్నారని ఆయన అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యుడు తిరువక్కరుసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు. 126 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ చేసిన చిన్న తప్పునకు ప్రజలు మరణ శిక్ష విధించారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తప్పు తెలుసుకున్నామని, మీ ఓటుతో మరణ శిక్షను తొలగించాలని కోరారు. వెంకయ్య రాష్ట్రానికి చేసిందేమిటి? విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బండారు దత్తాత్రేయ కృషి చేస్తుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమిటని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బీజేపీ బిల్లు పెట్టాలని ఏఐసీసీ పరిశీలకుడు కుంతీయ డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్లో ముసలం
ఉప ఎన్నికల అభ్యర్థికి దూరంగా ముఖ్య నేతలు చింతామోహన్ ఏకపక్ష నిర్ణయాలపై కినుక బుజ్జగించేందుకు ఫిబ్రవరి రెండున రఘువీరా రాక అధిష్టానం నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం, పార్టీ అధికార ప్రతినిధి ఆశోక్ సామ్రాట్, పీసీసీ కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాగంటి గోపాల్రెడ్డిలను చింతామోహన్తో కలిసి చర్చించి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని సూచించింది. వీరంతా చింతాతో సమావేశమైనప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వెంట కేవలం చింతామోహన్తో పాటు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్రెడ్డి మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగతా పార్టీ శ్రేణులంతా అసంతృప్తితో రగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మబ్బు దేవనాథరెడ్డితో పాటు ప్రమీలమ్మ వంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యర్థికి సహకరించేది లేదని తెగేసి చెప్పినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. రంగంలోకి పీసీసీ నేత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడంతో సమస్యను పరిష్కరించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఫిబ్రవరి రెండో తేదీన తిరుపతికి వస్తున్నట్లు సమాచారం. ఆయన అసంతృప్త నేతలను బుజ్జగించి సమష్టిగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కూడా కొంత మంది నేతలు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థికి సహకరించేది లేదని ఖరాఖండిగా తెగేసి చెప్పినట్లు సమాచారం. కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పరువు ఎలా కాపాడుకోవాలని పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. -
ఎన్ఎస్యూఐ ‘విద్యార్థి పోరాట యాత్ర’
పోస్టర్ విడుదల చేసిన పీసీసీ చీఫ్ రఘువీరా సాక్షి, హైదరాబాద్: బాబు వస్తే జాబు వస్తుంది... నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి... ఇలా ఎన్నో హామీలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ఆ తర్వాత చేతులెత్తేయడంపై ఎన్ఎస్యూఐ ఉద్యమానికి దిగుతోంది. బాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఒత్తిడి తెచ్చేందుకు ‘విద్యార్థి పోరాటం’ పేరిట యాత్ర చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం ఇందిరా భవన్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ రాష్ర్ట అధ్యక్షుడు రాజీవ్ రతన్ మాట్లాడారు. ఈ నెల 28న అనంతపురం జిల్లాలో పోరాట యాత్రను ప్రారంభించి ఫిబ్రవరి 11న శ్రీకాకుళం జిల్లాలో ముగిస్తామన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర బీసీ సెల్ చైర్మన్ నియామకం..: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ చైర్మన్గా కాకినాడకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావును ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నియమించారు. పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం నియామక పత్రాన్ని వెంకటేశ్వరరావుకు అందజేశారు. -
కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూత
* ఇందిర భవన్లో ఆయన భౌతికకాయానికి నేతల ఘననివాళి * రేపు నూజివీడులో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు (78) సోమవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భార్య సుశీలాదేవితో కలిసి ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడిని పెంచుకున్నారు. అయితే ఆయన కూడా ఇదివరకే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పాలడుగు మరణవార్త తెలిసి పార్టీ నేతలు పెద్దఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన ఆయన భౌతికకాయాన్ని తరువాత ఎమ్మెల్యే క్వార్టర్స్కు, అనంతరం ఇందిర భవన్కు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా నాయకులు తరలివచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. తరువాత పాల డుగు భౌతికకాయాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్కు తరలించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం అక్కడ ఉంచి, బుధవారం ఉదయం 11 గంటలకు కృష్ణాజిల్లా నూజివీడులోని పాలడుగు తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ పాలడుగు ప్రత్యేక చొరవ తీసుకుని భూ పోరాటాలు చేశారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థ లకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఉచితంగా ఇచ్చారని గుర్తుచేశారు. పాలడుగు మృతికి సీఎం సంతాపం పాలడుగు వెంకట్రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపి ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పాలడుగు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు సంతాపం వ్యక్తంచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన పాలడుగు మృతి కృష్ణాజిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జగన్ సంతాపం పాలడుగు వెంకట్రావు మృతిపట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. విద్యార్థినేతగా రాజకీయ ప్రస్థానం సాక్షి ప్రతినిధి, విజయవాడ: పాలడుగు వెంకట్రావు రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, సమసమాజ స్థాపన కోసం పోరాడిన కార్ల్మార్క్స్ జీవితాలపై పాలడుగు పీహెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన 1940 నవంబరు 11న కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండ లం గోగులంపాడులో పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. 1968లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. 1972 లో ఎమ్మెల్సీగా 1978, 1989ల్లో నూజివీడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజయ్య, భవనం వెంకట్రామ్, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సభ్యుడిగా, సెన్సార్ బోర్డు సభ్యుడిగా, పీసీసీ హైపవర్ కమిటీ సభ్యుడిగా, ఏఐసీసీ, పీసీసీల్లో సభ్యుడిగా, పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్గా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. -
'చంద్రన్న దోపిడీ అనాలేమో'
హైదరాబాద్: పేదలకు నిత్యవసర సరుకులు ఒక్క సంక్రాంతికే కాకుండా ప్రతినెలా ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రతినెలా పేదలకు సరుకులు ఇచ్చామన్నారు. చంద్రన్న కానుక అంటూ సంక్రాంతి సరుకుల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. టీడీపీ నేతలకు మాత్రమే మేలు జరిగేలా కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. చంద్రన్న కానుక అనకుండా చంద్రన్న దోపిడీ అనాలేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నిలుపుకోకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. -
'ఎమ్మెల్యేలే రూ.150 కోట్లు తినేశారు'
విశాఖపట్నం: హుద్ హుద్ తుపాను సాయంలో అధికార టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. దీనిపై జనవరి మొదటివారంలో తమ పార్టీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశామని గుర్తు చేశారు. తుపాను బాధితుల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారని, అయితే ఇందులో రూ. 150 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలే తినేశారని ఆరోపించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో గవర్నర్ కలుస్తామని చెప్పారు. తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని రఘువీరారెడ్డి అన్నారు. -
రుణాలు మాఫీ చేయకుంటే నిలదీస్తాం
మాడుగుల రూరల్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అందరికీ వ్యవసాయ రుణాల మాఫీ వర్తింపచేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్చేశారు. సోమవారం ఎం.కోటపాడు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. గత నెలలో సంభవించిన తుపానుకు 64 మంది మృతిచెందితే వీరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదన్నారు. క్షతగాత్రులైన 190 మందికి రూ.50 వేల వంతున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతాంగానికి రూ.134 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కావలసి ఉందన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల మంది కౌలు రైతులకు రుణాలివ్వగా, ఈ ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు బాలరాజు, కోండ్రు మురళి, స్థానిక నాయకులు శానాపతి గంగాధర్ కొండలరావు, బొడ్డపాటి శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు చేయూతలో ప్రభుత్వం విఫలం బుచ్చెయ్యపేట: హుద్హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారం మండలంలోని వడ్దాది నాలుగు రోడ్లు సెంటర్లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ మంత్రులు కోండ్రు మురళి, పి.బాలరాజు, సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు తదితరులు ఉన్నారు. -
రేపు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాక
విజయవాడ సెంట్రల్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 14న దివంగత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకలను ఆంధ్రరత్నభవన్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడపా నాగేంద్ర బుధవారం తెలియజేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈనెల 19న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు నగరంలోని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నాగేంద్ర తెలిపారు. 7నుంచి 10 తరగతులు విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖుల పాత్ర’ అంశంపై పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని నాగేంద్ర పేర్కొన్నారు. -
రసాభాసగా చీరల పంపిణీ
వితరణం రసాభాసగా హుద్హుద్ బాధితులకు చీరల పంపిణీ భారీగా తరలిరావడంతో తొక్కిసలాట కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం సాక్షి, విశాఖపట్నం : హుద్హుద్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమం రసాభసా అయింది. ఊహించని రీతిలో తరలివచ్చిన బాధితులకు కిట్లు పంపిణీ చేయలేక కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. టర్నర్ చౌల్ట్రీలోని విశాఖ సెంట్రల్ ఎదురుగా సుమారు 14 డివిజన్లకు చెందిన బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీ సీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నా రు. సాయం పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి సాయం అందే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని 50 వేల మంది బాధితులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం ఓ అరడజను మందికి నేతలు దుప్పట్లు, చీరల కిట్లను పంపిణీ చేశారు. డివిజన్కు 400 మంది వంతున నగర పరిధిలోని పది డివిజన్ల నుంచి ప్రత్యేకంగా కూపన్లు పంపిణీ చేశారు. కూపన్లున్న బాధితులు మాత్రమే రావాల్సిందిగా సూచించారు. వీరి కోసం విశాఖ సెంట్రల్ ఎదురుగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీరేనా బాధితులు.. మేము కాదా అంటూ వేలాదిగా వచ్చిన బాధితులు నాయకులతో వాగ్వాదానికి దిగా రు. అర్హులైన వారికి కాకుండా పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. నాయకులు వారించినా వినిపించుకోకుం డా కౌంటర్లలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశా రు. దీంతో పరిస్థితి చేజారిపోతుందనే భయం తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ముఖ్య నేతలంతా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మిగిలిన నాయకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అంతవరకు క్యూలైన్లలోఉన్న వారు సైతం ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు తోసుకురావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకదశలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో బాధితులు కిందపడి పోయారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య బాధితులతో పాటు కార్యకర్తలు కూడా కౌంటర్లలోకి చొరబడి అందినకాడికి పట్టుకుపోయారు. రెండు మూ డు వందల మందికి కూడా పంపిణీ చేయకుం డానే కిట్లు మాయం కావడంతో నాయకులు కూడా చేసేది లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ సిటీఅధ్యక్షురాలు రమణికుమారి, ఎస్సీ సెల్ చైర్మన్ కె.వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. -
హామీలకు చంద్రబాబు తిలోదకాలు: రఘువీరా
-
హామీలకు చంద్రబాబు తిలోదకాలు: రఘువీరా
నెల్లూరు: ఎన్నికలకు ముందు వందలకొద్దీ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. పంట రుణమాఫీ, పొదుపు రుణాల మాఫీపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నెల్లూరులో రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్ర పాలనను చంద్రబాబు కార్పొరేట్ గా మార్చారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ మాట-కాంగ్రెస్ మాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
అనంతపురం అర్బన్: అన్ని వేళలా కార్యకర్తలకు అండగా ఉంటామని పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. స్థానిక మడకశిర భవన్లో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేకని రఘువీరా అన్నారు. రైతులకు ప్రకటించిన రుణమాఫీ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. జిల్లాకు రైతాంగానికి రావాల్సిన రూ. 640 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ వెంట నే ప్రభుత్వం విడుదల చేసి రైతు ఖాతాల్లోకి జమా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ప్రజల అవసరాల కోసం అనంతపురం నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలకు అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా ద్వారా పీఏబీఆర్ జలాశయం నుంచి తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాకు 15 నుంచి 20 టీఎంసీలు నీటిని తెచ్చే అవకాశం ఉన్నా చేతకాని ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఇప్పటికి కేవలం 5.5 టీఎంసీలు మాత్రమే తెచ్చారన్నారు. ఈ నీటితో సరిపెట్టుకుంటే కరువు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్లో జిల్లా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందన్నారు. జిల్లాలో 70 శాతం వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం ఉండగా ఇప్పుడు రూ. 2 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేస్తామనడం హాస్యస్పదమన్నారు. ఓఎంసీ గనుల లెసైన్స్ను కుద్రేముఖ్ కంపెనీకి కేటాయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత పాలకులు కొందరు లెసైన్స్ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షులు కోట సత్యం, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మండ్ల నరసింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ నాగరాజు, కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడు బి.వై. రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్బాబు, ప్రత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'రైతు కక్ష సాధింపు సంస్థ'
హైదరాబాద్: పంట రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఏడాదికి 20 శాతం మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని... వాస్తవానికి రూ. 5 వేల కోట్లతో 50 శాతం రుణాలు మాఫీ అవుతాయన్నారు. రైతులు తీసుకున్న ప్రైవేటు వడ్డీలను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతు సాధికార సంస్థ కాదని, రైతు కక్ష సాధింపు సంస్థ అని వ్యాఖ్యానించారు. టీడీపీ రైతు వ్యతిరేకి కాబట్టే కార్పొరేట్ పాలన చేస్తోందన్నారు. రైతులు తిరగబడకముందే రుణాలు మాఫీ చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
ఆళ్లగడ్డలో పోటీకి కాంగ్రెస్ దూరం: రఘువీరా
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డలో పోటీ చేయొద్దంటూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవతీర్మానం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. హుదూద్ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒత్తిడి తీసుకురావాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందన్నారు. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని చెప్పారు. బాధితులను గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. ఇందుకోసం అఖిలపక్ష కమిటీలు వేయాలని సూచించారు. గ్రామ సభల్లో చదివి వినిపించాలి. జాబితాను ఆన్లైన్ కూడా పెట్టాలన్నారు. తుపాను కారణంగా నష్టపోయినవారందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
'కిరణ్కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డికి ముందే స్పష్టంగా తెలుసునని అన్నారు. విభనకు అన్ని పార్టీలూ కారణమన్నారు. ప్రజల కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేయగలదని చెప్పారు. ప్రజల తరపున నిలబడి కాంగ్రెస్ కుపూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. పంట పొలాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేయొద్దని కోరారు. ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ రుణమాఫీ విషయంలో టీడీపీ సర్కారు పూటకో మాట మాట్లాడుతోందని రఘువీరా రెడ్డి విమర్శించారు.