Pakistan vs New Zealand
-
'వెళ్లి జింబాబ్వేతో సిరీస్ ఆడుకోండి'.. పాక్పై ఆక్మల్ ఫైర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి మ్యాచ్లోనే ఆతిథ్య పాకిస్తాన్కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. కరాచీ వేదికగా జరిగిన న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక పాక్ చతికలపడింది.బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పాక్ విఫలమైంది. ఈ క్రమంలో పాక్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ ఆక్మల్ విమర్శల వర్షం గుప్పించాడు. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదని ఆక్మల్ జోస్యం చెప్పాడు."ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్కు ఆడే ఆర్హత లేదు. ప్రస్తుతం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో పాక్ జట్టు పాల్గోవాలి. కనీసం వారిపైనా విజయం సాధిస్తే ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆర్హత ఉందని భావించవచ్చు. గేమ్ ప్లాన్ ఎలా ఉండాలో న్యూజిలాండ్ను చూసి నేర్చుకోవాలి. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయినప్పటికి అద్బుతంగా కమ్బ్యాక్ ఇచ్చారు. కివీస్ బ్యాటర్లు సెటిల్ అయ్యాక మళ్లీ ఎదురుదాడికి దిగారు. పరిణితి చెందిన జట్టు చేసే పని అదే. కివీస్ లాంటి టాప్ క్లాస్కు జట్టుకు ఎల్లప్పుడూ బ్యాకప్ ప్లాన్ ఉంటుంది. రచిన్ రవీంద్ర గాయపడగా.. అతడి స్ధానంలో వచ్చిన విల్ యంగ్ సెంచరీతో మెరిశాడు అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమ్రాన్ ఆక్మల్ పేర్కొన్నాడు.కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో దుబాయ్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టోర్నీలో కమ్బ్యాక్ ఇవ్వాలని పాక్ భావిస్తోంది. భారత్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది.తుది జట్లు(అంచనా)భారత్: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్చదవండి: భారత్తో మ్యాచ్.. మాకు స్పెషలేమి కాదు: పాక్ స్టార్ బౌలర్ -
CT IND Vs PAK: పాకిస్తాన్కు షాకిచ్చిన ఐసీసీ..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025(Champions Trophy) తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలింది. కరాచీ వేదికగా కివీస్తో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయిన్టైన్ చేసినందుకు పాక్ జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 5 శాతం కోత విధించింది. ఈ మ్యాచ్లో నిర్ణీత సమయంలో పాక్ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది.దీంతో కొత్త రూల్స్ ప్రకారం.. మొదటి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పాక్ 30-యార్డ్ సర్కిల్లో అదనపు ఫీల్డర్తో ఫీల్డింగ్ చేయవలిసి వచ్చింది. దాంతో పాటుగా ఈ జరిమానా కూడా పాక్ జట్టుపైన పడింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్బరో, షర్ఫుద్దౌలా ఫిర్యాదు మెరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఈ చర్యలు తీసుకున్నాడు. అదేవిధంగా తన తమ తప్పిదాన్ని రిజ్వాన్ అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ కేవలం ఫైన్తోనే సరిపెట్టాడు.తొలి మ్యాచ్లో చిత్తు..కాగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. 321 పరుగుల లక్ష్య చేధనలో పాక్ జట్టు 260 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్ష్బ్యాటర్లలో ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు.కివీస్ బౌలర్లలో శాంట్నర్, ఓ రూర్క్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ రెండు వికెట్లు సాధించాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు.జమాన్ దూరం..కాగా పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తొలి మ్యాచ్లో జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మధ్యలోనే జమాన్ వైదొలగాడు. అతడి స్ధానాన్ని ఇమామ్ ఉల్ హక్తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్తో తలపడనుంది.చదవండి: Champions Trophy: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ రికార్డు బద్దలు -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే తొలిసారిగా..
భారీ అంచనాలతో చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) బరిలోకి దిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆదిలోనే పరాభం ఎదురైంది. న్యూజిలాండ్(Pakistan vs New Zealand)తో జరిగిన మ్యాచ్లో అరవై పరుగుల తేడాతో చిత్తై ఓటమితో ఈ టోర్నమెంట్ను ఆరంభించింది. అంతేకాదు.. బుధవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ బృందం టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు ఒకటి నమోదు చేసింది.గత చాంపియన్స్ ట్రోఫీ-2017 ఎడిషన్లో విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఈసారి ఈ ఐసీసీ ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. వన్డే వరల్డ్కప్-2023లో కనీసం సెమీస్ చేరకపోయినా డిఫెండింగ్ హోదాలో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్లతో కలిసి ఇందులో భాగం కానుంది.యంగ్, లాథమ్ సెంచరీలుఈ క్రమంలో ఆరంభ మ్యాచ్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న పాకిస్తాన్- న్యూజిలాండ్ కరాచీ వేదికగా తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆరంభంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్ విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులతో దుమ్ములేపగా.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత అజేయ శతకం(104 బంతుల్లో 118* రన్స్) సాధించాడు. ఇక ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో చెలరేగాడు.ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు కివీస్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. విలియం ఓరూర్కీ ఓపెనర్ సౌద్ షకీల్(6), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(3)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశాడు.పాక్ చెత్త రికార్డుఈ క్రమంలో మరో ఓపెనర్ బాబర్ ఆజం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నంలో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఈ వన్డే మ్యాచ్ పవర్ప్లే(తొలి పది ఇన్నింగ్స్)లో రెండు వికెట్ల నష్టానికి కేవలం 22 పరుగులే చేసింది పాకిస్తాన్. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పవర్ప్లేలో అత్యధికంగా మూడుసార్లు.. 25 కంటే తక్కువ సోర్లు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఈ చెత్త రికార్డు సాధించిన టీమ్గా పాక్ చరిత్రకెక్కింది. ఇక పాకిస్తాన్కు సొంతగడ్డపై వన్డే చరిత్రలో పవర్ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో పవర్ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లుపాకిస్తాన్- 2013లో జింబాబ్వేపై బర్మింగ్హామ్ వేదికగా 18/2పాకిస్తాన్- 2025లో న్యూజిలాండ్పై కరాచీ వేదికగా 22/2పాకిస్తాన్- 2013లో వెస్టిండీస్పై ది ఓవల్ వేదికగా 23/3బంగ్లాదేశ్- 2017లో న్యూజిలాండ్పై కార్డిఫ్ వేదికగా 24/3శ్రీలంక- 2013లో ఇండియాపై కార్డిఫ్ వేదికగా 26/1.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్లో బాబర్ ఆజం 90 బంతుల్లో 64 పరుగులు చేయగా.. ఫఖర్ జమాన్ 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేశాడు. అయితే, ఖుష్దిల్ షా(49 బంతుల్లో 69), సల్మాన్ ఆఘా(28 బంతుల్లో 42) వేగంగా ఆడటంతో పాక్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ కివీస్ బౌలర్లు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు.నాథన్ స్మిత్ సల్మాన్ను, ఖుష్దిల్ను విలియం పెవిలియన్కు పంపారు. దీంతో పాకిస్తాన్ కథ కంచికి చేరకుండానే ముగిసిపోయింది. 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో విలియం ఓరూర్కీ,కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. మ్యాట్ హెన్రీ రెండు, మైఖేల్ బ్రాస్వెల్, నాథన్ స్మిత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
Pak vs NZ: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాలను కివీస్ మాజీ బౌలర్ సైమన్ డౌల్(Simon Doull) తప్పుబట్టాడు. ఫఖర్ జమాన్(Fakhar Zaman)ను నాలుగో స్థానంలో పంపడం చెత్త నిర్ణయమని.. ఇందుకు బాబర్ ఆజం(Babar Azam) మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్- న్యూజిలాండ్ మ్యాచ్తో బుధవారం తెరలేచిన విషయం తెలిసిందే.గాయపడిన ఫఖర్ జమాన్కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు.. కివీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రెండో బంతికే ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. బౌండరీ దిశగా వెళ్తున్న బాల్ను ఆపే ప్రయత్నంలో అతడి కండరాలు పట్టేశాయి. దీంతో నొప్పితో మైదానం వీడిన ఫఖర్ జమాన్ కాసేపటి తర్వాత మళ్లీ ఫీల్డ్లోకి వచ్చాడు.కివీస్ బ్యాటర్ల అద్భుత శతకాలుఇదిలా ఉంటే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు సాధించింది. ఓపెనర్ విల్ యంగ్(107)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్(118 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. వీరిద్దరికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 61) ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టాడు. ఫలితంగా న్యూజిలాండ్కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.ఫఖర్ జమాన్ నాలుగో స్థానంలోఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రిజ్వాన్ బృందం ఆది నుంచే తడబడింది. ఫఖర్ జమాన్కు బదులు సౌద్ షకీల్ బాబర్ ఆజంతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. షకీల్ 19 బంతులు ఎదుర్కొని 6 పరుగులే చేసి.. విలియం రూర్కీ బౌలింగ్లో పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రిజ్వాన్(14 బంతుల్లో 3) అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో ఉన్న వేళ బాబర్కు తోడుగా ఫఖర్ జమాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు.అయితే, బాబర్ 90 బంతుల్లో కేవలం 64 పరుగులు చేయగా.. జమాన్ 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ మాత్రమే సాధించాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(28 బంతుల్లో 42) వేగంగా ఆడగా.. ఖుష్దిల్ షా(49 బంతుల్లో 69) రాణించాడు. కానీ మిగిలిన ఆటగాళ్లంతా విఫలం కావడంతో 47.2 ఓవర్లలోనే పాకిస్తాన్ కథ ముగిసింది. 260 పరుగులకు ఆలౌట్ అయిన రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది.అతడిని నాలుగో స్థానంలో ఎందుకు పంపినట్లు?ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్, కామెంటేటర్ సైమన్ డౌల్ ఫఖర్ జమాన్ను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ‘‘తనదైన శైలిలో బౌండరీలు బాదేందుకు ఫఖర్ జమాన్ విఫలయత్నం చేశాడు. అతడు ప్రతిసారి బాబర్ ఆజంపైనే భారాన్ని మోపాడు.బాబర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో సింగిల్, డబుల్స్ తీస్తూ వికెట్ల మధ్య పరిగెడుతూ అలసిపోయాడు. ఒకవేళ ఫఖర్ జమాన్ పరిగెత్తలేని స్థితిలో ఉంటే.. అతడిని నాలుగో స్థానంలో ఎందుకు పంపినట్లు?ఒకవేళ మీరు గెలవాలంటే ఓవర్కు పది లేదంటే పన్నెండు పరుగులు అవసరమైన సమయంలో ఆఖర్లో హిట్టర్ అవసరం ఉంటుంది కాబట్టి... అప్పుడు ఫఖర్ జమాన్ను పంపాల్సింది’’ అని పాకిస్తాన్ మేనేజ్మెంట్కు డౌల్ చురకలు అంటించాడు. ఫఖర్ జమాన్ను ముందు పంపించి బాబర్పై భారం వేయడం తప్పుడు నిర్ణయమంటూ ఫైర్ అయ్యాడు. చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్ -
అందుకే ఓడిపోయాం.. ఆ ఇద్దరు మాత్రం అద్బుతం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఆరంభ మ్యాచ్లోనే పాకిస్తాన్కు చేదు అనుభవం ఎదురైంది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన పాక్.. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) జట్టు పరాజయంపై స్పందించాడు. కివీస్ జట్టు భారీ స్కోరు సాధిస్తుందని తాము అస్సలు ఊహించలేదన్నాడు.తాము అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశామని.. అయితే, న్యూజిలాండ్ తమ కంటే గొప్పగా ఆడిందని రిజ్వాన్ ఓటమిని అంగీకరించాడు. ఏదేమైనా తొలి మ్యాచ్లోనే ఓడిపోవడం తీవ్రంగా నిరాశపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.శతకాలతో చెలరేగిన విల్ యంగ్, లాథమ్ఈ క్రమంలో కరాచీ వేదికగా ఈ టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్లో పాక్ న్యూజిలాండ్తో తలపడింది. నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన పోరులో టాస్ గెలిచిన రిజ్వాన్ బృందం తొలుత బౌలింగ్ చేసింది. ఓపెనర్ డెవన్ కాన్వే(10)తో పాటు వన్డౌన్ స్టార్ కేన్ విలియమ్సన్(1), డారిల్ మిచెల్(10) త్వరగా పెవిలియన్కు పంపి శుభారంభం అందుకుంది.కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ విల్ యంగ్(Will Young- 107), వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్(118 నాటౌట్) పాక్ బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈ ఇద్దరు అద్భుత శతకాలతో రాణించగా.. గ్లెన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్(39 బంతుల్లో 61) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు స్కోరు చేసింది.A quality knock! 💯#TomLatham brings up a stunning century, putting New Zealand firmly in command against the defending champions! 💪🏻FACT: Fifth time two batters have scored centuries in an innings in Champions Trophy!📺📱 Start watching FREE on JioHotstar:… pic.twitter.com/vAKzM0pW1Y— Star Sports (@StarSportsIndia) February 19, 2025 పాక్ బ్యాటర్ల వైఫల్యంఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కివీస్ బౌలర్ల ధాటికి తాళలేక 47.2 ఓవర్లకు కుప్పకూలింది. బాబర్ ఆజం(64), కుష్దిల్ షా(69) అర్ధ శతకాలు సాధించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. ఈ క్రమంలో 260 పరుగులకే ఆలౌట్ అయి.. అరవై పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఓటమిని మూటగట్టుకుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు ఈ మేరు భారీ స్కోరు సాధిస్తామని మేము అస్సలు ఊహించలేదు. 260 పరుగుల వరకే కివీస్ను కట్టడి చేయగలమని భావించాం. మా పరిధి మేర అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేశాం. అయితే, వాళ్లు మాకంటే గొప్పగా ఆడి భారీ టార్గెట్ ఇచ్చారు.ఆ ఇద్దరికీ అదెలా సాధ్యమైందో!నిజానికి ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు పెద్దగా సహకరించలేదు. కానీ విల్ యంగ్, లాథమ్ ఇద్దరూ క్రీజులో పాతుకుపోయి.. సులువుగా పరుగులు రాబట్టేశారు. అయితే, ఆఖరి ఓవర్లలో మేము మళ్లీ పాత తప్పులనే పునరావృతం చేశాం. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాం.ఇక బ్యాట్తోనూ మేము శుభారంభం అందుకోలేకపోయాము. ఫఖర్ జమాన్ గాయంపై కూడా పూర్తి సమాచారం ఇంకా లభించలేదు. ఈ మ్యాచ్లో పవర్ప్లే, డెత్ ఓవర్లలో మా ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఓటమి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫలితం ఏదైనా దాని గురించే ఆలోచిస్తూ కూర్చోలేము. మిగతా మ్యాచ్లలో మరింత మెరుగ్గా ఆడే ప్రయత్నం చేస్తాం’’ అని పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్తో మ్యాచ్లో రిజ్వాన్ 14 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి విలియం రూర్కీ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో పాకిస్తాన్ న్యూజిలాండ్తో నాలుగుసార్లు తలపడగా.. అన్నిసార్లూ కివీస్ జట్టే విజయం సాధించడం విశేషం. ఇక బుధవారం నాటి మ్యాచ్లో సెంచరీ వీరుడు టామ్ లాథమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్ -
Champions Trophy 2025: పాకిస్తాన్ను చిత్తు చేసిన న్యూజిలాండ్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను ఆతిథ్య పాకిస్తాన్ ఓటమితో ఆరంభించింది. కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో పాక్ ఓటమి పాలైంది. 321 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 47 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది.పాకిస్తాన్ బ్యాటర్లలో కుష్దిల్ షా(69) టాప్ స్కోరర్గా నిలవగా.. బాబర్ ఆజం(90 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్తో 64 పరుగులు) సల్మాన్ అగా(42), పర్వాలేదన్పించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా.. విలియం ఓ రూర్క్, మాట్ హెన్రీ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు బ్రేస్వెల్, నాథన్ స్మిత్ చెరో వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(107), టామ్ లాథమ్(118) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు) మెరుపులు మెరిపించాడు.ఇక పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్లో ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో తలపడనుంది.చదవండి: PAK vs NZ: వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్ -
PAK Vs NZ: వారెవ్వా ఫిలిప్స్.. క్రికెట్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ను ఫిలిప్స్ పెవిలియన్కు పంపాడు. అతడి క్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు.పాక్ ఇన్నింగ్స్ పదో ఓవర్ వేసిన కివీ స్పీడ్ స్టార్ విలియం ఓ'రూర్క్ ఆఖరి బంతిని రిజ్వాన్కు కొంచెం వైడ్ బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ డెలివరీగా సంధించాడు. వెడ్త్ దొరకడంతో పాయింట్ దిశగా రిజ్వాన్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే కట్ షాట్ సరిగ్గా కనక్ట్ అయినప్పటికి, పాయింట్లో ఉన్న ఫిలిప్స్ మాత్రం అద్బుతం చేశాడు.ఫిలిప్స్ తన ఎడమవైపునకు డైవ్ చేసి సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో మహ్మద్ రిజ్వాన్(3) ఒక్కసారిగా బిత్తరపోయాడు. గ్లెన్ క్యాచ్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లాథమ్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. 73 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్ను లాథమ్, యంగ్ తమ అద్బుత ఇన్నింగ్స్లతో అదుకున్నారు. విల్ యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 107 పరుగులు చేయగా.. లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 118 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫిలిప్స్ బ్యాట్తో సైతం సత్తాచాటాడు. 39 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. పాక్ బౌలర్లలో హ్యారీస్ రవూఫ్, నసీమ్ షా తలా రెండు వికెట్లు సాధించగా.. అర్బర్ ఆహ్మద్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ తడబడుతోంది. 32 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యం: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
CT 2025: ఈ జట్ల మధ్యే ప్రధాన పోటీ?.. కివీస్కు ఛాన్సులు ఎక్కువే!
సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ కి ఆతిథ్యమిస్తోంది 2017 ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) విజేత పాకిస్తాన్. సొంతగడ్డపై జరిగే ఈ ఈవెంట్లో గెలిచి మరోసారి ట్రోఫీని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరి.. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ టోర్నమెంట్లో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటే?..ప్రపంచ కప్ వంటి పలు అంతర్జాతీయ క్రికెట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎప్పుడూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఆస్ట్రేలియా ప్రస్తుతం గాయాలతో చతికిలపడి పోయింది. సొంత గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియాను ఓడించి 3-1తో గెలిచింది ఆస్ట్రేలియా. ఆసీస్కు ఎదురుదెబ్బలుఅయితే, ఈ టెస్టు సిరీస్ తర్వాత కీలకమైన ఆటగాళ్లు గాయాలబారిన పడటం ఆందోళనకర అంశంగా పరిణమించింది. అందుకే చాంపియన్స్ ట్రోఫీకి తమ పూర్తి స్థాయి జట్టుని పంపలేకపోయింది ఆసీస్ బోర్డు.ముఖ్యంగా జట్టులోని ప్రధాన బౌలర్ల అందరూ గాయాల కారణంగా ఈ టోర్నమెంట్ కి దూరంకావడం ప్రభావం చూపనుంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్తో పాటు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్, అల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల వల్ల వైదొలిగారు. ఇదే సమయంలో జట్టులోని ప్రధాన ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా అనూహ్యంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మునుపటి స్థాయి లో చెలరేగి ఆడి ఈ ట్రోఫీ ని సాధించడం అనుమానంగానే కనిపిస్తోంది.అంత సులువు కాక పోవచ్చుఈ టోర్నమెంట్ లో మరో ప్రధానమైన జట్టుగా బరిలో దిగుతున్న ఇంగ్లండ్ 2019 వన్డే ప్రపంచ కప్, 2022 టి20 ప్రపంచ కప్ ల విజయం తర్వాత ఇటీవలి కాలంలో ఆశించిన రీతిలోరాణించలేకపోయింది. ఇటీవల భారత్ లో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో ఇంగ్లండ్ 3-0 తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి జట్లని పూర్తి స్థాయిలో పక్కకు పెట్టడం కష్టమే.కానీ ఇలాంటి ప్రధానమైన టోర్నమెంట్ లో రాణించడానికి ముందు వారి ప్రదర్శన, పిచ్ ల ప్రభావం కూడా కీలకం. ఈ నేపధ్యం లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లకు ప్రస్తుత పరిస్థితుల్లో రాణించడం అంత సులువు కాక పోవచ్చు. ఇక ఈ టోర్నమెంట్ మూడు జట్ల మధ్యే ట్రోఫీ కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. అందులో ప్రధానమైనవి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్. ఈ నేపథ్యం లో ఈ మూడు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం.భారత్: ఛాంపియన్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2002, 2013)ప్రస్తుత వన్డే ర్యాంకింగ్: 1ప్రధాన ఆటగాళ్ళు: కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాఇంగ్లండ్లో 2017లో జరిగిన చివరి ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్లో పాకిస్తాన్ జట్టు 180 పరుగుల తేడాతో భారత్ను ఓడించి ట్రోఫీ ని గెలుచుకుంది. ప్రస్తుత టి20 ప్రపంచ ఛాంపియన్స్ అయిన భారత్ వరుసగా రెండో ఐసిసి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని చూస్తోంది. సొంతగడ్డ పై 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ చాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా అనూహ్యంగా భారత్ పై విజయం సాధించి ట్రోఫీ ని చేజిక్కించుకుంది.అయితే రోహిత్ శర్మ సేన ఆ ఘోర పరాజయం నుంచి తొందరగా కోలుకొని ఏడు నెలల తర్వాత టి20 ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ ని సాధించింది. గత ఏడాది కాలంగా భారత్ జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉంది. టెస్ట్లలో పేలవమైన ప్రదర్శననను పక్కన పెడితే టి20, వన్డే ఫార్మాట్లలో భారత్ ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం చెలాయించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ను 3-0 తేడాతో ఓడించడం, అలాగే టాప్-ఆర్డర్ బ్యాట్స్మన్ అద్భుతమైన ఫామ్తో ఉండడటం తో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్కు భారత్ ప్రధాన పోటీదారులలో ఒకటిగా చెప్పడంలో సందేహం లేదు. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ఒక్కటే భారత్ కి కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తున్న అంశం. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ మునుపటి ఫామ్ ని కనబరిచినట్టయితే ఈ లోపాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ చాకచక్యమైన లెగ్-బ్రేక్ బౌలింగ్, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ఫామ్ జట్టుకి అదనపు బలం. మంచి ఊపు మీద ఉన్న ప్రస్తుత భారత్ జట్టుని నిలువరించడం ప్రత్యర్థులకు అంత సులువు కాకపోవచ్చు.పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2017)వన్డే ర్యాంకింగ్: 3ప్రధాన ఆటగాళ్ళు: బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, ఫఖర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్ఇటీవల కాలంలో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన ఎప్పుడూ నిలకడగా లేదు. సొంత గడ్డ పై ప్రధాన జట్లు ఆడకపోవడం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో రాజకీయాలు, కోచ్, కెప్టెన్ ల పై వేటు .. ఇలా పాకిస్తాన్ పేలవమైన ఫామ్ కి అనేక కారణాలు. అయితే 2017 చాంపియన్స్ అయిన పాకిస్తాన్ ఈసారి సొంత గడ్డ పై ఆడటం వారికి కలిసొచ్చే అంశం. పాకిస్తాన్ స్వదేశం లో ఆడిన మూడు ద్వైపాక్షిక వన్డే సిరీస్లను చేజిక్కించుకుంది.ప్రపంచ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాపై 2-1 తో విజయం, బలీయమైన దక్షిణాఫ్రికా జట్టును 3-0 తేడాతో ఓడించడం వంటివి ఆ జట్టుకు ఈ టోర్నమెంట్ కి ముందు కొత్త ఉత్సాహాన్నిస్తాయనడంలో సందేహం లేదు. మొహమ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాట్స్మన్ బాబర్ ఆజం, ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది మరియు 2017 టైటిల్ హీరో ఫఖర్ జమాన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అదీ కాక స్వదేశీ ప్రేక్షకుల ముందు ఆ జట్టు విజృంభించి ఆడితే ప్రత్యర్థి జట్లకు అంత సులువు కాకపోవచ్చు.న్యూజిలాండ్చాంపియన్స్ ట్రోఫీ రికార్డ్: ఛాంపియన్స్ (2000)వన్డే ర్యాంకింగ్: 4ప్రధాన ఆటగాళ్ళు: కేన్ విలియమ్సన్, మాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్గత ఐదు ఐసిసి పరిమిత ఓవర్ల ప్రపంచ కప్లలో ఒకటి తప్ప మిగతా వాటిలో న్యూజిలాండ్ నాకౌట్ దశకు చేరుకుని తన సత్తా చాటుకుంది. అయితే 2000 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత న్యూజీల్యాండ్ ఒక్క ఐసిసి టోర్నమెంట్ను కూడా గెలవలేదు. కానీ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ నాయకత్వం, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మళ్ళీ ఫామ్లోకి రావడంతో, న్యూజిలాండ్ ఈసారి ఆటుపోట్లను తట్టుకొని నిలబడ గలమని ఆశాభావంతో ఉంది. పాకిస్తాన్లో జరిగిన ముక్కోణపు సిరీస్ విజయంతో న్యూజిలాండ్ కొత్త ఉత్సహంతో ఈ టోర్నమెంట్లోకి అడుగుపెట్టింది. అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ ఫామ్ తో పటు పేస్ బౌలర్లు సరైన రీతి రాణించి నట్లయితే న్యూజిలాండ్ మరోసారి టైటిల్ గెలిచినా ఆశ్చర్యం లేదు.చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్లోనే సూపర్ సెంచరీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మొదటి సెంచరీ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ (Will Young) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కాన్వే, విలియమ్సన్, మిచెల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట.. యంగ్ తన సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 107 బంతుల్లో యంగ్ తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.విల్ యంగ్కు ఇది నాలుగో వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఓవరాల్గా 112 బంతులు ఎదుర్కొన్న యంగ్.. 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులు చేసి ఔటయ్యాడు.జీరో టూ హీరో..కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాక్ వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో యంగ్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ సిరీస్లో యంగ్ మూడు మ్యాచ్లు ఆడి కేవలం 28 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అతడిని ఎందుకు ఎంపిక చేశారని పలువరు మాజీ క్రికెటర్లు పెదవి విరిచారు. కానీ యంగ్ తనపై వచ్చిన విమర్శలకు సూపర్ సెంచరీతో సమాధానమిచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన యంగ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన నాలుగో న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. 38 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో లాథమ్(57), ఫిలిప్స్(1) ఉన్నారు.ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీలు చేసిన కివీస్ ప్లేయర్లు వీరే..145* - నాథన్ ఆస్టిల్ vs అమెరికా, ది ఓవల్, 2004102* - క్రిస్ కెయిర్న్స్ vsభారత, నైరోబి, 2000 ఫైనల్100 - కేన్ విలియమ్సన్ vs ఆస్ట్రేలియా, ఎడ్జ్బాస్టన్, 2017100* - విల్ యంగ్ vs పాకిస్తాన్, కరాచీ, 2025ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్కు పాక్, కివీస్ తుది జట్లే ఇవే..పాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్ -
పాక్ బౌలర్ సూపర్ బాల్.. పాపం కేన్ మామ! ఐదేళ్ల తర్వాత?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా కరాచీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్నతొలి మ్యాచ్లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్( Kane Williamson) తీవ్ర నిరాశపరిచాడు. పాక్ పేసర్ నసీమ్ షా అద్బుతమైన బంతితో విలియమ్సన్ను బోల్తా కొట్టించాడు. అతడి దెబ్బకు కేన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. కివీస్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన నసీమ్ షా.. తొలి బంతిని కేన్ మామకు బ్యాక్ ఆఫ్ ఎ-లెంగ్త్ డెలివరీగా ఆఫ్సైడ్ సంధించాడు. ఆ బంతిని విలియమ్సన్ బ్యాక్ఫుట్ నుండి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి పిచ్ అయిన వెంటనే అతడి బ్యాట్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ రిజ్వాన్ చేతికి వెళ్లింది. దీంతో కేన్ మామ హెడ్ను షేక్ చేస్తూ నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా విలియమ్సన్ సింగిల్ డిజిట్ స్కోర్కు అవుట్ కావడం 2019 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.రవీంద్ర దూరం..కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్.. న్యూజిలాండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్హనించాడు. అయితే తొలుత బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్ విల్ యంగ్(88 నాటౌట్) మాత్రం తన అద్బుతమైన ఆటతీరుతో కివీ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు.29 ఓవర్లకు న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇక ఈ టోర్నీ ఆరంభానికి ముందు జరిగిన ట్రైసిరీస్లో గాయపడిన కివీస్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇంక పూర్తి ఫిట్నెస్ సాధించలేదు.దీంతో అతడు తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. అదేవిధంగా ఈ మ్యాచ్లో పాక్ ఓపెనర్ ఫఖార్ జమాన్ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతడి తొడ కండరాలు పట్టేశాడు. దీంతో అతడు ఆట మధ్యలోనే ఫీల్డ్ను వీడి బయటకు వెళ్లిపోయాడు.తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ WHAT A BALL FROM NASEEM SHAH ⚡⚡ pic.twitter.com/ghHOFkiSlU— Johns. (@CricCrazyJohns) February 19, 2025 -
తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్కు భారీ షాక్..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)కి బుధవారం(ఫిబ్రవరి 19) తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.గాయం కారణంగా ట్రైసిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే అదే సిరీస్లో గాయపడిన కివీస్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర మాత్రం ఇంకా కోలుకోలేదు. అతడు ఈ మ్యాచ్కు కూడా దూరమయ్యాడు.ఇక తొలి మ్యాచ్లోనే పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది బౌలింగ్లో మూడో బంతికి విల్ యంగ్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. ఆ బంతిని ఆపేందుకు జమాన్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో అతడి కూడి కాలికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే అతడు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. అతడి స్దానంలో కమ్రాన్ గులాం సబ్స్ట్యూట్గా మైదానంలోకి వచ్చాడు. ఇప్పటివరకు జమాన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదుకాగా అతడి గాయంపై పీసీబీ తాజాగా అప్డేట్ ఇచ్చింది. "ఫఖర్ జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని" పీసీబీ ట్విటర్లో రాసుకొచ్చింది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైనది అయితే పాకిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ సేవలను పాక్ కోల్పోయింది.తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్ -
Pak vs NZ: మెగా టోర్నీ షురూ.. టాస్ గెలిచిన పాక్.. తుదిజట్లు ఇవే
CT 2025 Pak vs NZ: ఎనిమిదేళ్ల విరామం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్కు తెరలేచింది. పాకిస్తాన్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్ బుధవారం ఆరంభమైంది. ఆతిథ్య పాక్- న్యూజిలాండ్ జట్ల మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మంచు ప్రభావాన్ని బట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.అదే విధంగా.. తాము డిఫెండింగ్ చాంపియన్స్ హోదాలో బరిలోకి దిగుతున్నందున కాస్త ఒత్తిడి ఉన్న మాట వాస్తమేనన్న రిజ్వాన్.. అయితే, ఇటీవలి ముగిసిన త్రైపాక్షిక సిరీస్ మాదిరే దీనిని సాధారణ సిరీస్గా భావిస్తే ప్రెజర్ తగ్గుతుందన్నాడు. సొంతగడ్డపై ఆడటం సంతోషంగా ఉందని.. గాయం కారణంగా జట్టుకు దూరమైన హ్యారిస్ రవూఫ్ జట్టులోకి తిరిగి వచ్చాడని తెలిపాడు.కాగా ఈ చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ స్వదేశంలో న్యూజిలాండ్- సౌతాఫ్రికాతో వన్డే ట్రై సిరీస్ ఆడింది. ఇందులో ఫైనల్కు చేరుకున్న పాక్.. ఆఖరి పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. మెగా ఈవెంట్లో కివీస్దే పైచేయిఇక ఇప్పటి వరకు పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య 118 వన్డేలు జరుగగా.. పాకిస్తాన్ 61, న్యూజిలాండ్ 53 మ్యాచ్లు గెలిచాయి. ఒకటి టై కాగా.. మూడు ఫలితం తేలకుండా ముగిసిపోయాయి. అయితే, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్లలో కివీస్ జట్టే పాక్పై గెలుపొందడం విశేషం. ఇక 1998లో మొదలైన ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని వివిధ కారణాల వల్ల 2017 తర్వాత నిలిపివేశారు. అయితే, తాజాగా మరోసారి ఈ మెగా ఈవెంట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు.. దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా సొంతగడ్డపై అతిపెద్ద క్రికెట్ పండుగను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లుఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసింది. కరాచీ, రావల్పిండి, లాహోర్లలో మ్యాచ్ల నేపథ్యంలో దాదాపు పన్నెండు వేల మంది పోలీసులను మోహరించేందుకు సిద్ధమైందని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో 18 మంది సీనియర్ ఆఫీసర్లతో పాటు 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్స్పెక్టర్లు, 1200 మంది ఉన్నతాధికారులు, 10,566 మంది కానిస్టేబుల్స్, 200కు పైగా మహిళా పోలీస్ ఆఫీసర్లు భద్రతా విభాగంలో భాగమైనట్లు తెలిపాయి. అంతేకాదు టోర్నీలో పాల్గొనే జట్లు, వీరాభిమానుల కోసం పీసీబీ ప్రత్యేకంగా విమానాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ-2025: పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీ -
Pak vs NZ: జట్టు నిండా ఆల్రౌండర్లే.. విజయం వారిదే!
న్యూజిలాండ్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) ప్రశంసలు కురిపించాడు. వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే కివీస్ ఆటగాళ్లు ప్రాధాన్యం ఇస్తారని.. అన్నింటికంటే వాళ్లకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొన్నాడు. వారికి ఆట పట్ల నిబద్ధత ఎక్కువని.. అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికల విషయంలోనూ వారికి స్పష్టమైన అవగాహన ఉంటుందన్నాడు.ఐకమత్యమే మహాబలంకాగా పాకిస్తాన్- న్యూజిలాండ్(Pakistan vs New Zealand) మధ్య మ్యాచ్తో చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్కు బుధవారం(ఫిబ్రవరి 19) తెరలేవనుంది. ఈ నేపథ్యంలో కివీస్ జట్టు బలాల గురించి కామెంటేటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘ఐకమత్యంగా ఉండటమే న్యూజిలాండ్ జట్టుకు ఉన్న ప్రధాన బలం. ఆ జట్టులో సూపర్స్టార్లు లేకపోవచ్చు.. కానీ అంతా కలిసి సూపర్స్టార్ టీమ్ను తయారుచేయగలరు.టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ దాకా.. ప్రతి ఒక్క సభ్యుడికి తమ పాత్ర ఏమిటో స్పష్టంగా తెలుసు. అంతేకాదు.. కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వారు ఒక్కోసారి త్యాగాలకు కూడా వెనుకాడరు. ప్రణాళికలు, వ్యూహాల విషయంలో వారు రాజీపడరు. అందుకే వారిని చోకర్స్ అనేందుకు నేను ఇష్టపడను.వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా ఆడేందుకే వారు ప్రాధాన్యం ఇస్తారు. జట్టు ప్రయోజనాలే పరమావధిగా మైదానంలోకి దిగుతారు. వ్యక్తిగతంగా ప్రకాశించడం కంటే కూడా.. జట్టుగా సత్తా చాటాడమే వారికిష్టం. ప్రస్తుత టీమ్ మొత్తం ఆల్రౌండర్లతో నిండిపోయింది. ముగ్గురు లేదంటే నలుగురు వికెట్ కీపర్లు ఉన్నారు.జట్టు నిండా ఆల్రౌండర్లేఆఫ్ స్పిన్నర్లు, లెఫ్టార్మ్ స్పిన్నర్లు జట్టుతో పాటే ఉన్నారు. రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్వెల్... వీరంతా బ్యాటింగ్, బౌలింగ్ చేయగలరు. ఇటీవలే న్యూజిలాండ్ త్రైపాక్షిక సిరీస్ గెలిచింది. పాకిస్తాన్ గడ్డపై పాక్తో పాటు సౌతాఫ్రికాను ఓడించింది.వరుస విజయాలుఅంతకు ముందు భారత్లో టీమిండియాపై అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం కివీస్ జట్టు సూపర్ ఫామ్లో ఉంది. పాక్ పిచ్ పరిస్థితులపై వారికి స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. పాక్తో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి. ఈ వన్డే ఫార్మాట్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుండగా టీమిండియా మాత్రం తమ మ్యాచ్లన్నీ దుబాయ్లో ఆడుతుంది.ఫెర్గూసన్ స్థానంలో జెమీసన్ చాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమైన పేసర్ లాకీ ఫెర్గూసన్ స్థానంలో మరో పేస్ బౌలర్ కైల్ జెమీసన్ జట్టులోకి వచ్చాడు. ఈ మార్పునకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది. 30 ఏళ్ల జేమీసన్ న్యూజిలాండ్ తరఫున 13 వన్డేలు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. జేమీసన్ చివరి వన్డే 2023లో బంగ్లాదేశ్పై ఆడాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే న్యూజిలాండ్ జట్టుడెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విల్ ఓ రూర్కీ, నాథన్ స్మిత్, విల్ యంగ్, జాకబ్ డఫీ, మైఖేల్ బ్రేస్వెల్, కైల్ జెమీసన్.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
పాకిస్తాన్కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే.. ఇప్పుడిలా!
తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యమిచ్చే అవకాశం లభించడంతో పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల్లో మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలపై ఆశలు చిగురిస్తున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల్ని చూసే అవకాశం లభించడంతో వారంతా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ప్రధాన జట్టుగా వెలుగొందిన పాకిస్తాన్కి ఉగ్రవాద ముద్ర పడిన తర్వాత ప్రధాన క్రికెట్ జట్లన్నీ ఆ దేశంలో పర్యటించడానికి వెనుకాడాయి.ముఖ్యంగా 2009లో ఆ దేశానికీ పర్యటనకి వచ్చిన శ్రీలంక జట్టు ఆటగాళ్ల బస్సుపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్ దేశం లో దాదాపు అంతర్జాతీయ క్రికెట్ పర్యటనలు నిలిచిపోయాయి. విదేశీ జట్ల రాకపోకలు నిలిచిపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా కొంతకాలం క్రితం వరకు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ని తమ స్వదేశీ వేదిక చేసుకొని క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.పాకిస్తాన్కి మళ్ళీ ఊపిరి పోసిన జింబాబ్వే2015లో జింబాబ్వే తొలిసారిగా పాకిస్తాన్ లో పర్యటించింది. దీంతో మళ్ళీ ఆ దేశంలో క్రికెట్ పర్యటనలకు దారులు తెరుచుకున్నాయి. ఆ తర్వాత 2017లో వరల్డ్ XI జట్టు టి20 సిరీస్ ఆడింది. దీంతో అంతర్జాతీయ జట్ల పర్యటనలు మళ్ళీ మెల్ల మెల్లగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్ కి పర్యటనలకు వెళ్లడంతో మళ్ళీ ఆ దేశ క్రికెట్ అభిమానులకి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. వివాదాల ఛాంపియన్స్ ట్రోఫీఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత పాకిస్తాన్ అభిమానులు ఒక అంతర్జాతీయ టోర్నమెంట్, అదీ ఛాంపియన్స్ ట్రోఫీ చూసేందుకు అవకాశం లభించడంతో వారంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వివాదాల అనంతరం పాకిస్తాన్ కి మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చే అవకాశం లభించింది. 2017లో సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ను తమ చిరకాల ప్రత్యర్థి భారత్పై ఫైనల్లో 180 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటి నుండి అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఎందుకంటె భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ల మధ్య ఈ టోర్నమెంట్ ఆడితిధ్యం హక్కులపై వివాదం నెలకొంది. ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుడుగా వ్యవహరించిన రోజర్ బిన్నీ నేతృత్వంలోని బోర్డు భద్రతా కారణాల దృష్ట్యా భారత్ గతంలో జట్టు ని పాకిస్తాన్కు పంపడానికి నిరాకరించింది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ని ప్రతిపాదించగా, పీసీబీ మాత్రం మొత్తం టోర్నమెంట్ను పాకిస్తాన్లోనే ఉంచాలని పట్టుదలకు పోయింది.పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కావడం, అంతే కాక 1996 ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నమెంట్ ని నిర్వహించే అవకాశం రావడం ఇందుకు ప్రధాన కారణం. చివరికి పాకిస్తాన్ కొద్దిగా పట్టు సడలించింది. దీంతో పాకిస్తాన్ అభిమానుల కల నెరవేరే రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్కి ఇది చాల ప్రత్యేకమైన రోజు!ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎందుకు రద్దు చేసింది?ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించిన ఐసీసీ 1998లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు ప్రతిపాదించింది. ఐసీసీలో అసోసియేట్ దేశాలు గా గుర్తింపు పొందిన దేశాల జట్లు మాత్రమే ప్రతిష్టాత్మకమైన యాభై ఓవర్ల ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఐసీసీ అనుమతించింది.మొదటి రెండు టౌర్నమెంట్లకు ఇదే పద్ధతిని అనుసరించారు. కానీ త్వరలోనే పూర్తి సభ్య దేశాల జట్లు కూడా ఈ టోర్నమెంట్లో పాలొనడం ప్రారంభించడం తో ఇది వన్డే ప్రపంచ కప్ తర్వాత ఎలైట్ ఐసీసీ యాభై ఓవర్ల ఈవెంట్గా మారిపోయింది. 2006 వరకు ఛాంపియన్స్ ట్రోఫీని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు కానీ ఆ తర్వాత ఐసీసీ దీనిని వన్డే ప్రపంచ కప్ మాదిరిగానే దీన్ని నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం ప్రారంభించింది. అయితే యాభై ఓవర్ల ఫార్మాట్లో రెండు ప్రధాన టౌర్నమెంట్లను -- ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ --- నిర్వహించడంపై దుమారం చెలరేగడంతో, ముఖ్యంగా ప్రపంచ కప్ స్థాయిలో రెండు వన్డే టౌర్నమెంట్లు నిర్వహించడం అర్ధరహితమని క్రికెట్ అభిమానులు వాదనలు వినిపించారు.మరోవైపు.. మూడు ఫార్మాట్లలోనూ మెగా టోర్నీ నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ను ఐసీసీ ప్రవేశట్టింది. ఈ క్రమంలో 2017లో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణను నిలిపివేసిన ఐసీసీ... 2021లో రీ ఎంట్రీపై అప్డేట్ ఇచ్చింది. 2025లో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీని నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఈ టోర్నమెంట్ వేదిక కోసం పాకిస్తాన్ పట్టుబడటం, ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో మళ్ళీ ఛాంపియన్ ట్రోఫీ ఆతిధ్యం పై వివాదం చెలరేగింది.తటస్థ వేదికైన యూఏఈలోఈ టోర్నమెంట్ నిర్వహణ పై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ టోర్నమెంట్ పాకిస్తాన్ నుంచి వేరే దేశానికీ మార్చాలని కూడా భావించారు. అయితే గత సంవత్సరం నవంబర్ లో బీసీసీఐ, పీసీబీ అధికారుల మధ్య ఐసీసీ ఒక సమావేశం నిర్వహించింది. భారత్ మ్యాచ్లను తటస్థ దేశమైన యూఏఈలో నిర్వహించేందుకు చివరికి అంగీకారం కుదరడంతో మళ్ళీ ఈ టోర్నమెంట్ నిర్వహణకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.చదవండి: భారత తుదిజట్టులో బుమ్రా స్థానంలో అతడే సరైనోడు: రిక్కీ పాంటింగ్ -
అతడు ఓపెనర్గానే వస్తాడు.. ట్రోఫీ గెలవడమే లక్ష్యం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడని పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) అన్నాడు. తమ పాత్రలు ఏవైనా అందరి ప్రధాన లక్ష్యం మాత్రం టైటిల్ గెలవడమేనని తెలిపాడు. అదే విధంగా తమ ఓపెనింగ్ జోడీలోనూ ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని రిజ్వాన్ పేర్కొన్నాడు.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహించగా నాడు పాకిస్తాన్ విజేతగా నిలిచింది. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 19 నుంచి సొంతగడ్డపై మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో పాక్ జట్టు తొలుత న్యూజిలాండ్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజం(Babar Azam) ఓపెనర్గానే బరిలో దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా వన్డౌన్లో వచ్చే బాబర్.. ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్తో త్రైపాక్షిక సిరీస్లో భాగంగా ఓపెనర్గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు.ఓపెనర్గా ఆడిన మూడు మ్యాచ్లలో వరుసగా 10, 23, 29 పరుగులు చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికా గడ్డపై సయీమ్ ఆయుబ్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్గా ప్రమోట్ అయిన బాబర్ అక్కడ కూడా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను ఓపెనర్గా ఆడించడంపై పునరాలోచన చేయాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు.అతడు ఓపెనర్గానే వస్తాడు..ఈ నేపథ్యంలో కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే, కాంబినేషన్లకు అనుగుణంగానే తుదిజట్టు కూర్పు ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీలోనూ బాబర్ ఆజం ఓపెనర్గా కొనసాగుతాడు. తన బ్యాటింగ్ స్థానం పట్ల అతడు సంతృప్తిగానే ఉన్నాడు.స్పెషలిస్టు ఓపెనర్లతోనే బరిలోకి దిగాలని మాకూ ఉంది. అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఒక్కోసారి సడలింపులు తప్పవు. అందుకే బాబర్ ఆజంను ఓపెనర్గా పంపాలనే నిర్ణయానికి వచ్చాం. ఫఖర్ జమాన్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. టెక్నికల్గా అతడు గొప్ప బ్యాటర్ అని అందరికీ తెలిసిందే.అందరూ కెప్టెన్లేఇక ఈ టోర్నీలో నేను లేదంటే బాబర్ ఆజం మాత్రమే ముఖ్యంకాదు. ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్కరు కఠినంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్గా జట్టు సమిష్టి ప్రదర్శనతో వచ్చే గెలుపును ఆస్వాదిస్తా. అయితే, కొన్నిమ్యాచ్లలో వ్యక్తిగత ప్రదర్శనలే అధిక ప్రభావం చూపిస్తాయి. ఏదేమైనా ప్రస్తుతం మా దృష్టి జట్టులోని పదిహేను మంది సభ్యులపై ఉంది. అందరూ కెప్టెన్లే. అయితే, వారికి ప్రతినిధిగా నేను టాస్ సమయంలో.. మీడియా సమావేశంలో ముందుకు వచ్చి మాట్లాడుతానంతే’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్తో మ్యాచ్కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
'పాక్ కెప్టెన్కు కొంచెం కూడా తెలివి లేదు.. అదొక చెత్త నిర్ణయం'
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు పాకిస్తాన్ వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్ టైటిల్ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన కరాచీ వేదికగా జరిగిన పైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. అయితే ఓ దశలో కివీస్కు గట్టిపోటీ ఇచ్చిన పాక్ జట్టు.. ఆ తర్వాత సొంత తప్పిదాల వల్ల మ్యాచ్పై పట్టుకోల్పోయింది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన పాక్ కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్ల్లో కూడా బ్లాక్ క్యాప్స్ చేతిలోనే పాక్ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో మహ్మద్ రిజ్వాన్ అండ్ కోపై పాక్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ విమర్శలు గుప్పించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ ఆట తీరు ఎలా ఉందో తేటతెల్లమైందని షెహజాద్ మండిపడ్డాడు. కాగా ఈ మ్యాచ్లో పాక్ జట్టు ఫీల్డింగ్లో తీవ్ర నిరాశపరిచింది."టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ చేసిన ఘోర తప్పిదంగా పరిగణించాలి. నిజంగా అదొక చెత్త నిర్ణయం. ఎందుకంటే ఈ వేదికలో జరిగిన గత మ్యాచ్లో పిచ్ రాత్రిపూట బ్యాటింగ్కు అనుకూలించడం మనం చూశాము. తేమ ఎక్కువగా వల్ల స్పిన్నర్లు కూడా పట్టు సాధించలేకపోయారు. అందువల్ల బంతి చక్కగా బ్యాట్పైకి వచ్చింది.అయినప్పటికి పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అస్సలు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎందుకు నాకు ఆర్దం కావడం లేదు. ఇదొక్కటే కాదు ఈ మ్యాచ్లో చాలా తప్పులు చేశారు. కొన్ని కొన్ని నిర్ణయాలు మరీ చైల్డీష్గా ఉన్నాయి. ప్రత్యర్థి స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తేనే మనం విజయం సాధించే అవకాశముంటుంది.అంతేకాకుండా జట్టులోని ప్రధాన ఆటగాళ్లు సైతం రాణించాల్సిన అవసరముంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ వంటి మెగా టోర్నీలో సమస్యలు ఎదుర్కొకతప్పదు అని షెహజాద్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.బాబర్ మళ్లీ ఫెయిల్.. కాగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) టాప్ స్కోరర్గా నిలవగా.. సల్మాన్ అఘా(65 బంతుల్లో ఫోర్, సిక్స్తో 45) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.కానీ బాబర్ ఆజం మాత్రం మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 29 పరుగులు మాత్రమే చేసి ఆజం పెవిలియన్కు చేరాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ ఓ రూర్కీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. మైకేల్ బ్రేస్వెల్(2/38), మిచెల్ సాంట్నర్(2/20) తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జాకోబ్ డఫ్ఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 243 పరుగుల లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు కోల్పోయి 45.2 ఓవర్లలో చేధించి గెలుపొందింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(58 బంతుల్లో 6 ఫోర్లతో 57), టామ్ లాథమ్(64 బంతుల్లో 5 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. వీరిద్దరితో పాటు డెవాన్ కాన్వే (74 బంతుల్లో 5 ఫోర్లతో 48) కూడా రాణించాడు.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్? -
Pak vs NZ: పాకిస్తాన్ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ కివీస్దే
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ప్రారంభానికి ముందు సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్(Tir Nation Series) ఫైనల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. గత మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్... న్యూజిలాండ్(Pakistan Vs New Zealand)తో తుదిపోరులో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది. రాణించిన రిజ్వాన్కరాచీ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఆఘా (65 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.మిచెల్, లాథమ్ హాఫ్ సెంచరీలుగత మ్యాచ్లో సెంచరీలతో కదంతొక్కిన ఈ ఇద్దరూ... తాజా పోరులో మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తయ్యబ్ తాహిర్ (38), బాబర్ ఆజమ్ (29) ఫర్వాలేదనిపించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో రూర్కే 4 వికెట్లు పడగొట్టగా... సాంట్నర్, బ్రాస్వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (58 బంతుల్లో 57; 6 ఫోర్లు), టామ్ లాథమ్ (64 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... కాన్వే (48), కేన్ విలియమ్సన్ (34) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు తీశాడు. రూర్కేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సల్మాన్ ఆఘాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్- త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ సంక్షిప్త స్కోర్లు👉వేదిక: నేషనల్ స్టేడియం, కరాచీ👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 242 (49.3)👉న్యూజిలాండ్ స్కోరు- 243/5 (45.2)👉ఫలితం: పాకిస్తాన్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విలియం రూర్కే(4/43)చాంపియన్స్ ట్రోఫీకి సియర్స్ దూరంక్రైస్ట్చర్చ్: చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆటగాళ్ల జాబితాలో మరో పేస్ బౌలర్ చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు బెన్ సియర్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిక్క కండరాల నొప్పితో ఇబ్బంది పడిన అతనికి పరీక్షలు చేయించగా చీలిక ఉన్నట్లు తేలింది. దాంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సియర్స్ స్థానంలో జేకబ్ డఫీని ఎంపిక చేసినట్లు కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. చదవండి: చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’! -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి
పాకిస్తాన్ స్టార్ ఆటగాడు బాబర్ ఆజమ్ (Babar Azam) ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హాషిమ్ ఆమ్లాతో (Hashim Amla) కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో 6000 పరుగులు పూర్తి చేసేందుకు ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి.The Moment Babar Azam created History in ODIs ⚡- Joint fastest to complete 6000 runs....!!!!! pic.twitter.com/U29MXMJ8xW— Johns. (@CricCrazyJohns) February 14, 2025కరాచీ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న ట్రై సిరీస్ (Pakistan Tri Series) ఫైనల్లో బాబర్ ఈ ఘనత సాధించాడు. ఆమ్లా, బాబర్ తర్వాత టీమిండియా స్టార్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి (Viart Kohli) వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ మైలురాయిని తాకేందుకు విరాట్కు 136 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్లలో బాబర్, ఆమ్లా, విరాట్ తర్వాతి స్థానాల్లో కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ట్రై సిరీస్లోనే (సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో) కేన్ విలియమ్సన్ 6000 పరుగుల క్లబ్లో చేరాడు.ట్రై సిరీస్ ఫైనల్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. పాక్ 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. గత కొంతకాలంగా ఫామ్లో లేని బాబర్ ఆజమ్ (29) ఈ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. పాక్ ఇన్నింగ్స్లో ఫకర్ జమాన్ (10), సౌద్ షకీల్ (8) కూడా తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (0), సల్మాన్ అఘా (0) క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మైఖేల్ బ్రేస్వెల్, నాథన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ముందు పాకిస్తాన్ స్వదేశంలో ముక్కోణపు సిరీస్కు ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో పాక్ సహా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నీలో ఫైనల్ ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్లు ఆడాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్లో పాక్ 353 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరింది.ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయన్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
రచిన్ రవీంద్రకు తీవ్ర గాయం.. మైదానంలో కుప్పకూలిన కివీ స్టార్! వీడియో
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా టోర్నీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా మరో కీలక ఆటగాడు ఈ జాబితాలో చేరాడు.ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో కివీ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రచిన్ రవీంద్ర నుదిటికి బంతికి బలంగా తాకింది. వెంటనే రచిన్ కింద పడిపోయాడు. అతడికి తీవ్ర రక్త స్రావం జరిగింది. మైదానంలోకి వచ్చిన ఫిజియోలు రక్త స్రావం ఆపే ప్రయత్నం చేశారు. ఫిజియోలు సాయంతో రచిన్ మైదానాన్ని వీడాడు.అసలేం జరిగిందంటే?పాకిస్తాన్ ఇన్నింగ్స్ 38వ ఓవర్ వేసిన స్పిన్నర్ మైఖేల్ బ్రేస్వెల్ బౌలింగ్లో మూడో బంతిని పాక్ బ్యాటర్ కుష్దిల్ షా.. డీప్ స్క్వేర్ లెగ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ బంతిని అందుకోవడానికి ప్రయత్నించాడు. కానీ బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేయడంలో రచిన్ విఫలమం కావడంతో.. ఆ బంతి నేరుగా వెళ్లి అతడి నుదిటికి తాకింది.దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు వల్ల బంతి సరిగా కనిపించకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇక గాయపడిన రచిన్ను వెంటనే అస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా రచిన్ గాయంపై న్యూజిలాండ్ క్రికెట్ అప్డేట్ ఇచ్చింది."పాక్ ఇన్నింగ్స్ 38వ ఓవర్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంతో బంతి రచిన్ నుదిటికి బలంగా తాకింది. అతడికి రక్తస్రావమైంది. దీంతో అతడిని మా ఫిజియోలు మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతడి నుదిటిపై గాయం ఉంది. రచిన్ను వెంటనే అస్పత్రికి తరలించి చికిత్స అందించాము.అతడి గాయం మరీ అంత తీవ్రమైనది కాదు. రవీంద్ర ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడికి హెడ్ ఇంజ్యూరీ అసెస్మెంట్(HIA ) పరీక్షలు నిర్వహించాము. అందులో అంతా క్లియర్గా ఉంది. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని" న్యూజిలాండ్ క్రికెట్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.పాకిస్తాన్ చిత్తు..కాగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (74 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 7 సిక్స్లు) మెరుపు శతకంతో విజృంభించగా... సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 58; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (84 బంతుల్లో 81; 2 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంరీలతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా... అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (69 బంతుల్లో 84; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకంతో మెరవగా... సల్మాన్ ఆఘా (40), తయ్యబ్ తాహిర్ (30) రాణించారు. కివీస్ బౌలర్లలో కెప్టెన్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫిలిప్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్ How did @ICC allowed Pakistan's ground to host international matches??ICC should ensure players safety and if Pakistan can't provide shift CHAMPIONS TROPHY to Dubai.Prayers for Rachin Ravindra 🙏🏻#PAKvNZ pic.twitter.com/77bvA7uqjv— KohliForever (@KohliForever0) February 8, 2025 -
ఫిలిప్స్ మెరుపు సెంచరీ.. పాక్ను చిత్తుచేసిన న్యూజిలాండ్
స్వదేశంలో చాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆడుతున్న ముక్కోణపు వన్డే టోర్నీని పాకిస్తాన్ పరాజయంతో ప్రారంభించింది. మూడు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీ తొలి పోరులో శనివారం పాకిస్తాన్ 78 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది.ఫిలిప్స్ ఊచకోత..న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(Glenn Phillips) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఫిలిప్స్.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదినైతే ఫిలిప్స్ ఓ ఆట ఆడేసికున్నాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో ఈ కీవీ స్టార్.. రెండు సిక్స్లు, రెండు ఫోర్ల సాయం(Wd Wd 4 6 6 2 4 1) సాయంతో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.ఓవరాల్గా 74 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్.. 6 ఫోర్లు, 7 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫిలిప్స్కు ఇదే తొలి వన్డే సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు నియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 58; 7 ఫోర్లు), డారిల్ మిచిల్ (84 బంతుల్లో 81; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకాలతో రాణించారు.విల్ యంగ్ (4), వికెట్ కీపర్ టామ్ లాథమ్ (0) విఫలం కాగా... రచిన్ రవీంద్ర (25), బ్రాస్వెల్ (31) ఫర్వాలేదనిపించారు. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ షా అఫ్రిది 3 వికెట్లు పడగొట్టగా... అబ్రార్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 47.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ (69 బంతుల్లో 84; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకంతో మెరవగా... సల్మాన్ ఆఘా (40), తయ్యబ్ తాహిర్ (30) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (3), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10), కమ్రాన్ గులామ్ (18) విఫలమయ్యారు.కివీస్ బౌలర్లలో కెప్టెన్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫిలిప్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా సోమవారం జరగనున్న తదుపరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని -
పాక్ బౌలర్లకు చుక్కలు.. ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీ! వీడియో వైరల్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాలను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీకి ముందు న్యూజిలాండ్-పాకిస్తాన్-దక్షిణాఫ్రికా జట్లు ట్రైసిరీస్లో తలపడుతున్నాయి. ఈ సిరీస్లో భాగంగా లహోర్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో కివీస్ బ్యాటర్లు జూలు విధిల్చారు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఆరో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన ఫిలిప్స్.. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాక్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిదినైతే ఫిలిప్స్ ఓ ఆట ఆడేసికున్నాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన అఫ్రిది బౌలింగ్లో ఈ కీవీ స్టార్.. రెండు సిక్స్లు, రెండు ఫోర్ల సాయం(Wd Wd 4 6 6 2 4 1) సాయంతో ఏకంగా 29 పరుగులు పిండుకున్నాడు.ఈ క్రమంలో కేవలం 72 బంతుల్లోనే తొలి వన్డే సెంచరీని ఫిలిప్స్ అందుకున్నాడు. ఆఖరి వరకు అతడిని ఆపడం ప్రత్యర్ధి బౌలర్ల తరం కాలేదు. ఓవరాల్గా 74 బంతులు ఎదుర్కొన్న ఫిలిప్స్.. 6 ఫోర్లు, 7 సిక్స్లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు డార్లీ మిచెల్(81), కేన్ విలియమ్సన్(81) హాఫ్ సెంచరీలతో రాణించారు.దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగుల భారీ స్కోర్ సాధించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. అర్బర్ ఆహ్మద్ రెండు, రౌఫ్ ఒక్క వికెట్ సాధించారు.తుది జట్లుపాకిస్తాన్: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), ఖుష్దిల్ షా, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, బెన్ సియర్స్, విలియం ఒరోర్కేచదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధానిGLENN PHILIPS SHOW AT LAHORE....!!- Philips smashed Hundred from just 72 balls against Pakistan in Pakistan 🔥⚡ pic.twitter.com/YnGqsULtsL— Johns. (@CricCrazyJohns) February 8, 2025 -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్కు భారీ షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు న్యూజిలాండ్కు భారీ షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్(Lockie Ferguson) గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఫెర్గూసన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాదదపడుతున్నాడు.యూఏఈ టీ20 లీగ్-2025లో డెజర్ట్ వైపర్స్కు సారథ్యం వహించిన ఫెర్గూసన్కు.. దుబాయ్ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్లో తొడ కండరాలు పట్టేశాయి. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. ఫెర్గూసన్ మరుసటి రోజు స్కాన్ చేయించుకున్నాడు. అయితే అతడి స్కానింగ్ సంబంధించిన పూర్తి రిపోర్టులు కోసం ఎదురు చూస్తున్నట్లు కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు."లాకీ ఫెర్గూసన్ ఇప్పటికే యూఏఈలో స్కాన్ చేయించుకున్నాడు. అందుకు సంబంధించిన కొన్ని రిపోర్టులు మాకు అందాయి. వాటిని మా రేడియాలజిస్ట్కు పంపించాం. లాకీ ఇంకా యూఏఈలోనే ఉన్నాడు. మా రేడియాలజిస్ట్ సూచనమెరకు అతడు పాకిస్తాన్కు రప్పించాలా లేదా వేరొకరితో భర్తీ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాము" అని స్టెడ్ పేర్కొన్నాడు.కాగా బ్లాక్క్యాప్స్ జట్టు ప్రస్తుతం పాకిస్తాన్-దక్షిణాఫ్రికాలతో ట్రైసిరీస్లో తలపడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాకల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమైంది. లహోర్ వేదికగా మొదటి మ్యాచ్లో పాక్-న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్కు ఫెర్గూసన్ దూరమయ్యాడు.కాగా ట్రైసిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీలకు ఫెర్గూసన్ బ్యాకప్గా జాకబ్ డఫీని న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. ఏదేమైనప్పటికి ఛాంపియన్స్ ట్రోఫీకి లాకీ దూరమైతే కివీస్కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇక మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న ఆతిథ్య పాకిస్తాన్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీచదవండి: నాయకుడే ఇలా ఉంటే ఎలా?: రోహిత్పై కపిల్ దేవ్ వ్యాఖ్యలు -
CT 2025: పాకిస్తాన్కు ఎదురుదెబ్బ! ఓవైపు క్రికెట్ పండుగ.. మరోవైపు..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఆరంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ సయీమ్ అయూబ్(Saim Ayub) గాయం కారణంగా సొంతగడ్డపై ఈనెల 19 నుంచి జరిగే ఈ మెగా వన్డే టోర్నమెంట్కు దూరమయ్యాడు. గత నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. టెస్టు సిరీస్ సందర్భంగా అతడి చీలమండకు ఫ్రాక్చర్ అయ్యింది. దీంతో.. అప్పటి నుంచి అతడు ఇంగ్లండ్లోనే పునరావాస శిబిరంలో గడుపుతున్నాడు.అయితే గాయం తీవ్రత దృష్ట్యా కనీసం పది వారాలు విశ్రాంతి తీసుకోవాలని బోర్డు వైద్య సిబ్బంది నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీకి ఆయూబ్ గైర్హాజరు కానున్నాడు. నిజానికి గాయపడటానికి ముందు ఈ 22 ఏళ్ల ఎడంచేతి వాటం బ్యాటర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనలలో అదరగొట్టాడు.ఆ సిరీస్కూ దూరంముఖ్యంగా సఫారీ జట్టుతో జరిగిన వన్డేల్లో సెంచరీలతో కదంతొక్కిన అయూబ్ జింబాబ్వేతో టీ20లో ‘శత’క్కొట్టాడు. ఇక వచ్చే నెల న్యూజిలాండ్ పర్యటనకు అతడు అందుబాటులో ఉండేది అనుమానమేనని తెలిసింది. మెడికల్ రిపోర్టులు, ఫిట్నెస్ టెస్టులను పరిశీలించాకే కివీస్ పర్యటనకు ఎంపిక చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా న్యూజిలాండ్లో పాకిస్తాన్ ఐదు టీ20లు, మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ రెండు పరిమిత ఓవర్ల సిరీస్లు జరుగుతాయి.క్రికెట్ పండుగఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత క్రికెట్ పండగ జరగబోతోన్న విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం నవీకరించిన స్టేడియాల సామర్థ్యం, ఆ టోర్నీకి ముందు సిద్ధమైన మూడు మేటి జట్ల సత్తా ఏంటో పరీక్షించుకునేందుకు సన్నాహక ముక్కోణపు టోర్నీ శనివారం నుంచి మొదలుకానుంది. లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలపై ఆతిథ్య పాక్ సహా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లు ఈ ముక్కోణపు సిరీస్లో తలపడనున్నాయి.ఇందులో భాగంగా శనివారం పాకిస్తాన్, న్యూజిలాండ్ల మధ్య లాహోర్లోని గడాఫీ స్టేడియంలో తొలి పోరు జరుగనుంది. 35 వేల సీట్ల సామర్థ్యం గల ఈ స్టేడియాన్ని ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నవీకరించింది. వందల సంఖ్యలో రోజుల తరబడి కారి్మకులు శ్రమించి నిర్ణీత సమయానికల్లా మైదానాలకు అందుబాటులోకి తెచ్చారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ కితాబిచ్చారు.ఇటు ఆతిథ్య దేశంతో పాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలు మెగా ఈవెంట్కు సరైన సన్నాహక టోర్నీగా ఈ ముక్కోణపు టోర్నీ మ్యాచ్ల్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. తద్వారా స్థానిక పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు ఐసీసీ మెగా టోర్నీకి వేదికలైన స్టేడియాల పిచ్పై కూడా అవగాహన పెంచుకోవచ్చని కివీస్, సఫారీలు భావిస్తున్నాయి. ఇరుజట్లలోని ఆటగాళ్లలో కొందరు మినహా దాదాపు మెగా ఈవెంట్లో పాల్గొనే క్రికెటర్లతోనే ఈ టోర్నీ ఆడేందుకు వచ్చాయి. ఫిబ్రవరి 14న కరాచీలో జరిగే ఫైనల్స్తో ఈ ముక్కోణపు టోర్నీ ముగుస్తుంది. తర్వాత ఐదు రోజుల వ్యవధిలోనే 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మొదలవుతుంది. చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
పాకిస్తాన్కు వెళ్లనున్న రోహిత్ శర్మ!.. కారణం?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పాకిస్తాన్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ఆరంభోత్సవంలో భారత సారథి పాల్గొననున్నట్లు సమాచారం. కాగా 1996 తర్వాత తొలిసారి పాకిస్తాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తోంది.వన్డే ఫార్మాట్లో జరిగే చాంపియన్స్ ట్రోఫీని చివరగా 2017లో నిర్వహించగా.. నాడు పాక్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించడంతో పాటు నిర్వహణ హక్కులను కూడా దక్కించుకుంది.ఇక ఆతిథ్య పాకిస్తాన్తో పాటు.. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఈవెంట్ ప్రదర్శన ఆధారంగా చాంపియన్ ఆస్ట్రేలియా, రన్నరప్ టీమిండియా.. అదే విధంగా టాప్-7లో నిలిచిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ కూడా ఈ టోర్నమెంట్కు అర్హత సాధించాయి.తటస్థ వేదికపైఅయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించింది. తటస్థ వేదికపైన తమకు మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఆరంభంలో ఇందుకు ససేమిరా అన్నప్పటికీ.. ఐసీసీ జోక్యంతో పట్టువీడింది. తాము కూడా ఇకపై భారత్లో ఐసీసీ టోర్నీ జరిగితే అక్కడికి వెళ్లకుండా తటస్థ వేదికపైనే ఆడతామన్న షరతుతో హైబ్రిడ్ విధానానికి అంగీకరించింది.ఈ నేపథ్యంలో దుబాయ్(Dubai) వేదికగా భారత క్రికెట్ జట్టు తమ మ్యాచ్లు ఆడనుంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుండగా.. ఫిబ్రవరి 16 లేదంటే 17వ తేదీన ఈ ఈవెంట్ ఆరంభ వేడుకను నిర్వహించేందుకు పాక్ బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. ఆనవాయితీ ప్రకారం ఈ టోర్నీలో పాల్గొనే జట్ల కెప్టెన్లందరూ ఈ వేడుకకు హాజరు కావాల్సి ఉంటుంది.టీమిండియా కెప్టెన్ కూడా వస్తాడుఈ విషయం గురించి పాక్ బోర్డు వర్గాలు వార్తా సంస్థ(IANS)తో మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ వేడుకలను పీసీబీ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. టీమిండియా కెప్టెన్ కూడా ఇందులో పాల్గొనేందుకు పాకిస్తాన్కు వస్తాడు. 29 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఐసీసీ ఈవెంట్ జరుగబోతోంది. దీనిని విజయవంతం చేయాలని పీసీబీ పట్టుదలగా ఉంది’’ అని పేర్కొన్నాయి.అయితే, బీసీసీఐ రోహిత్ శర్మను పాకిస్తాన్కు పంపిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కరాచీ వేదికగా జరుగనున్న మ్యాచ్తో చాంపియన్స్ ట్రోఫీ-2025కి తెరలేవనుంది. మరోవైపు.. టీమిండియా ఫిబ్రవరి 20న దుబాయ్లో తమ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. దాయాదుల సమరం ఆరోజేఇక క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగుతుంది. దాయాదుల సమరానికి దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. కాగా భారత్- పాక్ చివరగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా తలపడగా.. టీమిండియా విజయం సాధించింది.ఇక టీ20 ప్రపంచకప్లో ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన.. చాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకున్న తర్వాత.. రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం టెస్టు, వన్డే జట్ల సారథిగా కొనసాగుతున్నాడు.చదవండి: టి20 ప్రపంచకప్.. టీమిండియా ఘన విజయం -
‘ఇంత చెత్త ఆట చూడలేదు.. మేమేమీ క్యాచ్లు డ్రాప్ చేయలేదు’
మహిళల టీ20 ప్రపంచకప్-2024.. ఆరంభం నుంచే తడబడ్డ భారత జట్టు సెమీ ఫైనల్ చేరాలంటే.. పాకిస్తాన్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన దుస్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో పాక్ గెలిస్తేనే హర్మన్ప్రీత్ సేన టాప్-4కు చేరుతుంది. కాబట్టి.. దాయాది ఎలాగైనా గెలవాలని ఈసారి టీమిండియా అభిమానులు కూడా కోరుకున్నారు.కానీ.. ఫ్యాన్స్ ప్రార్థనలు ఫలించలేదు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ కివీస్ చేతిలో చిత్తుగా ఓడింది. బౌలింగ్లో రాణించినా.. ఫీల్డింగ్లో మాత్రం చెత్త ప్రదర్శన కనబరిచింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 4.2, 5.2, 7.3, 15.5, 17.2, 19.1, 19.3, 19.5 ఓవర్ల వద్ద ఏకంగా ఎనిమిది క్యాచ్లు జారవిడిచింది.లక్ష్య ఛేదనలోనూ నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించి.. తమ క్రికెట్ చరిత్రలోనే అత్యల్పస్కోరు (56 ఆలౌట్) నమోదు చేసింది. కివీస్ చేతిలో ఏకంగా 54 పరుగుల తేడాతో ఓడిపోయింది. టోర్నీ నుంచి తామూ నిష్క్రమిస్తూ.. భారత జట్టును కూడా ఇంటిబాట పట్టించింది పాకిస్తాన్ మహిళా టీమ్.ఇంత చెత్త ఆట చూడలేదుఈ నేపథ్యంలో పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనా మిర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘15 ఏళ్ల మా జట్టు ఆట తీరులో నేను ఇలాంటి చెత్త ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు’’ అని సనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం న్యూజిలాండ్తో మ్యాచ్లో పాకిస్తాన్ ప్రదర్శనపై స్పందించాడు.మేమేమీ క్యాచ్లు ‘డ్రాప్’ చేయలేదు‘‘ఆసియాలో.. మేము ఆటగాళ్లను ‘డ్రాప్’ చేయము.. వారికి కేవలం ‘విశ్రాంతి’ని మాత్రమే ఇస్తాం.. అంతేకాదు.. మేమేమీ క్యాచ్లు ‘డ్రాప్’ చేయము.. కేవలం బంతిని గ్రౌండ్ మీద పెడతాము అంతే’’ అంటూ ఆకాశ్ చోప్రా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇంగ్లండ్తో తొలి టెస్టులో పాకిస్తాన్ పురుషుల జట్టు ఓటమి తర్వాత.. రెండు, మూడో మ్యాచ్ల జట్టు నుంచి బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిది వంటి స్టార్లను తప్పించి.. రెస్ట్ ఇచ్చామని కోచ్లు చెప్పిన విషయం తెలిసిందే.అదే ప్రభావం చూపిందిఈ నేపథ్యంలో పాక్ పురుషుల, మహిళా జట్ల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆకాశ్ చోప్రా ఇలా సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత పాక్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ.. ‘‘మేము బాగానే బౌలింగ్ చేశాం. కానీ.. బ్యాటింగ్.. ముఖ్యంగా ఫీల్డింగ్ విభాగంలో మెరుగ్గా రాణించాల్సింది.మా జట్టులోని సీనియర్లు సైతం బ్యాటింగ్లో విఫలం కావడం ప్రభావం చూపింది. ఒకవేళ మేము గనుక బ్యాటింగ్లో రాటుదేలకపోతే.. మహిళా క్రికెటర్లుగా మా ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది’’ అని పేర్కొంది. ఆ ఎనిమిది క్యాచ్లు ఏదేమైనా.. పాకిస్తాన్ జారవిడిచిన ఆ ఎనిమిది క్యాచ్లు భారత జట్టు కొంపముంచాయి. సెమీస్ చేరాలన్న హర్మన్సేన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో.. సహజంగానే కొంతమంది.. పాక్ కావాలనే చెత్తగా ఆడిందా అనే సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. అయితే, కివీస్ వంటి జట్టుతో మ్యాచ్ అంతతేలికైన విషయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లువేదిక: దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్టాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ స్కోరు: 110/6 (20)పాకిస్తాన్ స్కోరు: 56 (11.4)ఫలితం: పాక్పై 54 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్లో అడుగుమహిళల టీ20 ప్రపంచకప్-2024 నుంచి పాకిస్తాన్తో పాటు భారత్ కూడా అవుట్.చదవండి: Ind vs NZ: మా ఆటకు హద్దుల్లేవ్.. రోజుకు 400–500 పరుగులైనా..Pakistan dropped 8 catches against New Zealand. 🤯pic.twitter.com/kW53N2A31t— Mufaddal Vohra (@mufaddal_vohra) October 14, 2024 -
NZ vs Pak: షెడ్యూల్ విడుదల.. ఐపీఎల్-2025కి కివీస్ స్టార్స్ దూరం?
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 2024- 2025 ఏడాదికి గానూ తమ హోం షెడ్యూల్ను ప్రకటించింది. స్వదేశంలో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్లతో సిరీస్లు ఆడనున్నట్లు తెలిపింది.ఇంగ్లండ్తో టెస్టు సిరీస్, శ్రీలంక- పాకిస్తాన్లతో వన్డే, టీ20 సిరీస్లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే, పాక్తో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్-2025లో ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే.. కివీస్ జట్టు ఇప్పటికే సౌతాఫ్రికా- పాకిస్తాన్తో ట్రై సిరీస్ ఆడేందుకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి సన్నాహకంగా ముందుగా ఈ త్రైపాక్షిక సిరీస్లో న్యూజిలాండ్ పాల్గొననుంది. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది.న్యూజిలాండ్ మెన్స్ షెడ్యూల్(2024- 2025)వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల సిరీస్👉మొదటి టెస్టు- నవంబరు 28- డిసెంబరు 2- క్రైస్ట్చర్చ్👉రెండో టెస్టు- డిసెంబరు 6- 10- వెల్లింగ్టన్👉మూడో టెస్టు- డిసెంబరు 14- 18- హామిల్టన్శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్లు👉తొలి టీ20- డిసెంబరు 28- తౌరంగ👉రెండో టీ20- డిసెంబరు 30- తౌరంగ👉మూడో టీ20- జనవరి 2- నెల్సన్👉తొలి వన్డే- జనవరి 5- వెల్లింగ్టన్👉రెండో వన్డే- జనవరి 8- హామిల్టన్👉మూడో వన్డే- జనవరి 11- ఆక్లాండ్పాకిస్తాన్తో టీ20, వన్డే సిరీస్లు👉మొదటి టీ20- మార్చి 16- క్రైస్ట్చర్చ్👉రెండో టీ20- మార్చి 18- డునెడిన్👉మూడో టీ20- మార్చి 21- ఆక్లాండ్👉నాలుగో టీ20- మార్చి 23- తౌరంగ👉ఐదో టీ20- మార్చి 26- వెల్లింగ్టన్తొలి వన్డే- మార్చి 29- నేపియర్👉రెండో వన్డే- ఏప్రిల్ 2- హామిల్టన్👉మూడో వన్డే- ఏప్రిల్ 5- తౌరంగ.చదవండి: మీరంటే నేను.. నేనంటే మీరు: గంభీర్ భావోద్వేగం -
Pak vs NZ: చావో రేవో.. గట్టెక్కిన పాకిస్తాన్! ఆఖరికి..
న్యూజిలాండ్తో ఆఖరి టీ20లో పాకిస్తాన్ గట్టెక్కింది. తొమ్మిది పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది సిరీస్ను సమం చేసుకుంది. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కివీస్ జట్టు పాక్ పర్యటనకు వెళ్లింది.బాబర్ ఆజం కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్కు ఇదే తొలి సిరీస్. అది కూడా సొంతగడ్డపై జరుగుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ క్రమంలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్లో ఆతిథ్య పాక్ విజయం సాధించింది. ఆ మరుసటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన కివీస్.. నాలుగో టీ20లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు 1-2తో వెనుకబడింది. కివీస్ ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో బాబర్ ఆజం బృందంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి టీ20లో పాక్ గెలుపొందింది. తద్వారా సిరీస్ను 2-2తో సమం చేయగలిగింది.లాహోర్లో టాస్ ఓడిన పాక్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. బాబర్ ఆజం(44 బంతుల్లో 69), ఉస్మాన్ ఖాన్(24 బంతుల్లో 31), ఫఖర్ జమాన్(33 బంతుల్లో 43), షాబాద్ ఖాన్(5 బంతుల్లో 15 నాటౌట్) రాణించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కివీస్ తడబడింది. ఓపెనర్ టిమ్ సెఫార్ట్ (33 బంతుల్లో 52), జోష్ క్లార్క్సన్(26 బంతుల్లో 38 నాటౌట్) మాత్రమే మెరుగ్గా ఆడారు.మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొమ్మిది పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. నాలుగు వికెట్లతో రాణించిన షాహిన్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. Scenes in Lahore following the fifth T20I as the series is squared 🏆🤝#PAKvNZ | #AaTenuMatchDikhawan pic.twitter.com/pBm4SmQi7j— Pakistan Cricket (@TheRealPCB) April 27, 2024 -
Pak Vs NZ: ఉత్కంఠ పోరులో పాక్ చిత్తు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!
సొంతగడ్డపై పాకిస్తాన్కు మరో చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్తో నాలుగో టీ20లో స్వల్ప తేడాతో బాబర్ ఆజం బృందం ఓడిపోయింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో కివీస్ 2-1తో పాక్పై పైచేయి సాధించింది.కాగా బాబర్ ఆజం కెప్టెన్గా తిరిగి పగ్గాలు చేపట్టిన తర్వాత పాకిస్తాన్ తొలుత స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఇందులో తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్లో పాక్ గెలిచింది.అయితే, మరుసటి మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసిన కివీస్.. తాజాగా గురువారం నాటి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గెలిచి షాకిచ్చింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ రాబిన్సన్(36 బంతుల్లో 51), టామ్ బ్లండెల్ (15 బంతుల్లో 28), వన్డౌన్ బ్యాటర్ ఫాక్స్క్రాఫ్ట్(26 బంతుల్లో 34), కెప్టెన్ మిచెల్ బ్రాస్వెల్(20 బంతుల్లో 27) రాణించారు.పాక్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది అత్యధికంగా మూడు వికెట్లు తీయగా.. ఆమిర్, ఉసామా మిర్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ ఆమిర్, జమాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే సయీమ్ ఆయుబ్(20), బాబర్ ఆజం(5), ఉస్మాన్ ఖాన్(16) వికెట్లు కోల్పోయింది. అయితే, ఫఖర్ జమాన్ పట్టుదలగా నిలబడి 45 బంతుల్లో 61 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.ఇఫ్తికర్ అహ్మద్(20 బంతుల్లో 23), ఇమాద్ వసీం(11 బంతుల్లో 22 నాటౌట్) పోరాడాడు. కానీ ఆఖరి బంతికి పాక్ విజయానికి ఆరు పరుగులు అవసరం కాగా.. క్రీజులో ఉన్న ఇమాద్ వసీం జెమ్మీ నీషం బౌలింగ్లో ఒక్క పరుగు మాత్రమే తీయగలిగాడు. ఫలితంగా నాలుగు పరుగుల తేడాతో పాక్ ఓటమిపాలైంది. దీంతో లాహోర్ ప్రేక్షకుల హృదయాలు ముక్కలయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మ్యాచ్లో మూడు కీలక వికెట్లు తీసి కివీస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన 22 ఏళ్ల పేసర్ విలియం రూర్కీకి ప్లేయర్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
‘బాబర్ ఆజం పెళ్లి చేసుకోవాలనుకుంటే?.. ఒప్పుకోను!’
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వన్డేల్లో సుదీర్ఘకాలం పాటు నంబర్ వన్ ర్యాంకులో కొనసాగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇటీవలే తిరిగి పరిమిత ఓవర్ల కెప్టెన్గా పునర్నియమితుడయ్యాడు.ఇక బాబర్ ఆజంకు తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో పెళ్లి గురించి తప్పక ప్రస్తావన ఉంటుంది. వరల్డ్క్లాస్ క్రికెటర్గా ఎదిగిన 29 ఏళ్ల ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరిని పెళ్లాడబోతున్నాడన్న అంశంపై గాసిప్రాయుళ్లు కథనాలు అల్లేస్తుంటారు కూడా! ఈ విషయమై పాకిస్తాన్కు చెందిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. బాబర్ ఫ్యాన్స్ దెబ్బకు ఆమె అకౌంట్ను కాసేపు ప్రైవేట్ అకౌంట్గా మార్చుకోవాల్సి వచ్చింది. నజీష్ జహంగీర్ అనే బుల్లితెర నటికి ఇన్స్టాగ్రామ్లో 12 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెను.. ‘‘బాబర్ ఆజం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాన’’ని అడిగితే ఏం చెప్తారు? అని అడిగాడు. ఇందుకు బదులుగా.. ‘‘సారీ చెప్తాను’’ అంటూ సున్నితంగా తిరస్కరిస్తాననే అర్థంలో సమాధానమిచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ను ఆమె తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేసిందన్న వార్త వైరల్ అయింది.అంతేకాదు.. ‘‘బాబర్ మాకు సోదరుడి వంటి వాడు. కానీ అతడి అభిమానులు ఇలా నెగిటివిటీ ప్రచారం చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు’’ అని నజీష్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్నట్లు మరో ఇన్స్టా స్టోరీ కూడా తెరమీదకు వచ్చింది.ఈ క్రమంలో బాబర్ ఫ్యాన్స్ ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. వేధింపులను తట్టుకోలేక నజీష్ తన అకౌంట్ను సోమవారం కాసేపు ప్రైవేట్గా పెట్టినట్లు సామా టీవీ వెల్లడించింది. అయితే, మరుసటి రోజే ఆమె మళ్లీ తన అకౌంట్ను పబ్లిక్ చేసేసింది. కాగా వన్డే వరల్డ్కప్-2023 వైఫల్యం తర్వాత బాబర్ ఆజం పాక్ కెప్టెన్గా వైదొలిగాడు.దీంతో అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్గా ఎంపికయ్యారు. అయితే, వీరి సారథ్యంలో జట్టు ఘోర వైఫల్యాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో షాహిన్పై వేటు వేసిన పాక్ బోర్డు.. పగ్గాలను తిరిగి బాబర్ ఆజంకు అప్పగించింది. షాన్ మసూద్ను మాత్రం టెస్టుల సారథిగా కొనసాగిస్తోంది. ఇక మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాబర్ సొంతగడ్డపై న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో బిజీ అయ్యాడు. వర్షం కారణంగా తొలి టీ20 రద్దు కాగా.. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచింది. ఇరుజట్ల మధ్య గురువారం నాలుగో టీ20 జరుగనుంది. -
పాకిస్తాన్కు బిగ్ షాక్.. విధ్వంసకర ఆటగాడికి గాయం!?
న్యూజిలాండ్తో తొలి టీ20కు ముందు పాకిస్తాన్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర కీపర్-బ్యాటర్ ఆజం ఖాన్ గాయం కారణంగా తొలి టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గురువారం రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20లో పాకిస్తాన్-కివీస్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో బుధవారం నెట్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోన్న ఆజం మోకాలికి గాయమైంది. మెకాలికి బంతి బలంగా తాకడంతో ఆజం తీవ్రమైన నోప్పితో విలవిల్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడిని తొలి టీ20కు పక్కన పెట్టాలని పాక్ మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. కాగా ఆజం ఖాన్ ప్రస్తుతం పీసీబీ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు కాకుల్ ఆర్మీ క్యాంపులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో ఆజం ఖాన్ తీవ్రంగా శ్రమించాడు. అతడితో పాటు జట్టు మొత్తం 11-రోజుల ఫిట్నెస్ క్యాంప్లో పాల్గోంది. కాగా ఈ సిరీస్ టీ20 వరల్డ్కప్-2024 సన్నహాకాల్లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్లు ఐదు టీ20లు ఆడనున్నాయి. అయితే పాక్ పర్యటనకు కివీస్ క్రికెట్ బోర్డు తమ ద్వితీయ శ్రేణి జట్టును పంపించింది. స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్-2024 సీజన్లో బీజీబీజీగా ఉండడంతో న్యూజిలాండ్ క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. -
పాకిస్తాన్ జట్టు ప్రకటన! 4 ఏళ్ల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ
స్వదేశంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్న పేసర్ మహ్మద్ అమీర్, ఆల్రౌండర్ ఇమాద్ వసీంకు ఈ జట్టులో చోటు దక్కింది. వీరిద్దరితో పాటు యువ ఆటగాడు ఉస్మాన్ ఖాన్, అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా ఈ సిరీస్తో బాబర్ ఆజం మళ్లీ పాకిస్తాన్ టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు పాకిస్తాన్ సూపర్ లీగ్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన యువ ఓపెనర్ సైమ్ అయూబ్ను సైతం సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక మహ్మద్ అమీర్ పాకిస్తాన్ తరపున చివరగా 2020లో ఆడాడు. ఆ తర్వాత బోర్డుతో విభేదాల కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు అమీర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఇప్పుడు బోర్డు కొత్త చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ సూచనల మెరకు అమీర్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం కూడా గతేడాది అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. కానీ పీసీబీ అధికారులతో చర్చలు జరిపి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వహాబ్ రియాజ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఏప్రిల్ 18 నుంచి రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కివీస్తో టీ20లకు పాక్ జట్టు బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ అమీర్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది, ఉసామా మీర్, ఉస్మాన్ ఖాన్, జమాన్ ఖాన్ నాన్ ట్రావెలింగ్ రిజర్వ్లు: హసీబుల్లా, మొహమ్మద్ అలీ, మొహమ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్ మరియు సల్మాన్ అలీ అఘా -
న్యూజిలాండ్కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 92 పరుగులకే ఆలౌట్
న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్తో జరిగిన ఐదో టీ20లో 42 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ వైట్ వాష్ నుంచి పాక్ తప్పించుకుంది. తొలి నాలుగు టీ20ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్ 4-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, ఫెర్గూసన్, సోధీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ 38 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ఇఫ్తికర్ ఆహ్మద్ 3 వికెట్లతో కివీస్ను దెబ్బతీశాడు. అతడితో పాటు షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ నవాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు జమాన్ ఖాన్, ఉసమా మీర్ చెరో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(26) టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు -
#NZvPAK: దంచి కొట్టిన మిచెల్, ఫిలిప్స్.. పాకిస్తాన్కు మరో పరాభవం
New Zealand vs Pakistan, 4th T20I: న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్తాన్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకున్న షాహిన్ ఆఫ్రిది బృందం.. నాలుగో టీ20లోనూ ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో ఓడి మరో పరాభవం మూటగట్టుకుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా టాస్ ఓడిన పాకిస్తాన్.. న్యూజిలాండ్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(1) ఆదిలోనే అవుట్ కాగా.. వన్డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(19), ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన ఫఖర్ జమాన్(9), షాహిజాదా ఫర్హాన్(1), ఇఫ్తికర్ అహ్మద్ (10) పూర్తిగా విఫలమయ్యారు. ఇలా ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 63 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరు ఫోర్లు, రెండు సిక్స్ల సాయంతో 90 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. రిజ్వాన్కు తోడు మహ్మద్ నవాజ్(9 బంతుల్లో 23 రన్స్- నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కు పాక్ కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే షాకిచ్చాడు. కివస్ టాపార్డర్ను కకావికలం చేశాడు. ఈ ఫాస్ట్బౌలర్ ధాటికి ఓపెనర్లు ఫిన్ అలెన్ 8, టిమ్ సెఫార్ట్ 0 వచ్చీ రాగానే మైదానం వీడగా.. విల్ యంగ్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో పాకిస్తాన్కు శుభారంభం లభించింది. కానీ.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరు తుపాన్ ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్కు మరోసారి ఘోర అవమానం తప్పలేదు. డారిల్ మిచెల్ 44 బంతుల్లో 72 పరుగులు(7 ఫోర్లు, 2 సిక్స్లు), గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 70 పరుగుల(5 ఫోర్లు, 3 సిక్సర్లు)తో అజేయంగా నిలిచి న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా కివీస్ 18.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆఖరి మ్యాచ్లో బరిలోకి దిగనుంది. ఇక పాక్తో నాలుగో టీ20లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన డారిల్ మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. Victory in Christchurch! #NZvPAK pic.twitter.com/5PZKPIzemF — BLACKCAPS (@BLACKCAPS) January 19, 2024 -
ఫలితాలు పట్టించుకోం.. బాబర్ గెలిపించలేకపోయాడు: షాహిన్ ఆఫ్రిది
"Results don't matter" - Shaheen Afridi's makes bold statement: పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న బాబర్ ఆజం బృందం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో చేపట్టిన ప్రక్షాళన చర్యల్లో భాగంగా బాబర్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్.. టీ20లకు షాహిన్ ఆఫ్రిది సారథులుగా నియమితులయ్యారు. ఇక మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ టీమ్ డైరెక్టర్ కమ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించి తనదైన మార్కు చూపేందుకు విఫలయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా హఫీజ్ మార్గదర్శనంలో మసూద్ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ టెస్టుల్లో 0-3తో వైట్వాష్కు గురైంది. ఈ ఘోర అవమానం నుంచి కోలుకోకముందే న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-3తో కోల్పోయింది. డునెడిన్ వేదికగా కివీస్తో బుధవారం జరిగిన మ్యాచ్లో 45 పరుగుల తేడాతో ఓడిపోయి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో పాక్ టీ20 జట్టు కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది ఓటమిపై స్పందిస్తూ.. ఫలితాలతో మాకు సంబంధం లేదంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Shaheen Afridi says result doesn't matter, effort of players matters 🤯 Do you agree with this statement? #NZvsPAK pic.twitter.com/Y69482v7ih — Farid Khan (@_FaridKhan) January 17, 2024 ఈ మేరకు..‘‘ మ్యాచ్ ఫలితాలతో మాకు పట్టింపు లేదు. మా ఆటగాళ్లు విజయం కోసం తగినంత ఎఫర్ట్ పెడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం. నాకు తెలిసి మా జట్టులోని ప్రతి ప్లేయర్ పూర్తి నిబద్ధతతో ఆడుతున్నారు. మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే బాబర్ ఫామ్లేమితో సతమతం కావడం లేదు. ఈ సిరీస్లో అతడు మూడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, జట్టుకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఇన్నింగ్స్ ఫినిష్ చేయలేకపోయాడు. అతడికి తోడుగా కనీసం ఒక్క బ్యాటర్ అయినా పట్టుదలగా నిలబడి ఉంటే బాగుండేది. ఈరోజు కూడా అలాగే జరిగింది. బాబర్తో పాటు ఇంకొక్కరు రాణించినా ఫలితం వేరేలా ఉండేది’’ అని షాహిన్ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్తో సిరీస్లో బాబర్ ఆజం ఇప్పటి వరకు మూడు మ్యాచ్లలో కలిపి 181 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. రెగ్యులర్ ఓపెనర్గా కాకుండా వన్డౌన్లో బరిలోకి దిగి ఈ మేరకు పరుగులు రాబట్టాడు. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
ఫిన్ అలెన్ సునామీ శతకం.. పాక్కు మరో ఘోర పరాభవం
పాకిస్తాన్ జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో చేతిలో (0-3తో టెస్ట్ సిరీస్ ఓటమి) భంగపడ్డ ఆ జట్టు.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో అంతకుమించిన అవమానాన్ని (0-3తో టీ20 సిరీస్ ఓటమి) ఎదుర్కొంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో పాక్ మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కోల్పోయి ఇంటాబయట అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది. వన్డే ప్రపంచకప్ నుంచి చెత్త ప్రదర్శనను కొనసాగిస్తున్న పాక్ క్రికెట్ జట్టును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని ఆ జట్టు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఫిన్ అలెన్ సునామీ శతకంతో (62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 137 పరుగులు) విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 224 పరుగుల భారీ స్కోర్ (7 వికెట్ల నష్టానికి) చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో అలెన్ మినహా టిమ్ సీఫర్ట్ (31), గ్లెన్ ఫిలిప్స్ (19) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అలెన్తో పాటు మరొక్కరు రాణించినా న్యూజిలాండ్ ఇంతకంటే భారీ స్కోర్ చేసేది. అలెన్ ధాటికి పాక్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) బెంబేలెత్తిపోయారు. ఈ ముగ్గురు 10కిపైగా ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 కోల్పోయి 179 పరుగులకు మాత్రమే పరిమతమై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ ఇన్నింగ్స్లో మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. టీ20ల్లో బాబర్కు ఇది హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ. పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24), ఫకర్ జమాన్ (19), ఆజం ఖాన్ (10), ఇఫ్తికార్ అహ్మద్ (1), మొహమ్మద్ నవాజ్ (28) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో సౌథీ 2, హెన్రీ, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రపు నాలుగో టీ20 జనవరి 19న క్రైస్ట్చర్చ్లో జరుగుతుంది. -
విధ్వంసం.. ఊచకోత.. ఎన్ని చెప్పినా తక్కువే, 16 సిక్స్లతో పరుగుల సునామీ
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్ సరసన నిలిచాడు. 2019లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో జజాయ్ 16 సిక్సర్లు బాదగా.. తాజాగా అలెన్ జజాయ్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో అరివీర భయంకర ఫామ్లో ఉన్న అలెన్.. డునెడిన్ వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 62 బంతుల్లో 16 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో విధ్వంసర శతకం (137) బాదాడు. అలెన్ తన సెంచరీని కేవలం 48 బంతుల్లోనే పూర్తి చేశాడు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అలెన్దే అత్యుత్తమ స్కోర్. దీనికి ముందు ఈ రికార్డు బ్రెండన్ మెక్కల్లమ్ (123) పేరిట ఉండింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. అలెన్ ఊచకోత ధాటికి నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో అలెన్ ఒక్కడే వన్ మ్యాన్ షో చేశాడు. టిమ్ సీఫర్ట్ (31) పర్వాలేదనిపించగా.. కాన్వే (7), డారిల్ మిచెల్ (8), చాప్మన్ (1), సాంట్నర్ (4) విఫలమయ్యారు. ఈ మ్యాచ్లో అలెన్ విధ్వంసం ఓ రేంజ్లో సాగింది. ఈ ఇన్నింగ్స్ గురించి విధ్వంసం.. ఊచకోత లాంటి ఎన్ని పదాలు వాడినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ టీ20ల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని విశ్లేషకులు కొనియాడుతున్నారు. ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్న ఫిన్ అలెన్ రెండో మ్యాచ్లో 74 (41 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు), తొలి టీ20లో 34 (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. మూడో మ్యాచ్లో అలెన్ విధ్వంసం ధాటికి పాక్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాహీన్ అఫ్రిది (4-0-43-1), హరీస్ రౌఫ్ (4-0-60-2), మొహమ్మద్ నవాజ్ (4-0-44-1) 10కిపైగా ఎకానమీ రేట్తో పరుగులు సమర్పించుకున్నారు. పాక్ బౌలర్లలో అలెన్ ధాటి నుంచి మొహమ్మద్ వసీం జూనియర్ (4-0-35-1), జమాన్ ఖాన్ (4-0-37-1) కాస్త తప్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసి, ఓటమి దిశగా సాగుతుంది. సైమ్ అయూబ్ (10), మొహమ్మద్ రిజ్వాన్ (24) ఔట్ కాగా.. బాబర్ ఆజమ్ (27), ఫకర్ జమాన్ (12) పోరాడుతున్నారు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి రెండు టీ20ల్లో ఓడింది. ఈ మ్యాచ్లో కూడా ఆ జట్టు ఓడితే మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ కివీస్ వశమవుతుంది. -
కేన్ మామకు ఏమైంది..? గుజరాత్ టైటాన్స్ ఆందోళన
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయాల కారణంగా ఇటీవలికాలంలో తరుచూ క్రికెట్కు దూరమవుతున్నాడు. ఐపీఎల్ 2023 సందర్భంగా కాలు విరగ్గొట్టుకున్న కేన్ మామ.. అష్టకష్టాలు పడి వన్డే వరల్డ్కప్కు అందుబాటులోకి వస్తే, అక్కడ కూడా గాయపడి పలు కీలక మ్యాచ్లకు దూరమయ్యాడు. తాజాగా ఆ గాయం నుంచి కూడా కోలుకుని స్వదేశంలో పాక్తో జరుగుతున్న టీ20 సిరీస్కు అందుబాటులోకి వస్తే, ఇక్కడ కూడా గాయపడి మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. హ్యామిల్టన్లో జరిగిన రెండో టీ20 సందర్భంగా గాయపడిన కేన్ మామ సిరీస్లోని మిగతా మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని క్రికెట్ న్యూజిలాండ్ ప్రకటించింది. రెండో టీ20లో మాంచి టచ్లో (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) ఉన్నప్పుడు కండరాల సమస్య కారణంగా అతను ఉన్నపళంగా మైదానాన్ని వీడాడు. స్కానింగ్ రిపోర్ట్ల్లో చిన్న సమస్యే అని తేలినప్పటికీ, టీ20 వరల్డ్కప్ దృష్ట్యా క్రికెట్ న్యూజిలాండ్ పాక్తో సిరీస్ మొత్తానికి అతన్ని దూరంగా ఉంచింది. పాక్తో మిగిలిన మ్యాచ్లకు కివీస్ సెలెక్టర్లు విల్ యంగ్ను కేన్కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు. కేన్ పరిస్థితి చూసి ఆందోళన చెందుతున్న గుజరాత్.. కేన్ తాజా పరిస్థితి చూసి అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా ఆందోళన చెందుతుంది. త్వరలో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కేన్ పూర్తిగా కోలుకుంటాడో లేదోనని టెన్షన్ పడుతుంది. ప్రస్తుతానికి కోలుకున్నా ఆతర్వాత జరిగే సిరీస్లు ఆడి దెబ్బలు తగిలించుకుని తమని ఇబ్బంది పెడాతాడేమోనని కలవర పడుతుంది. 33 ఏళ్లకే వయసు పైబడినట్లు కనిపిస్తున్న కేన్ పరిస్థితి గుజరాత్ టైటాన్స్ ఉలిక్కిపడుతుంది. ఇప్పటినుంచి కేన్కు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటే మంచిదని ఆలోచిస్తుంది. ఇదిలా ఉంటే, పాక్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో న్యూజిలాండ్ తొలి రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. మూడో టీ20 జనవరి 17న డునెడిన్ వేదికగా జరుగనుంది. -
సత్తా చాటిన అలెన్, మిల్నే.. పాక్ను చిత్తు చేసిన న్యూజిలాండ్
ఐదు మ్యాచ్లో టీ20 సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ పాకిస్తాన్ను వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడించింది. తొలి మ్యాచ్లో పర్యాటక జట్టును 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన కివీస్.. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 14) జరిగిన రెండో టీ20లో పాక్ను 21 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఫిన్ అలెన్ (41 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో అలెన్ మినహా ఎవరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. విలియమ్సన్ (26 రిటైర్డ్ హర్ట్), సాంట్నర్ (25), కాన్వే (20), డారిల్ మిచెల్ (17), గ్లెన్ ఫిలిప్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో తడబడిన పాక్.. 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కివీస్ పేసర్ ఆడమ్ మిల్నే (4-0-33-4) పాక్ పతనాన్ని శాశించగా.. సౌథీ, బెన్ సియర్స్, సోధి తలో రెండు వికెట్లతో రాణించారు. పాక్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (66), ఫకర్ జమాన్ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. షాహీన్ అఫ్రిది (22) రెండంకెల స్కోర్ చేశాడు. ఈ ముగ్గురు మినహా పాక్ ఆటగాళ్లు మొత్తం విఫలమయ్యారు. సైమ్ అయూబ్ 1, రిజ్వాన్ 7, ఇఫ్తికార్ అహ్మద్ 4, ఆజం ఖాన్ 2, ఆమిర్ జమాల్ 9, అబ్బాస్ అఫ్రిది 7, ఉసామా మిర్ 0, హరీస్ రౌఫ్ 2 నాటౌట్ పరుగులు చేశారు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 జనవరి 17న డెనెడిన్ వేదికగా జరుగుతుంది. -
ఫిన్ అలెన్ ఊచకోత.. పాక్ బౌలర్లపై మెరుపుదాడి
న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాటర్ ఫిన్ అలెన్ భీకర ఫామ్లో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడ్డాడు. స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేసిన అలెన్.. తాజాగా జరుగుతున్న రెండో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో 41 బంతులను ఎదుర్కొన్న అలెన్ 7 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ మార్కును కేవలం 24 బంతుల్లోనే అందుకున్న అలెన్ ఆతర్వాత కాస్త నెమ్మదించాడు. మరో భారీ షాట్కు ప్రయత్నించే క్రమంలో ఉసామా మిర్ అలెన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా పాక్ బౌలర్లను ఊచకోత కోసిన అలెన్.. క్రీజ్లో ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. అలెన్ ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టగా.. అబ్బాస్ అఫ్రిది 2, ఆమిర్ జమాల్, ఉసామా మిర్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే (15 బంతుల్లో 20; 3 ఫోర్లు), ఫిన్ అలెన్ కివీస్కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్కు 5.1 ఓవర్లలో 59 పరుగులు జోడించారు. కాన్వే ఔటయ్యాక బరిలోకి దిగిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేసిన అతను ఇన్నింగ్స్ 10 ఓవర్ తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. తొలి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన డారిల్ మిచెల్ 17 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. తొలి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన మార్క్ చాప్మన్ 4 పరుగులకే ఔటయ్యాడు. ఆడమ్ మిల్నే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్ 13, సాంట్నర్ 25 పరుగులు చేశారు. భారీ స్కోర్ దిశగా పయనిస్తున్న కివీస్ను హరీస్ రౌఫ్ 19వ ఓవర్లో దెబ్బకొట్టాడు. ఈ ఓవర్ 1, 2, 4 బంతులకు వికెట్లు పడగొట్టిన రౌఫ్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి కివీస్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. కాగా, ఈ సిరీస్లో కివీస్ తొలి మ్యాచ్లో పాక్ను 46 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. -
గప్టిల్ రికార్డు బద్దలు కొట్టిన బాబర్.. కోహ్లి, రోహిత్ తర్వాత అతడే!
New Zealand vs Pakistan, 1st T20I - Babar Azam Record: పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్గా రికార్డులకెక్కాడు. తద్వారా కివీస్ బ్యాటర్ మార్టిన్ గఫ్టిల్ను అధిగమించాడు. కెప్టెన్సీకి గుడ్బై టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్తో తొలి టీ20 సందర్భంగా బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాక్ కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన బాబర్ ప్రస్తుతం కేవలం ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఈ క్రమంలో టీ20 కొత్త సారథి షాహిన్ ఆఫ్రిది సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో భాగమయ్యాడు ఈ రైట్హ్యాండ్ బ్యాటర్. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో వన్డౌన్లో బ్యాటింగ్ చేసిన బాబర్ 35 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 57 పరుగులు సాధించాడు. గప్టిల్ రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో బాబర్ ఆజం అంతర్జాతీయ టీ20లలో 3538 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మార్టిన్ గప్టిల్ను దాటి మూడోస్థానానికి ఎగబాకాడు. తన 105వ మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. ఇక ఈ లిస్టులో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా బాబర్ ఇంకో 316 పరుగులు సాధిస్తే రోహిత్ను కూడా దాటేస్తాడు! అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు: 1. విరాట్ కోహ్లి(ఇండియా)- 115 మ్యాచ్లలో- 4008 రన్స్ 2. రోహిత్ శర్మ(ఇండియా)- 148 మ్యాచ్లలో- 3853 రన్స్ 3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 105 మ్యాచ్లలో- 3538 రన్స్ 4. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్)- 122 మ్యాచ్లలో- 3531 రన్స్ 5. పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)- 134 మ్యాచ్లలో- 3438 రన్స్. చదవండి: డారిల్ మిచెల్ ఊచకోత.. కివీస్ చేతిలో పాక్ చిత్తు! బాబర్ పోరాడినా.. చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు -
చరిత్ర సృష్టించిన కివీస్ పేసర్: ప్రపంచంలోనే ఏకైక బౌలర్గా రికార్డు
New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన షాహిన్ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో డారిల్ మిచెల్(27 బంతుల్లో 61- నాటౌట్), కెప్టెన్ విలియమ్సన్ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఏకైక బౌలర్గా రికార్డు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో టిమ్ సౌతీ.. మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) రూపంలో రెండు బిగ్ వికెట్లు తీశాడు. అబ్బాస్ ఆఫ్రిదిని అవుట్ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్గా నిలిచాడు. ఇక అబ్బాస్ తర్వాత హ్యారిస్ రవూఫ్ను పెవిలియన్కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్ విజయాన్ని ఖరారు చేశాడు. నంబర్ 2 ఎవరంటే ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్ ఫాస్ట్బౌలర్ టిమ్ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్ స్పిన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్ నుంచి ఇష్ సోధి(127), మిచెల్ సాంట్నర్(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం. చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్ శర్మ -
డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బాబర్ పోరాటం వృథా
న్యూజిలాండ్ పర్యటనను పాకిస్తాన్ పరాజయంతో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. అక్లాండ్ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వేను డకౌట్ చేసి శుభారంభం అందుకుంది. అయితే, మరో ఓపెనర్ ఫిన్ అలెన్(35), వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ విలియమ్సన్(57) ఆ ఆనందాన్ని ఎక్కువసేపు నిలవనీయలేదు. ఇక నాలుగో నంబర్లో బ్యాటింగ్కు దిగిన డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కొరకరాని కొయ్యలా మారి విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. మిగిలిన వాళ్లలో మార్క్ చాప్మప్ 26(11 బంతుల్లో) రన్స్తో రాణించాడు. బ్యాటర్లంతా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజం ఒక్క హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఈ వన్డౌన్ బ్యాటర్ మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించాడు. మిగతా వాళ్లలో ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(27), మహ్మద్ రిజ్వాన్(25), ఇఫ్తికర్ అహ్మద్(24) మాత్రమే 20 అంకెల స్కోరు చేశారు. రిజ్వాన్, ఇఫ్తికర్ రూపంలో కీలక వికెట్లు తీసిన టిమ్ సౌతీ.. అబ్బాస్ ఆఫ్రిది(1), హారిస్ రవూఫ్(0)లను త్వరత్వరగా పెవిలియన్కు పంపాడు. మొత్తంగా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకుని పాక్ను కోలుకోని దెబ్బకొట్టాడు. మిగతా వాళ్లలో ఆడం మిల్నే రెండు, బెన్ సియర్స్ రెండు, ఇష్ సోధి ఒక వికెట్ దక్కించుకున్నారు. కివీస్ బౌలర్ల విజృంభణతో 18 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్తాన్ 46 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక పాకిస్తాన్ కెప్టెన్గా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్లో అతడు బౌలర్గా, సారథిగానూ విఫలమయ్యాడు. నాలుగు ఓవర్ల కోటాలో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన ఆఫ్రిది.. కెప్టెన్గా అరంగేట్ర మ్యాచ్లో ఓటమిని చవిచూశాడు. మరోవైపు.. కివీస్ను గెలిపించిన డారిల్ మిచెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది’ మ్యాచ్ అవార్డు దక్కింది. -
NZ VS PAK 1st T20: డారిల్ మిచెల్ ఊచకోత
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆక్లాండ్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ (27 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి కివీస్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించగా.. 417 రోజుల తర్వాత టీ20 మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో (57) రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ఫిన్ అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో మార్క్ చాప్మన్ (11 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్లో డెవాన్ కాన్వే, ఐష్ సోధి డకౌట్లు కాగా.. గ్లెన్ ఫిలిప్స్ 19, ఆడమ్ మిల్నే 10 పరుగులు చేశారు. మ్యాట్ హెన్రీ 0, టిమ్ సౌథీ 6 పరుగులతో అజేయంగా నిలిచారు. డారిల్ మిచెల్ క్రీజ్లో ఉన్న సమయంలో కివీస్ 250కి పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే అతను ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ మెరుపు ఇన్నింగ్స్లు ఆడకపోవడంలో కివీస్ 226 పరుగులతో సరిపెట్టుకుంది. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4-0-46-3), ఆమిర్ జమాల్ (4-0-56-0), ఉసామా మిర్లను (4-0-51-0) కివీస్ బ్యాటర్లు ఆటాడుకున్నారు. ముఖ్యంగా షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్లకు చుక్కలు చూపించారు. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్.. షాహీన్ అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో 2 సిక్స్లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. పాకిస్తాన్ను అబ్బాస్ అఫ్రిది (4-0-34-3), హరీస్ రౌఫ్ (4-0-34-2) కాపాడారు. వీరిద్దరు కాస్త పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు కూడా తీశారు. -
NZ Vs PAK 1st T20: షాహీన్ అఫ్రిదికి చుక్కలు చూపించిన కివీస్ ఓపెనర్
పాకిస్తాన్ స్టార్ పేసర్, ఆ జట్టు కొత్త కెప్టెన్ షాహీన్ అఫ్రిదికి న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ చుక్కలు చూపించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆక్లాండ్ వేదికగా ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్లో అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అలెన్ ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్ తొలి బంతిని సిక్సర్గా మలిచిన అలెన్.. ఆతర్వాత హ్యాట్రిక్ బౌండరీలు, ఆ వెంటనే సిక్సర్ బాదాడు. ఆఖరి బంతి డాట్ బాల్ అయ్యింది. ఆమిర్ జమాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో రెండో బంతిని సైతం సిక్సర్గా మలిచిన అలెన్.. ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టిస్తాడని అంతా అనుకున్నారు. అయితే ఆ తర్వాతి ఓవర్లో మరో అఫ్రిది (అబ్బాస్ అఫ్రిది) అలెన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) జోరుకు అడ్డుకట్ట వేసి అతన్ని పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 11.2 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. అలెన్, డెవాన్ కాన్వే (0) ఔట్ కాగా.. కేన్ విలియమ్సన్ (57), డారిల్ మిచెల్ (31) క్రీజ్లో ఉన్నారు. అబ్బాస్ అఫ్రిది బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాది విలియమ్సన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అబ్బాస్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలకు తలో వికెట్ దక్కింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 417 రోజుల తర్వాత అంతర్జాతీయ టీ20ల బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. -
పాకిస్తాన్తో తొలి టీ20కి ముందు న్యూజిలాండ్కు భారీ షాక్
ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జనవరి 12) జరిగే తొలి టీ20కి ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్న సాంట్నర్ జట్టులో లేకపోవడం కివీస్కు పెద్ద లోటు. సాంట్నర్ను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాల్సిందిగా ఆదేశించినట్లు క్రికెట్ న్యూజిలాండ్ పేర్కొంది. కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్లో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి దేశంలో ఎలాంటి అంక్షలు లేనప్పటికీ.. ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. 🚨NEWS ALERT🚨: Mitchell Santner has been ruled out of the first T20I against Pakistan after testing positive for Covid. pic.twitter.com/lCFttMZzpQ — CricTracker (@Cricketracker) January 12, 2024 ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 11: 30 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ ఫుల్టైమ్ టీ20 జట్టు కెప్టెన్గా షాహీన్ అఫ్రిదికి ఇది తొలి మ్యాచ్ కాగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ చాలాకాలం తర్వాత టీ20 జట్టు పగ్గాలు చేపట్టాడు. న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టిమ్ సీఫెర్ట్ (వికెట్కీపర్), డెవాన్ కాన్వే, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, బెన్ సియర్స్ పాకిస్తాన్: మొహ్మమద్ రిజ్వాన్ (వికెట్కీపర్), షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, మహ్మద్ నవాజ్, హరీస్ రౌఫ్, జమాన్ ఖాన్, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, అబ్రర్ అహ్మద్, సాహిబ్జాదా ఫర్హాన్, అబ్బాస్ అఫ్రిది, హసీబుల్లా ఖాన్ -
ధన్యవాదాలు.. పాక్ క్రికెట్తో ప్రయాణం ముగిసిపోయింది
Pakistan Cricket Team: పాకిస్తాన్ హై పర్ఫామెన్స్ కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్తో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. ఐదేళ్లకు పైగా మూడు భిన్న పాత్రలు పోషించానన్న బ్రాడ్బర్న్.. ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ గ్రాంట్ బ్రాడ్బర్న్ను రెండేళ్ల కాలానికి గానూ తొలుత హెడ్కోచ్గా నియమించుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మే, 2023లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో పాక్ జట్టు కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. తన మార్కు చూపిస్తున్న హఫీజ్ ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ప్రక్షాళన చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా కోచింగ్ సిబ్బంది ఫోర్ట్పోలియోలు మార్చాడు. ఈ క్రమంలో బ్రాడ్బర్న్ హై పర్ఫామెన్స్ కోచ్గా బాధ్యతలు స్వీకరించగా.. ఇటీవల అతడి స్థానంలో పాక్ మాజీ ఆల్రౌండర్ యాసిర్ అరాఫత్ను నియమించాడు. పాక్తో ప్రయాణం ముగిసిపోయింది ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో పాకిస్తాన్ టీ20 సిరీస్ నుంచి యాసిర్ సేవలను వినియోగించుకోనున్నట్లు పీసీబీ తెలిపింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బ్రాడ్బర్న్ తాజాగా ప్రకటన విడుదల చేశాడు. ‘‘చాలా చాలా ధన్యవాదాలు. పాకిస్తాన్ క్రికెట్తో అద్భుతమైన అధ్యాయం ముగిసిపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు, కోచ్లు, సిబ్బందితో పనిచేసినందుకు గర్వంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’’ అని గ్రాంట్ బ్రాడ్బర్న్ ఎక్స్ వేదికగా నోట్ షేర్ చేశాడు. అతడు ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లామోర్గాన్ హెడ్కోచ్గా నియమితుడైనట్లు సమాచారం. కాగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం పాకిస్తాన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్తో కెప్టెన్గా షాహిన్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించనుండగా.. వైస్ కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్ నియమితుడయ్యాడు. Bohat Bohat Shukriya 🇵🇰 pic.twitter.com/n0k0pagdtb — Grant Bradburn (@Beagleboy172) January 7, 2024 -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్.. పాకిస్తాన్కు బిగ్ షాక్!?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో చిత్తు అయిన పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అహ్మద్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడు. భారత్ వేదికగా జరిగిన వరల్డ్కప్లో ప్రాక్టీస్ చేస్తుండగా అహ్మద్ గాయపడ్డాడు. అయినప్పటికి అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు పాకిస్తాన్ జట్టు మేనెజ్మెంట్ తీసుకు వెళ్లింది. కానీ ఒక్క మ్యాచ్లో కూడా అహ్మద్ ఆడలేదు. అయితే న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సమయానికి అతడు కోలుకుంటాడని సెలెక్టర్లు భావించారు. ఈ క్రమంలో కివీస్తో సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో సెలక్టర్లు అహ్మద్కు చోటు కల్పించారు. కానీ అతడు కోలుకోవడానికి మరింత సమయం పట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్తో సిరీస్కు కూడా అతడు దూరం కావడం దాదాపు ఖాయమైంది. కాగా అతడి స్ధానాన్ని ఇక న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్తో తలపడనుంది. జనవరి 12న ఆక్లాండ్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్తో టీ20లకు పాక్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్-కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), మహ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్ మరియు జమాన్ ఖాన్. చదవండి: #Shweta Sehrawat: 242 పరుగులతో విధ్వంసం.. 31 ఫోర్లు, 7 సిక్స్లు! ఎవరీ సెహ్రావత్? -
పాక్ జట్టేమీ నేపాల్కు వెళ్లడం లేదు.. వాళ్లకు రెస్ట్ ఎందుకు?
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్ గడ్డపై జనవరి 12 నుంచి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్ ద్వారానే పాక్ టీ20 జట్టు కొత్త కెప్టెన్ షాహిన్ ఆఫ్రిది సారథిగా తన ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి సీనియర్లు అతడి నాయకత్వంలో తొలిసారి మైదానంలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో పీసీబీ సెలక్షన్ కమిటీ కన్సల్టెంట్, మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్కు వింత ప్రశ్న ఎదురైంది. స్థానిక టీవీ చానెల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో యాంకర్.. ‘‘సీనియర్లు బాబర్ ఆజం, రిజ్వాన్లకు న్యూజిలాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా విశ్రాంతినివ్వవచ్చు కదా?’’ అని అక్మల్ను అడిగారు. ఇందుకు అతడు బదులిస్తూ.. ‘‘సెలక్షన్ కమిటీలోని సభ్యులు కానీ.. మేనేజ్మెంట్గానీ న్యూజిలాండ్ సిరీస్లో బాబర్, రిజ్వాన్లకు రెస్ట్ ఇవ్వాలని అనుకోలేదు. ఎందుకంటే పాక్ జట్టు వెళ్తోంది న్యూజిలాండ్కు.. నేపాల్కు కాదు. అలాంటి పటిష్ట జట్టుతో పోటీపడేటప్పుడు సీనియర్లకు విశ్రాంతినివ్వడం ఏమిటి? అసలు ఎవరైనా అలాంటి ఆలోచన చేస్తారా?’’ అంటూ కమ్రాన్ అక్మల్ కౌంటర్ వేశాడు. ఇక షాన్ మసూద్ కెప్టెన్సీ గురించి ప్రస్తావనకు రాగా.. ‘‘కెప్టెన్గా లేదంటే కోచింగ్ సిబ్బందిగా కొత్తగా నియమితులైన వాళ్లకు.. తమను తాము నిరూపించుకునేందుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే వారి పనితీరును అంచనా వేసే అవకాశం ఉంటుంది’’ అని అక్మల్ పేర్కొన్నాడు. కాగా భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో ఘోర వైఫల్యం అనంతరం పాక్ కెప్టెన్గా బాబర్ ఆజం వైదొలిగాడు. అతడి స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లు అయ్యారు. ఈ క్రమంలో మసూద్ సారథ్యంలో తొలిసారి ఆసీస్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ తొలి టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడి విమర్శలు మూటగట్టుకుంది. ఇక డిసెంబరు 26 నుంచి రెండో టెస్టు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ ముగించుకుని తదుపరి న్యూజిలాండ్కు పయనం కానుంది. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు పాకిస్తాన్ జట్టు షాహిన్ ఆఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, జమాన్ ఖాన్. చదవండి: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం! ఆటకు దూరం.. కారణం? -
పాకిస్తాన్ జట్టు ప్రకటన.. కెప్టెన్గా షాహీన్ అఫ్రిది
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య జట్టుతో పాక్ 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ క్రమంలో కివీస్తో టీ20 సిరీస్కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్పేసర్ షాహీన్ అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. వన్డే వరల్డ్కప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీ20ల్లో పాక్ కొత్త కెప్టెన్గా షాహీన్ అఫ్రిదిని వహాబ్ రియాజ్తో కూడిన సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అఫ్రిదికి కెప్టెన్గా ఇదే తొలి సిరీస్. ఇక కివీస్తో సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ గాయం కారణంగా దూరంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హ్యారీస్ను సెలక్టర్లు తప్పించారు. అదే విధంగా స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్, హసీబుల్లా ఖాన్కు తొలి సారి పాక్ టీ20 జట్టులో చోటు దక్కింది. న్యూజిలాండ్తో టీ20లకు పాక్ జట్టు: షాహీన్ అఫ్రిది (కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసీబుల్లా ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆజం ఖాన్, అమీర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ నవాజ్, అబ్రర్ అహ్మద్, రౌఫ్, జమాన్ ఖాన్. చదవండి: IPL 2024-SRH Captain: సన్రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. !? -
గెలుపు జోష్లో ఉన్న పాకిస్తాన్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ
వన్డే ప్రపంచకప్-2023 కీలక మ్యాచ్లో న్యూజిలాండ్పై విజయం సాధించిన పాకిస్తాన్కు ఐసీసీ బిగ్ షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్లో 10 శాతం కోత విధించారు. నిర్ధేశిత సమయం పూర్తియ్యే సరికి పాకిస్తాన్ తమ కోటా ఓవర్ల కంటే రెండు ఓవర్లు వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ ఫైన్ విధించింది. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కూడా నేరాన్ని అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ కోత విధుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్పై డక్వర్త్ లూయిస్ (డీఎల్ఎస్) పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. ఈ విజయంతో పాక్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటి డక్వర్త్ లూయిస్ లెక్కల ప్రకారం మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పాక్ 21 పరుగులు ముందంజలో ఉంది. దీంతో పాక్ను విజేతగా నిర్ణయించారు. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెప్టెన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. -
న్యూజిలాండ్పై పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసులో
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్కు పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్పై 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160/1 వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గముఖం పట్టడంతో మ్యాచ్ను 41 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ టార్గెట్ను 342 పరుగులు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి పాకిస్తాన్కు 19. 3 ఓవర్లలో 182 పరుగులు అవసరమయ్యాయి. అయితే మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపిటికే మళ్లీ వరుణుడు రీ ఎంట్రీ ఇచ్చాడు. రెండో సారి ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 179 పరుగులు చేసింది. అప్పటికే న్యూజిలాండ్ డీఎల్ఎస్ ప్రకారం.. 21 పరుగుల ముందంజలో ఉంది. ఈ క్రమంలో వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో పాకిస్తాన్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. జమాన్ సూపర్ ఇన్నింగ్స్.. కాగా పాకిస్తాన్ విజయంలో ఆ జట్టు ఓపెనర్ ఫఖార్ జమాన్ కీలక పాత్ర పోషించాడు. జమాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 81 బంతుల్లో 8 ఫోర్లు ,11 సిక్స్లతో 126 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ బాబర్ ఆజం(66 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్కప్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో జమాన్ కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్కప్లో కింగ్స్టన్ ఓవెల్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 95 బంతుత్లో నజీర్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్తో నజీర్ రికార్డును జమాన్ బ్రేక్ చేశాడు. అదే విధంగా వరల్డ్కప్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన నజీర్ రికార్డును కూడా జమాన్ బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మ్యాచ్లో నజీర్ 8 సిక్స్లు బాదాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో మ్యాచ్లో 9 సిక్స్లు కొట్టిన జమాన్.. నజీర్ను అధిగమించాడు. మ్యాచ్కు అంతరాయం.. కాగా చెన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఫఖార్ జమాన్(106), బాబర్ ఆజం(42) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో వసీం మూడు వికెట్లు సాధించగా.. రవూఫ్, ఇఫ్తికర్, హసన్ అలీ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: World Cup 2023: హార్దిక్ పాండ్యా అవుట్.. కెఎల్ రాహుల్కి ప్రమోషన్! వన్డే వరల్డ్ కప్లో View this post on Instagram A post shared by ICC (@icc) -
'ఇది నిజంగా చెత్త నిర్ణయం'.. బాబర్ అజంపై అక్తర్ మండిపాటు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు తేలిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. తొలుత న్యూజిలాండ్ను బ్యాటింగ్ అహ్హనించాడు. మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో వసీం మూడు వికెట్లు సాధించగా.. రవూఫ్, ఇఫ్తికర్, హసన్ అలీ ఒక్క వికెట్ సాధించారు. బాబర్ ఆజంపై విమర్శలు.. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదటి ఫీల్డింగ్ ఎంచుకున్న బాబర్ ఆజంపై పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ విమర్శల వర్షం కురిపించాడు. "డూ ఆర్ డై మ్యాచ్లో టాస్ గెలిచి పాక్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కెప్టెన్ ఎందుకు బౌలింగ్ ఎంచుకున్నారో నాకు అర్ధం కావడం లేదు. ప్రత్యర్ధి న్యూజిలాండ్ జట్టులో కీలక బౌలర్లు గాయాలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అటువంటిప్పుడు ఎందుకు ఈ చెత్త నిర్ణయం. అంతేకాకుండా బెంగళూరు పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తోంది. ఇటువంటి వికెట్పై మొదట బౌలింగ్ చేయాలనుకోవడం నిజంగా చెత్త నిర్ణయమని" అక్తర్ ట్వీట్ చేశాడు. చదవండి: World Cup 2023: షాహీన్ అఫ్రిది అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్కప్ చరిత్రలోనే -
షాహీన్ అఫ్రిది అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్కప్ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్గా అఫ్రిది నిలిచాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్తో జరగుతున్న మ్యాచ్లో అఫ్రిది తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 90 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా ఈ చెత్త రికార్డును అఫ్రిది తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లు మొత్తం బౌలింగ్ చేసిన అఫ్రిది ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. కాగా ఇప్పటి వరకు ఈ చెత్త రికార్డు తన సహచర పేసర్ హసన్ అలీ పేరిట ఉండేది. 2019 వన్డే ప్రపంచకప్లో భారత్తో మ్యాచ్లో అలీ ఏకంగా 84 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే న్యూజిలాండ్తో మ్యాచ్లో హ్యారీస్ రవూఫ్ కూడా చెత్త బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. తన 10 ఓవర్ల కోటాలో 85 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో రవూఫ్ కూడా హసన్ అలీని దాటేశాడు. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో అఫ్రిది తర్వాత రవూఫ్ ఉన్నాడు. చెలరేగిన కివీస్ బ్యాటర్లు.. కాగా పాకిస్తాన్తో మ్యాచ్లో కివీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. చదవండి: WC 2023: సెంచరీతో చెలరేగిన రచిన్.. సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా -
పాకిస్తాన్ బౌలింగ్ను చిత్తు చేసి.. భారీ స్కోరుతో రికార్డులు సృష్టించిన న్యూజిలాండ్
వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్తో మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. పాక్ పేసర్ల బౌలింగ్ను ఓ ఆటాడుకున్న కివీస్ బ్యాటర్లు జట్టుకు రికార్డు స్థాయి స్కోరు అందించారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో హసన్ అలీ కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వేను 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల కోసం ప్రయత్నించిన పాక్ బౌలింగ్ విభాగానికి.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర, కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) రచిన్ 108, కేన్ విలియమ్సన్ 95 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ జోడీని ఇఫ్తికార్ అహ్మద్ విడదీసినా అప్పటికే భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. ఇక మిగిలిన వాళ్లలో డారిల్ మిచెల్ 29, మార్క్ చాప్మన్ 39, గ్లెన్ ఫిలిప్స్ 41, మిచెల్ శాంట్నర్ 26 పరుగులు(నాటౌట్) సాధించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 401 పరుగులు స్కోరు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక స్కోరు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. అదే విధంగా.. వరల్డ్కప్ ఈవెంట్లో సౌతాఫ్రికా(3 సార్లు) తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాతో కలిసి 400+ స్కోరు నమోదు చేసిన నాలుగో జట్టుగా అవతరించింది. అంతేకాదు.. వన్డేల్లో పాకిస్తాన్పై అత్యధిక స్కోరు సాధించిన రెండో జట్టుగా కివీస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఇంగ్లండ్ పాక్తో 2016 నాటి మ్యాచ్లో 444/3 స్కోరు నమోదు చేసింది. వీటితో పాటు మరో అరుదైన ఘనతను కూడా న్యూజిలాండ్ జట్టు తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్కప్ చరిత్రలో పాకిస్తాన్ మీద అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
సెంచరీతో చెలరేగిన రచిన్.. సచిన్ రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
ICC ODI WC 2023- Pak Vs NZ: వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్తో మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సెంచరీతో దుమ్ములేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్ల వర్షం కురిపించాడు. పాక్ బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ.. సంపూర్ణ ఆధిపత్యం కనబరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ‘సొంత ప్రేక్షకులకు’ కావాల్సినంత వినోదం పంచుతూ .. ఏకంగా 15 బౌండరీలు బాదాడీ భారత మూలాలున్న కివీస్ క్రికెటర్. ఇక పాక్తో మ్యాచ్లో మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న రచిన్ రవీంద్ర 108 పరుగులు సాధించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా తద్వారా భారత్ వేదికగా ప్రపంచకప్-2023లో మూడో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. పాతికేళ్ల వయసులోపే వరల్డ్కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు బాదిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. కాగా రచిన్ 23 ఏళ్ల 351 రోజుల వయసులో ఈ ఫీట్(3 శతకాలు) సాధించగా.. సచిన్ టెండుల్కర్ 22 ఏళ్ల 313 రోజుల వయసులో ప్రపంచకప్లో రెండు సెంచరీలు చేశాడు. కివీస్ తరఫున తొలి బ్యాటర్గా సచిన్ రికార్డు బ్రేక్ చేయడంతో న్యూజిలాండ్ తరఫున అరుదైన ఘనత కూడా సాధించాడు రచిన్ రవీంద్ర. సింగిల్ వరల్డ్కప్ ఎడిషన్లో అత్యధిక శతకాలు(3) బాదిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. గతంలో గ్లెన్ టర్నర్ 1975 వరల్డ్కప్లో రెండు, మార్టిన్ గప్టిల్ 2015లో రెండు, 2019లో కేన్ విలిమయ్సన్ రెండు శతకాలు సాధించారు. కాగా ప్రస్తుత ప్రపంచకప్ ఎడిషన్లో రచిన్ రవీంద్ర తొలుత ఇంగ్లండ్.. తర్వాత ఆస్ట్రేలియా.. తాజాగా పాకిస్తాన్పై సెంచరీలు నమోదు చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: వచ్చీ రాగానే.. చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్..
ICC WC 2023- Pak vs NZ: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోకి తిరిగి వచ్చీ రాగానే అరుదైన రికార్డుతో మెరిశాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచకప్ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్- పాకిస్తాన్ పోటీకి దిగాయి. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్లకూ శనివారం నాటి మ్యాచ్ కీలకంగా మారింది. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో పైచేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్తో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే(35) అవుట్ కావడంతో పదకొండవ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో పద్నాలుగో ఓవర్ మొదటి బంతికి.. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో ఫోర్ బాదిన విలియమ్సన్.. మరుసటి బాల్కు సింగిల్ తీశాడు. తద్వారా ప్రపంచకప్ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. View this post on Instagram A post shared by ICC (@icc) కివీస్ తరఫున సరికొత్త చరిత్ర.. తొలి బ్యాటర్గా న్యూజిలాండ్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా నిలిచాడు. వరల్డ్కప్లో 24 ఇన్నింగ్స్లోనే కేన్ విలియమ్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక ఓవరాల్గా ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. కాగా బొటనవేలి గాయం కారణంగా కేన్ ఇన్నాళ్లూ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో కివీస్ 16 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు సాధించింది. వరల్డ్కప్ టోర్నీలో తక్కువ ఇన్నింగ్స్లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు 19 - డేవిడ్ వార్నర్/ రోహిత్ శర్మ 20 - సచిన్ టెండూల్కర్/ ఏబీ డివిలియర్స్ 21 - వివ్ రిచర్డ్స్/ సౌరవ్ గంగూలీ 22 - మార్క్ వా / హెర్షల్ గిబ్స్ 23 - తిలకరత్నే దిల్షాన్ 24 - కేన్ విలియమ్సన్*. చదవండి: అయ్యర్ భారీ సిక్సర్! ఆమె రావడం మంచిదైంది.. కానీ! ప్రతిభను గుర్తించరా? -
WC 2023: టాస్ గెలిచిన పాకిస్తాన్.. న్యూజిలాండ్కు గుడ్న్యూస్!
ICC Cricket World Cup 2023- New Zealand vs Pakistan: వన్డే వరల్డ్కప్-2023 సెమీస్ రేసులో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్- పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అందుకే తొలుత బౌలింగ్ సెమీ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘పిచ్ తేమగా ఉంది. కాబట్టి తొలుత బౌలింగ్ చేస్తే మాకు సానుకూలంగా ఉంటుంది. మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయడం సాధ్యపడుతుంది’’ అని తన నిర్ణయానికి గల కారణం వెల్లడించాడు. టాస్ గెలిచిన పాకిస్తాన్ (PC: ICC) హసన్ అలీ తుదిజట్టులోకి అదే విధంగా కివీస్తో మ్యాచ్లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు బాబర్ పేర్కొన్నాడు. ఉసామా మిర్ స్థానంలో హసన్ అలీ తుదిజట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. ఇక వ్యక్తిగతంగా తన ఫామ్ పట్ల సంతృప్తిగానే ఉన్నానన్న బాబర్ ఆజం.. భారీ స్కోర్లు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. కివీస్కు గుడ్న్యూస్ ఇక పాకిస్తాన్తో కీలక మ్యాచ్ నేపథ్యంలో న్యూజిలాండ్కు శుభవార్త అందింది. బొటనవేలి గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్లకు దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తిరిగి జట్టుతో కలిశాడు. టాస్ సందర్భంగా కేన్ మామ మాట్లాడుతూ.. తమ తుదిజట్టులో రెండు మార్పులు చేశామని తెలిపాడు. విల్ యంగ్ స్థానంలో తాను.. మ్యాచ్ హెన్రీ స్థానంలో ఇష్ సోధి వచ్చినట్లు వెల్లడించాడు. తుది జట్లు: పాకిస్తాన్: అబ్దుల్లా షఫీక్, ఫకార్ జమాన్, బాబర్ అజామ్(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, సౌద్ షకీల్, ఆఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, హారిస్ రౌఫ్ న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్. చదవండి: WC 2023: కీలక సమయంలో టీమిండియాకు భారీ షాక్.. ఐసీసీ ప్రకటన! అతడికి మాత్రం.. -
వరల్డ్కప్లో న్యూజిలాండ్కు భారీ షాక్..
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో హెన్రీ తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆట మధ్యలోనే 5 ఓవర్లు బౌలింగ్ చేసి మైదానం వీడి వెళ్లాడు. అతడి బౌలింగ్ కోటాను జెమ్మీ నీషమ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హెన్రీ బ్యాటింగ్కు వచ్చినప్పటికీ పరుగులు తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు కివీస్ వైద్యబృందం వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడు టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. హెన్రీ స్ధానాన్ని కైల్ జేమీసన్తో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. జేమీసన్ ఇప్పటికే జట్టుతో చేరాడు. కాగా ఈ మెగా టోర్నీలో భాగంగా కివీస్ నవంబర్ 4న బెంగళూరు వేదికగా పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి తమ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్కు కూడా కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: WC 2023: కపిల్ దేవ్, ధోనికి సాధ్యం కాలేదు! రోహిత్కు కలిసొచ్చింది.. అరుదైన రికార్డు -
PAK vs NZ: ఉప్పల్ స్టేడియంలో పాక్, న్యూజిల్యాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ (ఫోటోలు)
-
World Cup 2023: పాక్తో మ్యాచ్.. రీఎంట్రీలో సత్తా చాటిన కేన్ మామ
ఐపీఎల్ 2023 సందర్భంగా గాయపడి, ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీలో సత్తా చాటాడు. వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్లో వన్డౌన్లో బరిలోకి దిగిన కేన్ మామ అదిరిపోయే అర్ధసెంచరీతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్లో 50 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. ఫలితంగా పాక్ నిర్ధేశించిన 346 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా న్యూజిలాండ్ ముందుకు సాగుతుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రచిన్ రవీంద్ర ఎవరూ ఊహించని విధంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రచిన్ 66 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్ సాయంతో 88 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ (కాన్వే (0)) ఏమాత్రం తడబడకుండా లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. 21 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 159/1గా ఉంది. రచిన్కు జతగా డారిల్ మిచెల్ (9) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించారు. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. -
World Cup 2023: న్యూజిలాండ్తో మ్యాచ్.. పాక్ భారీ స్కోర్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న వరల్డ్కప్ వార్మప్ గేమ్లో పాక్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో ఫెర్గూసన్ పొదుపుగా బౌల్ చేయడంతో పాక్ 345 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ ఓవర్లో పాక్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఓ వికెట్ కోల్పోయింది. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 263 పరుగులు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
World Cup 2023: న్యూజిలాండ్తో మ్యాచ్.. సెంచరీతో కదంతొక్కిన రిజ్వాన్
పాక్ స్టార్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. వరల్డ్కప్ 2023 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో రిజ్వాన్ 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 103 పరుగులు చేసి రిటైర్డ్ అయ్యాడు. రిజ్వాన్తో పాటు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా రాణించాడు. బాబర్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ మెరుపు ఇన్నింగ్స్లతో కదంతొక్కడంతో ఈ మ్యాచ్లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 42 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 257/4గా ఉంది. సౌద్ షకీల్ (36), అఘా సల్మాన్ (10) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండానే కొనసాగుతుంది. మరోవైపు ఇవాళే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక (68), ధనంజయ డిసిల్వ (55) అర్ధసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ 3, సకీబ్, షొరీఫుల్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో వికెట్ పడగొట్టారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. -
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే ఇరగదీసిన బాబర్ ఆజమ్
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు. వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్లో బాబర్ చెలరేగిపోయాడు. 84 బంతులత్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బాబర్తో పాటు మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న మొహమ్మద్ రిజ్వాన్ సైతం భారత్లో ఆడిన తన తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించడంతో వార్మప్ గేమ్లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 32 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. రిజ్వాన్ (62), సౌద్ షకీల్ (5) క్రీజ్లో ఉన్నారు. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండా కొనసాగుతుంది. మరోవైపు ఇవాలే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక.. 40 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 202 పరగులు చేసింది. ధనంజయ డిసిల్వ (45), కరుణరత్నే క్రీజ్లో ఉన్నారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
World Cup Warm Up Matches: బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్, శ్రీలంక
భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్ 2023 వార్మప్ మ్యాచ్లు ఇవాల్టి (సెప్టెంబర్ 29) నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవాళ మొత్తం మూడు మ్యాచ్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్.. గౌహతి వేదికగా శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్-సౌతాఫ్రికా జట్ల మధ్య తివేండ్రం వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతుంది. తివేండ్రంలో భారీ వర్షం పడుతుండటంతో టాస్ కూడా పడలేదు. మూడు మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ అయ్యాయి. తొలి వికెట్ కోల్పోయిన పాక్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి ఇమామ్ ఉల్ హాక్ (1) ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత పాక్ స్కోర్ 31/1గా ఉంది. అబ్దుల్లా షఫీక్ (12), బాబర్ ఆజమ్ (16) క్రీజ్లో ఉన్నారు. ధాటిగా ఆడుతున్న లంక ఓపెనర్లు.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక థాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించింది. ఓపెనర్లు పథుమ్ నిస్సంక (25), కుశాల్ పెరీరా (21) వేగంగా పరుగులు సాధిస్తున్నారు. 8 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 46/0గా ఉంది. పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, మొహమ్మద్ వసీం జూనియర్, షాహీన్ అఫ్రిది, ఉసామా మిర్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, ఐష్ సోధి, టిమ్ సౌథీ శ్రీలంక: దసున్ షనక(కెప్టెన్), కుశాల్ మెండిస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరణ, లహిరు కుమార, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, దిల్షన్ మధుశంక బంగ్లాదేశ్: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీం, లిటన్ దాస్, నజ్ముల్ హొసేన్ షాంటో, మెహిది హసన్ మీరజ్, తౌహిద్ హ్రిదోయ్,తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షొరీఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్, తంజిమ్ షకీబ్, తంజిద్ తమీమ్, మహ్మదుల్లా రియాద్ ఆఫ్ఘనిస్తాన్: హస్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, రియాజ్ హసన్, నజీబుల్లా జద్రాన్, రెహ్మాత్ షా, మొహమ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలికిల్, అబ్దుల్ రహ్మాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హాక్ ఫారూకీ, నవీన్ ఉల్ హాక్ సౌతాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, రస్సీ వాన్ డర్ డస్సెన్, మార్కో జన్సెన్, అండిల్ ఫెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, గెరాల్డ్ కొయెట్జీ, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబాడ, తబ్రేజ్ షంషి -
పాకిస్తాన్ నెట్బౌలర్గా హైదరాబాద్ కుర్రాడు.. ఎవరంటే?
వన్డే ప్రపంచకప్-2023కు రంగం సిద్దమైంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. కాగా ప్రధాన టోర్నీ ప్రారంభానికి ముందు వార్మప్ మ్యాచ్లు ఆడేందుకు సన్నద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు ఈ సన్నహాక మ్యాచ్లు జరగనున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్లకు హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి వేదికలగా మారనున్నాయి. పాకిస్తాన్ నెట్బౌలర్గా హైదరాబాద్ కుర్రాడు ఇక వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు హైదరాబాద్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న పాక్ జట్టు తమ ప్రాక్టీస్ సెషన్స్ను కూడా మొదలు పెట్టేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ అండర్-19 ఫాస్ట్బౌలర్ నిశాంత్ సరను తమ నెట్బౌలర్గా పాకిస్తాన్ నియమించకుంది. కివీస్ వార్మప్ మ్యాచ్కు ముందు నెట్స్లో పాక్ బ్యాటర్లకు నిశాంత్ బౌలింగ్ చేస్తూ కన్పించాడు. ఈ యువ హైదరబాదీ పేసర్ గంటకు 140 నుంచి 150 వేగంతో బంతులు విసరగలడు. అదే విధంగా ఆరు అడుగులకు పైగా ఉన్న నిశాంత్ బౌన్సర్స్ను సంధించగలడు. నెట్స్లో అతడి బౌలింగ్ను ఎదుర్కొన్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. నిశాంత్కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని, కచ్చితంగా అతడు అత్యున్నత స్ధాయికి చేరుకుంటాడని జమాన్ కొనియాడాడు. అదే విధంగా నిశాంత్ మాట్లాడుతూ.. తనకు ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ఆదర్శమని తెలిపాడు. అంతేకాకుండా హైదరాబాద్కు ఆడాలన్న తన కోరికను నిశాంత్ వ్యక్తం చేశాడు. చదవండి: WC 2023: చారిత్మాతక డీల్.. ఆటగాళ్లకు పీసీబీ గిఫ్ట్! వాళ్లకు ఏకంగా 202 శాతం హైక్ -
టీమిండియా తొలుత ఇంగ్లండ్.. తర్వాత పసికూనతో! పూర్తి షెడ్యూల్, వివరాలు
ICC Men's Cricket World Cup warm-up matches 2023: భారత్లో క్రికెట్ ఫీవర్ తారస్థాయికి చేరింది. వారం రోజుల్లో ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. పుష్కరకాలం తర్వాత వన్డే వరల్డ్కప్-2023 ఆతిథ్యానికి టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు భారత్కు చేరుకుంటున్నాయి. ప్రధాన మ్యాచ్ల కంటే ముందు వార్మప్ మ్యాచ్లు ఆడేందుకు సన్నద్ధమవుతున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, గువాహటి ఈ సన్నాహక మ్యాచ్లకు వేదికలుగా మారనున్నాయి. మరి.. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు జరుగనున్న వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్, టైమింగ్స్ లైవ్ స్ట్రీమింగ్, టికెట్ల బుకింగ్ తదితర వివరాలు తెలుసుకుందామా?! సెప్టెంబరు 29, 2023 - శుక్రవారం 1. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 2. దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్తాన్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం 3. న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ సెప్టెంబరు 30, 2023- శనివారం 4. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 5.ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం. అక్టోబరు 2, 2023- సోమవారం 6.ఇంగ్లండ్ వర్సెస్ బంగ్లాదేశ్, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 7.న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం అక్టోబరు 3, 2023- మంగళవారం 8.అఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక, బర్సపరా క్రికెట్ స్టేడియం, గువాహటి 9.ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్, గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం 10.పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ మ్యాచ్ ఆరంభ సమయం వార్మప్ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే? ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్కప్-2023కు సంబంధించిన వార్మప్, ప్రధాన మ్యాచ్లన్నీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం డిజిటల్ మీడియాలో డిస్నీ+హాట్స్టార్లో మొబైల్లో ఉచితంగా వీక్షించవచ్చు. బుక్ మై షోలో.... వరల్డ్ కప్- 2023 ప్రధాన, వార్మప్ మ్యాచ్లు కలిపి మొత్తం 58 మ్యాచ్ల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. టీమిండియా మినహా ఇతర జట్ల వార్మప్ మ్యాచ్లకు టికెట్లు ఆగష్టు 25 నుంచే అందుబాటులోకి రాగా.. భారత జట్టు ఆడే వార్మప్ మ్యాచ్లకు ఆగష్టు 30 నుంచి అందుబాటులో వచ్చాయి. చదవండి: హైదరాబాద్లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి: బాబర్ భావోద్వేగం -
హైదరాబాద్లో ఘన స్వాగతం.. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి: బాబర్ భావోద్వేగం
ICC WC 2023: #welcometoindia- #Babar Azam: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం హైదరాబాదీల ప్రేమకు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమకు ఘన స్వాగతం పలికినందుకు సంతోషంగా ఉందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023 ఆడేందుకు పాక్ క్రికెట్ జట్టు భారత్కు చేరుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆడనున్న వార్మప్, కొన్ని ప్రధాన మ్యాచ్లకు హైదరాబాద్ వేదికకానున్న తరుణంలో బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో టీమ్ ల్యాండ్ అయింది. వీసా సమస్యలు తీరడంతో దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వారికి స్వాగతం పలకగా.. పోలీసుల పటిష్ట భద్రత నడుమ పార్క్ హయత్కు ఆటగాళ్లు చేరుకున్నారు. కాగా దాదాపు ఏడేళ్ల తర్వాత పాక్ జట్టు ఇండియాకు రావడం ఇదే తొలిసారి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ఈ నేపథ్యంలో కొంతమంది అభిమానులు సైతం ఎయిర్పోర్టు బయట దారి పొడవునా నిల్చొని ఘన స్వాగతం పలికారు. టీమ్ బస్లో తరలివెళ్తున్న పాక్ క్రికెటర్లను కెమెరాలలో బంధిస్తూ వారికి విష్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో బాబర్ ఆజం హైదరాబాద్ ఆతిథ్యానికి ముగ్ధుడయ్యాడు. ‘‘హైదరాబాద్లో.. మీ అంతులేని ప్రేమ, మద్దతు చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ మేరకు బాబర్ చేసిన పోస్ట్ వైరల్గా మారింది. Babar's Wink 😉 and Shaheen's laugh with the Officer 😄 This shows how awesome India has treated them in the airport! 💚 India is truly the land of hospitality! 💙#WelcometoIndia | #ThanksIndia | #BabarAzam𓃵 | #PakistanCricketTeam | #Hyderabad pic.twitter.com/KnMHVfwe6X — BatBallBanter 🏏 (@batballbanters) September 28, 2023 ఉప్పల్లో ప్రధాన మ్యాచ్లు ఇవే కాగా ఉప్పల్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్ శుక్రవారం న్యూజిలాండ్తో తమ తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అదే విధంగా... అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. తదుపరి.. వరల్డ్కప్ ప్రధాన మ్యాచ్లలో భాగంగా.. అక్టోబర్ 6న నెదర్లాండ్స్తో, అక్టోబర్ 10న శ్రీలంకతో పోటీపడుతుంది. ఇక ఇండియాకు బయల్దేరే ముందు బాబర్ ఆజం మాట్లాడుతూ.. తమ జట్టు ఈ ఐసీసీ టోర్నీలో అత్యుత్తమంగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. చదవండి: చాలా సంతోషంగా ఉన్నా.. అతడు మాత్రం అద్భుతం! వరల్డ్కప్లో కూడా: రోహిత్ A warm welcome in Hyderabad as we land on Indian shores 👏#WeHaveWeWill | #CWC23 pic.twitter.com/poyWmFYIwK — Pakistan Cricket (@TheRealPCB) September 27, 2023 Someone arrived in India 👑#BabarAzam𓃵 | #WorldCup2023 #Hyderabad | #INDvsAUS pic.twitter.com/Sjj2p6Pg9o — World Cup 🏏 (@World_Cup_23) September 27, 2023 -
న్యూజిలాండ్- పాక్ వార్మప్ మ్యాచ్.. బీసీసీఐ కీలక ప్రకటన
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వార్మప్ మ్యాచ్లు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 29న న్యూజిలాండ్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ప్రాక్టీస్ మ్యాచ్ను ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించ కూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. టికెట్లు కొనుగోలు చేసిన వారికి మొత్తం డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. "ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్-పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. స్థానిక భద్రతా సంస్థల సలహా మేరకు ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్ను నిర్వహించనున్నాం. ఒకే రోజు రెండు పండగలు రావడంతో భద్రత విషయంలో ఇబ్బంది ఉంటుందని పోలీసులు తెలిపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రతీ ఒక్కరికి రిఫెండ్ చేస్తామని" బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది... రేపు హైదరాబాద్కు పాకిస్తాన్ జట్టు -
CWC 2023: పాకిస్తాన్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ
ఈనెల 29న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్కప్-2023 వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్కు ముందు రోజు (సెప్టెంబర్ 28) నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్ను వాయిదా వేయాలని వారు హెచ్సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్సీఏకు తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వరల్డ్కప్ టికెటింగ్ పార్డ్నర్ బుక్ మై షోకు సూచించింది. కాగా, వన్డే వరల్డ్కప్-2023కు ముందు మొత్తం 10 వార్మప్ మ్యాచ్లు జరుగనున్న విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా సెప్టెంబర్ 29న 3 మ్యాచ్లు, సెప్టెంబర్ 30న 2, అక్టోబర్ 2న 2, అక్టోబర్ 3న 3 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ డే అండ్ మ్యాచ్లుగా సాగనున్నాయి. సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక (గౌహతి, మధ్యాహ్నం 2 గంటలకు) ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) అక్టోబర్ 2: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) అక్టోబర్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గౌహతి) ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) -
Pak Vs NZ: 12 ఏళ్ల తర్వాత తొలిసారి సిరీస్ సమర్పయామి.. ఇప్పుడేమో ఏకంగా..
Pakistan vs New Zealand- Babar Azam: పాకిస్తాన్ గడ్డపై టీ20 సిరీస్లో రాణించిన న్యూజిలాండ్ వన్డే సిరీస్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. ఇప్పటికే మూడింట ఓటమిపాలై సిరీస్ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న కివీస్.. నాలుగో వన్డేలోనూ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. 5 టీ20లు, 5 వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడటానికి న్యూజిలాండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. వన్డే వరల్డ్కప్-2023 ఈవెంట్కు ముందు సన్నాహకంగా జరుగుతున్న ఈ సిరీస్లో కివీస్ వైఫల్యం కొనసాగిస్తోంది. కరాచీ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సెంచరీతో చెలరేగిన బాబర్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య పాకిస్తాన్కు ఓపెనర్ మసూద్(44) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ బాబర్ సెంచరీ(107)తో చెలరేగాడు. అతడికి తోడు.. ఐదో స్థానంలో వచ్చిన ఆగా సల్మాన్ అర్థ శతకం(58)తో రాణించాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఒక్కడే ఈ మాత్రం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ను ఉసామా మీర్ దెబ్బకొట్టాడు. 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చి కివీస్ పతనాన్ని శాసించాడు. హారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్ మూడు, షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ టామ్ లాథమ్ 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతావాళ్లలో మార్క్ చాప్మన్ 46 పరుగులతో రాణించగా.. వన్డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్ల ధాటికి మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో 43.4 ఓవర్లలో 232 పరుగులు మాత్రమే చేసి కివీస్ ఆలౌట్ అయింది. 102 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 12 ఏళ్ల తర్వాత తొలిసారి సెంచరీ హీరో బాబర్ ఆజం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కాగా ఐపీఎల్-2023 సందర్భంగా గాయపడిన కివీస్ సారథి కేన్ విలియమ్సన్ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక ఇప్పటికే 12 ఏళ్ల తర్వాత తొలిసారి పాక్కు వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్.. ఆఖరి మ్యాచ్లో గనుక ఓడితే క్లీన్స్వీప్తో అపఖ్యాతిని మూటగట్టుకోకతప్పదు. చదవండి: IPL 2023: కేఎల్ రాహుల్ అవుట్.. అతడి స్థానంలో కర్ణాటక బ్యాటర్ .@iShaheenAfridi gets the New Zealand skipper! \0/#PAKvNZ | #CricketMubarak pic.twitter.com/dE5C7ZmOOq — Pakistan Cricket (@TheRealPCB) May 5, 2023 -
ఒకే ఇన్నింగ్స్తో రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
PAK VS NZ 4th ODI: కరాచీ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన బాబర్ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు).. వన్డేల్లో అత్యంత వేగంగా 18 సెంచరీలు (97 ఇన్నింగ్స్ల్లో) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు వరకు ఈ రికార్డు దిగ్గజ సౌతాఫ్రికా బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు 18 సెంచరీలు సాధించేందుకు 102 ఇన్నింగ్స్లు ఆవసరమయ్యాయి. అంతకుముందు ఇదే మ్యాచ్లో బాబర్ మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బాబర్ ఈ మైలురాయిని అధిగమించాడు. బాబర్ 97 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. బాబర్ (117 బంతుల్లో 107; 10 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 334 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాన్ మసూద్ (44), అఘా సల్మాన్ (58) రాణించగా.. ఆఖర్లో షాహీన్ అఫ్రిది (7 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, బెన్ లిస్టర్, ఇష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన పాక్ కెప్టెన్
PAK VS NZ 4th ODI: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. బాబర్ 97 ఇన్నింగ్స్ల్లో ఈ ఫీట్ను సాధించాడు. గతంలో వేగవంతమైన 5000 పరుగుల రికార్డు సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లాకు ఈ మైలురాయిని అందుకునేందుకు 101 ఇన్నింగ్స్లు అవసరమయ్యాయి. న్యూజిలాండ్తో ఇవాళ (మే 5) జరుగుతున్న నాలుగో వన్డేలో 19 పరుగుల వద్ద బాబర్ 5000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. గతేడాది బాబర్.. హషీమ్ ఆమ్లా పేరిటే ఉన్న వేగవంతమైన 4000 పరుగుల రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఆమ్లా 81 ఇన్నింగ్స్ల్లో ఆ ఫీట్ను సాధిస్తే, బాబార్ 82 ఇన్నింగ్స్ల్లో ఆ మైలురాయిని అధిగమించాడు. గత రెండేళ్లుగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న బాబర్.. 5000 పరుగులు పూర్తి చేసిన 14వ పాకిస్తానీ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నాలుగో వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన పాక్.. 28 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భీకర ఫామ్లో ఉన్న ఫకర్ జమాన్ (14) త్వరగా ఔటవ్వగా.. షాన్ మసూద్ (44), మహ్మద్ రిజ్వాన్ (24) పర్వాలేదనిపించారు. బాబర్ ఆజమ్ (55), అఘా సల్మాన్ (7) క్రీజ్లో ఉన్నారు. కాగా, 5 మ్యాచ్ల ఈ సిరీస్ను పాక్ ఇదివరకే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కాకుండా సిరీస్లో మరో మ్యాచ్ (ఐదో వన్డే) మిగిలి ఉంది. అంతకుముందు ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ డ్రాగా ( 2-2) ముగిసింది. -
తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం!
పాకిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్ 21వ ఓవర్ మహ్మద్ నవాజ్ వేశాడు. ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్ చేతి వేలికి తగిలింది. బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్ బ్రేక్ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్-రే తీయించారు. కాగా రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్ నవాజ్ బౌలింగ్ వేసే చాన్స్ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్కు 2011 తర్వాత న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలవడం మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్ బ్లండల్ 65, కొల్ మెక్నికొంచి 64, టామ్ లాథమ్ 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్లు తలా రెండు వికెట్లు తీశారు. Yaar ye kya hogya 😭 The main finger of M Nawaz has been broken yaar ☹️🥺💔 Plzz remember him in ur prayers to comeback as quick as possible 🙏🤲❤️#BabarAzam𓃵 #NaseemShah #PAKvNZ #muhammadNawaz @Awaisii6 pic.twitter.com/NPOors4m0i — 𝘽𝙖𝙗𝙖𝙧 ⁵⁶ × 𝘼𝙞𝙢𝙖𝙡 ¹¹ ⚡ (@Aymalkhan_112) May 3, 2023 చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
పాక్ ఓపెనర్ విధ్వంసం..న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు..17 ఫోర్లు,6 సిక్సర్లతో 180 నాటౌట్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) కదం తొక్కిన జమాన్.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. జమాన్కు జతగా బాబర్ ఆజమ్ (65), మహ్మద్ రిజ్వాన్ (54 నాటౌట్) రాణించడంతో కివీస్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్), బోవ్స్ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 4, నసీం షా ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్ జమాన్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించారు. ఇమామ్ ఉల్ హాక్ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్ (7) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్ సోధిలకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్ జమాన్కు వరుసగా రెండో మ్యాచ్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్ పర్యటనలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. -
పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి!
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గ్రౌండ్లో 30 యార్డ్ సర్కిల్ దూరం ఎక్కువగా ఉన్నట్లు అంపైర్లు గుర్తించి సరిచేయడం ఆసక్తిగా మారింది. వాస్తవానికి మ్యాచ్ ప్రారంభానికి ముందే గ్రౌండ్స్మెన్ కొలతలతో 30-యార్డ్ సర్కిల్ను ఏర్పాటు చేయాలి. అయితే కొలతలు తప్పుగా తీసుకోవడం వల్ల 30-యార్డ్ సర్కిల్ అసలు దానికంటే కాస్త దూరంగా పెట్టారు. పాకిస్తాన్ బౌలర్ నసీమ్ షా తొలి ఓవర్లో నాలుగు బంతులు వేసిన తర్వాత ఫీల్డ్ అంపైర్లు అలీమ్ దార్, రషీద్ రియాజ్లు తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మ్యాచ్ను హాల్డ్ చేసి గ్రౌండ్స్మెన్ను పిలిచి 30-యార్డ్ సర్కిల్ను సరిచేశారు. గ్రౌండ్స్మెన్తో పాటు పాక్ ఆటగాళ్లు కూడా సర్కిల్ను సరిచేయడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన అభిమానులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేశారు. పీసీబీ ఘనకార్యం.. క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.. 30 యార్డ్ సర్కిల్ను సరిగ్గా సెట్ చేయలేకపోయారు.. ఇక ఆసియాకప్ను హోస్ట్ చేస్తారంటా.. అంటూ కామెంట్ చేశారు. pic.twitter.com/TPyCV3qCyZ — Out Of Context Cricket (@GemsOfCricket) April 29, 2023 చదవండి: అద్భుతాలు అరుదుగా.. చూసి తీరాల్సిందే -
వన్డే క్రికెట్లో పాకిస్తాన్ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే
గురువారం న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో విజయాన్ని అందుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించింది. కివీస్పై విజయం పాక్కు వన్డేల్లో 500వది కావడం విశేషం. వన్డే క్రికెట్లో 500 విజయాలు నమోదు చేసిన మూడో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 978 మ్యాచ్లు ఆడి 594 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా ఇప్పటివరకు మొత్తం 1029 మ్యాచ్లు ఆడి 539 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతుంది. తాజాగా కివీస్పై విజయంతో పాక్ 949వ మ్యాచ్లో 500వ విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్ 411, దక్షిణాఫ్రికా 399, శ్రీలంక 399, ఇంగ్లండ్ 392, న్యూజిలాండ్ 368, బంగ్లాదేశ్ 149, జింబాబ్వే 147 విజయాలతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇక 1973లో మొదటి వన్డే మ్యాచ్ ఆడిన పాకిస్తాన్.. 1974 ఆగస్టులో నాటింగ్హమ్ వేదికగా ఇంగ్లండ్తో మ్యాచ్లో తొలి వన్డే విజయాన్ని అందుకుంది. 1992లో వన్డే వరల్డ్కప్ నెగ్గిన పాకిస్తాన్.. ఆ తర్వాత 1999లో ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు. చదవండి: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్పై పాక్ ఘన విజయం -
సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్పై పాక్ ఘన విజయం
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మిల్నే రెండు వికెట్లు పడగొట్టగా.. టిక్నిర్,సోధి, రవీంద్ర ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా సెంచరీతో చెలరేగిన జమాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్ 29న రావల్పిండి జరగనుంది. చదవండి: MS Dhoni: 'చెలరేగుతున్నాడన్న కోపం.. రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు' -
న్యూజిలాండ్ బ్యాటర్ ఊచకోత.. పాక్కు పరాభవం
న్యూజిలాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో పాకిస్తాన్కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. చాప్మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా రావల్పిండి వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్మన్కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్మన్కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. -
బదులు తీర్చుకున్న న్యూజిలాండ్.. ఉత్కంఠపోరులో పాకిస్తాన్పై విజయం
లాహొర్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టీ20లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్లో కివీస్ తొలి గెలుపు నమోదు చేసింది. 164 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(23 బంతుల్లో 60) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. పాకిస్తాన్ విజయం సాధించలేకపోయింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బంతిని నీషమ్ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని ఇఫ్తికర్ ఆహ్మద్ సిక్సర్గా మలచగా.. రెండో బంతికి ఎటువంటి రన్స్ రాలేదు. మూడో బంతికి ఇఫ్తికర్ ఫోర్ బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ నాలుగో బంతికి ఇఫ్తికర్ ఔటయ్యాడు. దీంతో పాకిస్తాన్ ఓటమి ఖారారైంది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే,రవీంద్ర తలా రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్(64) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్, అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించగా.. షాదాబ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: IPL 2023: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. పదండి ఉప్పల్కి అంటూ! వీడియో వైరల్