Steve Smith
-
శుబ్మన్ గిల్కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు.. బుమ్రా రికార్డు బ్రేక్!
టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’(ICC Player of the Month) అవార్డు గెలుచుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గానూ ఈ పురస్కారానికి అతడు ఎంపికయ్యాడు. తద్వారా ఇప్పటి వరకు అత్యధికసార్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలిచిన తొలి భారత క్రికెటర్గా గిల్ నిలిచాడు.ట్రోఫీ గెలిచిన టీమిండియా..కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భారత యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే. గత నెల 19న పాకిస్తాన్లో మొదలైన ఈ మెగా వన్డే టోర్నమెంట్.. దుబాయ్లో మార్చి 9న టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ఫైనల్తో ముగిసింది. ఇక ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ మ్యాచ్లన్నీ దుబాయ్లోనే ఆడింది.గిల్ అదరగొట్టాడుగ్రూప్ దశలో వరుసగా మూడు గెలిచి సెమీస్ చేరిన భారత్.. అనంతరం సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో కివీస్ జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది. ఐదు మ్యాచ్లలోనూ అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.భారత్ ఈ ఘనత సాధించడంలో గిల్ది కూడా కీలక పాత్ర. ఈ టోర్నీలో బంగ్లాదేశ్పై 101 పరుగులు సాధించిన గిల్.. పాకిస్తాన్తో మ్యాచ్లో 46 పరుగులు చేశాడు. అంతకు ముందు ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లోనూ గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో వరుసగా 87, 60, 112 పరుగులు సాధించాడు.వారిని ఓడించిఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి నెలకు నామినేట్ అయ్యాడు గిల్. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కూడా ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. వారిద్దరిని ఓడించి అత్యధిక ఓట్లతో గిల్ విజేతగా నిలిచాడు.బుమ్రా రికార్డు బ్రేక్ఇక గిల్ ఈ అవార్డు గెలవడం ఇది మూడోసారి. 2023 జనవరి, సెప్టెంబర్ నెలలకు గానూ గిల్ గతంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచాడు. అంతకు ముందు భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండుసార్లు ఈ పురస్కారం పొందాడు. అయితే, గిల్ ఇప్పుడు బుమ్రాను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు అందుకున్న భారత క్రికెటర్లు వీరే👉శుబ్మన్ గిల్- మూడుసార్లు👉జస్ప్రీత్ బుమ్రా- రెండుసార్లు👉రిషభ్ పంత్- ఒకసారి👉రవిచంద్రన్ అశ్విన్- ఒకసారి👉భువనేశ్వర్ కుమార్- ఒకసారి👉శ్రేయస్ అయ్యర్- ఒకసారి👉విరాట్ కోహ్లి- ఒకసారి👉యశస్వి జైస్వాల్- ఒకసారి.టాప్లోనే గిల్మరోవైపు.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో గిల్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మూడో ర్యాంకు సాధించాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు.చదవండి: IND vs ENG: గంభీర్ మాస్టర్ ప్లాన్.. ఇంత వరకు ఏ కోచ్ చేయని విధంగా.. -
రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ వార్తలు.. జడ్డు రియాక్షన్ ఇదే!
దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నమెంట్ జరుగగా.. టీమిండియా విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ పాకిస్తాన్ ఒక్క గెలుపు కూడా లేకుండా నిష్క్రమించగా.. భారత్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో న్యూజిలాండ్(India vs New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్గా నిలిచింది.ఆ నలుగురు.. అప్పుడూ.. ఇప్పుడూఇక 2017 చాంపియన్స్ ట్రోఫీ నాటి భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా(Ravindra Jadeja), హార్దిక్ పాండ్యా.. తాజా ఎడిషన్లోనూ ఆడారు. ప్రస్తుతం ఈ వన్డే టోర్నమెంట్ గెలిచిన జట్టుకు రోహిత్ కెప్టెన్గా ఉండగా.. మిగతా ముగ్గురు అతడితో కలిసి టీమిండియాను విజేతగా నిలపడంలో తమ వంతు పాత్ర పోషించారు.ముఖ్యంగా స్పిన్కు అనుకూలించిన దుబాయ్ పిచ్పై ఆల్రౌండర్ జడ్డూ ప్రభావం చూపాడు. మొత్తంగా ఐదు మ్యాచ్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన జడ్డూ మొత్తంగా ఐదు వికెట్లు తీశాడు. ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతూ కీలక వికెట్లు కూల్చి టీమిండియాను విజయపథంలో నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్లలో కలిపి 42 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా.. 4.35 ఎకానమీ రేటుతో 183 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. బంతితోనే కాకుండా.. అవసరమైన వేళ బ్యాట్తోనూ జడ్డూ రాణించాడు. ముఖ్యంగా కివీస్తో ఫైనల్లో ఫోర్ బాది టీమిండియా విజయాన్ని ఖరారు చేసి.. ఈ టోర్నీని చిరస్మరణీయంగా మార్చుకున్నాడు. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుఅయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా తన బౌలింగ్ ఓవర్ల కోటా పూర్తి చేయగానే విరాట్ కోహ్లి వచ్చి జడ్డూను ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట విస్తృతంగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియాకు కెప్టెన్గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్కు కోహ్లి హగ్ ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ.. జడేజా రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు వచ్చాయి. జడ్డూ వన్డేల్లో తన చివరి స్పెల్ వేసేశాడని.. ఇక రిటైర్మెంట్ ప్రకటనే తరువాయి అన్నట్టుగా ప్రచారం సాగింది.జడ్డు రియాక్షన్ ఇదే!టీమిండియా విజయానంతరం ఈ విషయంపై స్పందించిన జడేజా.. ‘‘అనవసరంగా వదంతులు ప్రచారం చేయద్దు.. ధన్యవాదాలు’’ అంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీతో పాటు సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉన్న ఎమోజీని జత చేశాడు. కాగా ఫైనల్లో జడ్డూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఆరు బంతుల్లో ఒక ఫోర్ సాయంతో తొమ్మిది పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇదిలా ఉంటే.. సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు కోహ్లి అతడిని ఆలింగనం చేసుకోగా.. అధికారిక ప్రకటన కంటే ముందే స్మిత్ కోహ్లికి ఈ విషయం చెప్పాడని వార్తలు వచ్చాయి. జడ్డూ విషయంలో కూడా ఇలాగే జరుగుతుందని భావించిన వాళ్లకు తాజాగా అతడి పోస్టుతో స్పష్టతవచ్చింది.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్గా.. మాటలకు అందని అనుభూతి!Ravindra Jadeja with his family!#INDvsNZ #ChampionsTrophy2025 pic.twitter.com/16MpYrm7V6— Chandra 🇮🇳 (@cbatrody) March 9, 2025 -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీగా శుభ్మన్ గిల్.. రేసులో మరో ఇద్దరు స్టార్లు
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీల వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. పురుషుల విభాగంలో టీమిండియా యువ ఆటగాడు శుభ్మన్ గిల్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో అలానా కింగ్ (ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్), అన్నాబెల్ సదర్ల్యాండ్ (ఆసీస్ బ్యాటర్), తిసాట్చా పుత్తవోంగ్ (థాయ్ల్యాండ్ బౌలర్) నామినీస్గా నిలిచారు. ఫిబ్రవరిలో ఆయా ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన వారిని ఐసీసీ నామినీస్గా ఎంపిక చేసింది. ఓటింగ్ ఆధారంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ విజేతలను ప్రకటిస్తారు.శుభ్మన్ గిల్: ఫిబ్రవరి నెలలో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నెలలో అతను 100కుపైగా సగటుతో 406 పరుగులు చేశాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్లో గిల్ వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్పై మరో సెంచరీ బాదాడు. ఇదే నెలలో గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు.గ్లెన్ ఫిలిప్స్: ఫిబ్రవరి నెలలో ఫిలిప్స్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరిగిన వన్డే సిరీస్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ సిరీస్లో ఫిలిప్స్ వరుసగా 28 నాటౌట్, 20 నాటౌట్, 106 (74 బంతుల్లో 7 సిక్సర్లు) స్కోర్లు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఫిలిప్స్ విజృంభించాడు. ఈ మ్యాచ్లో ఫిలిప్స్ మెరుపు అర్ద సెంచరీ (39 బంతుల్లో 61) సాధించాడు. ఇదే మ్యాచ్లో ఫిలిప్స్ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ క్యాచ్ను నమ్మశక్యంకాని రీతిలో అందుకున్నాడు.స్టీవ్ స్మిత్: ఫిబ్రవరి నెలలో స్మిత్ టెస్ట్ల్లో అద్భుతంగా రాణించాడు. ఈ నెలలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్ల్లో స్మిత్ రెండు సెంచరీలు బాదాడు. ఫలితంగా ఈ సిరీస్లో స్మిత్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శనలతో స్మిత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టాప్-5లోకి చేరుకున్నాడు. -
Steve Smith: కోహ్లికి ముందే తెలుసు!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికి.. తన అకస్మాత్ నిర్ణయంతో అభిమానులకు షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఆసీస్ పరాజయం అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అయితే, యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచి తప్పుకొన్నా... టెస్టులు, టీ20ల్లో కొనసాగాలనుకుంటున్నట్లు 35 ఏళ్ల స్మిత్ వెల్లడించాడు.అయితే, స్మిత్ తన రిటైర్మెంట్(ODI Retirement) నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే కంటే ముందే.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)కి ఈ విషయం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. సెమీ ఫైనల్లో ఆసీస్పై భారత్ విజయానంతరం ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న వేళ స్మిత- కోహ్లి ముఖాలు దిగాలుగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇదే చివరి మ్యాచా?ఈ క్రమంలో.. ‘‘ఇదే చివరి మ్యాచా?’’ అని కోహ్లి అడుగగా.. ‘అవును’ అంటూ స్మిత్ సమాధానమిచ్చాడని.. వారి మధ్య జరిగిన సంభాషణ ఇదేనంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో ప్రత్యర్థులే అయినా కోహ్లి- స్మిత్ మధ్య వ్యక్తిగతంగా ఉన్న స్నేహబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు చిలిపిగా వ్యవహరించినా క్రీడా స్ఫూర్తిని చాటడంలో.. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వడంలో కింగ్కు మరెవరూ సాటిరారని కోహ్లిని కొనియాడుతున్నారు.నాడు స్మిత్కు కోహ్లి మద్దతుకాగా నవతరం ఫ్యాబ్ ఫోర్(కోహ్లి, విలియమ్సన్, స్మిత్, రూట్)లో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. మైదానంలో నువ్వా- నేనా అన్నట్లుగా తలపడే ఈ ఇద్దరు పరస్పరం ప్రశంసలు కురిపించుకోవడంలోనూ ముందే ఉంటారు. కోహ్లి వంటి గొప్ప ఆటగాడిని తాను చూడలేదని.. అతడంటే తనకు ఎంతో గౌరవమని స్మిత్ పలు సందర్భాల్లో వెల్లడించాడు.ఇక వరల్డ్ కప్-2019లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ సమయంలో స్మిత్ను ప్రేక్షకులు ‘చీటర్’ అంటూ గేళి చేయగా.. బ్యాటింగ్ చేస్తున్న కోహ్లి బౌండరీ వద్దకు వచ్చి అలా చేయవద్దని వారించాడు. అంతేకాదు.. స్మిత్ భుజంపై చేయి వేసి మద్దతు పలికాడు. దీంతో ప్రేక్షకులు కూడా సంయమనం పాటించారు.5,800 పరుగులుఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో... చాంపియన్స్ ట్రోఫీలో అతడి స్థానంలో స్మిత్ కంగారూ జట్టుకు సారథ్యం వహించాడు. 2010లో వెస్టిండీస్పై వన్డే అరంగేట్రం చేసిన స్మిత్... కెరీర్లో ఇప్పటి వరకు 170 మ్యాచ్లాడి 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 35 హాఫ్సెంచరీలు ఉన్నాయి. గొప్ప ప్రయాణంఇక 2015, 2023 వన్డే ప్రపంచకప్లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడైన స్మిత్... బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. లెగ్స్పిన్నర్గా జట్టులోకి వచ్చిన స్టీవ్ స్మిత్... ఆ తర్వాత నెమ్మదిగా ఆల్రౌండర్గా... ఆపై టాపార్డర్ బ్యాటర్గా... అటు నుంచి స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. ‘ఇది చాలా గొప్ప ప్రయాణం. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించా. ఈ ఫార్మాట్లో ఎన్నో అద్భుత జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్లు గెలవడం ఎప్పటికీ మరవలేను. ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడా’ అని స్మిత్ పేర్కొన్నాడు.అందుకే రిటైర్ అయ్యానుకాగా 2027 వన్డే ప్రపంచకప్నకు జట్టును సిద్ధం చేసుకునేందుకు టీమ్ మేనేజ్మెంట్కు తగినంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. ‘ఇంకా నాలో చాలా క్రికెట్ మిగిలే ఉంది. అయితే మరో రెండేళ్లలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో జట్టును సిద్ధం చేసుకునేందుకు మేనేజ్మెంట్కు సమయం దక్కుతుంది. టెస్టులు, టీ20ల్లో అవకాశం కల్పిస్తే తప్పక జట్టు విజయాల కోసం కృషి చేస్తా’ అని స్మిత్ అన్నాడు. చదవండి: అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్YOU MISS, I HIT! 🎯Shami strikes big, sending the dangerous Steve Smith back to the pavilion with a stunning delivery! 🤯#ChampionsTrophyOnJioStar 👉 #INDvAUS | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2 & Sports18-1!📺📱 Start Watching FREE on… pic.twitter.com/cw9RB77Ech— Star Sports (@StarSportsIndia) March 4, 2025 -
ఒకడే ఒక్కడు మొనగాడు
ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అదీ నాకౌట్ దశలో ఆడే మ్యాచ్ మరింత క్లిష్టతరంగా ఉంటుంది. ఇందుకు చివరివరకూ పోరాడే ఆస్ట్రేలియా నైజం, వారి పోరాట తత్త్వం ప్రధాన కారణాలు. సాధారణముగా ఈ విషయం లో భారత్పై ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దే పైచేయిగా నిలిచింది. ముఖ్యంగా భారత్లో జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ , అదే సంవత్సరం ఇంగ్లండ్లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక నిదర్శనం. ఈ రెండిటిని లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రధాన భూమిక వహించాడు.కోహ్లీ విభిన్నమైన ఇన్నింగ్స్అయితే, మంగళవారం దుబాయ్ వేదిక పై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇందుకు భిన్నమైనిది. అందుకు ప్రధాన కారణం 36 ఏళ్ల భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆడిన తీరు భారత్ క్రికెట్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కోహ్లీ లో అసాధారణ పరిణతి కనిపించింది. ఎక్కడా తడబాటు లేదు. పెద్ద షాట్లు కొట్టి ఆస్ట్రేలియా వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే దృఢ సంకల్పంతో సింగిల్స్ కోసం చిన్నపిల్లల వాడిలాగా పరిగెడుతూనే ఉన్నాడు.ఎక్కడా అలసట లేదు. అలసత్వం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమినించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది కోహ్లీ వయ్యస్సు. కోహ్లీ దుబాయ్ ఎండలో మధ్యానమంతా ఫీల్డింగ్ చేసాడు. ఇక కోహ్లీ ఫీల్డ్ లో ఎలా ఉంటాడో చెప్పనవసరం లేదు. ఒక మెరుపు తీగలాగా, పాదరసం లాగా మైదానమంతా కళయదిరగడం, తోటి ఆటగాళ్ళని ఉత్సహాబారచడం కోహ్లీ కి అలవాటు.కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యం265 పరుగుల విజయ లక్ష్యం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కొద్దిగా దూకుడుగా ఆడినా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్మాన్ గిల్ త్వరితగతిన ఔటవ్వడంతో పవర్ప్లే ముగిసే సమయానికి భారత్ 55/2తో ఉంది. ఆ దశలో జత కలిసిన కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ 91 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాలా పరిణతితో ఆడారు. ఎక్కడా ఆస్ట్రేలియా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ఫీల్డ్ ప్లేసిమెంట్లను జల్లెడ పట్టారు. గాప్స్ లో కొడుతూ ప్రధానంగా సింగిల్స్ పైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి అవకాశం రాలేదు. బ్యాటర్ తప్పిదాలు చేస్తేనే కదా ప్రత్యర్థికి అవకాశం.అలాంటిది షాట్లు కొట్టకుండా నిబ్బరంగా ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక దశలో ఏమి చేయాలో తెలియకుండా పోయింది. భారత్ మాత్రం విజయం దశగా పరుగు తీసింది. ఈ మ్యాచ్ కోహ్లీ మాస్టర్ స్ట్రోక్ కి మచ్చు తునక గా నిలిచిపోతుంది.సచిన్ టెండూల్కర్ రికార్డుబ్రేక్అవసరమైన పక్షంలో విజృన్భించి ఆడగల బ్యాటర్ జట్టులో ఉన్నందునే కోహ్లీకి ఈ అవకాశం దక్కిందండంలో సందేహం లేదు. తెలివైన స్ట్రైక్ రొటేషన్ మరియు సకాలంలో బౌండరీలతో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ భారత్ ఇన్నింగ్స్ను స్థిరపరిచారు. 25వ ఓవర్లో కోహ్లీ తన అర్ధ సెంచరీని సాధించాడు. విరాట్ కోహ్లీ, 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 24 అర్థసెంచరీలు ఉండగా, సచిన్ సాధించిన 23 అర్థసెంచరీల మైలురాయి ని అధిగమించాడు.కోహ్లీ క్రూయిజ్ మోడ్ బ్యాటింగ్కోహ్లీ ఇన్నింగ్స్ ఒక విషయాన్నీ స్పష్టం చేసింది. వన్డే ఫార్మాట్లో అతని నైపుణ్యం ఒక దశకు చేరుకుంది. కోహ్లీ ఇప్పుడు ఎటువంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా హైవే పై పరుగు తీసే క్రూయిజ్ మోడ్ లో ఉండే కారు లాగా సునాయాసంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "నేను ఎక్కడా తొందరపడలేదు. చాల ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఒక్క సింగిల్స్ తో ఇన్నింగ్స్ ని అలా నిర్మించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇప్పుడు 106 ఇన్నింగ్స్లలో 5999 పరుగులు చేసి భారత్ విజయలక్ష్య సాధన లో పరుగులు సాధించిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. " కోహ్లీ మరో సారి తన ప్రతిభని చాటి చెప్పాడు. పరిస్థితులను అద్భుతంగా అంచనా వేశాడు. ఒక క్లాస్ ప్లేయర్ అయిన అతనికి తన జట్టుకు ఏమి అవసరమో మరియు మ్యాచ్ ని గెలవడానికి సరిగ్గా ఎలా ఆడాలో దిశా నిర్దేశం చేసాడు. ముందుండి జట్టుని నడిపించాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సాధించిన సెంచరీ తో ఈ విషయం స్పష్టమైంది. మళ్ళీ కోహ్లీ అదే ఇన్నింగ్స్ ని పునరావృతం చేసాడు. వన్డేలలో మొనగాడని మరోసారి నిరూపించుకున్నాడు’’ అని క్లార్క్ విరాట్ కోహ్లీని ప్రశంసించాడు.చదవండి: కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ ర్యాంకు -
CT 2025, SA VS NZ 2nd Semis: 48వ శతకం.. స్మిత్ రికార్డును సమం చేసిన కేన్ మామ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా సౌతాఫ్రికాతో ఇవాళ (మార్చి 5) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. తొలుత రచిన్ రవీంద్ర సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆతర్వాత కొద్ది సేపటికే కేన్ విలియమ్సన్ శతక్కొట్టాడు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. సెంచరీల అనంతరం రచిన్ (108), కేన్ (102) ఇద్దరూ ఔటయ్యారు. 45 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 296/4గా ఉంది. డారిల్ మిచెల్ (48), గ్లెన్ ఫిలిప్స్ (9) క్రీజ్లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 2, ఎంగిడి, ముల్దర్ తలో వికెట్ పడగొట్టారు.48వ శతకం.. స్టీవ్ స్మిత్ రికార్డు సమంనేటి మ్యాచ్లో సెంచరీతో కేన్ వన్డేల్లో 15వ సెంచరీ, ఓవరాల్గా (మూడు ఫార్మాట్లలో) 48వ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక వన్డే సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాళ్ల జాబితాలో కేన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఫాబ్ ఫోర్లో ఒకడైన స్టీవ్ స్మిత్ రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లి (82) పేరిట ఉంది. ఓవరాల్గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ (100) పేరిట ఉంది.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు (ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లు)విరాట్ కోహ్లి-82జో రూట్-53రోహిత్ శర్మ-49కేన్ విలియమ్సన్-48స్టీవ్ స్మిత్-48హ్యాట్రిక్ సెంచరీలువన్డేల్లో సౌతాఫ్రికాపై కేన్ మామకు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. ఏ జట్టుపై అయినా వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాటర్ విలియమ్సనే. సౌతాఫ్రికాపై వన్డేల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ కూడా విలియమ్సనే. ఐసీసీ టోర్నీల్లో (వన్డేలు) రచిన్ రవీంద్ర (5) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాటర్ కూడా విలియమ్సనే (4). 19000 పరుగుల క్లబ్లో కేన్.. తొలి న్యూజిలాండ్ ప్లేయర్ఈ ఇన్నింగ్స్లో 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కేన్ విలియమ్సన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. అంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కేన్ తన 370వ అంతర్జాతీయ మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.ఓవరాల్గా 16వ ఆటగాడుఅంతర్జాతీయ క్రికెట్లో 19000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా కేన్ రికార్డుల్లోకెక్కాడు. కేన్కు ముందు సచిన్ (34357), సంగక్కర (28016), విరాట్ కోహ్లి (27598), రికీ పాంటింగ్ (27483), జయవర్దనే (25957), జాక్ కల్లిస్ (25534), రాహుల్ ద్రవిడ్ (24208), బ్రియాన్ లారా (22358), సనత్ జయసూర్య (21032), శివ్నరైన్ చంద్రపాల్ (20988), జో రూట్ (20724), ఇంజమామ్ ఉల్ హక్ (20580), ఏబీ డివిలియర్స్ (20014), రోహిత్ శర్మ (19624), క్రిస్ గేల్ (19593) ఈ ఘనత సాధించారు. -
భారత్ చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్కు స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమి అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ పరాజయం పాలైంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్గా స్మిత్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్కు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్మిత్ తెలిపాడు."వన్డేల్లో నా ప్రయాణాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అద్బుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్లు గెలిచిన జట్టులో భాగంగా ఉండడం నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఎంతోమంది సహచరలతో కలిసి నా క్రికెట్ జర్నీని కొనసాగించాను. 2027 వన్డే ప్రపంచకప్కు యువ ఆటగాళ్లను సిద్దం చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నాను.అందుకే వన్డే క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాను. ముఖ్యంగా అత్యున్నతస్ధాయిలో క్రికెట్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఎల్లప్పుడూ నాకు గర్వకారణమే. ఎల్లో జెర్సీ ధరిస్తే కలిగే ఆ ఆనుభూతిని వర్ణించలేం. నా ఈ ప్రయాణంలో సపోర్ట్గా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియాకు, సహచరులు, అభిమానులకు ధన్యవాదాలు.ఇకపై టెస్టు క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వెస్టిండీస్, ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా 2015, 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యునిగా ఉన్నాడు. -
అదే మా కొంపముంచింది... లేదంటే విజయం మాదే: స్టీవ్ స్మిత్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆస్ట్రేలియా పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మంగళవారం దుబాయ్ వేదికగా జరిగిన భారత్తో జరిగిన మొదటి సెమీఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఆసీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 రన్స్ కు ఆలౌటైంది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 73) టాప్ స్కోరర్గా నిలవగా.. అలెక్స్ కేరీ(61) హాఫ్ సెంచరీతో రాణించాడు.భారత బౌలర్లలో హ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 265 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలో చేధించింది. దీంతో ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. ఓటమి పాలైనప్పటికి తమ బౌలర్లు అద్భుతంగా పోరాడరని స్మిత్ కొనియాడాడు."ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్బుతమైన పోరాట పటిమ కనబరిచారు. విజయం కోసం చివరివరకు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకొచ్చారు. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం అంతసులువు కాదు. ఆరంభంలో పరుగులు సాధించడం, స్టైక్ రొటేట్ చేయడం చాలా కష్టమైంది.మా జట్టులోని ప్రతీ ఒక్కరూ విజయం సాధించేందుకు చాలా కష్టపడ్డారు. పిచ్ మేము ఊహించినదాని కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ వికెట్కు కొంతవరకు స్పిన్నర్లకు బాగానే అనుకూలించింది. స్పిన్ అవ్వడంతో పాటు స్కిడ్ అయ్యింది. పేసర్లకు కూడా కొంచెం కష్టంగానే ఉంది. దుబాయ్ వికెట్ కొంచెం గమ్మత్తుగా ఉంది. అందుకే భారీ స్కోర్లు ఈ వికెట్పై సాధించలేకపోతున్నారు. మేము కీలక సమయంలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయాం. నేను ఔటైన వెంటనే మాక్స్వెల్ కూడా తన వికెట్ను కోల్పోయాడు. అక్కడే మేము రిథమ్ను కోల్పోయాము. మేం 280 పైగా రన్స్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మిడిల్ ఓవర్లలో ఒక్క భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఉండింటే మేము అనుకున్న లక్ష్యానికి చేరువయ్యే వాళ్లం. అప్పుడు ప్రత్యర్ధిపై ఒత్తిడి ఉండేది. ఈ టోర్నీలో మా కుర్రాళ్లు బాగా రాణించారు. ముఖ్యంగా మా బౌలింగ్ ఎటాక్లో ఒక్క అనుభవం ఉన్న బౌలర్ లేడు. అయినప్పటికి టోర్నీ ఆసాంతం వారు అద్బుతంగా రాణించారు. ఇంగ్లండ్తో మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని కూడా చేధించాము. మా జట్టులోని కొంతమంది కుర్రాళ్లు భవిష్యత్తులో కచ్చితంగా అత్యుత్తమ క్రికెటర్లగా ఎదుగుతారు" అని స్మిత్ పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో పేర్కొన్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
IND vs AUS: ఛేదించేశారు..
ఆస్ట్రేలియా(India vs Australia)తో సెమీ ఫైనల్లో టీమిండియా బౌలర్లు రాణించారు. కంగారూ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశారు. 49.3 ఓవర్లలోనే స్మిత్ బృందాన్ని ఆలౌట్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో తొలి సెమీ ఫైనల్లో గ్రూప్-‘ఎ’ టాపర్ భారత్- గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా తలపడుతున్నాయి.దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే ఓపెనర్ కూపర్ కన్నోలి(0) వికెట్ కోల్పోయిన ఆసీస్ ఇన్నింగ్స్ను మరో ఓపెనర్ ట్రవిస్ హెడ్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ చక్కదిద్దారు. హెడ్ 33 బంతుల్లో 39 పరుగులు చేయగా.. వరుణ్ చక్రవర్తి అద్భుత బంతితో అతడిని పెవిలియన్కు పంపాడు.స్మిత్, క్యారీ హాఫ్ సెంచరీలుఇక అర్ధ శతకం పూర్తి చేసుకుని ప్రమాదకారిగా మారిన స్మిత్ ఆటను మహ్మద్ షమీ కట్టించాడు. 73 పరుగుల వద్ద ఉన్న సమయంలో స్మిత్ను అతడు బౌల్డ్ చేశాడు. మిగతా వాళ్లలో మార్నస్ లబుషేన్ ఫర్వాలేదనిపించగా.. అలెక్స్ క్యారీ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. కేవలం 57 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అయితే, మైదానంలో పాదరసంలా కదిలిన శ్రేయస్ అయ్యర్ అతడిని రనౌట్ చేశాడు.షమీకి మూడు వికెట్లుఇదిలా ఉంటే.. గ్లెన్ మాక్స్వెల్(7)నున అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. బెన్ డ్వార్షుయిస్(19), ఆడం జంపా(7), నాథన్ ఎల్లిస్(10), తన్వీర్ సంఘా(1 నాటౌట్) కనీస పోరాటం చేయలేదు. ఫలితంగా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ షమీ అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ దక్కించుకున్నాడు. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.ఛేదిస్తే చరిత్రే..కాగా ఐసీసీ టోర్నమెంట్లలో 2011 తర్వాత టీమిండియా నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియాను ఓడించలేకపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తే సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా ఐసీసీ వన్డే వరల్డ్కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా విధించిన అత్యధిక లక్ష్య ఛేదనను పూర్తి చేసిన ఏకైక జట్టు టీమిండియానే.వన్డే ప్రపంచకప్-2011 టోర్నీలో అహ్మదాబాద్ వేదికగా క్వార్టర్ ఫైనల్లో ఆసీస్ ఇచ్చిన 261 పరుగుల టార్గెట్ను నాడు ధోని సేన పూర్తి చేసింది. ఇక తాజాగా ఆస్ట్రేలియా 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. దీనిని ఛేదిస్తే ఆస్ట్రేలియాపై తమకున్న రికార్డును తామే బద్దలుకొట్టినట్లవుతుంది. అప్డేట్: విరాట్ కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), కేఎల్ రాహుల్(42) రాణించడంతో భారత్ ఆసీస్ ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసి నాలుగు వికె ట్ల తేడాతో గెలుపొందింది.చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీస్- తుదిజట్లు ఇవేటీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.చదవండి: రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు! -
రోహిత్ శర్మ ‘చెత్త’ రికార్డు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన సారథుల జాబితాలోకి హిట్మ్యాన్ చేరాడు. నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్ పీటర్ బారెన్ పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్ తొలి సెమీ ఫైనల్లో టీమిండియా- ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య మ్యాచ్సందర్భంగా రోహిత్ ఖాతాలో ఈ ఫీట్ నమోదైంది.టాపర్గా నిలిచిన టీమిండియాకాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలైన ఈ వన్డే టోర్నీలో టీమిండియా మాత్రం దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత బంగ్లాదేశ్, పాకిస్తాన్లను ఓడించి సెమీస్ చేరిన రోహిత్ సేన.. గ్రూప్ దశలో ఆఖరిదైన న్యూజిలాండ్ మ్యాచ్లోనూ గెలిచి టాపర్గా నిలిచింది. అయితే, ఈ మూడు మ్యాచ్లలో రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడం గమనార్హం.తాజాగా ఆస్ట్రేలియాతో మంగళవారం నాటి సెమీస్ మ్యాచ్లోనూ రోహిత్ను మరోసారి దురదృష్టం పలకరించింది. టాస్ గెలిస్తే తమకు నచ్చిన విధంగా మ్యాచ్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, గత పదకొండు సందర్భాల్లోనూ రోహిత్ టాస్ ఓడి ప్రత్యర్థి జట్టుకే మొదటి ఛాయిస్ ఇచ్చేశాడు. వరుసగా పదకొండుసార్లు టాస్ ఓడిపోయాడు.ఇక వన్డే ఇంటర్నేషనల్స్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన కెప్టెన్గా బ్రియన్ లారా ముందున్నాడు. అతడి తర్వాతి స్థానంలో పీటర్ బారెన్, రోహిత్ శర్మ కొనసాగుతున్నారు.వన్డేల్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్లు👉బ్రియన్ లారా- వెస్టిండీస్ మాజీ సారథి- అక్టోబరు 1998- మే 1999 వరకు- 12 సార్లు టాస్ ఓడిపోయాడు.👉పీటర్ బారెన్- నెదర్లాండ్స్ మాజీ కెప్టెన్- మార్చి 2011 నుంచి ఆగష్టు 2013👉రోహిత్ శర్మ- ఇండియా కెప్టెన్- నవంబరు 2023- మార్చి 2025*గ్రూప్ దశలోనే ఆ జట్ల ఇంటిబాటకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో మొత్తం ఎనిమిది జట్లు భాగమయ్యాయి. ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా పాకిస్తాన్ అర్హత సాధించగా.. వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన ఆస్ట్రేలియా, టీమిండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్లతో పాటు ఇంగ్లండ్ టోర్నీలో అడుగుపెట్టాయి.ఈ క్రమంలో వీటిని రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఎ నుంచి భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడ్డాయి. పాక్, బంగ్లాదేశ్లతో పాటు.. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. భారత్, న్యూజిలాండ్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. దుబాయ్లో మార్చి 4న తొలి సెమీస్లో భారత్- ఆసీస్.. లాహోర్ మార్చి 5న రెండో సెమీస్లో సౌతాఫ్రికా-న్యూజిలాండ్ తలపడేలా షెడ్యూల్ ఖరారైంది.చదవండి: IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. మేము గెలవాలంటే: స్మిత్ -
Champions Trophy 2025: ఆసీస్పై ఘన విజయం.. ఫైనల్లో టీమిండియా
ICC Champions Trophy 2025- India vs Australia, 1st Semi-Final: 4 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసిన భారత్48.1వ ఓవర్: మ్యాక్స్వెల్ బౌలింగ్లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశాడు. భారత్ 4 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులు చేయగా.. భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో విరాట్ కోహ్లి కీలకమైన ఇన్నింగ్స్ (84) ఆడి భారత్ను గెలిపించాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అంతుకుముందు స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.84 పరుగుల వద్ద విరాట్ కోహ్లి ఔట్42.4 ఓవర్: 225 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఆడమ్ జంపా బౌలింగ్లో డ్వార్షుయిస్కు క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (84) ఔటయ్యాడు.కేఎల్ రాహుల్కు (31) జతగా హార్దిక్ పాండ్యా క్రీజ్లోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా34.5వ ఓవర్: నాథన్ ఇల్లిస్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (27) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 35 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 178/4గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 90 బంతుల్లో 87 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. విరాట్కు (68) జతగా కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన భారత్26.2వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (45) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విరాట్కు (51) జతగా అక్షర్ పటేల్ క్రీజ్లోకి వచ్చాడు. టీమిండియా స్కోర్ 134/3గా ఉంది.హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్24.5వ ఓవర్: ఆడమ్ జంపా బౌలింగ్లో బౌండరీ బాది విరాట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విరాట్ ఈ ఇన్నింగ్స్లో 53 బంతులు ఎదుర్కొని 4 బౌండరీలు సాధించాడు. విరాట్కు జతగా మరో ఎండ్లో శ్రేయస్ (43) ఉన్నాడు. 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 131/2గా ఉంది.రోహిత్ శర్మ అవుట్7.5: రోహిత్ శర్మ(29 బంతుల్లో 28) రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. ఆసీస్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కూపర్ కన్నోలి బౌలింగ్లో రోహిత్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. కోహ్లి ఐదు పరుగులతో ఉండగా.. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 43-2(8)గిల్ అవుట్4.6: శుబ్మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ బౌలింగ్లో గిల్ బౌల్డ్ అయ్యాడు. పదకొండు బంతులు ఎదుర్కొని 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. కోహ్లి క్రీజులోకి రాగా.. రోహిత్ శర్మ 21 పరుగులతో ఉన్నాడు. భారత్ స్కోరు: 30-1 ఆసీస్ ఆలౌట్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో ఆడం జంపా బౌల్డ్అయ్యాడు. ఏడు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పదో వికెట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 49.3 ఓవర్లలో 264 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. టీమిండియాకు 265 పరుగుల లక్ష్యాన్ని విధించింది. భారత బౌలర్లలో పేసర్లు మహ్మద్ షమీ మూడు వికెట్లు , హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆసీస్నాథన్ ఇల్లిస్(10) రూపంలో ఆసీస్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. షమీ బౌలింగ్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అతడు అవుటయ్యాడు. ఆసీస్ స్కోరు: 262-9(49). తన్వీర్సంఘా క్రీజులోకి వచ్చాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. క్యారీ ఔట్47.1వ ఓవర్: 249 పరుగుల వద్ద ఆసీస్ ఎనిమిదో వికెట్ను కోల్పోయింది. అలెక్స్ క్యారీ (61) స్ట్రయిక్ తన వద్దే ఉంచుకునేందుకు లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన డైరెక్ట్ త్రోతో క్యారీని రనౌట్ చేశాడు. ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్45.1 ఓవర్: 239 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టడంతో బెన్ డ్వార్షుయిస్ (19) పెవిలియన్కు చేరాడు. అలెక్సీ క్యారీకి (54) జతగా ఆడమ్ జంపా క్రీజ్లోకి వచ్చాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్యారీ42.2 ఓవర్: కీలకమైన తరుణంలో అలెక్స్ క్యారీ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. క్యారీ 48 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 45 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 240/6గా ఉంది. క్యారీ 54, బెన్ డ్వార్షుయిష్ 19 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆసీస్కు బిగ్ షాక్37.3:ఆసీస్ బిగ్ హిట్టర్ గ్లెన్ మాక్స్వెల్ను అనూహ్య రీతిలో అక్షర్ బౌల్డ్ చేశాడు. ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి మాక్సీ నిష్క్రమించాడు. క్యారీ 39 పరుగులతో ఉండగా.. డ్వార్షుయిస్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 205/6 (37.3)ఎట్టకేలకు స్మిత్ అవుట్36.4: భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఇబ్బంది పెట్టిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు అవుటయ్యాడు. షమీ బౌలింగ్లో బౌల్డ్ అయి 73 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు: 198/5 (36.5). మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్26.6: రవీంద్ర జడేజా బౌలింగ్ జోష్ ఇంగ్లిస్ విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఫలితంగా ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 బంతులు ఎదుర్కొన్న ఇంగ్లిస్ 11 పరుగులు చేసి నిష్క్రమించాడు. మరోవైపు.. స్మిత్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అలెక్స్ క్యారీ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 144-4మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్22.3: లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా అతడు వెనుదిరిగాడు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 111/3 (22.4)వంద పరుగుల మార్కు దాటేసిన కంగారూలు20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 105/2స్మిత్ 36, లబుషేన్ 24 రన్స్తో ఉన్నారు.పద్నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు: 72/2లబుషేన్ 4, స్మిత్ 23 పరుగులతో ఉన్నారు.8.2: ట్రవిస్ హెడ్ అవుట్ఆసీస్కు భారీ షాక్ తగిలింది. హార్డ్ హిట్టర్, ఓపెనర్ ట్రవిస్ హెడ్ అవుటయ్యాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో శుబ్మన్ గిల్కు క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. దీంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్ క్రీజులోకి వచ్చాడు. ఆసీస్ స్కోరు: 54/2 (8.2) కన్నోలీ డకౌట్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఓపెనర్ కూపర్ కన్నోలీ డకౌట్ అయ్యాడు. షమీ బౌలింగ్లో కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చిన కూపర్ డకౌట్గా పెవిలియన్ బాట పట్టాడు. 3 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 4/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో హెడ్, స్మీత్ కొనసాగుతున్నారు. టాస్ గెలిచిన ఆసీస్ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీ ఫైనల్ మ్యాచ్కు నగారా మోగింది. దుబాయ్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. ‘‘పిచ్ పొడిగా ఉంది. ఇక్కడ మేము రెండు సెషన్ల పాటు ప్రాక్టీస్ చేశాం. బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.బంతి స్పిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా బలమైన జట్టు. గత మ్యాచ్లో ఆడిన జట్టులో రెండు మార్పులు చేశాం. మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కన్నోలి వచ్చాడు. స్పెన్సర్ జాన్సన్స్థానాన్ని తన్వీన్ సంఘా భర్తీ చేశాడు’’ అని తెలిపాడు.అదే జట్టుతో భారత్మరోవైపు టీమిండియా సారథి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘పిచ్ స్వభావం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. గత మూడు మ్యాచ్లలో మేము రాణించాం. కివీస్తో ఆడిన జట్టుతోనే మరోసారి ముందుకు వెళ్తున్నాం’’ అని పేర్కొన్నాడు. కాగా గత మ్యాచ్లో పేసర్ హర్షిత్ రాణాపై వేటు వేసి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించగా.. అతడు ఐదు వికెట్లతో మెరిశాడు. ఇక సెమీస్లోనూ స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నడుమ భారత్తో పాటు ఆసీస్ కూడా వారివైపే మొగ్గు చూపింది.తుదిజట్లు ఇవేభారత్రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.ఆస్ట్రేలియా కూపర్ కన్నోలీ, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా. -
IND vs AUS: ఆ ఒక్కడే కాదు.. వాళ్లంతా ప్రమాదకరమే.. గెలవాలంటే: స్మిత్
ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) టీమిండియా స్పిన్ దళంపై ప్రశంసలు కురిపించాడు. సెమీ ఫైనల్లో తమకు భారత స్పిన్నర్లతోనే ప్రధానంగా పోటీ ఉండబోతోందని పేర్కొన్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) దూరం కాగా.. స్మిత్ తాత్కాలిక సారథిగా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ వన్డే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు భాగం కాగా.. గ్రూప్-‘ఎ’లో పాకిస్తాన్, బంగ్లాదేశ్లను ఎలిమినేట్ చేసిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్లను నాకౌట్ చేసి సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో తొలి సెమీస్ మ్యాచ్లో భారత్- ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్లో న్యూజిలాండ్- సౌతాఫ్రికా పోటీపడనున్నాయి.వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఇక దుబాయ్ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య మంగళవారం మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత స్పిన్ దళం మొత్తం పటిష్టంగా ఉంది. అందుకే వరుణ్ చక్రవర్తి ఒక్కడితోనే కాదు.. ఆ జట్టులోని మిగతా స్పిన్నర్లతోనూ మాకు ప్రమాదం పొంచి ఉంది.ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే ఈ మ్యాచ్లో మా గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడం అత్యంత కష్టతరమైనది. అదే మాకు అతిపెద్ద సవాలు కాబోతోంది. అయితే, మేము వారిపై ఎదురుదాడికి దిగేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం’’ అని స్మిత్ హిందుస్తాన్ టైమ్స్తో వ్యాఖ్యానించాడు.కాస్త సమయం చిక్కిందిఇక టీమిండియాతో మ్యాచ్ సన్నాహకాల గురించి మాట్లాడుతూ.. ‘‘రెండు రోజుల ముందుగానే దుబాయ్కు చేరుకోవడం మాకు సానుకూలాంశం. ప్రాక్టీస్కు కావాల్సినంత సమయం దొరికింది. భారత్- న్యూజిలాండ్ మ్యాచ్ ఫలితం వచ్చేంత వరకు మేము ఏ వేదిక మీద ఆడాల్సి వస్తుందో తెలియని పరిస్థితి.అయితే, అదృష్టవశాత్తూ మేము ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. లేదంటే.. న్యూజిలాండ్ స్థానంలో మేము పాకిస్తాన్ విమానం ఎక్కాల్సి వచ్చేది. ఏదేమైనా దుబాయ్ పిచ్ను అర్థం చేసుకునేందుకు మాకు కాస్త సమయం చిక్కింది’’ అని 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమిస్తుండగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లలేదు. తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతోంది. ఇక రెండో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ బుధవారం తలపడనున్నాయి. లాహోర్లోని గడాఫీ స్టేడియం ఇందుకు వేదిక.వరుణ్ మాయాజాలంచాంపియన్స్ ట్రోఫీకి ముందు స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన సిరీస్ సందర్భంగా వరుణ్ చక్రవర్తి వన్డేల్లో అరంగేట్రం చేశాడు. బట్లర్ బృందాన్ని 3-0తో టీమిండియా క్లీన్స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు టీ20 సిరీస్లోనూ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుకు ఎంపికైన వరుణ్.. తొలి రెండు మ్యాచ్లలో బెంచ్కే పరిమితమయ్యాడు.అయితే, న్యూజిలాండ్తో నామమాత్రపు మ్యాచ్లో మాత్రం ఈ మిస్టరీ స్పిన్నర్ దుమ్ములేపాడు. తనకు చెత్త రికార్డు ఉన్న దుబాయ్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆ అపవాదు చెరిపేసుకున్నాడు. పది ఓవర్ల కోటా పూర్తి చేసిన వరుణ్ 42 పరుగులు ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. విల్ యంగ్(22), గ్లెన్ ఫిలిప్స్(12), మైఖేల్ బ్రాస్వెల్(2), కెప్టెన్ మిచెల్ సాంట్నర్(28), మ్యాట్ హెన్రీ(2) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తదుపరి ఆసీస్తో వరుణ్ చక్రవర్తి ఆడటం దాదాపు ఖాయం కాగా.. స్మిత్ పైవిధంగా స్పందించాడు. కాగా వరుణ్తో పాటు కుల్దీప్ యాదవ్, ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఈ జట్టులో ఉన్నారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియారోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియాజేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ -
Ind vs Aus: ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..: రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా టైటిల్ రేసులో ముందుకు దూసుకుపోతోంది. గ్రూప్-‘ఎ’లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్లను ఓడించి.. మూడింట మూడు విజయాలతో టాపర్గా నిలిచింది. ఇదే జోరులో సెమీ ఫైనల్లోనూ గెలుపొంది టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో ఉంది.నాకౌట్ మ్యాచ్లలో..అయితే, సెమీస్లో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా(India vs Australia) రూపంలో పటిష్టమైన ప్రత్యర్థి జట్టు రోహిత్ సేనకు సవాలుగా మారింది. ద్వైపాక్షిక సిరీస్ల సంగతి పక్కనపెడితే.. 2011 తర్వాత ఐసీసీ టోర్నమెంట్ల నాకౌట్ మ్యాచ్లలో కంగారూ జట్టు చేతిలో టీమిండియాకు పరాభవాలు తప్పడం లేదు. సొంతగడ్డపై లక్షలకు పైగా ప్రేక్షకుల నడుమ వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్లో భారత్ కమిన్స్ బృందం చేతిలో ఓడిన తీరును అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ క్రమంలో మంగళవారం దుబాయ్లో ఆసీస్తో జరిగే సెమీస్ మ్యాచ్లో ప్రతీకారం తీర్చుకోవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం గత చేదు అనుభవాలను మరిపించేలా రోహిత్ సేన ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆసీస్ గొప్ప జట్టు.. కానీ..‘‘ఆసీస్ పటిష్ట జట్టు. మాకు గొప్ప ప్రత్యర్థి. అయితే, సెమీస్తో మ్యాచ్లో మా విధానం మారదు. గత మూడు మ్యాచ్ల మాదిరే మా ప్రణాళికలు ఉంటాయి. అయితే, ఆసీస్ జట్టును బట్టి వ్యూహాల్లో కొన్ని మార్పులు చేసుకుంటాం.ఇక సెమీ ఫైనల్ అంటే మా మీద మాత్రమే ఒత్తిడి ఉంటుందని అనుకోకూడదు. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అయితే, జట్టుగా ఎలా రాణించాలన్న అంశం మీదే మేము ఎక్కువగా దృష్టి సారించాం. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే మాకు తిరుగే ఉండదు. సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా గొప్ప జట్టుగా కొనసాగుతోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, మేము కూడా తక్కువేమీ కాదు. ప్రత్యర్థి ముందు అంత తేలికగా తలవంచే రకం కాదు.ఇరుజట్లకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యమైంది. మేము అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నాం. ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తే.. అనుకున్న ఫలితం అదే వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్పై విజయం తర్వాత పీటీఐతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రోహిత్ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా.ఆస్ట్రేలియా జట్టుజేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ క్యారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, కూపర్ కన్నోలి.చదవండి: ఇదేం పని జడ్డూ? ఆటగాడు ఇలా చేయొచ్చా?: కివీస్ మాజీ క్రికెటర్ ఫైర్ -
Aus vs Afg: కరుణించిన వరుణుడు.. సెమీస్ రేసు సమరానికి సై
వరణుడు కరుణించాడు. అఫ్గనిస్తాన్- ఆస్ట్రేలియా(Afghanistan vs Australia) మధ్య మ్యాచ్కు మార్గం సుగమం చేశాడు. ఫలితంగా లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య సెమీస్ రేసు సమరానికి నగారా మోగింది. టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) మొదలైన విషయం తెలిసిందే. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ఈ వన్డే టోర్నమెంట్ బరిలో దిగాయి. ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి భారత్(Team India), న్యూజిలాండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. గ్రూప్-‘బి’ సెమీ ఫైనలిస్టులు శుక్రవారం నాటి ఆఫ్గన్- ఆసీస్ మ్యాచ్ ఫలితంతో ఖరారు కానున్నాయి.గెలిస్తే నేరుగా సెమీస్కేగ్రూప్-‘బి’లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్లో అఫ్గన్ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అనంతరం ఆస్ట్రేలియాతో రావల్పిండిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. మొత్తంగా మూడు పాయింట్లు సాధించిన ప్రొటిస్ జట్టు నెట్ రన్రేటు(+2.140) పరంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.ఇక ఇదే గ్రూపులో ఉన్న ఆసీస్ కూడా ప్రస్తుతం మూడు పాయింట్లతో ఉండగా.. ఇంగ్లండ్ను ఓడించిన అఫ్గనిస్తాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇప్పటికే ఆసీస్, అఫ్గన్ చేతిలో ఓడిన ఇంగ్లండ్ ఇంటిబాట పట్టగా.. సెమీస్ రేసులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ పోటీపడుతున్నాయి.ఇందులో భాగంగా లాహోర్లోని గడాఫీ స్టేడియంలో శుక్రవారం నాటి మ్యాచ్ తొలి సెమీ ఫైనలిస్టును ఖరారు చేయనుంది. అఫ్గన్- ఆసీస్ పోరులో గనుక కంగారూ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. అఫ్గన్ గెలిచినా నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది. అయితే, అప్పుడు ఆస్ట్రేలియా సౌతాఫ్రికా- ఇంగ్లండ్ ఫలితం కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.అందుకే ముందుగా బ్యాటింగ్ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గుచూపాడు. ‘‘వికెట్ బ్యాటింగ్కు అనుకూలంగా కనిపిస్తోంది. ద్వితీయార్థ భాగంలో కాస్త మందకొడిగా ఉంటుందనిపిస్తోంది. అందుకే ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇంగ్లండ్పై గెలిచిన జట్టుతోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నాం’’ అని హష్మతుల్లా తెలిపాడు.మరోవైపు.. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ.. తాను టాస్ గెలిస్తే ముందుగా బౌలింగే ఎంచుకునేవాడినని తెలిపాడు. పిచ్ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని.. ఏదేమైనా తమ ఆటగాళ్లు దూకుడుగా ముందుకు వెళ్లడం ఖాయమన్నాడు.తాము కూడా ఎలాంటి మార్పుల్లేకుండా.. ఇంగ్లండ్తో ఆడిన జట్టుతోనే ఆడబోతున్నట్లు తెలిపాడు.అఫ్గనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా తుదిజట్లుఅఫ్గనిస్తాన్రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నాయిబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ.ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.చదవండి: #Jos Buttler: అఫ్గాన్ చేతిలో ఓటమి.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం! -
ది హండ్రెడ్ లీగ్లో ఆడనున్న స్టీవ్ స్మిత్..
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ 'ది హండ్రెడ్’ లీగ్లో ఆడనున్నాడు. ది హండ్రెడ్ 2025 సీజన్ కోసం వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ స్మిత్తో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 12న జరగనున్న ది హండ్రెడ్ డ్రాఫ్ట్కు ముందుకు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లను ఖారారు చేసే పనిలో పడ్డాయి. రూల్స్ ప్రకారం.. గత సీజన్లో తమతో ఉన్న 10 మంది సభ్యులను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు.ఈ లిస్ట్లో కచ్చితంగా ఒక ఇంగ్లండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్ ప్లేయర్లు ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్ సైనింగ్ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే స్మిత్ను తమ జట్టులోకి వెల్ష్ పైర్ తీసుకుంది. ఈ విషయాన్ని వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. అదేవిధంగా వెల్ష్ ఫైర్తో ఒప్పందంపై స్మిత్ కూడా స్పందించాడు."వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది వేసవి తర్వాత నేను ది హండ్రెడ్లో భాగం కానున్నాను. తొలిసారి ఈ టోర్నీలో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎటువంటి ఫార్మాట్లో ఆడడం మనకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. మైక్ హస్సీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాను. వెల్ష్ ఫైర్ కోసం 100 శాతం ఎఫక్ట్ పెట్టేందుకు ప్రయత్నిస్తాను" స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా ఈ ఫ్రాంచైజీ హెడ్కోచ్గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మైక్ హస్సీ వ్యవహరిస్తున్నాడు. ఈ వంద బంతుల టోర్నీ ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానుంది.ది హండ్రెడ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు..!కాగా ఈ 'ది హండ్రెడ్’ లీగ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం భారీ మొత్తం ఇన్వెస్ట్ చేశాయి. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్,సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యాలు దాదాపు రూ.3,257 కోట్లను పెట్టుబడులుగా పెట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ – సదరన్ బ్రేవ్, లక్నో సూపర్ జెయింట్స్ – మాంచెస్టర్ ఒరిజినల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ – నార్తర్న్ సూపర్చార్జర్స్ జట్లలో వాటాలు కొనుగోలు చేశాయి.చదవండి: 'ఇంత చెత్తగా ఆడుతారని ఊహించలేదు.. నన్ను క్షమించండి' -
CT 2025 Aus vs SA: టాస్ పడకుండానే కీలక మ్యాచ్ రద్దు.. ఆసీస్కు..
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య వన్డే మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే ఆట ముగిసిపోయింది. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా గ్రూప్-‘బి’లో ఉన్న ఆసీస్- ప్రొటిస్ జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.రావల్పిండి(Rawalpindi) వేదికగా జరగాల్సిన ఈ కీలక మ్యాచ్కు ఆది నుంచే వరణుడు అడ్డు తగిలాడు. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. కాస్త తెరిపినిచ్చినా మ్యాచ్ మొదలుపెట్టేందుకు సిద్ధం కాగా వర్షం మాత్రం ఆగలేదు. కాసేపు వాన ఆగినా.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ చినుకులు పడ్డాయి.కటాఫ్ టైమ్ రాత్రి 7.32 నిమిషాల వరకుఇలా ఆగుతూ, సాగుతూ దోబూచులాడిన వరణుడి కారణంగా ఆఖరికి అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం తగ్గకపోవడంతో.. మ్యాచ్ మొదలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కటాఫ్ టైమ్ రాత్రి 7.32 నిమిషాల వరకు ఉన్నప్పటికీ కనీసం ఇరవై ఓవర్ల మ్యాచ్ సాగేందుకు కూడా గ్రౌండ్ పరిస్థితి అనుకూలంగా లేదు. చెరో పాయింట్దీంతో మొదలుకాకుండానే మ్యాచ్ ముగిసిపోయినట్లు ప్రకటించిన అంపైర్లు.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంగ్లండ్- అఫ్గనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం ఆధారంగా ఈ గ్రూప్ నుంచి టోర్నీ నుంచి వైదొలిగే తొలి జట్టు ఖరారు కానుంది.ఇక తాజాగా వచ్చిన ఒక్కో పాయింట్తో బవుమా సారథ్యంలోని సౌతాఫ్రికా, స్మిత్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా చెరో మూడు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే, నెట్ రన్రేటు పరంగా పటిష్ట స్థితిలో ఉన్న ప్రొటిస్ జట్టు పట్టికలో టాప్లో కొనసాగుతుండగా.. ఆసీస్ రెండో స్థానంలో ఉంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో, ఆస్ట్రేలియా అఫ్గనిస్తాన్తో తలపడతాయి. ఇందులో విజయం సాధిస్తే గనుక ప్రొటిస్, కంగారు జట్లు నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడతాయి.ఇక చాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి. అయితే, గ్రూప్-‘ఎ’లో భాగంగా తమ తొలి రెండు మ్యాచ్లు గెలిచిన భారత్, న్యూజిలాండ్ సెమీస్ చేరగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ తమ మొదటి రెండు మ్యాచ్లలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఆసీస్కు ఇది నాలుగోసారికాగా చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో గత ఎనిమిది మ్యాచ్లలో ఆస్ట్రేలియాకు నాలుగుసార్లు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడం లేదంటే.. ఫలితం తేలకుండానే గేమ్ ముగిసిపోయింది.చాంపియన్స్ ట్రోఫీ-2025 పాయింట్ల పట్టికగ్రూప్-‘ఎ’👉న్యూజిలాండ్- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్రేటు+0.863(సెమీస్కు అర్హత)👉ఇండియా- ఆడినవవి రెండు- గెలిచినవి రెండు- పాయింట్లు నాలుగు- నెట్ రన్రేటు +0.647(సెమీస్కు అర్హత)👉బంగ్లాదేశ్- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్రేటు-0.443(ఎలిమినేటెడ్)👉పాకిస్తాన్- ఆడినవి రెండు- ఓడినవి రెండు- పాయింట్లు సున్నా- నెట్ రన్రేటు-1.087 (ఎలిమినేటెడ్)గ్రూప్-బి👉సౌతాఫ్రికా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్రేటు +2.140👉ఆస్ట్రేలియా- పూర్తైనవి రెండు- ఒక గెలుపు- ఒకటి రద్దు- పాయింట్లు మూడు- నెట్ రన్రేటు +0.475👉ఇంగ్లండ్- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్ రన్రేటు -0.475👉అఫ్గనిస్తాన్- ఆడింది ఒకటి- ఓడింది ఒకటి- పాయింట్లు సున్నా- నెట్ రన్రేటు-2.140.చదవండి: పదే పదే అవే తప్పులు.. పాక్పై గెలిచి విజయంతో ముగిస్తాం: బంగ్లాదేశ్ కెప్టెన్ -
Aus vs SA: కీలక మ్యాచ్కు వర్షం అడ్డంకి.. మ్యాచ్ రద్దు
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో కీలక మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. గ్రూప్-‘బి’లో భాగంగా ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా(Australia vs South Africa) మధ్య మంగళవారం మ్యాచ్ జరగాల్సి ఉండగా.. వరణుడి కారణంగా టాస్ ఆలస్యమైంది. రావల్పిండి(Rawalpindi)లో వర్షం కురుస్తున్న కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు.టాస్ సమయానికి(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు)మధ్యలో కాస్త తెరిపినివ్వగా కవర్లు తీయగా.. మళ్లీ కాసేపటికే చినుకులు పడ్డాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లనిమబ్బులు కమ్ముకుని ఉండటంతో ఆసీస్- ప్రొటిస్ మ్యాచ్ సజావుగా సాగే సూచనలు కనిపించడం లేదు.ఇంగ్లండ్కు తలపోటుఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-‘బి’ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ పోటీపడుతున్నాయి.గ్రూప్-‘ఎ’ నుంచి రెండేసి విజయాలతో భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. మరోవైపు.. గ్రూప్-‘బి’లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చెరో విజయంతో పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో కొనసాగుతున్నాయి.టాప్లో సౌతాఫ్రికాతమ ఆరంభ మ్యాచ్లో సౌతాఫ్రికా అఫ్గనిస్తాన్ను ఏకంగా 107 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఆసీస్ ఇంగ్లండ్పై ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఒక్కో విజయం ద్వారా ఈ రెండు జట్లకు చెరో రెండు పాయింట్లు లభించినప్పటికీ.. నెట్ రన్రేటు(+2.140) పరంగా సౌతాఫ్రికా ప్రథమ స్థానం ఆక్రమించింది.ఒకవేళ మంగళవారం నాటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. నిబంధనల ప్రకారం ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు సౌతాఫ్రికా ఖాతాలో మూడు, ఆసీస్ ఖాతాలో మూడు పాయింట్లు చేరతాయి. ఇక ఇంగ్లండ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన బట్లర్ బృందం.. తదుపరి అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికాలతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్లలో గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఇందులో ఏ ఒక్కటి ఓడినా ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక సౌతాఫ్రికా తమ తదుపరి మ్యాచ్లో నెగ్గితే మాత్రం నేరుగా సెమీ ఫైనల్కు దూసుకువెళ్తుంది. ఆస్ట్రేలియా మాత్రం ఇంగ్లండ్ మాదిరి ఇతర మ్యాచ్ల ఫలితాలు తేలేదాకా వేచి చూడాల్సి ఉంటుంది.నాడు సెమీ ఫైనల్లోఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా చివరగా 2023లో ఐసీసీ(వన్డే) ఈవెంట్లో తలపడ్డాయి. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లో నాడు సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను 212 పరుగులకు కట్టడి చేసిన ఆస్ట్రేలియా.. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో మూడు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో టీమిండియాపై విజయం సాధించి టైటిల్ విజేతగా అవతరించింది. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఒక మ్యాచ్లో విజయానికి రెండు పాయింట్లు లభిస్తాయి. మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ వస్తుంది.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.సౌతాఫ్రికా జట్టుర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డసెన్, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ, లుంగీ ఎంగిడి, తబ్రేజ్ షంసీ, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్.Update: వర్షం వల్ల టాస్ పడకుండానే ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్ రద్దుచదవండి: అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం -
AUS Vs ENG: ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ.. తుది జట్లు ఇవే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో మరో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా లహోర్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆసీస్ ఆడుతోంది.ఈ మెగా టోర్నీకి ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఆసీస్ కెప్టెన్గా స్టీవ్ స్మిత్ వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ కూడా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. గాయం కారణంగా వన్డే సిరీస్కు దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ వికెట్ కీపర్గా స్మిత్నే బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.ఆసీస్దే పైచేయి..వన్డే క్రికెట్లో ఇంగ్లండ్పై ఆస్ట్రేలియాకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు ముఖాముఖి 161 మ్యాచ్ల్లో తలపడగా.. ఆస్ట్రేలియా 91 విజయాలు, ఇంగ్లండ్ 65 మ్యాచ్ల్లో గెలుపొందింది. డు మ్యాచ్లు టై కాగా.. మూడు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇంగ్లండ్దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. తుది జట్లుఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జామీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్చదవండి: మిస్టరీ గర్ల్తో శిఖర్ ధవన్.. సోషల్మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు -
ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఇవాళ (ఫిబ్రవరి 22) బిగ్ ఫైట్ జరుగనుంది. గాయాలతో సతమతమవుతున్న వరల్డ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా.. ఇటీవలే భారత్ చేతిలో భంగపడ్డ ఇంగ్లండ్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. గ్రూప్-బిలో భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-బిలో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా.. ఆఫ్ఘనిస్తాన్ను 107 పరుగుల తేడాతో చిత్తు చేసింది.కీలక ఆటగాళ్లు దూరంఈ టోర్నీలో ఆస్ట్రేలియా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగుతుంది. కీలక ఆటగాళ్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ మార్ష్ గాయాల బారిన పడగా.. మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాల చేత ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. మరో స్టార్ ప్లేయర్ మార్కస్ స్టోయినిస్ టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆసీస్ సారథ్య బాధ్యతలను మోస్తున్నాడు.భారత్ చేతిలో భంగపాటుఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ భారత్ చేతిలో వన్డే సిరీస్ను కోల్పోయి భంగపాటుకు గురైంది. భారత్తో సిరీస్లో ఇంగ్లండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైంది. ఆసీస్తో మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. యువ ఆటగాడు జేమీ స్మిత్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. రూట్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.ఆసీస్తో వన్డే కోసం ఇంగ్లండ్ తుది జట్టు..ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..!ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటివరకు వన్డేల్లో 161 సార్లు ఎదురెదురుపడ్డాయి. ఇందులో ఆసీస్ 91 సార్లు గెలుపొందగా.. ఇంగ్లండ్ 65 మ్యాచ్ల్లో విజేతగా నిలిచింది. రెండు మ్యాచ్లు టై కాగా.. మూడు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరిది ఆధిపత్యం..?ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్, ఇంగ్లండ్ ఇప్పటివరకు 5 మ్యాచ్ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 3, ఆసీస్ 2 మ్యాచ్ల్లో గెలుపొందాయి. చివరి రెండు ఎడిషన్లలో (2013, 2017) ఇంగ్లండ్ ఆసీస్పై జయకేతనం ఎగురవేసింది. ఇక ఇరు జట్లు చివరిగా తలపడిన ఐదు వన్డేల్లో ఆసీస్ 3, ఇంగ్లండ్ 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఆసీస్ జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోస్ ఇంగ్లిస్ (వికెట్కీపర్), మాథ్యూ షార్ట్, ట్రవిస్ హెడ్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, గ్లెన్ మ్యాక్స్వెల్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిష్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా, నాథన్ ఇల్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ -
MLC రిటెన్షన్ జాబితా విడుదల.. అత్యధికంగా ఆస్ట్రేలియా ప్లేయర్లను అట్టిపెట్టుకున్న ఫ్రాంచైజీలు
ఫిబ్రవరి 19న జరుగనున్న డ్రాఫ్ట్కు (వేలం) ముందు మేజర్ లీగ్ క్రికెట్ (Major League Cricket-2025) ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను (విదేశీ ఆటగాళ్లు) ప్రకటించాయి. ఈ లీగ్లో పాల్గొనే ఆరు ఫ్రాంచైజీలు మొత్తం 23 మంది విదేశీ స్టార్లను అట్టిపెట్టుకున్నాయి. ఫ్రాంచైజీలు అత్యధికంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. ఈ జట్టు నుంచి ఏడుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుంచి చెరో నలుగురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్నాయి.డిఫెండింగ్ ఛాంపియన్ వాషింగ్టన్ ఫ్రీడం అత్యధికంగా 6 మంది విదేశీ స్టార్లను రీటైన్ చేసుకుంది. రిటైన్ చేసుకున్న వారిలో కెప్టెన్ స్టీవ్ స్మిత్, విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్, ఆసీస్ ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్, మార్కో జన్సెన్, లోకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర ఉన్నారు.గత సీజన్ రన్నరప్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్ తమ కీలక విదేశీ స్టార్లందరినీ రీటైన్ చేసుకుంది. యూనికార్న్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో హరీస్ రౌఫ్, ఫిన్ అలెన్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, మాథ్యూ షార్ట్ ఉన్నారు.కేకేఆర్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ విదేశీ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ను రీటైన్ చేసుకుంది.తొలి సీజన్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ కీరన్ పోలార్డ్, నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ను అట్టిపెట్టుకుంది.సియాటిల్ ఓర్కాస్.. సౌతాఫ్రికా స్లార్లు హెన్రిచ్ క్లాసెన్, ర్యాన్ రికెల్టన్లను రీటైన్ చేసుకుంది.టెక్సాస్ సూపర్కింగ్స్.. ఫాఫ్ డుప్లెసిస్, డెవాన్ కాన్వే, నూర్ అహ్మద్, మార్కస్ స్టోయినిస్ను రీటైన్ చేసుకుంది.అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న స్వదేశీ ఆటగాళ్ల జాబితాలను ఇదివరకే ప్రకటించాయి. కాగా, యూఎస్ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో ఎంఐ న్యూయార్క్ తొలి సీజన్ (2023) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన రెండో సీజన్లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడం ఛాంపియన్గా నిలిచింది. -
ఆస్ట్రేలియాను చిత్తు చేసిన శ్రీలంక..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహకాలను ఘనంగా ఆరంభించాలని భావించిన ఆస్ట్రేలియాకు శ్రీలంక ఊహించని షాకిచ్చింది. కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 49 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించారు. 215 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ 33.5 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలింది.లంక స్పిన్నర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. స్టీవ్ స్మిత్, లబుషేన్ వంటి స్టార్ ఆటగాళ్లు సైతం ప్రత్యర్ధి స్పిన్నర్ల ముందు తేలిపోయారు. వచ్చిన వారు వచ్చినట్టగా పెవిలియన్కు క్యూ కట్టారు. శ్రీలంక బౌలర్లలో మహేష్ థీక్షణ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దునిత్ వెల్లలాగే, అసితా ఫెర్నాండో తలా రెండు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ అసలంక, హసరంగా చెరో వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో అలెక్స్ క్యారీ(41) టాప్ స్కోరర్గా నిలవగా.. హార్దీ(32), సీన్ అబాట్(20) పర్వాలేదన్పించారు. కమ్మిన్స్, స్టార్క్, మాక్స్వెల్ వంటి స్టార్ ప్లేయర్లు లేని లోటు ఈ మ్యాచ్లో కన్పించింది.అసలంక విరోచిత సెంచరీ..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అయితే లంక కెప్టెన్ చరిత్ అసలంక మాత్రం విరోచిత పోరాటం కనబరిచాడు. సహచరులందరూ విఫలమైన చోట అసలంక అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. 126 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో అసలంక 127 పరుగులు చేశాడు. అతడితో పాటు దునిత్ వెల్లలాగే(30) కీలక పరుగులు సాధించారు.మిగతా ఆటగాళ్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఈల్లీస్, జాన్సన్, హార్దే తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఫిబ్రవరి 14న ఇదే వేదికలో జరగనుంది. కాగా ఇంతకుముందు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రెండో వన్డే అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గోనేందుకు పాకిస్తాన్కు ఆస్ట్రేలియా పయనం కానుంది. అయితే ఈ మెగా టోర్నీకి ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ పాటు జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, మార్ష్ వంటి స్టార్ ప్లేయర్లు గాయం కారణంగా దూరమయ్యాడు. తాజాగా ఈ ఈవెంట్ కోసం అప్డేటడ్ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు..స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిష్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబూషన్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా. [ట్రావెలింగ్ రిజర్వ్: కూపర్ కొన్నోలీ]చదవండి: వారెవ్వా!.. శుబ్మన్ గిల్ ప్రపంచ రికార్డు -
చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్గా అరుదైన రికార్డు
అహ్మదాబాద్ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా రికార్డులకెక్కాడు. ఓవరాల్గా ఈ జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉన్నాడు.కాగా గత కొంతకాలంగా కోహ్లి వరుస వైఫల్యాలతో సతమవుతున్న విషయం తెలిసిందే. గత పన్నెండు ఇన్నింగ్స్లో అతడు చేసిన పరుగులు వరుసగా 4, 1, 5, 100*, 7, 11, 3, 36, 5, 17, 6, 6. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)లోనైనా కోహ్లి ఫామ్లోకి వస్తాడని భావిస్తే.. మోకాలి గాయం కారణంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.కేవలం ఐదు పరుగులుఅనంతరం కటక్లో జరిగిన రెండో వన్డేతో పునరాగమనం చేసిన కోహ్లి పూర్తిగా విఫలమయ్యాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ సాయంతో కేవలం ఐదు పరుగులు చేసి నిష్క్రమించాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు.ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డేలోనైనా బ్యాట్ ఝులిపిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కోహ్లి ఓ అరుదైన ఘనత సాధించడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. కాగా కోహ్లి ఇంగ్లండ్పై ఇప్పటి వరకు ఎనిమిది శతకాలు బాదడంతో పాటు 23 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సగటు 41.23.హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లిఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ఇప్పటికే 2-0తో సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుని భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే, ఆదిలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుటయ్యాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో ఫిల్ సాల్ట్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ కోహ్లి(52), ఓపెనర్ శుబ్మన్ గిల్ ఇద్దరూ అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో సాల్ట్కు క్యాచ్ ఇచ్చిన కోహ్లి అవుటయ్యాడు.ఇక ఈ మ్యాచ్లో శుబ్మన్ గిల్ శతకం(112) బాదగా..శ్రేయస్ అయ్యర్(78), కేఎల్ రాహుల్(40) రాణించారు. ఫలితంగా నిర్ణీత యాభై ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది.అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు1. డాన్ బ్రాడ్మన్(ఆస్ట్రేలియా)- 63 ఇన్నింగ్స్లో 5028 పరుగులు2. అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా)- 124 ఇన్నింగ్స్లో 4850 పరుగులు3. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 114 ఇన్నింగ్స్లో 4815 పరుగులు4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 84 ఇన్నింగ్స్లో 4488 పరుగులు5. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 99 ఇన్నింగ్స్లో 4141 పరుగులు6. విరాట్ కోహ్లి(ఇండియా)-109 ఇన్నింగ్స్లో 4001కి పైగా పరుగులు.చదవండి: ఆఖరికి అతడికి జట్టులో స్థానమే లేకుండా చేశారు: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. డబుల్ సెంచరీ.. తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు
ఆసీస్ తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ల్లో 200 క్యాచ్లు పూర్తి చేసుకున్న తొలి ఆస్ట్రేలియన్గా రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో స్మిత్ మొత్తం ఐదు క్యాచ్లు పట్టుకున్నాడు. స్మిత్ క్యాచ్ల్లో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో రికీ పాంటింగ్ (Ricky Ponting) రికార్డును అధిగమించాడు. 🚨 HISTORY BY STEVEN SMITH. 🚨- Smith becomes the first ever Australian fielder to complete 200 catches in Tests. 🙇♂️pic.twitter.com/3T2v9jgcid— Mufaddal Vohra (@mufaddal_vohra) February 9, 2025పాంటింగ్ 287 ఇన్నింగ్స్ల్లో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ 205 ఇన్నింగ్స్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. ఆసీస్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టుకున్న నాన్ వికెట్కీపర్ల జాబితాలో స్మిత్, పాంటింగ్ తర్వాతి స్థానంలో మార్క్ వా ఉన్నాడు. మార్క్ వా 209 ఇన్నింగ్స్ల్లో 181 క్యాచ్లు పట్టుకున్నాడు.ఓవరాల్గా ఐదో క్రికెటర్టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఐదుగురు మాత్రమే 200 క్యాచ్లు పూర్తి చేశారు. వీరిలో టీమిండియా గ్రేట్ రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) 210 క్యాచ్లతో (164 టెస్ట్ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ (152 టెస్ట్ల్లో 207), మహేళ జయవర్దనే (149 టెస్ట్ల్లో 205), జాక్ కల్లిస్ (166 టెస్ట్ల్లో 200) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. శ్రీలంకతో మ్యాచ్లో స్మిత్ కల్లిస్ సరసన చేరడంతో పాటు 200 క్యాచ్ల క్లబ్లో చేరిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. అలాగే టెస్ట్ల్లో అత్యంత వేగవంతంగా 200 క్యాచ్లు పూర్తి చేసిన ఆటగాడిగానూ స్మిత్ రికార్డు నెలకొల్పాడు. స్మిత్ కేవలం 116 టెస్ట్ల్లోనే 200 క్యాచ్లు పూర్తి చేశాడు. స్మిత్ మరో 11 క్యాచ్లు పడితే టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొడతాడు.లంకతో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఐదు క్యాచ్లు పట్టిన స్మిత్.. బ్యాటింగ్లోనూ చెలరేగి టెస్ట్ల్లో 36వ సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీతో స్మిత్ టెప్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం స్మిత్, జో రూట్ తలో 36 సెంచరీలతో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది.అంతకుముందు స్మిత్ లంకతో జరిగిన తొలి టెస్ట్లోనూ సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో స్మిత్ టెస్ట్ల్లో 10000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్కు దూరం కాగా.. అతని గైర్హాజరీలో స్మిత్ ఆసీస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించాడు. తొలి టెస్ట్లోనూ ఘన విజయం సాధించిన ఆసీస్.. రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఊడ్చేసింది. ఫిబ్రవరి 12, 14 తేదీల్లో ఆసీస్.. శ్రీలంకతో రెండు వన్డేలు ఆడనుంది. -
ఆస్ట్రేలియా ఆధిపత్యం.. డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్ర
శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. తద్వారా పద్నాలుగేళ్ల తర్వాత లంక గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలుపును నమోదు చేసింది. అంతేకాదు.. మరో అరుదైన ఘనతనూ తన ఖాతాలో వేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2023-25 సీజన్లో ఇప్పటికే ఆసీస్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే.స్మిత్ కెప్టెన్సీలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ను సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ డబ్ల్యూటీసీ సీజన్లో ఆఖరిగా శ్రీలంకతో రెండు టెస్టులు ఆడింది. గాలె వేదికగా జరిగిన ఈ సిరీస్కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. స్టీవ్ స్మిత్ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు.స్మిత్ కెప్టెన్సీలో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులోనూ శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆసీస్.. లంకను 257 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కంగారూ జట్టుకు 157 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ స్మిత్(131)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(156) శతకాలతో చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 414 పరుగులు చేసింది.ఆ తర్వాత శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన స్మిత్ బృందం కేవలం ఒక వికెట్ కోల్పోయి కథ ముగించింది. డబ్ల్యూటీసీలో సరికొత్త చరిత్రకాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఆస్ట్రేలియాకు ఇది 33వ విజయం. తద్వారా డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది.కాగా 2019లో డబ్ల్యూటీసీ మొదలుకాగా.. ఇప్పటి వరకు 53 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా 33 విజయాలు సాధించి.. పదకొండు మ్యాచ్లలో ఓడిపోయింది. తొమ్మిది మ్యాచ్లు డ్రా చేసుకుంది. ఇక ఈ జాబితాలో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. 65 మ్యాచ్లు పూర్తి చేసుకున్న స్టోక్స్ బృందం 32 మ్యాచ్లలో గెలిచి.. 25 మ్యాచ్లలో ఓడింది. ఎనిమిది మ్యాచ్లు డ్రా చేసుకుంది.మూడో స్థానంలో టీమిండియాఇక డబ్ల్యూటీసీ తొలి రెండు సీజన్లలో ఫైనల్కు చేరగలిగిన టీమిండియా మూడో స్థానంలో ఉంది. 56 మ్యాచ్లకు గానూ 31 గెలిచి.. 19 ఓడి.. రెండు డ్రా చేసుకుంది. కాగా డబ్ల్యూటీసీ అరంగేట్ర విజేతగా న్యూజిలాండ్ నిలవగా.. రెండో సీజన్లో ఆస్ట్రేలియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక తాజా ఎడిషన్లో టైటిల్ కోసం ఆసీస్ సౌతాఫ్రికాతో తలపడనుంది.ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది. లంకతో సిరీస్కు ముందే డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించిన ఆసీస్ జట్టు చివరకు 67.54 విజయాల శాతంతో రెండో స్థానం దక్కించుకుంది. రెండేళ్ల వ్యవధిలో 19 టెస్టు మ్యాచ్లు ఆడిన ఆసీస్ 13 విజయాలు, 4 పరాజయాలు, 2 ‘డ్రా’లు నమోదు చేసుకుంది.మరోవైపు దక్షిణాఫ్రికా 69.44 విజయాల శాతంతో పట్టిక ‘టాప్’ ప్లేస్ దక్కించుకుంది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. గత రెండు పర్యాయాలు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన భారత జట్టు 50.00 విజయాల శాతంతో పట్టికలో మూడో స్థానానికి పరిమితమైంది. చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. -
రెండో టెస్టులో శ్రీలంక ఓటమి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2023-25ను ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక నిర్ధేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.శ్రీలంక నిర్ధేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కంగారులు కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖావాజా(27), మార్నస్ లబుషేన్(26) ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ముగించారు. అంతకుముందు 211/8 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకే ఆలౌటైంది. దీంతో పర్యాటక ఆసీస్ ముందు కేవలం 75 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే శ్రీలంక ఉంచగల్గింది.కాగా లంక బ్యాటర్లలలో సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (149 బంతుల్లో 76; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఈ మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకనున్న సీనియర్ బ్యాటర్ దిముత్ కరుణరత్నే (14) ఎక్కువసేపు నిలువలేకపోగా... పతుమ్ నిషాంక (8), దినేశ్ చండిమాల్ (12), కమిందు మెండిస్ (14), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (23) విఫలమయ్యారు. ఆ్రస్టేలియా బౌలర్లలో మాథ్యూ కునేమన్, నాథన్ లియోన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టగా.. వెబ్స్టెర్ రెండు వికెట్లు సాధించాడు.ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 414 పరుగుల భారీ స్కోర్ చేయగా..శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 257 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కునేమన్, నాథన్ లియోన్ సత్తాచాటారు. రెండు ఇన్నింగ్స్ల కలిపి కునేమన్, లియోన్ చెరో ఏడు వికెట్లు పడగొట్టారు.కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ను ఓడించి ఆసీస్ తమ డబ్ల్యూటీసీ బెర్త్ను ఖారారు చేసుకుంది. జూన్11 నుంచి జూన్ 15 వరకు లార్డ్స్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో కంగారులు తలపడనున్నారు.చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా -
చరిత్ర సృష్టించిన స్మిత్.. ప్రపంచంలో తొలి ప్లేయర్గా
టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్, స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) పరుగులు వరద పారిస్తున్నాడు. శ్రీలంకతో తొలి టెస్టు సూపర్ సెంచరీతో మెరిసిన స్మిత్.. రెండో టెస్టులోనూ తన బ్యాట్కు పనిచెప్పాడు.ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో స్మిత్ అద్బుతమైన శతకంతో చెలరేగాడు. 254 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 131 పరుగులు చేశాడు. కాగా మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో స్మిత్ అలెక్స్ క్యారీతో కలిసి నాలుగో వికెట్కు 259 పరుగులు జోడించాడు. తద్వారా ఓ అరుదైన స్మిత్ను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో 11 మంది ఆటగాళ్లతో 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తొలి బ్యాటర్గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ టెస్టుల్లో 10 మంది ఆటగాళ్లతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తాజా మ్యాచ్తో రికీ ఆల్టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.చరిత్ర సృష్టించిన అలెక్స్-స్మిత్..అదే విధంగా ఈ మ్యాచ్లో అభేధ్యమైన భాగస్వామ్యం నెలకొల్పిన అలెక్స్ క్యారీ, స్టీవ్ స్మిత్ జోడీ సైతం ఓ అరుదైన ఫీట్ను తమ పేరిట లిఖించుకున్నారు. శ్రీలంక గడ్డపై నాలుగో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పర్యాటక జట్టు జోడీ వీరిద్దరూ నిలిచారు.గతంలో ఈ రికార్డు మైకెల్ హస్సీ-షాన్ మార్ష్ పేరిట ఉండేది. 2011లో పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్లో హస్సీ-షాన్ మార్ష్ 258 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్తో దిగ్గజ క్రికెటర్ల రికార్డును స్మిత్-అలెక్స్ జోడీ బ్రేక్ చేశారు. -
శ్రీలంకతో రెండో టెస్టు.. విజయం ముంగిట ఆస్ట్రేలియా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(48), నిషాన్ పెర్రిస్(0) ఉన్నారు. అయితే లంక జట్టు ప్రస్తుతం 54 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆస్ట్రేలియా బౌలర్లలో కునేమన్ 4 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియోన్ మూడు, వెబ్స్టర్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు 330/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంబించిన ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 414 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారులకు తొలి ఇన్నింగ్స్లో 157 పరుగుల ఆధిక్యం లభించింది.స్మిత్, కేరీ సెంచరీల మోత..కాగా మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్మిత్, కేరీ లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జంట ఆడుతూ పాడుతూ పరుగులు చేయడంతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఈ క్రమంలో స్మిత్ 191 బంతుల్లో టెస్టుల్లో 36వ సెంచరీ నమోదు చేసుకోగా... కేరీ 118 బంతుల్లో టెస్టుల్లో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్కు 239 పరుగులు జోడించారు.ఇక శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జై సూర్య ఐదు వికెట్లతో సత్తాచాటగా.. పెర్రిస్ మూడు, మెండిస్ రెండు వికెట్లు సాధించారు. అదేవిధంగా శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (139 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లయన్, కునేమన్ తలా 3 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి సిరీస్లో 1–0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉంది.చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని -
సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(Steve Smith) మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో అద్బుత క్యాచ్లను అందుకున్న స్మిత్.. తాజాగా మరోసారి తన సంచలన ఫీల్డింగ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు.గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్.. నాలుగో బంతిని దనుంజయ డిసిల్వాకు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శ్రీలంక కెప్టెన్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి సిల్వా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ తన కుడివైపునకి డైవ్ చేస్తూ సింగల్ హ్యాండ్తో సంచలన క్యాచ్ను అందుకున్నాడు. అది చూసిన డిసిల్వా బిత్తరపోయాడు. చేసేదేమి లేక డిసిల్వా(23) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.స్మిత్ సరికొత్త చరిత్ర..కాగా ఈ మ్యాచ్లో స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్లో ప్రబాత్ జైసూర్య క్యాచ్ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు.పాంటింగ్ 287 ఇన్నింగ్స్లలో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ ఇప్పటివరకు 205 ఇన్నింగ్స్లలో 198 క్యాచ్లను తీసుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్లలో ద్రవిడ్.. 210 క్యాచ్లను తీసుకున్నాడు.స్మిత్ 12 క్యాచ్లను అందుకుంటే రాహుల్ ద్రవిడ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. కాగా ఈ మ్యాచ్లో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్లోనూ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్లో స్మిత్(131) సెంచరీతో మెరిశాడు. తద్వారా ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting)ను స్మిత్ అధిగమించాడు.చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్కు భారీ షాక్.. OUTSTANDING from Steve Smith 😮What. A. Catch. #SLvAUS pic.twitter.com/mVIJLZWbGI— 7Cricket (@7Cricket) February 8, 2025 -
విరాట్ కోహ్లిని అధిగమించిన స్టీవ్ స్మిత్
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. టెస్ట్ల్లో స్టీవ్కు ఇది 36వ సెంచరీ. ఈ సెంచరీతో స్టీవ్ పలు రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు (జో రూట్తో కలిసి) చేసిన ఆటగాడిగా నిలిచాడు. రూట్, స్టీవ్ ప్రస్తుతం టెస్ట్ల్లో తలో 36 సెంచరీలు చేశారు.టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ ఐదో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (51) అగ్రస్థానంలో ఉండగా.. జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.విరాట్ను అధిగమించిన స్టీవ్విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (Virat Kohli) అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకు విదేశాల్లో 16 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో స్టీవ్ విదేశీ సెంచరీల సంఖ్య 17కు పెరిగింది. తాజా సెంచరీతో స్టీవ్.. అలిస్టర్ కుక్, బ్రియాన్ లారా సరసన చేరాడు. కుక్, లారా ఇద్దరూ విదేశాల్లో తలో 17 టెస్ట్ సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్టీవ్.. విదేశీ టెస్ట్ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు (7) చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (120), అలెక్స్ క్యారీ (139) అజేయ సెంచరీలతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 73 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు. -
SL VS AUS 2nd Test: శతక్కొట్టిన అలెక్స్ క్యారీ.. ఆధిక్యంలో ఆస్ట్రేలియా
గాలే వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరుగుతున్న రెండో టెస్ట్లో ఆసీస్ (Australia) వికెట్కీపర్ బ్యాటర్ ఆలెక్స్ క్యారీ (Alex Carey) శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో ఐదో స్థానంలో బరిలోకి దిగిన క్యారీ.. 117 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో రెండో టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్యారీ తన సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. క్యారీ తన తొలి టెస్ట్ సెంచరీని 2022 బాక్సింగ్ డే టెస్ట్లో సాధించాడు.MOST TEST HUNDREDS IN ASIA BY WICKET-KEEPER BATTERS FROM AUSTRALIA:Adam Gilchrist - 4Alex Carey - 1* pic.twitter.com/E7yGUofiiB— Johns. (@CricCrazyJohns) February 7, 2025ఈ మ్యాచ్లో క్యారీకి ముందు స్టీవ్ స్మిత్ (Steve Smith) కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్కు టెస్ట్ల్లో ఇది 36వ శతకం. స్మిత్, క్యారీ సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వెళ్లింది. 74 ఓవర్ల అనంతరం తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ స్కోర్ 309/3గా ఉంది. క్యారీ (123), స్మిత్ (115) సెంచరీల అనంతరం అదే జోరుతో ఇన్నింగ్స్లను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.కాగా, రెండు టెస్ట్ మ్యాచ్లు, రెండు వన్డేల సిరీస్ల కోసం ఆస్ట్రేలియా శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో ఆసీస్ ఇన్నింగ్స్ 242 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఉస్మాన్ ఖ్వాజా (232) డబుల్ సెంచరీతో కదంతొక్కగా.. జోష్ ఇంగ్లిస్ (102), స్టీవ్ స్మిత్ (141) సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 165 పరుగులకే ఆలౌటై ఫాలో ఆన్ ఆడింది. సెకెండ్ ఇన్నింగ్స్లోనూ (247 ఆలౌట్) లంక పరిస్థితి మారలేదు. ఫలితంగా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ బౌలర్లు కుహ్నేమన్ 9, నాథన్ లయోన్ 7 వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించారు.టెస్ట్ సిరీస్ అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో కొలొంబో వేదికగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య రెండు వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఆసీస్ ఇక్కడి నుంచే నేరుగా పాకిస్తాన్కు వెళ్తుంది (ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు). ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 22న ఆడుతుంది. లాహోర్లో జరిగే ఆ మ్యాచ్లో ఆసీస్.. ఇంగ్లండ్తో తలపడుతుంది. -
స్టీవ్ స్మిత్ ఖాతాలో 36వ టెస్ట్ శతకం.. రూట్ రికార్డు సమం
ఆస్ట్రేలియా తాత్కాలిక సారధి స్టీవ్ స్మిత్ (Steve Smith) టెస్ట్ల్లో 36వ శతకాన్ని నమోదు చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో స్మిత్ ఈ ఘనత సాధించాడు. ఈ శతకాన్ని స్మిత్ 191 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో పూర్తి చేశాడు. స్మిత్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకున్నాడు. లంక పర్యటనలో స్మిత్కు ఇది వరుసగా రెండో సెంచరీ. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లోనూ స్మిత్ శతక్కొట్టాడు. THE MAN, THE MYTH, THE LEGEND - ITS STEVE SMITH IN TEST CRICKET 🦁 pic.twitter.com/phZ6XlCX9T— Johns. (@CricCrazyJohns) February 7, 2025తాజా సెంచరీతో స్మిత్ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) రికార్డును సమం చేశాడు. రూట్, స్మిత్ టెస్ట్ల్లో తలో 36 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్గా పిలువబడే వారిలో ప్రస్తుతం స్మిత్, రూట్ అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు. కేన్ విలియమ్సన్ (Kane Williamson) 33, విరాట్ కోహ్లి (Virat Kohli) 30 సెంచరీలతో స్మిత్, రూట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. స్మిత్, రోహిత్ శర్మ తలో 48 అంతర్జాతీయ శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ (81 సెంచరీలు) టాప్లో ఉండగా.. రూట్ (52) రెండు, కేన్ విలియమ్సన్ (46) నాలుగో స్థానంలో ఉన్నారు.తాజా సెంచరీ స్మిత్కు టెస్ట్ కెప్టెన్గా 17వ సెంచరీ. ఈ సెంచరీ స్మిత్కు ఆసియాలో 7, శ్రీలంకలో 4వది. ఈ సెంచరీతో స్మిత్ ఆసియాలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా అవతరించాడు. ఆసియాలో అలెన్ బోర్డర్ 6, రికీ పాంటింగ్ 5 సెంచరీలు చేశారు. ఈ సెంచరీతో స్మిత్ టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్, రూట్తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. సచిన్ తర్వాతి స్థానాల్లో జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38) ఉన్నారు.టెస్ట్ల్లో స్మిత్ సెంచరీలు..ఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్లో 8శ్రీలంకలో 4భారత్లో 3న్యూజిలాండ్లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్లో 1మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టెస్ట్లో స్మిత్ శతక్కొట్టడంతో ఆసీస్ ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆసీస్ 10 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. 68 ఓవర్ల అనంతరం ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. స్మిత్కు జతగా క్రీజ్లో ఉన్న అలెక్స్ క్యారీ (92) కూడా శతకానికి చేరువయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో హెడ్ 21, ఉస్మాన్ ఖ్వాజా 36, లబూషేన్ 4 పరుగులు చేసి ఔటయ్యారు. లంక బౌలర్లలో నిషాన్ పెయిరిస్ 2, ప్రభాత్ జయసూర్య ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చండీమల్ (74), కుసాల్ మెండిస్ (85 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి శ్రీలంకుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న దిముత్ కరుణరత్నే 36 పరుగులకే ఔటయ్యాడు. రమేశ్ మెండిస్ (28), కమిందు మెండిస్ (13), పథుమ్ నిస్సంక (11) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కుహ్నేమన్, లయోన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రవిస్ హెడ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
స్టీవ్ స్మిత్ సరికొత్త చరిత్ర.. ఆసీస్ తొలి బ్యాటర్గా అరుదైన ఫీట్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) అద్బుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. శ్రీలంక(Sri Lanka vs Australia)తో రెండో టెస్టులోనూ ఈ కుడిచేతి వాటం ఆటగాడు సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో ఇటీవలే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న స్మిత్.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించాడు.ఆల్టైమ్ రికార్డు బద్దలుఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకువచ్చాడు. కాగా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్మిత్ మళ్లీ ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే.భారత్తో బ్రిస్బేన్ టెస్టులో 101 పరుగులు సాధించిన స్మిత్.. మెల్బోర్న్లో భారీ శతకం(140)తో చెలరేగాడు. అనంతరం.. శ్రీలంక పర్యటనలో భాగంగా తొలి టెస్టులోనూ తాత్కాలిక స్మిత్ శతక్కొట్టాడు. గాలె మ్యాచ్లో 141 పరుగులతో చెలరేగి జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ సందర్భంగానే టెస్టు ఫార్మాట్లో పదివేల పరుగుల క్లబ్లో కూడా చేరాడు.ఇక తాజాగా లంకతో రెండో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ శతకం దిశగా పయనిస్తున్నాడు. ఈ క్రమంలో ఆసియా గడ్డ మీద పందొమ్మిది వందలకు పైగా పరుగులు పూర్తి చేసుకుని.. ఆస్ట్రేలియా తరఫున హయ్యస్ట్ రన్స్కోరర్గా నిలిచాడు. లంకతో రెండో టెస్టు భోజన విరామ సమయానికి స్మిత్.. ఆసియాలో 1917 పరుగులు పూర్తి చేసుకున్నాడు.కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిసిన స్మిత్ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆతిథ్య లంకను ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఆసీస్ చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం నుంచి గాలెలో రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. ఆసీస్ బౌలర్ల విజృంభణ కారణంగా 257 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ఆలౌట్ అయింది.ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా అదరగొడుతోంది. ఓపెనర్లు ట్రవిస్ హెడ్(22 బంతుల్లో 21), ఉస్మాన్ ఖవాజా(57 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(4) మరోసారి విఫలమయ్యాడు.ఈ దశలో స్మిత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. అతడికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ వేగంగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి నిలకడైన ప్రదర్శన కారణంగా 55 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 215 పరుగుల వద్ద నిలిచింది.ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు 👉స్టీవ్ స్మిత్: 23 మ్యాచ్లలో సగటు 50.35తో 1917+ పరుగులు. అత్యధిక స్కోరు- 178*- శతకాలు ఆరు.👉రిక్కీ పాంటింగ్: 28 మ్యాచ్లలో సగటు 41.97తో 1889 పరుగులు- అత్యధిక స్కోరు 150- శతకాలు ఐదు👉అలెన్ బోర్డర్: 22 మ్యాచ్లలో సగటు 54.51తో 1799తో 1799 పరుగులు- అత్యధిక స్కోరు 162- శతకాలు ఆరు👉మాథ్యూ హెడెన్: 19 మ్యాచ్లలో 50.39 సగటుతో 1663 పరుగులు- అత్యధిక స్కోరు 203- శతకాలు నాలుగు👉ఉస్మాన్ ఖవాజా: 17 మ్యాచ్లలో 61.76 సగటుతో 1544 పరుగులు- అత్యధిక స్కోరు 232- శతకాలు ఐదు. -
చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు సమం
ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న ఆస్ట్రేలియా ఆటగాడిగా రికీ పాంటింగ్ రికార్డు సమం చేశాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో కమిందు మెండిస్ క్యాచ్ను అందుకున్న ఈ స్మిత్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. పాంటింగ్ 287 ఇన్నింగ్స్లలో 196 క్యాచ్లు అందుకోగా.. స్మిత్ కేవలం 205 ఇన్నింగ్స్లలో సరిగ్గా 196 క్యాచ్లు అందుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్గా వరల్డ్ క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్లలో ద్రవిడ్.. 210 క్యాచ్లను తీసుకున్నాడు. స్మిత్ 14 క్యాచ్లను అందుకుంటే రాహుల్ ద్రవిడ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశముంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో కాస్త తడబడుతోంది. 71 ఓవర్లకు శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్(35), రమేష్ మెండిస్(20) ఆచితూచి ఆడుతున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఇప్పటివరకు నాథన్ లియోన్ మూడు వికెట్లు పడగొట్టగా..మిచెల్ స్టార్క్, మథ్యూ కుహ్నమెన్, హెడ్ తలా వికెట్ సాధించారు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి టెస్టులో లంకను మట్టికర్పించింది.ఈ మ్యాచ్ను డ్రా ముగించినా చాలు సిరీస్ ఆసీస్ 1-0 సొంతం చేసుకుంటుంది. శ్రీలంక టూర్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఆసీస్ జట్టును స్మిత్ ముందుండి నడ్పిస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కూడా ఆస్ట్రేలియా జట్టు పగ్గాలను స్మిత్ చేపట్టే అవకాశముంది.ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా కమ్మిన్స్ దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జోష్ హెజిల్వుడ్, మిచిల్ మార్ష్ గాయం కారణంగా దూరం కాగా.. తాజాగా స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిష్ పూర్తిగా వన్డే క్రికెట్కే విడ్కోలు పలికాడు.196TH TEST CATCH STEVE SMITH. 😱Steve Smith is on the verge of creating another record. This batter is top-class, and he is also a Superman in fielding. He has taken 196 catches so far, and with one more catch, he will break Ponting's record.Most Test catches for Australia by… pic.twitter.com/fKtqYvYEVs— All Cricket Records (@Cric_records45) February 6, 2025 -
‘చాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం’
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) టోర్నమెంట్లో ఆస్ట్రేలియాను ముందుండి నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు స్టీవ్ స్మిత్(Steve Smith) ప్రకటించాడు. ప్యాట్ కమిన్స్(Pat Cummins) అందుబాటులోకి రాకపోతే కెప్టెన్సీ చేపట్టేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.అయితే, ఈ మెగా ఈవెంట్కు ముందు ఆస్ట్రేలియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్తో పాటు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయాల బారిన పడగా.. కెప్టెన్ కమిన్స్ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ముగ్గురు ఐసీసీ టోర్నీకి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్వయంగా ధ్రువీకరించాడు.చారిత్రాత్మక విజయంకాగా టీమిండియాతో స్వదేశంలో ప్రతిష్టాత్మ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు ప్యాట్ కమిన్స్. పదేళ్ల తర్వాత ఈ సిరీస్ గెలిచి తన కెప్టెన్సీ రికార్డులలో ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైన కమిన్స్... చీలమండ గాయానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అదే విధంగా తన భార్య తమ రెండో సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా దూరంగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో కమిన్స్ స్థానంలో మాజీ సారథి స్మిత్ లంక టూర్లో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కమిన్స్ ఇంకా కోలుకోలేదని హెడ్కోచ్ మెక్డొనాల్డ్ బుధవారం వెల్లడించాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం‘కమిన్స్ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటి వరకు ఇంకా శిక్షణ కూడా మొదలు పెట్టలేదు. ఇలాంటి స్థితిలో అతడు నేరుగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అసాధ్యం. మరోవైపు.. పేసర్ హాజల్వుడ్ కూడా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు’ అని మెక్డొనాల్డ్ తెలిపాడు.ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో స్టీవ్ స్మిత్ లేదంటే ట్రవిస్ హెడ్ ఆస్ట్రేలియా సారథులుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పందించిన స్మిత్ మెగా టోర్నీలో నాయకుడిగా ఉండేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మనసులోని మాటను వెల్లడించాడు. ‘‘ఈ విషయం గురించి నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాఅయితే, జట్టు గురించి పూర్తి అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం నేను టెస్టు సిరీస్ మీద దృష్టి సారించాను. ఈ సిరీస్ గెలిచిన తర్వాత వన్డేలపైకి దృష్టి మళ్లిస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ చేయడం నాకు మరింత ఇష్టం.ఆటపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలన్న విషయంపై స్పష్టత ఉంది. పరిస్థితులకు తగ్గట్లుగా పావులు కదపడాన్ని నేను ఎంతగానో ఇష్టపడతా. సారథిగా ఉండటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తా’’ అని స్టీవ్ స్మిత్ తెలిపాడు.కాగా శ్రీలంక పర్యటనలో భాగంగా తొలుత టెస్టు సిరీస్ జరుగుతోంది. గాలెలో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య లంక జట్టును ఆస్ట్రేలియా ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో స్మిత్ అద్భుత శతకం(141)తో మెరిశాడు.ఇక ఇరుజట్ల మధ్య అదే వేదికపై గురువారం ఆఖరిదైన రెండో టెస్టు మొదలైంది. అనంతరం లంక- ఆసీస్ మధ్య రెండు వన్డేలు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులకు ఫిబ్రవరి 12 వరకు అవకాశం ఉంది.చాంపియన్స్ ట్రోఫీకి ఆసీస్(ప్రాథమిక) జట్టు..పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్వుడ్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.చదవండి: Rohit Sharma: బుమ్రా గాయంపై అప్డేట్.. వరుణ్ చక్రవర్తి పోటీలో ఉంటాడు! -
శ్రీలంకను మట్టికరిపించిన ఆస్ట్రేలియా.. లంకేయుల రికార్డు ఓటమి
శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా(Sri Lanka vs Australia) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ ఇప్పటికే ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.అయితే, ఈ ఎడిషన్లో ఆఖరిగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చింది. ఈ టూర్లో భాగంగా రెండు వన్డేలు కూడా ఆడనుంది. ఈ క్రమంలో తొలుత గాలె వేదికగా బుధవారం లంక- ఆసీస్ జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది.ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) డబుల్ సెంచరీ(232)తో చెలరేగగా.. ట్రవిస్ హెడ్ మెరుపు అర్ధ శతకం(40 బంతుల్లో 57) బాదాడు. స్మిత్, ఇంగ్లిస్ శతకాలుమిగతా వాళ్లలో వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) మరోసారి విఫలం కాగా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుత శతకం(141)తో దుమ్ములేపాడు. ఇక టెస్టు అరంగేట్రంలోనే జోస్ ఇంగ్లిష్ సెంచరీ(102)తో మెరిసి తన విలువను చాటుకోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(46 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. టెయిలెండర్లలో బ్యూ వెబ్స్టర్(23), మిచెల్ స్టార్క్(19 నాటౌట్) తమ శక్తిమేర పరుగులు రాబట్టారు.ఈ క్రమంలో 154 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఉన్న వేళ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో స్పిన్నర్లు ప్రబాత్ జయసూర్య, జెఫ్రీ వాండర్సే మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. ఇక తమ తొలి ఇన్నింగ్స్లో ఆరంభం నుంచే శ్రీలంక తడబడింది.కంగారూ స్పిన్నర్ల ధాటికి కుదేలుఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో, దిముత్ కరుణరత్నె ఏడేసి పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. వన్డౌన్లో వచ్చిన దినేశ్ చండిమాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. అయితే, ఆసీస్ స్పిన్నర్ అద్భుత బంతితో చండిమాల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో లంక బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా పతనమైంది.మిగతా వాళ్లలో ఏంజెలో మాథ్యూస్(15), కెప్టెన్ ధనంజయ డి సిల్వ(22), వికెట్ కీపర్ కుశాల్ మెండిస్(21) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీంతో 165 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియాన్ మూడు వికెట్లు కూల్చాడు. పేసర్ మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు దక్కాయి.ఫాలో ఆన్ గండం.. తప్పని ఓటమిఅయితే, తమ తొలి ఇన్నింగ్స్లో లంక కనీసం సగం కూడా స్కోరు చేయకపోవడంతో.. ఆస్ట్రేలియా ధనంజయ బృందాన్ని ఫాలో ఆన్ ఆడించింది. ఈ క్రమంలో వెంటనే తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శ్రీలంక 247 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్పిన్నర్లు కుహ్నెమన్, నాథన్ లియాన్ ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటారు. ఓపెనర్లు ఒషాడా ఫెర్నాండో(6), దిముత్ కరుణరత్నె(0) మరోసారి విఫలం కాగా.. మిడిలార్డర్ బ్యాటర్లు కాసేపు నిలబడ్డారు. చండిమాల్ 31, ఏంజెలో మాథ్యూస్ 41, కమిందు మెండిస్ 32, ధనంజయ డి సిల్వ 39, కుశాల్ మెండిస్ 34 పరుగులు చేశారు. ఇక ఆఖర్లో జెఫ్రీ వాండర్సే ఒక్కడే అర్ధ శతకం(53) చేయగలిగాడు.లంక క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమిఅయితే, ఆస్ట్రేలియా స్కోరుకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన శ్రీలంక.. ఇన్నింగ్స్ 242 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతిపెద్ద పరాజయాన్ని నమోదు చేసింది. ఉస్మాన్ ఖవాజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.చదవండి: హర్షిత్ బదులు అతడిని పంపాల్సింది.. ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డు.. టీమిండియాను వెనక్కి నెట్టి టాప్లోకి!
టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఫామ్లోకి వచ్చిన ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్(Steve Smith).. తన జోరును కొనసాగిస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులో భారీ శతకం(140) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. భారత్ ఆఖరిదైన సిడ్నీ టెస్టులో మొత్తంగా 37 పరుగులు చేసి.. 9999 పరుగుల వద్ద నిలిచాడు. తాజాగా శ్రీలంక(Australia vs Sri Lanka)తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో పది వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్గా స్మిత్ చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డుఅతడి కంటే ముందు.. అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్(Ricky Ponting) ఈ ఫీట్ నమోదు చేశారు. అయితే, తాజాగా స్మిత్ పదివేల టెస్టు పరుగుల మైలురాయిని అందుకున్న క్రమంలో ఆస్ట్రేలియా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. టెస్టు క్రికెట్లో ఒక దేశం తరఫున అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఈ మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇంతకు ముందు ఈ జాబితాలో టీమిండియాతో కలిసి ఆసీస్ అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు భారత్ను వెనక్కి నెట్టి వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్లో ఆసీస్ జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియాను 3-1తో ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్లో ఆఖరిగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు కంగారూ జట్టు శ్రీలంకకు వచ్చింది.ఖవాజా డబుల్ ధమాకాఈ క్రమంలో గాలె అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య బుధవారం తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్గా ప్రమోట్ అయిన ట్రవిస్ హెడ్ ధనాధన్ దంచికొట్టి అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 40 బంతుల్లో 57 పరుగులు సాధిస్తే.. ఖవాజా ఏకంగా 352 బంతులు ఎదుర్కొని 232 రన్స్ చేశాడు.స్మిత్ రికార్డు సెంచరీమరోవైపు.. వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(20) తన వైఫల్యాన్ని కొనసాగించగా.. నాలుగో స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు. మొత్తంగా 251 బంతులు ఫేస్ చేసిన స్మిత్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 141 పరుగులతో సత్తా చాటాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో 35వ టెస్టు సెంచరీ నమోదు చేసిన 36 ఏళ్ల స్మిత్.. పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.సెంచరీల పరంగా రెండోస్థానంలోకి‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్ టెస్టు సెంచరీల పరంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ లిస్టులో ఇంగ్లండ్ టెస్టు దిగ్గజం జో రూట్ 36 శతకాలతో ప్రథమస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 33, టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి 30 సెంచరీలతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.అంతేకాదు.. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో కలిపి శతకాల పరంగా నాలుగో స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ స్థాయిలో విరాట్ కోహ్లి 81 శతకాలతో టాప్(Active Cricketers)లో ఉండగా.. రూట్ 52, రోహిత్ శర్మ 48, స్మిత్ 47 సెంచరీలతో టాప్-4లో నిలిచారు.ఇక శ్రీలంకతో మ్యాచ్లో ఖవాజా(232), స్మిత్(141)లతో పాటు జోష్ ఇంగ్లిస్ కూడా బ్యాట్ ఝులిపించాడు. 94 బంతుల్లోనే 102 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఆరు వికెట్ల నష్టానికి 654 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు- ఏ దేశం తరఫున ఎందరు?👉ఆస్ట్రేలియా- నలుగురు- అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రిక్కీ పాంటింగ్, స్టీవ్ స్మిత్👉ఇండియా- ముగ్గురు- సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్👉ఇంగ్లండ్- ఇద్దరు- అలిస్టర్ కుక్, జో రూట్👉శ్రీలంక- ఇద్దరు- కుమార్ సంగక్కర, మహేళ జయవర్దనే👉వెస్టిండీస్- ఇద్దరు- బ్రియన్ లారా, శివ్నరైన్ చందర్పాల్👉పాకిస్తాన్- ఒక్కరు- యూనిస్ ఖాన్👉సౌతాఫ్రికా- ఒక్కరు- జాక్వెస్ కలిస్.చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్ -
చరిత్ర సృష్టించిన స్మిత్, ఖావాజా.. తొలి ఆసీస్ జోడీగా
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రోజు ఆటలో లంక బౌలర్ల భరతం పట్టిన ఆసీస్ బ్యాటర్లు.. రెండో రోజు ఆటలో సైతం అదే తీరును కనబరుస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా కంగారూ జట్టు సాగుతోంది. 117 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో కేవలం 3 వికెట్లు కోల్పోయి 486 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖావాజా డబుల్ సెంచరీతో మెరిశాడు. . 290 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్సర్తో ఖావాజా తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మరోవైపు ఆసీస్ సూపర్ స్టార్ స్మివ్ స్మిత్ కూడా సూపర్ సెంచరీతో సత్తాచాటాడు. 251 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో స్మిత్ 141 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో స్పిన్నర్ వాండర్సే బౌలింగ్లో ఎల్బీగా స్మిత్ వెనుదిరిగాడు.అరుదైన రికార్డు..కాగా మూడో వికెట్కు ఉస్మాన్ ఖావాజా, స్టీవ్ స్మిత్ మూడో వికెట్కు 266 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని వీరిద్దరూ నెలకొల్పారు. తద్వారా ఓ అరుదైన రికార్డును ఈ వెటరన్ ద్వయం తమ ఖాతాలో వేసుకుంది. శ్రీలంక గడ్డపై టెస్టుల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆస్ట్రేలియన్ జోడీగా వీరిద్దరూ రికార్డులకెక్కారు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ దిగ్గజాలు ఆడమ్ గిల్క్రిస్ట్, డామియన్ మార్టిన్ పేరిట ఉండేది. 2004లో కాండే వేదికగా జరిగిన లంకతో జరిగిన టెస్టులో గిల్లీ, మార్టిన్ 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తాజా మ్యాచ్తో గిల్లీ-డామియన్ ఆల్టైమ్ రికార్డును ఖావాజా-స్మిత్ బ్రేక్ చేశారు.కాగా ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్ ఫైనల్ బెర్త్ను ఆస్ట్రేలియా ఖారారు చేసుకున్న సంగతి తెలిసిందే. టీమిండియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. వరుసగా రెండో సారి డబ్ల్యూటీసీ ఫైనల్కు ఆర్హత సాధించింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియాకు ఇదే ఆఖరి సిరీస్. ఈ సిరీస్కు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆస్ట్రేలియా ఆడుతోంది.చదవండి: RT 2025: హ్యాట్రిక్తో చెలరేగిన శార్ధూల్.. టీమిండియాలోకి రీ ఎంట్రీకి సిద్దం -
స్టీల్ స్మిత్...
లెగ్ స్పిన్నర్గా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ కుర్రాడు... క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్లు ఆడి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందాడు. చిత్రవిచిత్రమైన స్టాన్స్తో ప్రత్యర్థి బౌలర్లను తికమక పెట్టడమే పనిగా పెట్టుకున్న అతడు... సుదీర్ఘ ఇన్నింగ్స్లకు కేరాఫ్ అడ్రస్గా మారాడు. ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తిరిగి వచ్చాక తన పరుగుల దాహం తీరనిదని నిరూపించుకున్నాడు. టెస్టు క్రికెట్లో రెండు వేర్వేరు దేశాలపై 10కిపైగా సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన ఆ ప్లేయర్... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 15వ ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. మనం ఇంత సేపు చెప్పుకున్నది ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ గురించే. శ్రీలంకతో తొలి టెస్టు ద్వారా 10 వేల పరుగుల మైలురాయిని దాటిన నాలుగో ఆస్ట్రేలియా ప్లేయర్పై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడా విభాగం టెక్నిక్లో విరాట్ కోహ్లిని సమం చేయలేకపోయినా... నిలకడలో జో రూట్ని తలపించకపోయినా... క్లాసిక్ షాట్లలో కేన్ విలియమ్సన్తో పోటీ పడలేకపోయినా... భారీగా పరుగులు చేయడంలో మాత్రం స్టీవ్ స్మిత్ ఈ ముగ్గురికి ఏమాత్రం తీసిపోడు. ఆధునిక క్రికెట్లో ‘ఫ్యాబ్–4’గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురిలో ఇప్పటికే ఇంగ్లండ్ మాజీ సారథి రూట్ (12,972) పది వేల పరుగుల మైలురాయి దాటగా... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ (10,103) ఈ క్లబ్లో చేరాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ (9,276), భారత మాజీ సారథి కోహ్లి (9,230) ఈ జాబితాలో కాస్త వెనక ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో భారీగా పరుగులు చేయడం అలవాటుగా మార్చుకున్న స్మిత్... 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్పైనే స్మిత్ ఈ మార్క్ అందుకుంటాడు అనుకుంటే... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 4 పరుగుల వద్ద అవుటై... 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. గతంలో ఆస్ట్రేలియా నుంచి 10 వేల పరుగుల మైలురాయి దాటిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా సిడ్నీలోనే ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించగా... తాజాగా స్మిత్ గాలే స్టేడియంలో ఆ జాబితాలో చేరాడు. 55 కంటే ఎక్కువ సగటుతో... మ్యాచ్ల సంఖ్య పరంగా చూసుకుంటే స్మిత్ 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయి దాటి... సంగక్కరతో కలిసి వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. బ్రియాన్ లారా 111వ టెస్టులోనే ఈ మార్క్ దాటి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్నింగ్స్ల పరంగా స్మిత్ (205) ఐదో స్థానంలో ఉన్నాడు. లారా (195 ఇన్నింగ్స్లు), సచిన్ టెండూల్కర్ (195 ఇన్నింగ్స్లు), కుమార సంగక్కర (195 ఇన్నింగ్స్లు), రికీ పాంటింగ్ (196 ఇన్నింగ్స్లు) ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న వారిలో స్మిత్ మూడో అత్యుత్తమ సగటు (56.44) నమోదు చేసుకున్నాడు. పాంటింగ్ (58.72), టెండూల్కర్ (57.61) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో తొలి 20 టెస్టుల్లో దాదాపు లెగ్స్పిన్నర్గానే జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్... ఆ తర్వాత ఆడిన 50 టెస్టుల్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. వరుసగా 78వ టెస్టు మ్యాచ్లో 55 కంటే ఎక్కువ సగటుతో బ్యాటింగ్ చేసిన తొలి ప్లేయర్గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ వరుసగా 65 టెస్టుల్లో 55కు పైగా సగటుతో బ్యాటింగ్ చేశాడు. 2015లో చివరిసారి స్మిత్ సగటు 55 కంటే తక్కువ నమోదైంది. ఆ తర్వాత భారీ ఇన్నింగ్స్లు ఆడుతూ ముందుకు సాగిన స్మిత్ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు. గోడకు కొట్టిన బంతిలా... అటు ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్, ఇటు భారత్తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరుగుల వరద పారించిన స్మిత్... దశాబ్ద కాలానికి పైగా ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ రెండు సిరీస్ల్లోనూ స్మిత్ తనదైన ముద్ర వేశాడు. చాన్నాళ్లుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వస్తున్న స్మిత్... ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించేందుకు కూడా వెనుకాడలేదు. ఆసీస్ తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడి జట్టును గెలిపించడమే తన లక్ష్యమని గతంలో పలుమార్లు వెల్లడించిన స్మిత్... దక్షిణాఫ్రికా సిరీస్లో ‘బాల్ ట్యాంపరింగ్’తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సంఘటన అనంతరం తన తప్పేం లేదని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన స్మిత్... నిషేధం ముగించుకొని తిరిగి వచ్చాక ఇతర ఆటగాళ్ల సారథ్యంలోనూ అంతే నిబద్ధతతో ఆడాడు. గోడకు కొట్టిన బంతిలా విజృంభించి విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్పై ఇప్పటి వరకు 12 శతకాలు బాదిన స్మిత్... ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో సెంచరీని కలుపుకుంటే టీమిండియాపై 11 శతకాలు కొట్టాడు. రెండు వేర్వేరు జట్లపై 10కి పైగా టెస్టు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ స్మిత్ మాత్రమే అంటే అతడి నిలకడ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంటా బయటా అనే తేడా లేకుండా పరుగుల దాహంతో దూసుకుపోతున్న స్మిత్ ఇదే జోరు కొనసాగిస్తే... అతడి ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయమే! -
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్.. 35వ టెస్ట్ సెంచరీ.. ఉస్మాన్ ఖ్వాజా కూడా..!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్ స్మిత్ 179 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో 35వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లలో) స్మిత్కు ఇది 47వ సెంచరీ. శ్రీలంక గడ్డపై మూడవది (టెస్ట్ల్లో).Steve Smith with yet another 100 It's his 35th test 100✨ pic.twitter.com/4ppbWFEehc— Schrödinger (@srhnation) January 29, 2025టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఏడవ స్థానానికి ఎగబాకాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్ కల్లిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), జో రూట్ (36), రాహుల్ ద్రవిడ్ (36) మాత్రమే టెస్ట్ల్లో స్మిత్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు.తాజా సెంచరీతో స్మిత్ ఫాబ్ ఫోర్లో (టెస్ట్ సెంచరీల పరంగా) రెండో స్థానానికి ఎగబాకాడు. 36 సెంచరీలతో రూట్ అగ్రస్థానంలో ఉండగా.. 33 సెంచరీలతో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో, 30 సెంచరీలతో విరాట్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ సెంచరీతో స్మిత్ ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో నాలుగో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ (81) అగ్రస్థానంలో నిలువగా.. రూట్ (52) రెండో స్థానంలో, రోహిత్ శర్మ (48) మూడో స్థానంలో, స్మిత్ (47) నాలుగులో, కేన్ విలియమ్సన్ (46) ఐదో స్థానంలో ఉన్నారు.వివిధ దేశాల్లో స్మిత్ చేసిన సెంచరీలుఆస్ట్రేలియాలో 18ఇంగ్లండ్లో 8భారత్లో 3శ్రీలంకలో 3న్యూజిలాండ్లో 1సౌతాఫ్రికాలో 1వెస్టిండీస్లో 135వ సెంచరీకి ముందు స్మిత్ ఇదే మ్యాచ్లో 10000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఈ ఇన్నింగ్స్ తొలి బంతికే స్మిత్ ఈ ఘనత సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు.205వ ఇన్నింగ్స్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న స్మిత్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) ఈ ఫీట్ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ మాత్రమే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్లోనే ఉన్నారు.తన టెస్ట్ కెరీర్లో 114 మ్యాచ్లు ఆడిన స్మిత్ 56కు పైగా సగటుతో 10100* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 35 సెంచరీలు, 41 అర్ద సెంచరీలు ఉన్నాయి.ఇదే మ్యాచ్లో మరో ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (Usman Khawaja) కూడా సెంచరీ చేశాడు. ఖ్వాజా 135 బంతుల్లో 8 బౌండరీలు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని 147 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవలికాలంలో పెద్దగా ఫామ్లో లేని ఖ్వాజాకు ఏడాదిన్నర తర్వాత ఇదే తొలి సెంచరీ. టెస్ట్ల్లో ఖ్వాజాకు ఇది 16వ శతకం. ఇటీవల భారత్తో ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఖ్వాజా దారుణంగా నిరాశపరిచాడు (కేవలం 20.44 సగటున పరుగులు చేశాడు).16TH TEST CENTURY FOR USMAN KHAWAJA - A TERRIFIC KNOCK. 💯pic.twitter.com/H2jliMrAVy— Mufaddal Vohra (@mufaddal_vohra) January 29, 2025ఖ్వాజా, స్మిత్ సెంచరీతో కదంతొక్కడంతో లంకతో తొలి టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 81.1 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. మ్యాచ్ ముగియడానికి కొద్ది సేపటి ముందు వర్షం మొదలుకావడంతో అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ (40 బంతుల్లో 57; 10 ఫోర్లు, సిక్స్) చెలరేగి మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. వన్డౌన్ బ్యాటర్ లబూషేన్ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రభాత జయసూర్య, జెఫ్రీ వాండర్సేలకు తలో వికెట్ దక్కింది. -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. 10000 పరుగుల క్లబ్లో చేరిక
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో 10000 పరుగుల క్లబ్లో చేరాడు. గాలే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్ట్లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. 9999 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను ప్రారంభించిన స్టీవ్.. తొలి బంతికే 10000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టీవ్ ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు. 10000 పరుగుల మార్కును తన 205వ ఇన్నింగ్స్లో అధిగమించిన స్టీవ్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్ల పరంగా) ఈ ఫీట్ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.There it is!Steve Smith is the fourth Australian to reach 10,000 Test runs 🙌#SLvAUS pic.twitter.com/06FLk8iqMI— 7Cricket (@7Cricket) January 29, 2025టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ ఒక్కడే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్లోనే ఉన్నారు. రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ (Kane Williamson), విరాట్ కోహ్లిలను (Virat Kohli) ఈ జమానా ఫాబ్ ఫోర్గా కీర్తిస్తారు. స్టీవ్ తన 115 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 205 ఇన్నింగ్స్లు ఆడి 56.18 సగటున 10056* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ 74 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) చాలాకాలం తర్వాత సెంచరీతో మెరువగా, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ అర్ద సెంచరీలతో రాణించారు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా తన సెంచరీలో 8 బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు హెడ్ వికెట్ దక్కగా.. జెఫ్రీ వాండర్సేకు లబూషేన్ (20) వికెట్ దక్కింది.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ (రెండు వన్డేలు కూడా) కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరింది. జూన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. సౌతాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా కమిన్స్ ఈ సిరీస్లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా స్టీవ్ స్మిత్ ఆసీస్కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఈ సిరీస్లో ట్రవిస్ హెడ్కు ప్రమోషన్ లభించింది. మిడిలార్డర్ బ్యాటింగ్కు దిగే హెడ్.. తొలి టెస్ట్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే హెడ్ ఓపెనింగ్ స్థానంలో తనదైన మార్కును చూపించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్గా బరిలోకి దిగే హెడ్.. ఇక్కడ కూడా అదే తరహా చెలరేగిపోయాడు. -
ట్రావిస్ హెడ్కు ప్రమోషన్..
గాలే వేదికగా శ్రీలంకతో బుధవారం(జనవరి29) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ఆస్ట్రేలియా అన్ని విధాల సిద్దమైంది. ఈ రెండు మ్యాచ్ల సిరీస్ కోసం దుబాయ్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో కంగారులు తీవ్రంగా శ్రమించారు.లంక స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా స్పిన్ ట్రాక్లను ఏర్పా టు చేసుకుని మరి ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేసింది. ఈ టూర్కు ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టు కెప్టెన్గా వ్యహరించనున్నాడు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2023-25లో ఆసీస్కు ఇదే ఆఖరి సిరీస్. కాగా ఆసీస్ ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ను ఓడించి డబ్ల్యూటీసీ ఫైనల్లో కమ్మిన్స్ సేన అడుగుపెట్టింది.ఆసీస్ ఓపెనర్గా ట్రావిస్ హెడ్..ఇక శ్రీలంకతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్గా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగనున్నాడు. ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ను హెడ్ ప్రారంభించనున్నాడు. జట్టులో సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్స్వీనీ ఉన్నప్పటికి ఆసీస్ టీమ్ మెనెజ్మెంట్ మాత్రం హెడ్కే ప్రాధాన్యత ఇచ్చింది.హెడ్ సాధరణంగా వైట్ బాల్ ఫార్మాట్లో ఆసీస్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తుంటాడు. టెస్టుల్లో మాత్రం ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తుంటాడు. అయితే రెడ్బాల్ క్రికెట్లో కూడా అతడు ఓపెనింగ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో మరోసారి అతడిని ఓపెనర్గా పంపి పరీక్షించాలని ఆస్ట్రేలియా టీమ్ మెనెజ్మెంట్ మాత్రం భావిస్తుంది.ఈ విషయాన్ని ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధ్రువీకరించాడు. కాగా వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్లగా నాథన్ మెక్స్వీనీ, సామ్ కాన్స్టాస్కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. నాథన్ మెక్స్వీనీ విఫలమైనప్పటికి కాన్స్టాస్ మాత్రం తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అయినప్పటకి లంకతో సిరీస్కు అతడికి ఓపెనర్గా చోటు దక్కలేదు.ట్రావిస్ హెడ్ మా ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. టాపార్డర్డ్లో కూడా అతడు తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తాడని భావిసతున్నాను. అతడు ఏ పొజిషేన్లోనైనా ఒకేలా బ్యాటింగ్ చేస్తాడు. గతంలో భారత్లో అతడు ఓపెనర్గా వచ్చి అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. దీంతో సెలక్టర్లు మరోసారి ఛాన్స్ ఇచ్చారు అని ప్రీమ్యాచ్ కాన్ఫరెన్స్లో స్మిత్ పేర్కొన్నాడు. ఓపెనర్గా మూడు టెస్టులు ఆడిన ట్రావిస్.. 223 పరుగులు చేశాడు.కాగా హెడ్ అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో 448 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు.శ్రీలంకతో టెస్టులకు ఆసీస్ జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టోడ్ మర్ఫీ చదవండి: Rohit Sharma: కొంపదీసి అందుకోసమేనా ఇదంతా?: గావస్కర్ -
ఆసీస్కు గుడ్ న్యూస్.. ఫిట్నెస్ టెస్టులో కెప్టెన్ పాస్
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందు ఆస్ట్రేలియా గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టాండ్-ఇన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్లో సిడ్నీ సిక్సర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. ఆడిలైడ్ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ మోచేతికి గాయమైంది. దీంతో అతడు శ్రీలంక సిరీస్ కోసం దుబాయ్లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరానికి ఆసీస్ జట్టుతో పాటు వెళ్లలేదు.ఈ క్రమంలో అతడు శ్రీలంక పర్యటనకు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ సోమవారం నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో ఈ ఆసీస్ సూపర్ స్టార్ పాసయ్యాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అతడికి తిరిగి జట్టులో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా ఇదే ఆఖరి సిరీస్ కావడం గమనార్హం. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకున్న ఆసీస్.. తమ ఫైనల్ సిరీస్లో కూడా విజయ భేరి మ్రోగించాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టీవ్ స్మిత్(Steve Smith ) జట్టు పగ్గాలు చేపట్టాడు.అదే విధంగా ఈ సిరీస్కు ఆసీస్ సెలక్టర్లు యువ సంచలనం కూపర్ కొన్నోలీకి తొలిసారి పిలుపునిచ్చారు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పదేళ్ల తర్వాత బీజీటీని కంగారులు రిటైన్ చేసుకున్నారు.లంకతో సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: జడేజా స్ధానంలో అతడికి ఛాన్స్ ఇవ్వాల్సింది: ఆకాష్ చోప్రా -
స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) విధ్వంసకర శతకంతో మెరిశాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ను ఊచకోత కోసి.. 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ 2024- 25(Big Bash League 2024-25 )లో సిడ్నీ సిక్సర్స్- పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్ సందర్భంగా స్మిత్ ఈ మేర బ్యాట్ ఝులిపించాడు.బిగ్ రికార్డు.. ఫాస్టెస్ట్గా మూడు సెంచరీలుఓవరాల్గా టీ20 ఫార్మాట్లో స్మిత్కు ఇది నాలుగో సెంచరీ కాగా.. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో మూడోది. తద్వారా లీగ్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా బెన్ మెక్డెర్మాట్(3)ను రికార్డును అతడు సమం చేశాడు. అయితే, మెక్డెర్మాట్(Ben McDermott) మూడు శతకాలు బాదడానికి 100 మ్యాచ్లు అవసరం కాగా.. స్మిత్ తన 32వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించాడు.కాగా బీబీఎల్లో స్మిత్ సిడ్నీ సిక్సర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్ తాజా ఎడిషన్లో అతడికి ఇదే తొలి మ్యాచ్. ఇటీవల టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీబిజీగా గడిపిన ఈ ఆసీస్ సీనియర్ బ్యాటర్.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో శతకం బాది ఫామ్లోకి వచ్చాడు. లంక టూర్లో సారథిగాఇక ఈ ఐదు టెస్టు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 3-1తో భారత జట్టుపై గెలిచిన కంగారూలు.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. అనంతరం.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు అక్కడికి వెళ్లనుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించునున్నాడు. అయితే, జనవరి 29 నుంచి ఆసీస్ లంక టూర్ మొదలుకానుంది. ఈ గ్యాప్లో స్మిత్ బీబీఎల్లో ఎంట్రీ ఇచ్చి.. తొలి మ్యాచ్లోనే సెంచరీతో దుమ్ములేపాడు.ఈలోపు బీబీఎల్లో ఎంట్రీసిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడిన సిడ్నీ సిక్సర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జోష్ ఫిలిప్(9) విఫలం కాగా.. మరో ఓపెనర్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అరవై నాలుగు బంతుల్లోనే 121 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా పది ఫోర్లతో పాటు ఏడు సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కర్టిస్ పాటర్సన్(12) నిరాశపరచగా.. కెప్టెన్ మోయిజెస్ హెండ్రిక్స్ మెరుపు ఇన్నింగ్స్(28 బంతుల్లో 46) ఆడాడు. ఇక బెన్ డ్వార్షుయిస్ ధనాధన్ దంచికొట్టి కేవలం ఏడు బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. స్మిత్తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు స్కోరు చేసింది.ఆఖరి వరకు పోరాడినాఇక లక్ష్య ఛేదనకు దిగిన పెర్త్ స్కార్చర్స్కు ఓపెనర్ సామ్ ఫానింగ్(41) శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్(15) నిరాశపరిచాడు. మిగతా వాళ్లలో కూపర్ కొన్నోలీ(33), మాథ్యూ కెప్టెన్(17 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించారు. ఇక ఆష్టన్ టర్నర్(32 బంతుల్లో 66 నాటౌట్) ఆఖరి వరకు పోరాడాడు. కానీ అప్పటికే బంతులు అయిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన పెర్త్ జట్టు 206 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా సిడ్నీ పద్నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది. సిడ్నీ సిక్సర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’Steve Smith is something else 😲 Here's all the highlights from his 121* off 64 balls. #BBL14 pic.twitter.com/MTo82oWAv1— KFC Big Bash League (@BBL) January 11, 2025 -
ఆస్ట్రేలియాకు భారీ షాక్!.. చాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ దూరం?
‘కెప్టెన్గా టీమిండియాపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడమే నాకున్న అతిపెద్ద లోటు.. ఈసారి ఎలాగైనా ఆ పని పూర్తిచేస్తాను’.. భారత్తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అనుకున్నట్లుగానే ఈసారి కంగారూ జట్టుకు ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని అందించాడు ఈ స్టార్ పేసర్.సుదీర్ఘ నిరీక్షణకు తెరబౌలర్గా, కెప్టెన్గా తనదైన వ్యూహాలతో 3-1తో టీమిండియాను ఓడించి.. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. అంతేకాదు.. తన కెప్టెన్సీలో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్తో పాటు కమిన్స్పై కూడా తీవ్రమైన భారం పడింది.స్కాట్ బోలాండ్, స్టార్క్ నుంచి సహకారం అందినా.. కమిన్స్ కూడా వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌల్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కమిన్స్ గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. శ్రీలంక పర్యటనకు టెస్టు జట్టును ప్రకటించిన సందర్భంగా ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ ఈ విషయాన్ని వెల్లడించాడు.చీలమండ గాయంకాగా సొంతగడ్డపై టీమిండియాపై టెస్టు సిరీస్ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. కమిన్స్ ఈ టూర్కు దూరం కాగా.. అతడి డిప్యూటీ స్టీవ్ స్మిత్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాల గురించి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘కమిన్స్కు వ్యక్తిగతంగా కాస్త పని ఉంది. అయితే, అతడు జట్టుకు దూరం కావడానికి అదొక్కటే కారణం కాదు.అతడు చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. వచ్చే వారం అతడు స్కానింగ్కు వెళ్తాడు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే గాయంపై పూర్తి స్పష్టత వస్తుంది’’ అని తెలిపాడు. కాగా కమిన్స్ గాయం గనుక తీవ్రతరమైతే ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లే.చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎదురుదెబ్బఎందుకంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ సమీపిస్తోంది. ఫిబ్రవరి 19- మార్చి 9 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. టోర్నీ మొదలయ్యేనాటికి కమిన్స్ పూర్తి ఫిట్గా లేనట్లయితే.. ఈ వన్డే వరల్డ్కప్-2023 చాంపియన్కు కష్టాలు తప్పవు. కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆటగాడిగా, కెప్టెన్గా సత్తా చాటాడు కమిన్స్. ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆసీస్ను చాంపియన్గా నిలిపాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్లతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్-‘బి’లో ఉంది. ఇందులో భాగంగా తమ తొలి మ్యాచ్లో ఆసీస్ లాహోర్ వేదికగా ఫిబ్రవరి 22న ఇంగ్లండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ నేపథ్యంలో భారత జట్టు తటస్థ వేదికైన దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతుంది.శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, ట్రవిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్పీ, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్.చదవండి: ‘చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు ఇదే.. వాళ్లిద్దరికి నో ఛాన్స్!’ -
ఆస్ట్రేలియా కెప్టెన్గా స్టీవ్ స్మిత్..
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో ఆస్ట్రేలియా తమ ఆఖరి సిరీస్కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకున్న ఆసీస్.. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో లంకతో సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.స్టార్క్కు నో రెస్ట్..అదే విధంగా ఈ సిరీస్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యాడు.భారత్తో జరిగిన సిరీస్లో గాయపడిన హాజిల్వుడ్.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్లైన్ పేసర్లగా ఉన్నారు.యువ సంచలనానికి పిలుపు..ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్బాష్ లీగ్లో పెర్త్స్కార్చర్స్ తరపున ఆడుతున్నాడు.ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్తో అద్బుతమైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భారత్తో టెస్టు సిరీస్కు దూరంగా ఉన్న స్పిన్నర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జట్టులోకి వచ్చారు. అదేవిధంగా బీజీటీలో అదరగొట్టిన సామ్ కాన్స్టాస్, వెబ్స్టార్లను శ్రీలంక సిరీస్కు కూడా ఆసీస్ సెలక్టర్లు కొనసాగించారు.ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్చదవండి: 'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్' -
స్మిత్, లబుషేన్ మైండ్గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో నిష్క్రమించాడు.పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లిఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్డౌన్ బ్యాటర్ శుబ్మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్లో స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు. గిల్ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్ను ఉద్దేశించి అన్నాడు. ఇచ్చి పడేసిన గిల్!ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్తో అన్నాడు.కానీ మనోడికే భంగపాటుదీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్ను ఒడిసిపట్టాడు. అలా శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్కు తెరపడింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు. బుమ్రా మెరుపులుఆఖర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
అద్భుతమైన టెస్టు.. ఆఖరికి మాదే పైచేయి.. వాళ్లిద్దరు సూపర్: కమిన్స్
మెల్బోర్న్ టెస్టు అద్భుతంగా సాగిందని.. ఆఖరికి తామే పైచేయి సాధించడం పట్ల సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) హర్షం వ్యక్తం చేశాడు. బంతితో పాటు బ్యాట్తోనూ తాను రాణించడం సంతృప్తినిచ్చిందని పేర్కొన్నాడు. ట్రవిస్ హెడ్కు బాల్ ఇవ్వడం వెనుక తమ కోచ్ హస్తం ఉందని.. ఈ విషయంలో క్రెడిట్ ఆయనకే ఇస్తానని కమిన్స్ తెలిపాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా సొంతగడ్డపై టీమిండియా(India vs Australia)తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్ మ్యాచ్లో ఓడిన కంగారూ జట్టు.. అడిలైడ్ టెస్టుతో విజయాన్ని రుచిచూసింది. అనంతరం బ్రిస్బేన్ టెస్టు వర్షం వల్ల డ్రా కాగా.. ఇరుజట్లు మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో నాలుగో టెస్టు జరిగింది.340 పరుగుల లక్ష్యంఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులు చేసిన కంగారూలు.. భారత్ను 369 పరుగులకు కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకు ఆలౌట్ అయిన కమిన్స్ బృందం.. టీమిండియాకు 340 పరుగుల లక్ష్యాన్ని విధించింది.అయితే, సోమవారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా 155 పరుగులకే ఆలౌట్ కావడంతో.. ఆసీస్ 184 రన్స్ తేడాతో జయభేరి మోగించింది. తద్వారా సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక ఈ మ్యాచ్లో మొత్తంగా 90(49, 41) పరుగులు చేయడంతో పాటు.. కమిన్స్ ఆరు వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.మాదే పైచేయిఈ క్రమంలో విజయానంతరం కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన టెస్టు మ్యాచ్ ఆడాము. ప్రేక్షకులు కూడా మాకు మద్దతుగా నిలిచారు. వారి నుంచి అద్భుత స్పందన లభించింది. విజయంలో నా పాత్ర కూడా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను.లబుషేన్(72, 70), స్మిత్(140, 13 ) రాణించడం వల్ల పటిష్ట స్థితిలో నిలిచాం. నిజానికి ఈరోజు తొలి సెషన్లో మాదే పైచేయి. కానీ అనూహ్య రీతిలో వాళ్లు పుంజుకుని.. రెండో సెషన్లో రాణించారు. అయితే, మేము మాత్రం సానుకూల దృక్పథంతోనే ఉన్నాము.ఫీల్డింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఇక హెడ్తో బౌలింగ్ చేయించాలన్నది మా కోచ్ ఆలోచనే. ఆ విషయంలో క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తాను. జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని పేర్కొన్నాడు. సిడ్నీ టెస్టులోనూ ఇదే తరహా ఫలితం పునరావృతం చేస్తామని కమిన్స్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా ఈ మ్యాచ్లో బ్యాటర్గా విఫలమైన ట్రవిస్ హెడ్(0, 1) రిషభ్ పంత్(Rishabh Pant-30) రూపంలో కీలక వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పడంలో సహాయం చేశాడు.చదవండి: మానసిక వేదన.. అందుకే ఓడిపోయాం.. నితీశ్ రెడ్డి మాత్రం అద్భుతం: రోహిత్ శర్మ -
IND Vs AUS: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సెంచరీతో మెరిశాడు. టెస్ట్ల్లో స్టీవ్కు భారత్పై ఇది 11వ సెంచరీ (43 ఇన్నింగ్స్ల్లో). ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు భారత్పై ఇన్ని టెస్ట్ సెంచరీలు చేయలేదు. స్టీవ్ తర్వాత ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ (10) భారత్పై అత్యధిక టెస్ట్ సెంచరీలు చేశాడు.SMUDGE 🔥pic.twitter.com/NavtFc0nFN— CricTracker (@Cricketracker) December 27, 2024టెస్ట్ల్లో భారత్పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లుస్టీవ్ స్మిత్ 11జో రూట్ 10గ్యారీ ఫీల్డ్ సోబర్స్ 8వివ్ రిచర్డ్స్ 8రికీ పాంటింగ్ 8వరుసగా రెండో సెంచరీస్టీవ్కు ఇది కెరీర్లో 34వ టెస్ట్ సెంచరీ. మెల్బోర్న్లో ఐదవది. టెస్ట్ల్లో స్టీవ్కు వరుసగా ఇది రెండో సెంచరీ. గబ్బా వేదికగా భారత్తో జరిగిన మూడో టెస్ట్లోనూ స్టీవ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ తన సెంచరీ మార్కును 167 బంతుల్లో చేరుకున్నాడు. ఇందులో రెండు సిక్స్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.రెండో రోజు లంచ్ విరామం సమయానికి స్టీవ్ 139 పరుగలతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా స్టార్క్ (15) క్రీజ్లో ఉన్నాడు. 113 ఓవర్లలో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 454/7గా ఉంది. రెండో రోజు తొలి సెషన్లో ఆసీస్ పాట్ కమిన్స్ (49) వికెట్ కోల్పోయింది.309/6 వద్ద ఆస్ట్రేలియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. ఆసీస్ బ్యాటర్లలో కాన్స్టాస్(60), ఖావాజా(57), లబుషేన్(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. జడేజా 2, ఆకాష్ దీప్, సుందర్ తలో వికెట్ దక్కించుకున్నారు.విరాట్ రికార్డును అధిగమించిన స్టీవ్టెస్ట్ల్లో స్టీవ్ విరాట్ పేరిట ఉన్న ఓ రికార్డును అధిగమించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బీజీటీలో స్టీవ్ ఖాతాలో 10 సెంచరీలు (41 ఇన్నింగ్స్లు) ఉండగా.. విరాట్ 9 (47 ఇన్నింగ్స్లు), సచిన్ 9 (65 ఇన్నింగ్స్లు), పాంటింగ్ 8 (51 ఇన్నింగ్స్లు), మైఖేల్ క్లార్క్ 7 సెంచరీలు (40 ఇన్నింగ్స్లు) కలిగి ఉన్నారు.గవాస్కర్, లారా సరసన స్టీవ్టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ 11వ స్థానానికి చేరాడు. స్టీవ్.. దిగ్గజాలు బ్రియాన్ లారా, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్దనే సరసన చేరాడు. స్టీవ్తో పాటు వీరంతా 34 టెస్ట్ సెంచరీలు చేశారు. టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ (51) పేరిట ఉంది. -
కోహ్లితో పోలికా?.. నవ్వకుండా ఉండలేను: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా స్టార్, క్రికెట్ రారాజు విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆధునికతరం ఆటగాళ్లలో కోహ్లికి సాటి వచ్చే క్రికెటర్ మరొకరు లేడన్నాడు. మూడు ఫార్మాట్లలో ఈ రన్మెషీన్ అరుదైన ఘనతలు సాధించాడని పేర్కొన్నాడు.81 సెంచరీలుఅలాంటి గొప్ప ఆటగాడితో వేరే వాళ్లను పోలిస్తే తాను నవ్వకుండా ఉండలేనని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ పేర్కొన్నాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ తర్వాత వంద శతకాలకు చేరువైన ఏకైక ఆటగాడిగా కోహ్లి వెలుగొందుతున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా కొనసాగుతున్న కోహ్లి.. టెస్టుల్లో 30, అంతర్జాతీయ టీ20లలో ఒక శతకం బాదాడు.మొత్తంగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 81 సెంచరీలు చేసిన కోహ్లి ఖాతాలో మరెన్నో అరుదైన రికార్డులు ఉన్నాయి. అయితే, పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం కోహ్లి సాధించిన పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది పాక్ మాజీ ఆటగాళ్లు బాబర్ను కోహ్లితో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమేఈ విషయంపై స్పందించిన మహ్మద్ ఆమిర్.. కోహ్లికి మరెవరూ సాటిరారని.. ఇలాంటి పోలికలు హాస్యాస్పదంగా ఉంటాయని పేర్కొన్నాడు. ‘‘నవతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి అత్యంత గొప్ప ఆటగాడు. అతడిని బాబర్ ఆజం.. లేదంటే స్టీవ్ స్మిత్, జో రూట్తో పోలిస్తే నాకు నవ్వు వస్తుంది.కోహ్లిని ఎవరితో పోల్చలేము. అతడికి మరెవరూ సాటిరారు. ఎందుకంటే.. ఒంటిచేత్తో అతడు టీమిండియాను ఎన్నోసార్లు గెలిపించాడు. అది కూడా కేవలం ఏ ఒక్క ఫార్మాట్లోనూ కాదు.. మూడు ఫార్మాట్లలోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు.మిగతా ప్లేయర్లలో ఇలాంటి ఘనత వేరెవరికీ సాధ్యం కాదు. ఈ జనరేషన్లో గ్రేటెస్ట్ బ్యాటర్ కోహ్లి మాత్రమే’’ అని మహ్మద్ ఆమిర్ కోహ్లి నైపుణ్యాలను కొనియాడాడు. కోహ్లికి కఠిన పరిస్థితుల ఎలా బయటపడాలో బాగా తెలుసునని.. ప్రత్యర్థి జట్ల పట్ల అతడొక సింహస్వప్నం అని పేర్కొన్నాడు. క్రికెట్ ప్రెడిక్టా షోలో ఆమిర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగాకాగా విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ ఐదు టెస్టుల సిరీస్లో పెర్త్లో శతకం బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో మాత్రం తేలిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తుండగా.. మహ్మద్ ఆమిర్ మాత్రం కఠిన దశ నుంచి వేగంగా కోలుకోవడం కోహ్లికి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నాడు. 2014లో ఇంగ్లండ్ గడ్డపై గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న కోహ్లి.. ఆ తర్వాత పదేళ్ల పాటు రాణించిన తీరే ఇందుకు నిదర్శనం అని తెలిపాడు.చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత -
ఫస్ట్ ఈజీ క్యాచ్ వదిలేశాడు.. కట్ చేస్తే! స్టన్నింగ్ క్యాచ్తో షాకిచ్చాడు
బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ను స్మిత్ పెవిలియన్కు పంపాడు. తొలుత స్లిప్స్లో రాహుల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను విడిచిపెట్టిన స్మిత్.. రెండోసారి మాత్రం ఎటువంటి తప్పిదం చేయలేదు.భారత తొలి ఇన్నింగ్స్ 43 ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్.. రెండో బంతిని లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని రాహుల్ కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ థిక్ ఎడ్జ్ తీసుకుని స్లిప్ కార్నర్ దిశగా వెళ్లింది.ఈ క్రమంలో ఫస్ట్స్లిప్లో ఉన్న స్మిత్ తన కుడివైపనకు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. అతడి క్యాచ్ చూసిన రాహుల్ బిత్తరపోయాడు. దీంతో 84 పరుగులు చేసిన రాహుల్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: కెప్టెన్గా రింకూ సింగ్ WHAT A CATCH FROM STEVE SMITH!Sweet redemption after dropping KL Rahul on the first ball of the day.#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/d7hHxvAsMd— cricket.com.au (@cricketcomau) December 17, 2024 -
చరిత్ర సృష్టించిన స్మిత్.. విలియమ్సన్, మార్క్వా రికార్డులు బద్దలు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు తిరిగి తన ఫామ్ను అందుకున్నాడు. బ్రిస్బేన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో స్మిత్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. స్మిత్కు ఇది 25 ఇన్నింగ్స్ల తర్వాత వచ్చిన టెస్టు సెంచరీ కావడం గమనార్హం.స్మిత్ చివరగా 2023 జూన్లో యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్పై చివరి సెంచరీ సాధించాడు. మళ్లీ ఇప్పుడు దాదాపు ఏడాదిన్నర తర్వాత మూడెంకెల స్కోర్ను స్మిత్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 190 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 12 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. స్మిత్కు ఇది భారత్పై 10వ సెంచరీ కాగా.. ఓవరాల్గా 33వ టెస్టు సెంచరీ. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.స్మిత్ అరుదైన రికార్డులు..టెస్టుల్లో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ స్టార్ జోరూట్ రికార్డును స్మిత్ సమం చేశాడు. రూట్ 55 ఇన్నింగ్స్లలో 10 సెంచరీలు నమోదు చేయగా... స్మిత్ 41 ఇన్నింగ్స్లలో పది శతకాలు సాధించాడు. అదే విధంగా ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్ధానానికి స్మిత్(33) ఎగబాకాడు. ఈ క్రమంలో మార్క్ వా(32)ను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(41) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పదకుండో స్ధానంలో స్మిత్(33) కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో కేన్ విలియమ్సన్(32)ను స్మిత్ వెనక్కి నెట్టాడు. -
భారత్తో మూడో టెస్టు.. చరిత్ర సృష్టించిన హెడ్.. వరల్డ్ రికార్డు
భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ శతకంతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆదివారం వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో ట్రవిస్ హెడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడుతోంది.తొలిరోజు వర్షం వల్ల అంతరాయంపెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్బాల్ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్లో శనివారం మూడో టెస్టు ఆరంభమైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుని.. కంగారూలను బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరంభంలో భారత పేసర్ల జోరుఅయితే, వర్షం కారణంగా తొలి రోజు ఆట 13.2 ఓవర్ల వద్ద ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో 28/0 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఆసీస్ను భారత పేసర్లు కట్టడి చేశారు. ఓపెనర్లలో నాథన్ మెక్స్వీనీ(9) అవుట్ చేసిన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఉస్మాన్ ఖవాజా(21) వికెట్ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.టీమిండియా బౌలర్లకు తలనొప్పిఇక ఆంధ్ర కుర్రాడు, టీమిండియా నయా సంచలనం నితీశ్ రెడ్డి మార్నస్ లబుషేన్(12)ను పెవిలియన్కు పంపడంతో.. 75 పరుగుల స్కోరు వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. అయితే, ట్రవిస్ హెడ్ రాకతో సీన్ రివర్స్ అయింది. స్టీవ్ స్మిత్తో కలిసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు.ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్రక్రీజులో పాతుకుపోయిన హెడ్.. ధనాధన్ బ్యాటింగ్తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వరల్డ్ రికార్డును సాధించాడు. ఒకే ఏడాదిలో ఒక వేదికపై రెండు ఇన్నింగ్స్లోనూ గోల్డెన్ డకౌట్(కింగ్ పెయిర్) కావడంతో పాటు.. అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా నిలిచాడు.గత ఏడు ఇన్నింగ్స్లో ఇలాగబ్బా మైదానంలో గత మూడు ఇన్నింగ్స్లోనూ ట్రవిస్ హెడ్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. తాజాగా టీమిండియాతో మ్యాచ్లో మాత్రం శతక్కొట్టాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత అతడి ఖాతాలో జమైంది. గబ్బా స్టేడియంలో గత ఏడు ఇన్నింగ్స్లో హెడ్ సాధించిన పరుగులు వరుసగా.. 84(187), 24(29), 152(148), 92(96), 0(1), 0(1), 0(1).ఇక ఒక క్యాలెండర్ ఇయర్లో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్లో డకౌట్ కావడంతో పాటు సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలోనూ ట్రవిస్ హెడ్ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్టులో ఉన్నది వీరే..1. వాజిర్ మహ్మద్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19582. అల్విన్ కాళిచరణ్- పోర్ట్ ఆఫ్ స్పెయిన్- 19743. మార్వన్ ఆటపట్టు- కొలంబో ఎస్ఎస్సీ- 20014. రామ్నరేశ్ శర్వాణ్- కింగ్స్టన్- 20045. మహ్మద్ ఆఫ్రాఫుల్- చట్టోగ్రామ్ ఎంఏ అజీజ్- 20046. ట్రవిస్ హెడ్- బ్రిస్బేన్ గబ్బా- 2024.బుమ్రా బౌలింగ్లోఇదిలా ఉంటే.. ఆదివారం టీ విరామ సమయానికి ఆసీస్ 70 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ(65*) పూర్తి చేసుకున్నారు. కాగా టెస్టుల్లో హెడ్కి ఇది తొమ్మిదో శతకం. అదే విధంగా టీమిండియా మీద మూడోది. అంతేకాదు.. ఇందులో రెండు(అడిలైడ్, గబ్బా) వరుసగా బాదడం విశేషం.బ్రేక్ అనంతరం.. సెంచరీ(101) పూర్తి చేసుకున్న స్మిత్, 152 పరుగులు సాధించిన హెడ్ను బుమ్రా అవుట్ చేశాడు. ఈ స్పీడ్స్టర్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి స్మిత్, పంత్కు క్యాచ్ ఇచ్చి హెడ్ పెవిలియన్ చేరారు.చదవండి: రోహిత్ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్HE'S DONE IT AGAIN!Travis Head brings up another hundred ⭐️#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/10yBuL883X— cricket.com.au (@cricketcomau) December 15, 2024 -
భారత్తో మూడో టెస్టు... ఆసీస్ స్టార్ క్రికెటర్పై వేటు!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టు ఫార్మాట్లో పరుగులు రాబట్టలేక ఈ మాజీ కెప్టెన్ ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. గత పదమూడు ఇన్నింగ్స్లో కలిపి స్మిత్ చేసిన పరుగులు కేవలం 232. ఇందులో ఒకే ఒక్క అర్ధ శతకం ఉంది.స్మిత్కు చేదు అనుభవంఇక టీమిండియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ స్టీవ్ స్మిత్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో అతడు చేసిన పరుగులు 0, 17, 2. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్లో స్మిత్కు చేదు అనుభవం ఎదురైంది. 2015 తర్వాత అతడు కనీసం టాప్-10లో కూడా నిలవలేకపోవడం ఇదే తొలిసారి.వేటు వేసేందుకు రెడీఈ పరిణామాల నేపథ్యంలో భారత్తో మూడో టెస్టులో స్మిత్పై వేటు వేసేందుకు ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న అతడికి కొన్నాళ్లపాటు విశ్రాంతి పేరిట తప్పించనున్నట్లు సమాచారం. అయితే, ఆసీస్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం.. స్మిత్ త్వరలోనే మునుపటి లయను అందుకుని.. పరుగుల వరద పారిస్తాడని ధీమా వ్యక్తం చేయడం విశేషం.1-1తో సమంగాకాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సైకిల్లో తమకు చివరిదైన ఈ సిరీస్లో కనీసం నాలుగు గెలిస్తేనే.. భారత్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది. ఇక ఆసీస్తో తొలి టెస్టులో 295 పరుగులు తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం పది వికెట్ల తేడాతో ఓడింది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్లోని గాబా మైదానంలో డిసెంబరు 14- 18 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.అప్పుడు భీకర ఫామ్లో..2014-2017 మధ్య స్టీవ్ స్మిత్ ఏడాదికి కనీసం ఐదు నుంచి ఆరు శతకాలు బాదాడు. అదే స్థాయిలో హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. గతేడాది సైతం సగటున 42.22తో పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో మూడు శతకాలు నమోదయ్యాయి. అయితే, ఈ ఏడాది మాత్రం ఒక్కసారి కూడా అతడు బ్యాట్ ఝులిపించలేకపోయాడు. ప్రస్తుతం అతడి బ్యాటింగ్ సగటు 23.20. 2010 తర్వాత ఇదే స్మిత్ లోయెస్ట్ యావరేజ్.చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్ -
టీమిండియాతో ‘పింక్ బాల్ టెస్టు’కు ముందు ఆసీస్కు మరో షాక్!
బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన కంగారూ జట్టు సిరీస్లో 0-1తో వెనుకబడింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా రెండో టెస్టులోనైనా రాణించాలని పట్టుదలగా ఉంది.అయితే, ఇప్పటికే స్టార్ పేసర్ జోష్ హాజిల్వుడ్, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ గాయాల బారిన పడ్డారు. పక్కటెముకల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హాజిల్వుడ్ రెండో టెస్టుకు పూర్తిగా దూరమయ్యాడు. ఇక తాజాగా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోపింక్ బాల్ టెస్టు కోసం అడిలైడ్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్మిత్కు గాయమైనట్లు తెలుస్తోంది. మార్నస్ లబుషేన్ త్రోడౌన్స్ వేస్తుండగా బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కుడిచేతి బొటనవేలుకు గాయమైనట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాలాడగా.. ఆసీస్ జట్టు వైద్య బృందంలోని ఫిజియో నెట్స్లోకి వచ్చి స్మిత్ పరిస్థితిని పర్యవేక్షించాడు. అనంతరం స్మిత్ నెట్స్ వీడి వెళ్లి పోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చిన స్మిత్ బ్యాటింగ్ చేయగలిగినప్పటికీ.. కాస్త అసౌకర్యానికి లోనైనట్లు సమాచారం.తొలి టెస్టులో విఫలంఈ నేపథ్యంలో అడిలైడ్ టెస్టుకు స్మిత్ అందుబాటులో ఉంటాడా? లేడా? అన్న సందేహాలు నెలకొన్నాయి. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో మాజీ కెప్టెన్ స్మిత్ పూర్తిగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో గోల్డెన్ డక్గా వెనుదిరిగిన ఈ వెటరన్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులకే అవుటయ్యాడు. ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సైకిల్లో స్మిత్ ఇప్పటి వరకు 13 టెస్టులు ఆడి 755 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 110.ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఆసీస్ బుమ్రా సేన చేతిలో 295 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య అడిలైడ్లో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. పూర్తి స్థాయిలో సన్నద్ధమైన టీమిండియాపింక్ బాల్తో జరుగనున్న ఈ టెస్టుకు ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. కాగా రెండో టెస్టుకు హాజిల్వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్మెంట్ స్కాట్ బోలాండ్ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్కు కవర్గా బ్యూ వెబ్స్టర్ను పిలిపించింది.ఇది కూడా చదవండి: పీవీ సింధు కాబోయే భర్త.. ఈ ఐపీఎల్ టీమ్తో రిలేషన్!.. బ్యాక్గ్రౌండ్ ఇదే!🚨 Another injury scare for Australia!Steve Smith in pain after being hit on his fingers by a throwdown from Marnus Labuschagne. After being attended by a physio, Smith left the nets. @debasissen reporting from Adelaide #INDvsAUS #BGT2024 pic.twitter.com/jgEQO0BTuz— RevSportz Global (@RevSportzGlobal) December 3, 2024 -
విరాట్ ఒక వారియర్.. అతడిని చూసి ఆసీస్ క్రికెటర్లు నేర్చుకోవాలి: పాంటింగ్
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి తన ఫామ్ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విఫలమైన విరాట్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 143 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 100 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాదిలో విరాట్ కోహ్లికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక తన రిథమ్ను తిరిగి పొందిన విరాట్.. డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా ప్రారంభం కానున్న పింక్ బాల్ టెస్టుకు సన్నద్దమవుతున్నాడు.ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లిపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్లు కోహ్లిని చూసి నేర్చుకోవాలని పాంటింగ్ సూచించాడు. కాగా ఈ ఆసీస్ స్టార్లు ఇద్దరూ ప్రస్తుతం పేలవ ఫామ్లో ఉన్నారు. పెర్త్ టెస్టులో వీరిద్దరి దారుణ ప్రదర్శన చేశారు.ఈ క్రమంలో పాంటింగ్ ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ.. "విరాట్ ఎప్పుడూ ఆత్మవిశ్వాన్ని కోల్పోడు. అతడొక వారియర్. తనను తను విశ్వసించినందున బలంగా తిరిగి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో కంటే రెండో ఇన్నింగ్స్లో కోహ్లి డిఫెరెంట్గా కన్పించాడు. అతడు ప్రత్యర్ధిలతో పోరాడాలని భావించలేదు. కేవలం తన బలాలపై దృష్టి పెట్టాడు. లబుషేన్, స్మిత్ కూడా కోహ్లిని ఫాలో అవ్వాలి. పరుగులు ఎలా చేయాలో ముందు దృష్టి పెట్టిండి. అంతే తప్ప మీ వికెట్ గురించి ఆలోచించకండి.ఫామ్లో లేనప్పుడు ఏ ఆటగాడికైనా పరుగులు సాధించడం చాలా కష్టమవుతోంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందకు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్ చేయడమే ఒక్కటే మార్గమని పేర్కొన్నాడు. -
బుమ్రా అరుదైన ఫీట్.. ప్రపంచంలోనే రెండో బౌలర్గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టాండింగ్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతడి ధాటికి కంగూరులు బెంబేలెత్తిపోయారు. తొలుత అరంగేట్ర ఆటగాడు నాథన్ మెక్స్వీనీని ఔట్ చేసి ఆసీస్ను ఆదిలోనే దెబ్బ కొట్టిన బుమ్రా.. ఆ తర్వాత స్మిత్, ఉస్మాన్ ఖావాజా, కమ్మిన్స్ ఔట్ చేసి ఆతిథ్య జట్టును కష్టాల్లో నెట్టేశాడు.ఇప్పటివరకు మొదటి ఇన్నింగ్స్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన జస్ప్రీత్.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో స్టీవ్ స్మిత్ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్గా బుమ్రా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్లో స్మిత్ తొలి బంతికే ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా టెస్టుల్లో స్మిత్ను బుమ్రా కంటే ముందు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. గెబెర్హా వేదికగా 2014లో ఆసీస్- సౌతాఫ్రికా మ్యాచ్లో స్మిత్ను స్టెయిన్ గోల్డెన్ డకౌట్ చేశాడు. మళ్లీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత స్మిత్ రెండో సారి గోల్డెన్ డకౌటయ్యాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌటైంది.చదవండి: IND vs AUS: వారెవ్వా పంత్.. ఆ షాట్ ఎలా కొట్టావు భయ్యా! వీడియో వైరల్ -
అశ్విన్తో ఢీకి రెడీ!
మెల్బోర్న్: భారత వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని, ఈసారి అతడు మ్యాచ్పై పట్టు బిగించకుండా చేస్తానని ఆ్రస్టేలియన్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కంగారూ గడ్డపై అశ్విన్కు మంచి రికార్డు లేదు. స్వదేశంలో 21.57 సగటు నమోదు చేస్తే ఆసీస్లో అది 42.15 మాత్రమే. అయితే గత రెండు బోర్డర్–గావస్కర్ సిరీస్లలో ఫామ్లో ఉన్న స్మిత్ను అదే పనిగా అవుట్ చేసి పైచేయి సాధించాడు. ఈ రెండు సిరీస్లలో అశ్విన్ అతన్ని క్రీజులో పాతుకుపోనీయకుండా ఐదుసార్లు పెవిలియన్ చేర్చాడు. దీనిపై ఆసీస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ మాట్లాడుతూ ‘ఈసారి అలా జరగకుండా చూసుకోవాలి. అయితే అశ్విన్ మాత్రం ఉత్తమ స్పిన్నర్. తప్పకుండా తన ప్రణాళికలు తనకు ఉంటాయి. గతంలో అతని ఎత్తుగడలకు బలయ్యాను. నాపై అతనే ఆధిపత్యం కనబరిచాడు. ఇప్పుడలా జరగకుండా చూసుకోవాలంటే ఆరంభంలోనే అతను పట్టు బిగించకుండా దీటుగా ఎదుర్కోవాలి’ అని అన్నాడు. గత కొన్నేళ్లుగా తమ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరమే జరుగుతోందన్నాడు. ఒకరు పైచేయి సాధిస్తే, మరొకరు డీలా పడటం జరుగుతుందని... ఐదు టెస్టుల్లో పది ఇన్నింగ్స్ల్లో ఇప్పుడు ఎవరూ ఆధిపత్యం కనబరుస్తారో చూడాలని స్మిత్ తెలిపాడు. అతన్ని బ్యాట్తో పాటు మానసికంగానూ దెబ్బకొట్టాలంటే ఆరంభంలోనే మంచి షాట్లతో ఎదురుదాడికి దిగాలని చెప్పాడు. 35 ఏళ్ల స్మిత్ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి 315 పరుగుల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే ఐదు టెస్టుల బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అతను తనకెంతో ఇష్టమైన, అచ్చొచి్చన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇటీవలి కాలంలో స్మిత్ తరచూ ఓపెనర్గా బరిలోకి దిగి పూర్తిగా విఫలమయ్యాడు. -
Aus Vs Pak: ఆస్ట్రేలియాకు ‘కొత్త’ కెప్టెన్.. ప్రకటించిన సీఏ! కారణం ఇదే
పాకిస్తాన్తో టీ20 సిరీస్ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టుకు కొత్త కెప్టెన్ను నియమించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్కు తొలిసారిగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అంతేకాదు.. పాక్తో మూడో వన్డేకు కూడా ఇంగ్లిస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం స్వదేశంలో పాకిస్తాన్తో వన్డే, టీ20 సిరీస్లు ఆడుతోంది. ఇందులో భాగంగా నవంబరు 4- నవంబరు 18 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పాకిస్తాన్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గాఇక శుక్రవారం(నవంబరు 8) అడిలైడ్ వేదికగా ఆసీస్- పాక్ మధ్య రెండో వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం కీలక ప్రకటన చేసింది. పాక్తో ఆఖరి వన్డేతో పాటు.. టీ20 సిరీస్కు జోష్ ఇంగ్లిష్ తాత్కాలికంగా కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.ప్యాట్ కమిన్స్ అందుకే దూరంకాగా నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియా టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే.. ఈ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఇరుజట్లకు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో పాక్తో రెండో వన్డే ముగిసిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ తదితరులు జట్టుకు దూరం కానున్నారు.వీరంతా భారత్తో టెస్టు సిరీస్కు సన్నద్ధం కానున్నారు. ఇక వీరి గైర్హాజరీ నేపథ్యంలో పేసర్లు స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్, వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ వన్డే జట్టుతో చేరనున్నారు. ఇదిలా ఉంటే.. జోష్ ఇంగ్లిస్కు గతంలో ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుకు సారథ్యం వహించిన అనుభవం ఉంది.వన్డేల్లో 30వ సారథిగాఅయితే, సీనియర్ జట్టుకు కెప్టెన్గా ఎంపిక కావడం మాత్రమ ఇదే మొదటిసారి. ఇక తాజా నియామకంతో ఆస్ట్రేలియా జట్టుకు వన్డేల్లో 30వ, టీ20లకు పద్నాలుగో కెప్టెన్గా ఇంగ్లిస్ చరిత్రకెక్కనున్నాడు. ఇంగ్లిస్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలడనే నమ్మకం తమకు ఉందని ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ పేర్కొన్నాడు. అదే విధంగా.. జట్టులోని సీనియర్లు ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్ నుంచి ఇంగ్లిస్కు పూర్తి సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఆసీస్ టీ20 రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ పాక్తో సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.పాకిస్తాన్తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్ - మొదటి రెండు మ్యాచ్లకు), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్ - మూడవ మ్యాచ్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్ (మూడవ మ్యాచ్ మాత్రమే), కూపర్ కొన్నోలీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్వుడ్ (రెండవ మ్యాచ్ మాత్రమే), స్పెన్సర్ జాన్సన్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మార్నస్ లబుషేన్ (మొదటి రెండు మ్యాచ్లు మాత్రమే), గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జోష్ ఫిలిప్ (మూడవ మ్యాచ్ మాత్రమే), మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (మొదటి రెండు మ్యాచ్లు మాత్రమే మాత్రమే), మిచెల్ స్టార్క్ (తొలి రెండు మ్యాచ్లు మాత్రమే), మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా.పాకిస్తాన్తో టీ20లకు ఆస్ట్రేలియా జట్టుసీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టొయినిస్, ఆడమ్ జంపా. -
Ind vs Aus: ఓపెనర్గా కాదు.. మిడిలార్డర్లోనే..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ-2024లో స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ స్థానంపై ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ స్పష్టతనిచ్చాడు. ఈ స్టార్ ప్లేయర్ మిడిలార్డర్లోనే వస్తాడని పేర్కొన్నాడు. కెప్టెన్, కోచ్లతో చర్చించిన తర్వాత స్మిత్ ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించాడని తెలిపాడు.స్మిత్ బ్యాటింగ్ పొజిషన్ను మార్చాలికాగా డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో స్మిత్ ఓపెనర్గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, టాపార్డర్లో అతడు రాణించలేకపోయాడు. వెస్టిండీస్తో గాబాలో అర్ధ శతకం బాదడం మినహా ఓపెనర్గా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఎనిమిది ఇన్నింగ్స్లోనూ అతడి సగటు 28.50గా మాత్రమే నమోదైంది. ఈ నేపథ్యంలో స్మిత్ బ్యాటింగ్ పొజిషన్ను మార్చాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, స్మిత్ మాత్రం తాను ఓపెనర్గా వచ్చేందుకు సుముఖంగానే ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్, ఆండ్రూ, స్టీవ్ స్మిత్.. ముగ్గురూ ఈ విషయంపై చర్చించారు. కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా ఎంతకాలం జట్టుకు దూరంగా ఉంటాడో తెలియని పరిస్థితి.ఓపెనర్గా కాదు.. మిడిలార్డర్లోనే..ఇలాంటి సమయంలో.. తాను ఓపెనర్గా ఉండటం కంటే మిడిలార్డర్లో ఉండటమే మంచిదని స్మిత్ భావించాడు. అదే విషయాన్ని ప్యాట్, ఆండ్రూతో చెప్పాడు. వాళ్లిద్దరు కూడా స్మిత్ నిర్ణయంతో ఏకీభవించారు. రానున్న సిరీస్లలో స్మిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు’’ అని స్పష్టం చేశాడు.కాగా దశాబ్దకాలానికి పైగా స్మిత్ ఆస్ట్రేలియా జట్టుకు వెన్నెముకలాగా ఉంటున్నాడు. నాలుగో నంబర్ బ్యాటర్గా బరిలోకి దిగిన సగటు 61.51తో పరుగులు రాబట్టాడు. ముఖ్యంగా టీమిండియా బౌలింగ్ విభాగాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగల కంగారూ బ్యాటర్లలో స్మిత్ ముఖ్యుడు. ఈ నేపథ్యంలోనే నవంబరులో మొదలుకానున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నుంచి అతడు మళ్లీ మిడిలార్డర్లో ఆడనున్నాడు.కామెరాన్ గ్రీన్కు వెన్నునొప్పికాగా మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆడాల్సి ఉండగా.. వెన్నునొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమైన గ్రీన్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టవచ్చు. ఇదిలా ఉంటే.. మాజీ కెప్టెన్లు అలెన్ బోర్డర్- సునీల్ గావస్కర్ పేర్ల మీదుగా సుదీర్ఘకాలంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ జరుగుతుంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. చదవండి: ‘అతడినే తప్పిస్తారా?.. ఇంతకంటే పిచ్చి నిర్ణయం మరొకటి ఉండదు’ -
కోహ్లి కేవలం రెండు సెంచరీలు చేస్తే రూట్ ఏకంగా 18 సెంచరీలు బాదాడు..!
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్ట్ క్రికెట్లో తన డ్రీమ్ రన్ను కొనసాగిస్తున్నాడు. రూట్ గత మూడేళ్ల కాలంలో 16 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీల సాయంతో 4600 పైచిలుకు పరుగులు చేశాడు. 2021 నుంచి టెస్ట్ల్లో ఇన్ని సెంచరీలు కాని, ఇన్ని పరుగులు కాని ఏ ఆటగాడూ చేయలేదు.ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా చెప్పుకునే కోహ్లి, విలియమ్సన్, స్టీవ్ స్మిత్ సైతం రూట్ చేసినన్ని సెంచరీలు కాని, పరుగులు కాని చేయలేకపోయారు. రూట్ తాజాగా పాక్పై సెంచరీ చేసి తన సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు.ఈ సెంచరీ అనంతరం సోషల్మీడియాలో ఓ ఆసక్తికర గణాంకం చక్కర్లు కొడుతుంది. 2021 ఆరంభంలో రూట్ కేవలం 17 సెంచరీలు మాత్రమే చేస్తే.. అప్పుడు కోహ్లి సెంచరీల సంఖ్య 27గా ఉండింది. అదే ఇప్పుడు (2024లో) టెస్ట్ల్లో కోహ్లి సెంచరీల సంఖ్య 29గా ఉంటే.. రూట్ సెంచరీల సంఖ్య ఏకంగా 35కు చేరుకుంది.ఈ ఫిగర్స్ను సగటు టీమిండియా అభిమాని జీర్ణించుకోలేనప్పటికీ ఇది నిజం. ఈ గణాంకాలను బట్టి చూస్తే రూట్ ఏ రేంజ్లో సెంచరీల మోత మోగిస్తున్నాడో ఇట్టే అర్దమవుతుంది. రూట్ ఈ మధ్యకాలంలో కోహ్లి ఒక్కడికే కాదు ఫాబ్లో మిగతా ఇద్దరికి (విలియమ్సన్, స్టీవ్ స్మిత్) కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు.2021లో స్టీవ్ సెంచరీల సంఖ్య 26గా ఉంటే ప్రస్తుతం అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. 2021లో విలియమ్సన్ సెంచరీల సంఖ్య 24గా ఉంటే ఇప్పుడు అతని సెంచరీల సంఖ్య 32గా ఉంది. కోహ్లితో పోలిస్తే సెంచరీల విషయంలో విలియమ్సన్, స్టీవ్ స్మిత్ కాస్త మెగ్గానే కనిపిస్తున్నా, రూట్ ఈ ఇద్దరికి కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.2021లో రూట్ సెంచరీలు-172024లో రూట్ సెంచరీలు-352021లో విలియమ్సన్ సెంచరీలు-242024లో విలియమ్సన్ సెంచరీలు-322021లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-262024లో స్టీవ్ స్మిత్ సెంచరీలు-322021లో కోహ్లి సెంచరీలు-272024లో కోహ్లి సెంచరీలు-29చదవండి: PAK VS ENG 1st Test: అరివీర భయంకర ఫామ్లో జో రూట్.. మరో సెంచరీ -
Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని కొనియాడాడు. బుమ్రా బౌలింగ్ను ఎదుర్కోవడం కష్టమని.. అయితే, అతడి పోటీ మాత్రం మజానిస్తుందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్తో తాజా టెస్టు సిరీస్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే.చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్ల క్లబ్లో చేరాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లో 15 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. టీమిండియా చాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీఇక బంగ్లాదేశ్తో రెండు టెస్టుల అనంతరం.. బుమ్రా సొంతగడ్డపై న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడే అవకాశం ఉంది. అనంతరం భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ బ్యాటింగ్ స్టార్ స్టీవ్ స్మిత్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు.ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‘‘అతడొక అద్భుతమైన బౌలర్. కొత్త బంతి అయినా.. కాస్త పాతబడినా.. మొత్తంగా అలవాటుపడిన బంతికి అయినా.. అతడిని ఎదుర్కోవడం కష్టం. బుమ్రాకు అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అతడు గొప్ప బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్గా కొనసాగుతున్నాడు. బుమ్రాను ఎదుర్కోవడం అంటే సవాలుతో కూడుకున్న పని’’ అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.బుమ్రా ఉంటే అంతేకాగా 2018-19, 2020-21లో ఆసీస్పై భారత్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2018-19లో నాలుగు టెస్టుల్లో 21, 2020-21లో మూడు టెస్టుల్లో 11 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాకు వెళ్లనున్న రోహిత్ సేన ఐదు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ -2023-25 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం అత్యంత ముఖ్యం.చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్ -
Fab Four: ‘కోహ్లి కాదు.. అతడే నంబర్ వన్’
క్రికెట్ నవ యుగంలో తమదైన ముద్ర వేసిన ఆటగాళ్లలో టీమిండియా రన్మెషీన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ లెజండరీ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎనభై శతకాలతో సత్తా చాటగా.. టెస్టుల్లో రూట్ అత్యధిక పరుగుల జాబితాలో మున్ముందుకు దూసుకెళ్తున్నాడు.ఫ్యాబ్ ఫోర్లో బెస్ట్ ఎవరు?మరోవైపు స్మిత్, విలియమ్సన్ సైతం తమ మార్కును చూపిస్తూ తమ తమ జట్లను విజయపథంలో నిలుపుతున్నారు. అందుకే.. ఈ నలుగురిని కలిపి ‘ఫ్యాబ్ ఫోర్’గా పిలుచుకుంటారు క్రికెట్ ప్రేమికులు. అయితే, వీరిలో అత్యుత్తమ క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు మాత్రం ‘ఫ్యాబ్ ఫోర్’ అభిమానులు సైతం ఏకాభిప్రాయానికి రాలేరు.కోహ్లికి ఆఖరి ర్యాంకు ఇస్తాతాను కూడా అందుకు అతీతం కాదంటోంది ఆస్ట్రేలియా మహిళా స్టార్ క్రికెటర్ అలిసా హేలీ.‘ ఫ్యాబ్ ఫోర్’ గురించి ప్రస్తావన రాగా.. ‘‘వారంతా గొప్ప బ్యాటర్లు. అయితే, వారికి ర్యాంకు ఇవ్వాలంటే మాత్రం నేను కోహ్లిని నాలుగో స్థానానికే పరిమితం చేస్తా. ఇది నేను సరదాకి చెప్తున్న మాట కాదు.మిగతా వాళ్లతో పోలిస్తేఅన్ని రకాలుగా విశ్లేషించిన తర్వాతే ఇలా మాట్లాడుతున్నా. నిజానికి మిగతా ముగ్గురితో పోలిస్తే కోహ్లి చాలా ఎక్కువగా క్రికెట్ ఆడాడు. అందుకే అతడి గణాంకాలు కూడా ఉత్తమంగా ఉంటాయి. ఈ విషయాన్ని పక్కనపెట్టి చూస్తే మాత్రం కోహ్లికి నంబర్ 1 రేటింగ్ ఇవ్వాల్సిందే’’ అని అలిసా హేలీ ఓ పాడ్కాస్ట్లో ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.అతడే నంబర్ వన్తన అభిప్రాయం ప్రకారం ఈ నలుగురిలో కేన్ విలియమ్సన్కు అగ్రస్థానం ఉంటుందని.. ఆ తర్వాతి స్థానాల్లో స్మిత్, రూట్, కోహ్లి ఉంటారని తెలిపింది. విలియమ్సన్ కారణంగా కివీస్ జట్టు మొత్తానికి పేరు వచ్చిందని.. అయితే, కోహ్లి ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ మాత్రమేనని హేలీ పేర్కొంది. ఎనిమిదిసార్లు ప్రపంచకప్ను ముద్దాడిందిఅదే విధంగా.. టీమిండియా తరఫున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఆఖరికి రవీంద్ర జడేజా కూడా సెంచరీలు బాదగలరని.. అయితే.. జట్టు భారం మొత్తాన్ని మోయగల విలియమ్సన్ లాంటి ఆటగాళ్లు కొంతమందే ఉంటారని అభిప్రాయపడింది.కాగా ఆస్ట్రేలియా మేటి బ్యాటర్గా ఎదిగిన అలిసా హేలీ ఆరుసార్లు టీ20 ప్రపంచకప్, రెండుసార్లు వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్లలో సభ్యురాలు. అంతేకాదు.. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్లలో ఒకడైన మిచెల్ స్టార్క్ భార్య కూడా! చదవండి: Musheer Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్! -
ఇప్పట్లో రిటైర్ అయ్యే ఆలోచనే లేదు.. ఒలింపిక్స్లోనూ: స్మిత్
అంతర్జాతీయ క్రికెట్కు ఇప్పట్లో వీడ్కోలు పలికే ఆలోచన తనకు లేదని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించాడు. తన బ్యాటింగ్ పవర్ ఇంకా తగ్గలేదని.. పొట్టి ఫార్మాట్లో రాణించగలననే విశ్వాసం వ్యక్తం చేశాడు.పరుగుల వీరుడుఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేసిన స్మిత్.. ఇప్పటి వరకు 109 టెస్టులు, 158 వన్డేలు, 67 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 32 సెంచరీలు, 4 డబుల్ సెంచరీల సాయంతో 9685 పరుగులు చేసిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్.. వన్డేల్లో 12 శతకాలు బాది.. 5446 రన్స్ స్కోరు చేశాడు. అయితే, టీ20లలో మాత్రం స్మిత్ సగుటన 24.86తో కేవలం 1094 పరుగులు మాత్రమే చేయగలిగాడు.యువ ఆటగాళ్ల నుంచి పోటీ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆసీస్ టీ20 జట్టులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. స్మిత్ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పనున్నాడనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, 35 ఏళ్ల స్మిత్ మాత్రం తన బ్యాటింగ్లో పస ఇంకా తగ్గలేదంటున్నాడు. బిగ్బాష్ లీగ్ ఫ్రాంఛైజీ సిడ్నీ సిక్సర్తో ఇటీవలే మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్న ఈ సిడ్నీ క్రికెటర్... మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగలనని తెలిపాడు.ఒలింపిక్స్లోనూ భాగమైతే.. ‘‘ప్రపంచంలోని ఫ్రాంఛైజీ క్రికెట్లో.. మిగతా ఆటగాళ్లతో పోలిస్తే నేనే ఎక్కువ లీగ్లలో భాగమయ్యాను. మరో నాలుగేళ్ల పాటు టీ20 క్రికెట్ ఆడగల సత్తా నాకుంది. కాబట్టి.. రిటైర్మెంట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం... ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచనే లేదు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్లోనూ భాగమైతే ఇంకా బాగుంటుంది’’ అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.టీమిండియా పటిష్ట జట్టు ఇక భారత్తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ గురించి మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇండియా పటిష్టమైన జట్టు. ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోటీని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. రానున్న విశ్వ క్రీడల ఎడిషన్లో క్రికెట్ను తిరిగి ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫలితంగా 128 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు క్రికెట్ ఒలింపిక్స్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో భాగంగా పొట్టి ఫార్మాట్లో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. -
స్టీవ్ స్మిత్ మెరుపు ఇన్నింగ్స్.. మేజర్ లీగ్ క్రికెట్ విజేత వాషింగ్టన్ ఫ్రీడం
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్ టైటిల్ను వాషింగ్టన్ ఫ్రీడం కైవసం చేసుకుంది. ఇవాళ (జులై 29) జరిగిన ఫైనల్లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 88; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (22 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగి ఆడాడు. సీజన్ ఆధ్యాంతం భీకర ఫామ్లో ఉండిన ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్లో 9 పరుగులకే ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), ముక్తార్ అహ్మద్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించారు. యూనికార్న్స్ బౌలర్లలో కమిన్స్ 2, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్, డ్రైస్డేల్ తలో వికెట్ పడగొట్టారు.నిప్పులు చెరిగిన జన్సెన్.. రచిన్ మాయాజాలం208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనికార్న్స్ మార్కో జన్సెన్ (4-1-28-3), రచిన్ రవీంద్ర (4-0-23-3), ఆండ్రూ టై (2-0-12-2), సౌరభ్ నేత్రావల్కర్ (4-0-33-1), మ్యాక్స్వెల్ (2-0-14-1) ధాటికి 16 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్లో పదో నంబర్ ఆటగాడు కార్మీ రౌక్స్ చేసిన 20 పరుగులే అత్యధికం. జన్సెన్, రచిన్ అద్భుతంగా బౌలింగ్ చేసి యూనికార్న్స్ పతనాన్ని శాశించారు. ఈ ఎడిషన్ ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫైనల్ మ్యాచ్లోనూ ఆశించిన ప్రదర్శన కనబర్చి టైటిల్ను ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్లో వాషింగ్టన్ టీమ్ను స్టీవ్ స్మిత్ విజయవంతంగా ముందుండి నడిపించాడు. వాషింగ్టన్ టీమ్కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా వ్యవహరించాడు. -
సిక్సర్ల వర్షం కురిపించిన జోస్ ఇంగ్లిస్.. స్మిత్ సేనకు తొలి ఓటమి
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో స్టీవ్ స్మిత్ నేతృత్వలోని వాషింగ్టన్ ఫ్రీడం తొలి ఓటమి చవి చూసింది. శాన్ఫ్రాన్సిస్కోతో ఇవాళ (జులై 23) జరిగిన నామమాత్రపు మ్యాచ్లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన యూనికార్న్స్కు టార్గెట్ నిర్దేశించారు. యూనికార్న్స్ టార్గెట్ 14 ఓవర్లలో 177 పరుగులుగా నిర్దారించబడింది. భారీ లక్ష్య ఛేదనలో ఆది నుంచే దూకుడుగా ఆడిన యూనికార్న్స్.. మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. జోస్ ఇంగ్లిస్ (17 బంతుల్లో 45; ఫోర్, 6 సిక్సర్లు), సంజయ్ కృష్ణమూర్తి (42 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), హసన్ ఖాన్ (11 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సిక్సర్ల వర్షం కురిపించి తమ జట్టును గెలిపించారు. వాషింగ్టన్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు పడగొట్టగా.. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అంతకుముందు ట్రవిస్ హెడ్ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వాషింగ్టన్ భారీ స్కోర్ చేసింది. ఆండ్రియస్ గౌస్ (29 నాటౌట్), రచిన్ రవీంద్ర (16) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆండర్సన్కు రెండు వికెట్లు దక్కాయి.కాగా, ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో వాషింగ్టన్, యూనికార్న్స్ మ్యాచ్కు అంత ప్రాధాన్యత లేదు. పాయింట్ల పట్టికలో వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
స్టీవ్ స్మిత్ విధ్వంసం.. ట్రవిస్ హెడ్ మెరుపులు
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో స్టీవ్ స్మిత్ మెరుపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఎడిషన్లో శైలికి భిన్నంగా రెచ్చిపోయి ఆడుతున్న స్మిత్.. తాజాగా మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్తో జరుగుతున్న మ్యాచ్లో కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేశాడు. ప్రస్తుత ఎడిషన్లో స్మిత్కి ఇది వరసగా రెండో హాఫ్ సెంచరీ.Steven Smith on fire in the MLC. 😲🔥pic.twitter.com/rMFbQPRpM1— Mufaddal Vohra (@mufaddal_vohra) July 23, 2024మరో ఎండ్లో ట్రవిస్ హెడ్ సైతం మెరుపు ఇన్నింగ్స్లతో చెలరేగిపోతున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడంకు ఓపెనర్లుగా వస్తున్న ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. యూనికార్న్స్తో జరుగుతున్న మ్యాచ్లో హెడ్ కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అలరించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగుల చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో హెడ్కు ఇది మూడో హాఫ్ సెంచరీ.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడం.. 15.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో వాషింగ్టన్ ఇన్నింగ్స్ను అక్కడే ముగించారు. ఈ మ్యాచ్ 14 ఓవర్లకు కుదించి యూనికార్న్స్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్దారించారు. ఈ ఎడిషన్లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్కు అంత ప్రాధాన్యత లేదు. వాషింగ్టన్, యూనికార్న్స్ తొలి రెండు ప్లే ఆఫ్స్ బెర్త్లను ఖరారు చేసుకోగా.. టెక్సాస్ సూపర్కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎడిషన్లో వాషింగ్టన్ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్లో కూడా ఓడలేదు. -
సిక్సర్ల వర్షం కురిపిస్తున్న స్టీవ్ స్మిత్
మేజర్ లీగ్ క్రికెట్లో (ఎంఎల్సీ) ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎడిషన్లో వాషింగ్టన్ ఫ్రీడంకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న స్టీవ్.. తన శైలికి విరుద్దంగా భారీ షాట్లతో రెచ్చిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన స్టీవ్.. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. స్టీవ్ ఆడిన రెండు ఇన్నింగ్స్ల్లో నాటౌట్గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో జరిగిన తొలి మ్యాచ్లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేసిన స్టీవ్.. టెక్సస్ సూపర్ కింగ్స్తో నిన్న (జులై 8) రద్దైన మ్యాచ్లో 13 బంతుల్లో బౌండరీ, 3 సిక్సర్ల సాయంతో 26 పరుగులు చేశాడు.Steven Smith loving the MLC. pic.twitter.com/k8CfprlXnQ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024ఇదిలా ఉంటే, అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ గత సీజన్కు భిన్నంగా జోరుగా సాగుతుంది. ఈ ఎడిషన్లో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం ఐదు మ్యాచ్లే జరగ్గా.. సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.వాషింగ్టన్ ఫ్రీడం, టెక్సస్ సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకకుండా ముగిసింది. ఈ మ్యాచ్లో సూపర్ కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీతో (58 బంతుల్లో 100; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన వాషింగ్టన్ ఫ్రీడంకు వరుణుడు అడ్డుతగిలాడు. ఆ జట్టు తొలి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసిన తరుణంలో వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చి మ్యాచ్ను రద్దు చేశారు. -
రోహిత్, బాబర్ కాదు.. అతడే వరల్డ్కప్ టాప్ రన్ స్కోరర్: స్మిత్
టీ20 వరల్డ్కప్-2024లో సత్తా చాటేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2024లో కనబరిచిన జోరునే ఈ పొట్టి ప్రపంచకప్లోనూ కొనసాగించాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్లు ఆడిన కింగ్ కోహ్లి.. 741 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్లో బుధవారం న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో తలపడనుంది. తొలిపోరు కోసం రోహిత్ సేన అన్ని విధాల సిద్దమైంది. ఇక మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లిపై ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ టోర్నీలో కోహ్లి టాప్ రన్ స్కోరర్గా నిలుస్తాడని స్మిత్ జోస్యం చెప్పాడు. "ఈ మెగా ఈవెంట్లో లీడింగ్ రన్ స్కోరర్గా విరాట్ కోహ్లి నిలుస్తాడని నేను భావిస్తున్నాడు. అతడు ఐపీఎల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అమెరికాకు వచ్చాడు. విరాట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఆ జోరును ఇక్కడ కూడా కొనసాగిస్తాడని నేను ఆశిస్తున్నానని" ఐసీసీ షేర్ చేసిన వీడియోలో స్మిత్ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్ టాప్ రన్స్కోరర్గా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లేదా విరాట్ కోహ్లి నిలుస్తాడని అంచనా వేశాడు.చదవండి: T20 WC: చరిత్ర సృష్టించిన నేపాల్ కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా -
T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టులో కొత్తగా ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఐపీఎల్-2024లో దుమ్ములేపిన యువ సంచలనం జేక్ ఫ్రేజర్-మెగర్క్తో పాటు మరో క్రికెటర్ వరల్డ్కప్ జట్టుతో ప్రయాణించనున్నాడు.కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన ప్రధాన జట్టును ప్రకటించింది.అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం మే 25 వరకు జట్టులో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ట్రావెలింగ్ రిజర్వ్స్గా ఇద్దరు బ్యాటర్లను ఎంపిక చేసింది. జేక్ ఫ్రేజర్- మెగర్క్తో మాథ్యూ షార్ట్కు కూడా అవకాశం ఇచ్చింది.స్టీవ్ స్మిత్తో పాటు వాళ్లకు మొండిచేయిఈ క్రమంలో సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్తో పాటు జేసన్ బెహ్రాన్డార్ఫ్, తన్వీర్ సంగాల ఆశలకు గండిపడినట్లయింది. కాగా ఈసారి వరల్డ్కప్లో మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆస్ట్రేలియా జూన్ 5న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. బార్బడోస్ వేదికగా ఒమన్తో తలపడనుంది.దుమ్ములేపిన మెగర్క్ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన జేక్ ఫ్రేజర్-మెగర్క్ సంచలన ఇన్నింగ్స్తో మెరిశాడు. లుంగి ఎంగిడి స్థానంలో జట్టులోకి వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ తొమ్మిది మ్యాచ్లు ఆడి 330 పరుగులు సాధించాడు.ఈ ఓపెనింగ్ బ్యాటర్ స్ట్రైక్రేటు ఏకంగా 234.04 ఉండటం విశేషం. ఇక ట్రావెలింగ్ రిజర్వ్గా ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్న మెగర్క్.. 15 మంది సభ్యుల ప్రధాన జట్టులో కూడా స్థానం సంపాదించుకునే అర్హతలు కలిగి ఉన్నా సీనియర్లు ఉన్న కారణంగా సాధ్యం కాలేదు.అందుకే ఇలా జరిగిందిఆస్ట్రేలియా హెడ్కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్లో జేక్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. వరల్డ్కప్ జట్టు ఫైనల్ 15 కోసం అతడి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేశాడు.ఇక మాథ్యూ షార్ట్ సైతం బిగ్బాష్ లీగ్లో అద్భుతంగా రాణించాడు. అయితే, వీరిద్దరు టాపార్డర్ బ్యాటర్లు కావడం వల్లే మొదటి 15 మంది సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కలేదు’’ అని మెక్డొనాల్డ్ పేర్కొన్నాడు.టీ20 ప్రపంచకప్-2024కు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్.చదవండి: శివమ్ దూబేపై వేటు.. వరల్డ్కప్ జట్టులో ఫినిషర్కు చోటు! -
స్మిత్కు దక్కని చోటు
మెల్బోర్న్: కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడాలని ఆశించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్కు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే ఆ్రస్టేలియా జట్టును బుధవారం ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆల్రౌండర్ మిచెల్ మార్‡్ష సారథ్యం వహిస్తాడు. గత 14 ఏళ్లలో ప్రపంచకప్ జట్టులో స్మిత్కు చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. 2021లో టి20 ప్రపంచకప్ను తొలిసారి సాధించిన ఆ్రస్టేలియా జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు. 34 ఏళ్ల స్మిత్ ఇప్పటివరకు ఆసీస్ తరఫున 67 టి20 మ్యాచ్లు ఆడి 125.45 స్ట్రయిక్రేట్తో 1094 పరుగులు సాధించాడు. ఆ్రస్టేలియా జట్టు: మిచెల్ మార్‡్ష (కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ వేడ్, కమిన్స్, హేజల్వుడ్, స్టార్క్, ఆష్టన్ అగర్, ఆడమ్ జంపా. -
టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్కప్ 2024 కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (మే 1) ప్రకటించారు. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. ముందుగా ప్రచారం జరిగినట్లుగా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఎలాగైనా జట్టులోకి వస్తాడనుకున్న ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ను సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. మాట్ షార్ట్, జేసన్ బెహ్రెన్డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండిచెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్ను సెలెక్టర్లు కరుణించారు. ఎండ్ ఓవర్స్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కెమరూన్ గ్రీన్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిస్కు ప్రత్యామ్నాయ వికెట్కీపర్గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ కొనసాగనున్నారు. మిచ్ మార్ష్తో పాటు ట్రవిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటా ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. మెగా టోర్నీలో ఆస్ట్రేలియా ప్రయాణం జూన్ 5న మొదలవుతుంది. ఆసీస్ తమ తొలి మ్యాచ్లో పసికూన ఒమన్తో తలపడుతుంది. గ్రూప్-బిలో ఆసీస్.. ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్లతో పోటీపడుతుంది.టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా వరల్డ్కప్ విన్నర్లతో..క్రికెట్ ఆస్ట్రేలియా తమ వరల్డ్కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. 2007 వన్డే వరల్డ్కప్ విన్నర్లు ఆసీస్ టీ20 వరల్డ్కప్ జట్టును అనౌన్స్ చేశారు. జట్టును ప్రకటించిన వారిలో దివంగత ఆండ్రూ సైమండ్స్ కొడుకు, కూతురు ఉండటం విశేషం. -
స్టీవ్ స్మిత్కు షాక్.. ఆసీస్ వరల్డ్కప్ జట్టులోకి విధ్వంసకర ఆటగాడు..!
ఆసీస్ సెలెక్టర్లు తమ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు భారీ షాకివ్వనున్నారని తెలుస్తుంది. వరల్డ్కప్ జట్టులో స్మిత్ స్థానం గల్లంతు కావడం ఖాయమని ఆసీస్ మీడియా కోడై కూస్తుంది. స్మిత్ స్థానంలో ఐపీఎల్ నయా సెన్సేషన్, ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసకర ఆటగాడు జేక్ ఫ్రేసర్ వరల్డ్కప్ జట్టులోకి వస్తాడని సమాచారం. జట్టు ప్రకటనకు మే 1 డెడ్లైన్ కావడంతో అన్ని జట్ల సెలెక్టర్లు తమతమ జట్లను ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్ సెలెక్టర్లు తమ జట్టుకు తుది రూపు తెచ్చినట్లు సమాచారం. నేడో రేపో 15 మంది సభ్యులతో కూడిన ఆసీస్ ప్రపంచకప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ఇవాళే తమ వరల్డ్కప్ జట్టును ప్రకటించగా.. టీమిండియాను ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈసారి టీమిండియా వరల్డ్కప్ జట్టుపై జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకరిద్దరి విషయంలో అభిమానులు చాలా పర్టికులర్గా ఉన్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయాలని పెద్ద ఎత్తును డిమాండ్లు వినిపిస్తున్నాయి. హార్దిక్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ విషయంలో సెలెక్టర్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.స్మిత్ విషయానికొస్తే.. ఈ ఆసీస్ స్టార్ను ఐపీఎల్ 2024 వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. స్మిత్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. ఇటీవలే స్మిత్కు జాతీయ జట్టు ఓపెనర్గా ప్రమోషన్ లభించినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నిదానంగా ఆడతాడన్న ముద్ర స్మిత్పై ఉండనే ఉంది. స్మిత్కు ప్రత్యామ్నాయాలు కూడా ఆసీస్కు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్కప్ జట్టులో స్మిత్కు స్థానం దొరకకపోవడం ఆశ్చర్యకరమేమీ కాదు. -
మేజర్ లీగ్ క్రికెట్లో స్టీవ్ స్మిత్.. వాషింగ్టన్ ఫ్రీడంతో ఒప్పందం
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్లో పాల్గొననున్నాడు. వాషింగ్టన్ ఫ్రీడం ఫ్రాంచైజీ స్టీవ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జులై 4 నుంచి ప్రారంభంకాబోయే ఎంఎల్సీ రెండో సీజన్లో స్టీవ్ బరిలోకి దిగనున్నాడు. స్టీవ్ ఎంఎల్సీ అరంగేట్రం సీజన్లో ఇదే వాషింగ్టన్ ఫ్రీడంకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. 𝐒𝐦𝐮𝐝𝐠𝐞 x 𝐅𝐫𝐞𝐞𝐝𝐨𝐦 = 😍 Welcome the the family, 𝐒𝐭𝐞𝐯𝐞 𝐒𝐦𝐢𝐭𝐡 ❤️#WashingtonFreedom #MLC2024 #SteveSmith pic.twitter.com/bGrzxlsr61 — Washington Freedom (@WSHFreedom) April 11, 2024 వాషింగ్టన్ ఫ్రీడంకు ఆసీస్ ఆటగాడు మోసెస్ హెన్రిక్స్ కెప్టెన్సీ వహిస్తుండగా.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ జట్టులో హెన్రిక్స్తో పాటు మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. తన్వీర్ సంగా, బెన్ డ్వార్షుయిస్, జోష్ ఫిలిప్ ఇదే ఫ్రాంచైజీకి ఆడుతున్నారు. వచ్చే సీజన్ నుంచి స్టీవ్ వీరితో జతకట్టనున్నాడు. ఎంఎల్సీ రెండో సీజన్ కోసం మరో ముగ్గురు ఆసీస్ ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్ లాస్ ఏంజెల్స్ నైట్రైడర్స్తో.. టిమ్ డేవిడ్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, స్టీవ్ ఇటీవలికాలంలో పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అతను జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశాలు రావడం లేదు. లీగ్ క్రికెట్లో సైతం ఫ్రాంచైజీలు ఇతనికి ఆసక్తి చూపడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ వేలంలో స్టీవ్ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. నిదానంగా బ్యాటింగ్ చేస్తాడనే కారణంగా ఏ ఫ్రాంచైజీ స్టీవ్ను సొంతం చేసుకోవడం లేదు. స్టీవ్ టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు ఆశిస్తున్నప్పటికీ అవకాశం లభించేలా లేదు. ఆసీస్ టాపార్డర్ బెర్తులు ట్రవిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్లతో భర్తీ అయ్యాయి. -
#Hardik Pandya: నచ్చినట్లు వాగుతుంటారు.. పట్టించుకుంటే..
‘‘నేను ఒక్క విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాను.. అనవసర విషయాలను అస్సలు పట్టించుకోవద్దు. నీ మనసులో చెలరేగే అలజడి గురించి బయటివాళ్లకు ఎలా తెలుస్తుంది? వాళ్లు వచ్చి మన ఆవేదనను తీర్చలేరు కదా! వ్యక్తిగతంగా నన్నైతే ఇలాంటి విషయాలు అస్సలు ప్రభావితం చేయలేవు. ఎందుకంటే నేను వాటిని పట్టించుకోను. అసలు నా గురించి మాట్లాడేవారి వైపు చూడను కూడా చూడను. బయట చాలా మంది చాలా రకాలుగా వాగుతుంటారు. అవి చెవికి ఎక్కించుకుంటే.. మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. బహుశా.. హార్దిక్ విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు అతడు ఇలాంటి ఒక క్లిష్ట పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. కాబట్టి సహజంగానే అతడికి ఇదంతా కొత్తగా ఉంటుంది. టీమిండియా స్టార్ ప్లేయర్ అయి ఉండి ఇండియాలోనే ఇలా అభిమానులచే అవమానం ఎదుర్కోవడం హార్దిక్ను కచ్చితంగా ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటుంది. గతంలో అతడికి ఇలాంటి అనుభవం లేదు కాబట్టి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది’’ అని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టును ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మపై వేటు వేసి పాండ్యాకు ముంబై పగ్గాలు అప్పగించారు. అయితే, రోహిత్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా.. మైదానంలో రోహిత్తో హార్దిక్ పాండ్యా ప్రవర్తనను కూడా సహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లోనూ పాండ్యాకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పాండ్యా కనిపిస్తే చాలు రోహిత్ నామస్మరణ చేయడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అభ్యంతరకర భాషతో హార్దిక్ను ట్రోల్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే.. ఇప్పటి వరకు అతడి సారథ్యంలో ముంబై ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఓడిపోవడంతో కామెంట్లు మరింత శ్రుతిమించాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కామెంటేటర్ స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా అవమానించేవారిని పట్టించుకోకుండా.. ముందుకు సాగడమే ఉత్తమమని హార్దిక్ పాండ్యాకు సలహా ఇచ్చాడు. ఈ మేరకు ఈఎస్ఎపీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశాడు. కాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్ కెప్టెన్సీ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిషేధం ఎదుర్కొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అతడిని చీటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ గేలి చేశారు. ఆ సమయంలో తాను అవేమీ పట్టించుకోకుండా కేవలం ఆటపై దృష్టి పెట్టి ముందుకు సాగిన విషయాన్ని స్మిత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. -
'రోహిత్, బాబర్ కాదు.. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే'
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్-2024లో బీజీబీజీగా ఉన్నాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని స్టీవ్ స్మిత్.. ప్రస్తుతం అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కామేంటేటర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రీ మ్యాచ్ షోలో పాల్గోన్న స్టీవ్ స్మిత్కు ఓ ప్రశ్న ఎదురైంది. వరల్డ్క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరన్న ప్రశ్న స్మిత్కు ఎదురైంది. వెంటనే స్మిత్ ఏమీ ఆలోచించకుండా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లినే ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అంటూ సమాధనమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా విరాట్ కోహ్లి వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. కింగ్ కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టిన ఘనత విరాట్ ది. కింగ్ కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2024 సీజన్లోనూ దుమ్ములేపుతున్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్.. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 77 పరుగులతో అదరగొట్టాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మార్చి 29న కేకేఆర్తో మ్యాచ్కు కోహ్లి సిద్దమవుతున్నాడు. -
రూ. 24.75 కోట్ల ఆటగాడు... ఎన్ని వికెట్లు తీస్తాడంటే?!
ఐపీఎల్-2024 సందడి మొదలైపోయింది. పొట్టి ఫార్మాట్లోని మజాను అందించేందుకు ఆటగాళ్లు.. ఆస్వాదించేందుకు అభిమానులూ సిద్ధమైపోయారు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో శుక్రవారం (మార్చి 22) ఈవెంట్కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ కామెంటేటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సహచర ఆటగాడు మిచెల్ స్టార్క్ ఐపీఎల్-2024లో కచ్చితంగా సత్తా చాటుతాడంటూ.. తాజా ఎడిషన్లో ఎన్ని వికెట్లు తీయగలడో అంచనా వేశాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో అదరగొట్టిన మిచెల్ స్టార్క్ దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత క్యాష్ రిచ్ లీగ్లో పునరాగమనం చేయనున్నాడు. వేలంలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ అతడి కోసం పోటీ పడి ఏకంగా రూ. 24.75 కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఈ పేస్ బౌలర్ నిలిచాడు. దీంతో మిచెల్ స్టార్క్పై అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈఎస్ఎపీఎన్క్రిక్ఇన్ఫో షోలో మాట్లాడిన ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్కు స్టార్క్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నాకు తెలిసి అతడు కొత్త బంతితో కచ్చితంగా మ్యాజిక్ చేయగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడే బౌలింగ్ చేస్తాడు కాబట్టి వికెట్లు తీసే అవకాశం ఉంటుంది. ఈసారి స్టార్క్ 30 వికెట్లు తీస్తాడని అనుకుంటున్నా’’ అని స్మిత్ అంచనా వేశాడు. కాగా ఐపీఎల్లో ఒక ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా డ్వేన్ బ్రావో, హర్షల్ పటేల్ సంయుక్త రికార్డు సాధించారు. 2013లో సీఎస్కే తరఫున బ్రావో.. 2021లో ఆర్సీబీ తరఫున హర్షల్ పటేల్ 32 వికెట్లు తీశారు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన సౌతాఫ్రికా స్టార్ కగిసో రబడ 30 వికెట్లతొ రెండోస్థానాన్ని ఆక్రమించాడు. ఇదిలా ఉంటే కేకేఆర్ తాజా సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో మార్చి 23న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. -
రసవత్తరంగా కివీస్-ఆసీస్ రెండో టెస్టు..
క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ తమ విజయానికి ఇంకా 202 పరుగుల దూరంలో నిలవగా.. కివీస్ విజయానికి ఇంకా 6 వికెట్లు మాత్రమే కావాలి. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం ట్రావిస్ హెడ్(17),మార్ష్(27) పరుగులతో ఉన్నారు. మాట్ హెన్రీ, సీర్స్ తలా రెండు వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ స్టీవ్ స్మిత్(9) రెండో ఇన్నింగ్స్లోనూ నిరాశపరిచాడు. ఇక 134/2 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ 372 పరుగులకు రెండో ఇన్నింగ్స్లో ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(82), టామ్ లాథమ్(73) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు, లయోన్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో ఆసీస్ ముందు 279 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు కివీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. ఆసీస్కు తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
భారత అంపైర్కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్లో ఇతను అంపైర్గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్ల వందో టెస్ట్ మ్యాచ్కు అంపైర్గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్లో కూడా అంపైర్గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్ల్లో అంపైర్గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్తో వంద టెస్ట్ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
NZ vs Aus: ఆసీస్ కెప్టెన్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్
"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్తో సిరీస్లో స్టీవ్ స్మిత్ ఓపెనర్గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని తెలిపింది. ఆల్రౌండర్లు కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు. వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్, మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు. మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్ కాగా ఫాస్ట్ బౌలర్ అయిన ప్యాట్ కమిన్స్ 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ సాధించాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ నంబర్వన్ బౌలర్ కావడం విశేషం. న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్: స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్కు ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాటర్ దూరం -
టీ20 వరల్డ్కప్కు ఆస్ట్రేలియా జట్టు ఎంపిక.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్!?
టీ20 వరల్డ్కప్-2024కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ క్రికెట్ మహా సంగ్రామానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికి మాజీ క్రికెటర్లు అంచనాలు, అభిప్రాయాలు ఇప్పటి నుంచే మొదలెట్టేశారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ టీ20 వరల్డ్కప్కు తమ జట్టు ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేశాడు. తాజాగా ఈఎస్పీఎన్ అరౌండ్ ది వికెట్ షోలో ఫించ్ పాల్గోనున్నాడు. ఈ క్రమంలో పొట్టి వరల్డ్కప్లో భాగమయ్యే ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్ను ఫించ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లగా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ను ఎంపిక చేసిన ఫించ్.. స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు తన తుది జట్టులో చోటు ఇవ్వలేదు. వరుసగా ఫస్ట్, సెకెండ్ డౌన్లో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్కు చోటు కల్పించారు. అదే విధంగా పిచ్ పరిస్ధితులను బట్టి మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్లో ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని ఫించ్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా వికెట్ కీపర్గా జోష్ ఇంగ్లీష్ను ఆరోన్ ఎంపిక చేశాడు. పినిషర్గా యువ ఆటగాడు టిమ్ డేవిడ్కు చోటు ఇచ్చాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ చోటు దక్కింది. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో ఆడమ్ జంపా ఒక్కడికే చోటు దక్కింది. ఫించ్ ఎంపిక చేసిన ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్ లేదా మాథ్యూ షార్ట్ (పరిస్థితులపై బట్టి), టిమ్ డేవిడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్ -
తగ్గుతూ వస్తున్న కోహ్లి ప్రభ.. గణనీయంగా పుంజుకుంటున్న విలియమ్సన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి 2021 నుంచి రెండేళ్ల పాటు కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. 2022 చివర్లో కోహ్లి ఎట్టకేలకు ఫామ్ను దొరకబుచ్చుకుని పూర్వవైభవం సాధించగలిగాడు. అయితే కోహ్లి ఫామ్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమైంది. గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో గతం కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్న కోహ్లి.. టెస్ట్ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడు. తాజాగా సోషల్మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏం సూచిస్తుందంటే.. 2021లో కోహ్లి 27 టెస్ట్ సెంచరీలు చేసే నాటికి ఫాబ్ ఫోర్గా పిలువబడే వారిలో మిగతా ముగ్గురు కోహ్లి కంటే తక్కువ సెంచరీ కలిగి ఉన్నారు. స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియమ్సన్ 23, జో రూట్ 17 సెంచరీలు చేశారు. అయితే నేటి దినం వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ ఫాబ్ ఫోర్లో ప్రథముడిగా పరిగణించబడిన కోహ్లి.. ప్రస్తుతం చివరివాడిగా మారిపోయాడు. Kane Williamson is just one century away from equaling Steve Smith among the Fab 4 for the most Test centuries. pic.twitter.com/ZtFIV45lmE — CricTracker (@Cricketracker) February 6, 2024 టెస్ట్ సెంచరీల సంఖ్యలో కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరి స్థానానికి పడిపోయాడు. నేటికి 32 సెంచరీలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. వరుస సెంచరీలు చేస్తూ పరుగులు వరద పారిస్తున్న విలియమ్సన్ 31 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అప్పట్లో 17 సెంచరీలు చేసిన రూట్.. ఈ మధ్యకాలంలో ఏకంగా 13 సెంచరీలు చేసి 30 సెంచరీలతో మూడో ప్లేస్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లి ఫాబ్ ఫోర్లో చివరివాడిగా కొనసాగుతున్నాడు. ఓ పక్క టెస్ట్ల్లో తనకు పోటీదారులుగా పిలువబడే వారు సెంచరీల మీద సెంచరీలు చేస్తూ దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం చల్లబడ్డాడు. కోహ్లికి ప్రధాన పోటీదారుడైన విలియమ్సన్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు చేయడంతో పాటు చివరి 10 ఇన్నింగ్స్ల్లో ఆరు శతకాలు బాది శతక వేటలో దూసుకుపోతుంటే కోహ్లి మాత్రం రేసులో వెనుకపడ్డాడు. కోహ్లి టెస్ట్ సెంచరీ సంఖ్య తగ్గడానికి ఓ ప్రధానమైన కారణంగా ఉంది. కోహ్లి ఫాబ్ ఫోర్లోని మిగతా సభ్యులతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో టెస్ట్ మ్యాచ్లు చాలా తక్కువగా ఆడాడు. ఏదో టెస్ట్ క్రికెట్ అంటే ఆసక్తి లేనట్లు మ్యాచ్కు మ్యాచ్కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఓ పక్క స్టీవ్ స్మిత్, కేన్ మామ, రూట్ దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆడుతుంటే కోహ్లి ఏ అమవాస్యకో పున్నానికో టెస్ట్ల్లో కనిపిస్తున్నాడు. కోహ్లి సెంచరీలు చేయకపోతేనేం పరుగులు సాధిస్తున్నాడు కదా అని అతని అభిమానులు వాదించవచ్చు. అయితే సహచరులతో పోలిస్తే కోహ్లి సాధించిన పరుగులు చాలా తక్కువ అన్న విషయాన్ని వారు మరువకూడదు. అభిమాన ఆటగాడు కదా అని మనం ఎంత సమర్ధించుకు వచ్చినా అంతిమంగా గణాంకాలు మాత్రమే మాట్లాడతాయని గుర్తించాలి. ఇంగ్లండ్తో చివరి మూడు టెస్ట్లకైనా కోహ్లి అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాలి. -
వరుస సెంచరీలతో దూసుకుపోతున్న విలియమ్సన్.. పలు రికార్డులు బద్దలు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో టాప్ రికార్డులన్నీ బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పటికే పలు రికార్డులు బద్దలు కొట్టిన కేన్.. తాజాగా మరిన్ని రికార్డులు నమోదు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు (118, 109) చేసిన కేన్.. ఈ ఘనత (ట్విన్ సెంచరీలు) సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. సెకెండ్ ఇన్నింగ్స్ సెంచరీతో టెస్ట్ సెంచరీల సంఖ్యను 31కి పెంచుకున్న కేన్.. అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో కలిపి 44 సెంచరీలు) చేసిన యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్లో ఉండగా.. డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. కేన్ (44).. స్మిత్తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. తాజా సెంచరీతో కేన్ మరో రికార్డు కూడా సాధించాడు. టెస్ట్ల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు (170 ఇన్నింగ్స్ల్లో) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో సచిన్ అగ్రస్థానంలో (165 ఇన్నింగ్స్ల్లో) ఉండగా.. స్టీవ్ స్మిత్, విలియమ్సన్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు. కేన్ గత 10 ఇన్నింగ్స్ల్లో స్కోర్లు ఇలా ఉన్నాయి. 132, 1, 121*, 215, 104, 11, 13, 11, 118, 109. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ప్రస్తుతం టెస్ట్ల్లో నంబర్ వన్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్లో న్యూజిలాండ్ గెలుపు దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. మహా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్లో ప్రత్యర్ధి సౌతాఫ్రికా గెలవలేదు. కేన్ ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి న్యూజిలాండ్ గెలుపుకు పునాది వేయగా.. యువ ఆటగాడు రచిన్ రవీంద్ర తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ (240) చేసి తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 511 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే కుప్పకూలింది. భారీ లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న కివీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా!.. టీమిండియా తర్వాత
వెస్టిండీస్తో మూడో వన్డే సందర్భంగా ఆస్ట్రేలియా సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అది కూడా 50 ఓవర్ల క్రికెట్లో తమ 1000వ మ్యాచ్లో ఈ ఫీట్ అందుకోవడం విశేషం. కాగా మంగళవారం కాన్బెర్రా వేదికగా ఆసీస్ విండీస్తో ఆఖరి వన్డేలో తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కంగారూ జట్టు.. విండీస్ను 86 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇదే మొదటిసారి ఆ తర్వాత 6.5 ఓవర్లలోనే అంటే.. ఇంకా 259 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఆస్ట్రేలియా. తద్వారా తమ వన్డే చరిత్రలో తొలిసారి ఇలాంటి ఘన విజయం అందుకుంది. ఇంతకు ముందు 2004లో యూఎస్ఏ జట్టు మీద ఆసీస్ 253 బంతులు మిగిలి ఉండగా గెలుపొందింది. టీమిండియా తర్వాత అదే విధంగా 2013లో వెస్టిండీస్తో మ్యాచ్లోనే 244 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి గెలుపు జెండా ఎగురవేసింది. ఇక కాన్బెర్రా మ్యాచ్ ఆసీస్కు 1000వ వన్డే కావడం విశేషం. తద్వారా టీమిండియా తర్వాత అత్యధిక వన్డేలు ఆడిన రెండో జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకెక్కింది. అయితే, ఈ ఫార్మాట్లో ఆస్ట్రేలియా 600కు పైగా మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టు కూడా కావడం మరో విశేషం. వెస్టిండీస్తో మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఈ మేరకు భారీ విజయం నమోదు చేయడంలో ఓపెనర్లది కీలక పాత్ర. జేక్ ఫ్రాసెర్ మెక్గర్క్(18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్స్లతో 41 రన్స్), జోష్ ఇంగ్లిస్( 16 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్)) సాధించాడు. జేక్ను అల్జారీ జోసెఫ్ పెవిలియన్కు పంపగా తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. వన్డౌన్ బ్యాటర్ ఆరోన్ హార్డీ(2) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో ఇంగ్లిస్కు తోడైన కెప్టెన్ స్టీవ్ స్మిత్(6- నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్ను ఆసీస్ 3-0తో వైట్వాష్ చేసింది. చదవండి: IPL 2024: అందుకే రోహిత్ను ముంబై కెప్టెన్గా తప్పించాం.. కోచ్పై రితిక విమర్శలు -
ఆకాశమే హద్దుగా అరంగేట్ర బౌలర్.. కేవలం 17 పరుగులిచ్చి..
వెస్టిండీస్తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా సొంతగడ్డపై మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మెల్బోర్న్ వేదికగా అరంగేట్ర బౌలర్ జేవియర్ బార్ట్లెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున ఇద్దరు యువ పేసర్లు లాన్స్ మోరిస్, జేవియర్ బార్ట్లెట్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు జేవియర్ ఆది నుంచే చుక్కలు చూపించాడు. తొలుత ఓపెనర్లు జస్టిన్ గ్రీవ్స్(1), అలిక్ అథనాజే(5)ల పనిపట్టిన ఈ రైటార్మ్ పేసర్.. కెప్టెన్ షాయీ హోప్(12) రూపంలో మరో కీలక వికెట్ దక్కించుకున్నాడు. జేవియర్ దెబ్బకు బ్యాటింగ్ ఆర్డర్ కకావిలమైన వేళ వన్డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ 88 పరుగులతో సత్తా చాటాడు. అతడికి తోడుగా రోస్టర్ చేస్ కూడా అర్ధ శతకం(59)తో మెరిశాడు. మిగతా వాళ్లలో ఒక్కరుకూడా చెప్పుకోగదగ్గ స్కోరు చేయలేదు. జేవియర్ అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కించుకోగా.. సీన్ అబాట్, కామెరాన్గ్రీన్ రెండేసి వికెట్లు కూల్చారు. ఆడం జంపాకు ఒక వికెట్ దక్కగా.. అబాట్ కేసీ కార్టీని రనౌట్లో భాగమయ్యాడు. ఈ క్రమంలో 48.5 ఓవర్లలో 231 పరుగులు చేసి విండీస్ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు కరేబియన్ పేసర్ మాథ్యూ ఫోర్డ్ ఆదిలోనే షాకిచ్చాడు. అతడి బౌలింగ్లో ఓపెనర్ ట్రవిస్ హెడ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ జోష్ ఇంగ్లిస్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాట్ ఝులిపించాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఏకంగా 65 పరుగులు రాబట్టాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ 77, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 79 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ విధించిన 232 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్లో జేవియర్ బార్ట్లెట్ తొమ్మిది ఓవర్లు బౌల్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 4న సిడ్నీలో రెండో వన్డే జరుగనుంది. -
పెను సంచలనం.. ఆసీస్ను చిత్తుగా ఓడించిన విండీస్
టెస్ట్ క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను శోభ తగ్గిన విండీస్ వారి సొంత దేశంలోనే చిత్తుగా ఓడించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో విండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి, 1-1తో సిరీస్ను సమం చేసుకుంది. WEST INDIES HAS WON A TEST MATCH AT GABBA 🤯 - Shamar Joseph is the hero. pic.twitter.com/d9zqVfcOpP — Johns. (@CricCrazyJohns) January 28, 2024 రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ను గెలిపించేందుకు ఓపెనర్ స్టీవ్ స్మిత్ (91 నాటౌట్) ఆఖరి వరకు ప్రయత్నించాడు. అయితే షమార్ జోసఫ్ (7/68) విజృంభించడంతో ఆసీస్కు పరాభవం తప్పలేదు. 1997 తర్వాత ఆసీస్ను వారి సొంత దేశంలో ఓడించడం విండీస్కు ఇది మొదటిసారి. ఈ మ్యాచ్లో షమార్ జోసఫ్ బొటనవేలి ఫ్రాక్చర్తో బాధపడుతూనే అద్భుతం చేశాడు. The celebration by West Indies is emotional. - World cricket needs powerful West Indies. 🦁pic.twitter.com/QwbbO9VxHP — Johns. (@CricCrazyJohns) January 28, 2024 ఇదే సిరీస్లోని తొలి మ్యాచ్తో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన షమార్ సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. తొలి మ్యాచ్లో కూడా షమార్ బంతితో, బ్యాట్తో రాణించాడు. పదకొండో నంబర్ ఆటగాడిగా వచ్చి అతి మూల్యమైన పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. అత్యంత పటిష్టమైన ఆసీస్ను వారి సొంత దేశంలో ఓడించడంతో విండీస్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. Gilchrist hugging Lara in commentary box after the historic win in West Indies at Gabba. - What a moment. 👌pic.twitter.com/8T9N1qjf8J — Johns. (@CricCrazyJohns) January 28, 2024 విండీస్ జనం ఈ గెలుపుతో పండుగ చేసుకుంటున్నారు. ఇటీవలికాలంలో చిన్న జట్ల చేతుల్లో కూడా పరాజయాలు ఎదుర్కొని, కనీసం వన్డే వరల్డ్కప్కు (2023) అర్హత సాధించలేకపోయిన విండీస్... ఈ గెలుపుతో పూర్వవైభవం సాధించేలా కనిపిస్తుంది. Ian Bishop describing the journey of Shamar Joseph. - This is lovely. 👏pic.twitter.com/tyjjFzt83i — Johns. (@CricCrazyJohns) January 28, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హాడ్జ్ (71), జాషువ డసిల్వ (79), కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీలతో సత్తా చాటారు. స్టార్క్ నాలుగు, హాజిల్వుడ్, కమిన్స్ తలో రెండు, నాథన్ లయోన్ ఓ వికెట్ పడగొట్టారు. Lara hugging Shamar Joseph. - What a moment for the youngster, he has started a new chapter. pic.twitter.com/fnn411HZ92 — Johns. (@CricCrazyJohns) January 28, 2024 అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.ఉస్మాన్ ఖ్వాజా (75), అలెక్స్ క్యారీ (65), కమిన్స్ (64 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్, కెవిన్ సింక్లెయిర్ తలో వికెట్ పడగొట్టారు. Shamar Joseph said "I told my captain that I will bowl till the last wicket falls no matter what happens to my toe". pic.twitter.com/Col1wTPJQI — Johns. (@CricCrazyJohns) January 28, 2024 విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ మెక్కెంజీ (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్, లయోన్ తలో మూడు వికెట్లు, గ్రీన్, స్టార్క్ తలో వికెట్ పడగొట్టారు. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ను షమార్ మ్యాజిక్ స్పెల్తో ఇబ్బంది పెట్టాడు. షమార్ ధాటికి ఆసీస్ 193 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది. షమార్తో పాటు అల్జరీ జోసఫ్ (2/62), జస్టిన్ గ్రీవ్స్ (1/46) వికెట్లు పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. -
29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్ జట్టులో ఛాన్స్ కొట్టేశాడు!
స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా సిద్దమవుతోంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే 13 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. అయితే అనుహ్యంగా ఈ జట్టులో చోటు దక్కించుకున్న స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్, జో రిచర్డ్సన్ గాయం కారణంగా దూరమయ్యారు. ఇక తాజాగా వీరిద్దరి స్ధానాన్ని యువ సంచలనం ఫ్రేజర్-మెక్గర్క్, ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్లెట్తో క్రికెట్ ఆస్ట్రేలియా భర్తీ చేసింది. ఫ్రేజర్-మెక్గర్క్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశీవాళీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా డొమాస్టిక్ వన్డే టోర్నీలో వరల్డ్ రికార్డు సెంచరీతో మెక్గర్క్ చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ మార్క్ను అందుకున్న మెక్గర్క్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. మెక్గర్క్ ప్రస్తుతం యూఏఈ టీ20 లీగ్లో దుబాయ్ క్యాపిటిల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో తన అరంగేట్ర మ్యాచ్లోనే మెక్గర్క్ అదరగొట్టాడు. 25 బంతుల్లో 54 పరుగులు చేసి సత్తా చాటాడు. మరోవైపు పేసర్ బార్ట్లెట్ కూడా దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరిస్తున్నాడు. బిగ్బాష్ లీగ్-2023 సీజన్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. కాగా ఆసీస్-విండీస్ మధ్య వన్డే సిరీస్ ఫిబ్రవరి 2 నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో స్టీవ్ స్మిత్కు జట్టు పగ్గాలు అప్పగించారు. ఆసీస్ వన్డే జట్టు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్చాగ్నే, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, లాన్స్ మోరిస్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా. చదవండి: టెస్టు సిరీస్కు బ్రూక్ దూరం -
విండీస్ అరంగేట్ర పేసర్ సంచలనం: స్మిత్ నమ్మలేకపోయాడు!
#Shamar Joseph: ‘‘టెస్టు కెరీర్లో ఇంతకంటే గొప్ప ఆరంభం ఉండాలని ఎవరైనా కలగనగలరా?! ఈ అబ్బాయి చరిత్ర సృష్టించాడు’’.. వెస్టిండీస్ అరంగేట్ర పేసర్ షమార్ జోసెఫ్ గురించి కామెంటేటర్ అన్న మాటలు. నిజమే.. జాతీయ జట్టుకు ఆడాలన్న చిరకాల కోరిక నెరవేర్చుకున్న 24 ఏళ్ల ఈ యువ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్లో.. అది కూడా పటిష్ట ఆస్ట్రేలియాతో టెస్టులో.. వేసిన తొలి బంతికే వికెట్ తీశాడు. స్టీవ్ స్మిత్ రూపంలో దిగ్గజ బ్యాటర్ వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు. 85 ఏళ్ల రికార్డు సమం అంతేకాదు.. వెస్టిండీస్ చరిత్రలో 85 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును సమం చేశాడు కూడా! విండీస్ తరఫున టెస్టు క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్గా రికార్డు సాధించాడు. అంతకు ముందు.. 1939లో టిరెల్ జాన్సన్.. ఓవల్ మైదానంలో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా 23వ స్థానం ఇక ఓవరాల్గా ఈ జాబితాలో 23వ బౌలర్గా తన పేరును లిఖించుకున్నాడు షమార్ జోసెఫ్. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు వెస్టిండీస్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా అడిలైడ్ వేదికగా ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్ సందర్భంగా షమార్ జోసెఫ్ విండీస్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. బ్యాటింగ్లోనూ సత్తా చాటాడు ఇక టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 188 పరుగులకే విండీస్ను ఆలౌట్ చేసింది. కంగారూ జట్టు పేసర్లు ప్యాట్ కమిన్స్, హాజిల్వుడ్ నాలుగేసి వికెట్లు తీసి విండీస్ను కోలుకోని దెబ్బకొట్టారు. వీరి ధాటికి టాపార్డర్, మిడిలార్డర్ కకావికలం కాగా పదకొండో స్థానంలో బరిలోకి దిగిన షమార్ జోసెఫ్ కీమర్ రోచ్తో కలిసి 55 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. 41 బంతుల్లో 36 పరుగులు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. స్మిత్ను బోల్తా కొట్టించి మరీ అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసీస్ బ్యాటర్లను తన బౌలింగ్తో తిప్పలు పెట్టాడు. తొమ్మిదో ఓవర్ తొలి బంతికి స్మిత్ను బోల్తా కొట్టించాడు షమార్. గుడ్ లెంగ్త్ డెలివరీతో స్మిత్ను డిఫెన్స్లో పడేసి వికెట్ సమర్పించుకునేలా చేశాడు. కాగా షమార్ బౌలింగ్లో బ్యాట్ను తాకి అవుట్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్ స్లిప్లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో పడగా.. ఊహించని పరిణామానికి కంగుతిన్న స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. FIRST BALL! Shamar Joseph gets Steve Smith with his first ball in Tests! #OhWhatAFeeling | @Toyota_Aus | #AUSvWI pic.twitter.com/XLelMqZHrG — cricket.com.au (@cricketcomau) January 17, 2024 ఇదిలా ఉంటే... పదిహేనో ఓవర్ ఐదో బంతికి మార్నస్ లబుషేన్(10) రూపంలో రెండో వికెట్ కూడా తానే దక్కించుకున్నాడు షమార్. ఇక.. తొలి రోజు ఆట ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసిన ఆస్ట్రేలియా విండీస్ కంటే 129 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: IPL 2024: హార్దిక్ వెళ్లినా నష్టం లేదు.. గిల్ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు -
నిప్పులు చెరిగిన కమిన్స్, హాజిల్వుడ్.. ఓపెనర్గా విఫలమైన స్టీవ్ స్మిత్
AUS VS WI 1st Test: రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (జనవరి 17) తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్గా కొత్త అవతారమెత్తిన స్టీవ్ స్మిత్ 12 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. లబూషేన్ (10) కూడా తక్కువ స్కోర్కే ఔటయ్యాడు. ఉస్మాన్ ఖ్వాజా (30), కెమరూన్ గ్రీన్ (6) క్రీజ్లో ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. ఆసీస్ పేసర్లు జోష్ హాజిల్వుడ్ (4/44), కెప్టెన్ పాట్ కమిన్స్ (4/41) ధాటికి తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ కిర్క్ మెక్కెంజీ (50) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించాడు. ఓపెనర్లు బ్రాత్వైట్ (13), తేజ్నరైన్ చంద్రపాల్ (6), అలిక్ అథనాజ్ (13), కవెమ్ హాడ్జ్ (12), జస్టిన్ గ్రీవ్స్ (5), జాషువ డిసిల్వ (6), అల్జరీ జోసఫ్ (14), మోటీ (1) నిరాశపర్చగా.. 11వ నంబర్ ఆటగాడు షమార్ జోసఫ్ (35) ఎంతో ఉపయోగకరమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ పరువు కాపాడాడు. షమార్.. కీమర్ రోచ్తో (17 నాటౌట్) కలిసి చివరి వికెట్కు 55 పరుగులు జోడించాడు. -
Viral Videos: జకోవిచ్ క్రికెట్, బాస్కెట్బాల్ ఆడితే...????
ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. జకో.. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఈ సందర్భంగా స్టీవ్ స్మిత్, జాక్సన్ వార్న్లు సైతం కాసేపు జకోతో టెన్నిస్ ఆడాడు. స్టీవ్ స్మిత్ ఆటకు (టెన్నిస్) జకో ఫిదా అయ్యాడు. Is it too late to add him to the test squad?! From the sounds of it the selectors are open to trying things out...@DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/VAJq2KFShr — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Game respects game! (And Novak is just like the rest of us when it comes to Smudge...)@stevesmith49 • @DjokerNole • #AusOpen • #AO2024 pic.twitter.com/ioL8hjVSrF — #AusOpen (@AustralianOpen) January 11, 2024 మెల్బోర్న్లోని రాడ్ లేవర్ ఎరీనాలో "ఎ నైట్ విత్ నొవాక్ అండ్ ఫ్రెండ్స్" పేరిట జరిగిన ఈ ఛారిటీ మ్యాచ్లో జకో.. స్టెఫనాస్ సిట్సిపాస్తో తలపడ్డాడు. మధ్యలో ఈ మ్యాచ్ కాసేపు మిక్సడ్ డబుల్స్గా కూడా మారింది. జకో.. మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకతో జతకట్టగా.. సిట్సిపాస్ మరియా సక్కారితో కలిసి ఆడాడు. A challenge?! This is like shelling peas for international gymnast Georgia Godwin, @DjokerNole!#AusOpen • #AO2024 pic.twitter.com/bXs24p8Lfj — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Nothing. But. Net. Like it wouldn't have been 😆@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/tzrLjgWTsB — #AusOpen (@AustralianOpen) January 11, 2024 ఈ సందర్భంగా జకో క్రికెట్తో పాటు పలు ఇతర క్రీడలను కూడా ఆడాడు. తొలుత పోల్ వాల్ట్ ఛాంపియన్ జార్జియా గాడ్విన్తో కలిసి ఫీట్లు చేసిన అతను.. ఆతర్వాత ఆస్ట్రేలియన్ వీల్ చైర్ టెన్నిస్ ఛాంపియన్ హీత్ డేవిడ్సన్తో కలిసి వీల్చైర్ టెన్నిస్ ఆడాడు. ఆతర్వాత ఆస్ట్రేలియన్ బాస్కెట్బాల్ స్టార్ అలన్ విలియమ్స్తో కలిసి బాస్కెట్బాల్, మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్, స్లామ్ డంక్ వంటి ఇతర క్రీడలను కూడా ఆడాడు. సరదాసరదాగా సాగిన ఈ ఛారిటీ మ్యాచ్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. స్క్రీన్పై కనిపించినంత సేపు జకో తనదైన శైలిలో నవ్వులు పూయిస్తూ అలరించాడు. Move over, @KingJames!@DjokerNole • @alantwilliams • #AusOpen • #AO2024 pic.twitter.com/bMmPknbXOD — #AusOpen (@AustralianOpen) January 11, 2024 Race again in Paris? 😅@DjokerNole v @pbol800 #AusOpen • #AO2024 pic.twitter.com/jXgTyzhhbE — #AusOpen (@AustralianOpen) January 11, 2024 -
స్టీవ్ స్మిత్కు ప్రమోషన్
ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు ఆసీస్ టెస్ట్ జట్టు ఓపెనర్గా ప్రమోషన్ లభించింది. టెస్ట్ల నుంచి వార్నర్ రిటైర్ కావడంతో ఆసీస్ ఓపెనర్ స్థానాన్ని స్టీవ్ స్మిత్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ధృవీకరించాడు. స్వదేశంలో విండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసిన బెయిలీ.. ఇదే సందర్భంగా స్మిత్ న్యూ ఇన్నింగ్స్పై (ఓపెనర్) ప్రకటన చేశాడు. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటన అనంతరం స్మిత్ టెస్ట్ ఓపెనింగ్ స్థానంపై తన ఇష్టాన్ని స్వయంగా వెల్లడించాడు. దీన్ని పరిగణలోకి తీసుకునే ఆసీస్ సెలెక్టర్లు స్మిత్కు ఓపెనర్గా అవకాశం ఇచ్చారు. మరోవైపు విండీస్తో సిరీస్కు రెగ్యులర్ ఓపెనర్ మ్యాట్ రెన్షాను కూడా ఎంపిక చేసిన సెలెక్టర్లు, అతన్ని ఏ స్థానంలో బరిలోకి దించుతారో వేచి చూడాలి. లెగ్ స్పిన్ బౌలర్గా మొదలైన ప్రస్తానం.. టెస్ట్ల్లో స్టీవ్ స్మిత్ ప్రస్తానం రకరకాల మలుపులు తిరుగూ సాగింది. లెగ్ స్పిన్ బౌలర్గా కెరీర్ ప్రారంభించిన స్మిత్.. దినదినాభివృద్ది చెందుతూ ఆసీస్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన స్మిత్్.. ఇప్పుడు ఓపెనర్గా ప్రమోషన్ పొందాడు. వన్డే జట్టు కెప్టెన్గానూ.. ఆసీస్ సెలెక్టర్లు విండీస్తో టెస్ట్ సిరీస్తో పాటు వన్డే సిరీస్కు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా నియమించారు. వన్డే సిరీస్కు కమిన్స్తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్లకు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
విండీస్తో సిరీస్ కోసం ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్ల ప్రకటన
స్వదేశంలో వెస్టిండీస్తో జరిగే రెండు టెస్ట్లు, మూడు వన్డేల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. వార్నర్ టెస్ట్ల నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో మ్యాట్ రెన్షాను ఎంపిక చేశారు ఆసీస్ సెలెక్టర్లు. వార్నర్ రిటైర్మెంట్ అనంతరం టెస్ట్ల్లో ఓపెనింగ్ అవకాశాలపై గంపెడాశలు పెట్టుకున్న కెమరూన్ బాన్క్రాఫ్ట్, మార్కస్ హ్యారిస్లకు నిరాశ తప్పలేదు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ తిరిగి జట్టులో చోటు సంపాదించగలిగాడు. మిచెల్ మార్ష్ ఆగమనంతో సరైన అవకాశాలు దక్కని గ్రీన్పై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. విండీస్తో తొలి టెస్ట్కు మ్యాట్ రెన్షా, స్కాట్ బోలాండ్ తుది జట్టులో ఉంటారని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ సూచనప్రాయంగా చెప్పాడు. టెస్ట్ సిరీస్ అనంతరం ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు కూడా జట్టును ఎంపిక చేశారు ఆసీస్ సెలెక్టర్లు. ఈ సిరీస్ కోసం రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్కు రెస్ట్ ఇచ్చిన సెలెక్టర్లు.. స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా నియమించారు. వన్డే సిరీస్కు కమిన్స్తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్లకు విశ్రాంతినిచ్చారు. విండీస్ ఈ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్లతో పాటు మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఇందు కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించాల్సి ఉంది. వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కెమరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లయోన్, మిచెల్ మార్ష్, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ వెస్టిండీస్తో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, కెమరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, లాన్స్ మోరిస్, జై రిచర్డ్సన్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్: జనవరి 17-21 (అడిలైడ్) రెండో టెస్ట్: జనవరి 25-29 (బ్రిస్బేన్) తొలి వన్డే: ఫిబ్రవరి 2 (మెల్బోర్న్) రెండో వన్డే: ఫిబ్రవరి 4 (సిడ్నీ) మూడో వన్డే: ఫిబ్రవరి 6 (కాన్బెర్రా) తొలి టీ20: ఫిబ్రవరి 9 (హోబర్ట్) రెండో టీ20: ఫిబ్రవరి 11 (అడిలైడ్) మూడో టీ20: ఫిబ్రవరి 13 (పెర్త్) -
ఐపీఎల్-2024 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..
దుబాయ్లోని కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఐపీఎల్-2024 వేలంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరలకు అమ్ముడుపోయారు. స్టార్క్ను రూ.24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేయగా.. కమ్మిన్స్ను రూ.20.50 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. కాగా మొత్తం 77 స్ధానాల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక ఈ వేలంలో ఆసీస్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిస్తే.. మరో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ మాత్రం ఆన్సోల్డ్గా మిగిలిపోయాడు. రూ. 2 కోట్ల వచ్చిన స్మిత్ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఇక స్మిత్తో పాటు ఆన్సోల్డ్గా మిగిలిపోయిన టాప్ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే: స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు) వాండర్ డసెన్ (కనీస ధర రూ.2 కోట్లు) జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు) జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు) బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు) జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు) సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు) జోష్ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు) ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు) జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు) కొలీన్ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు) టిమ్ సౌథీ (కనీస ధర రూ.1.50 కోట్లు) క్రిస్ జొర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు) డానియల్ సామ్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు) ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు) జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు) టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్లతో విధ్వంసం -
'స్మిత్ను ఎవరూ కొనరు.. అతడికి మాత్రం ఏకంగా రూ.20 కోట్లు'
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది.ఈ క్యాష్రిచ్ లీగ్ వేలం దుబాయ్లోని కోకాకోలా అరేనా వేదికగా మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేలంలో 77 స్ధానాలకు గానూ మొత్తంగా 330 ఆటగాళ్లు పాల్గోనున్నారు. ఇందులోనే ఇద్దరు అసోసియేట్ ప్లేయర్లు సహా 119 విదేశీ ఆటగాళ్లున్నారు. భారత్ నుంచి 214 ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఈ వేలంలో నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గం, ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ జోస్యం చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ మిచిల్ స్టార్క్ మాత్రం భారీ ధరకు అమ్ముడుపోతాడని మూడీ అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది వేలంలో స్టీవ్ స్మిత్ను ఏ ఫ్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చు. కానీ మిచిల్ స్టార్క్పై మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అత్యధిక ధర కలిగి ఉన్న శామ్ కుర్రాన్(రూ.18.50) రికార్డును స్టార్క్ బ్రేక్ చేస్తాడు. స్టార్క్ దాదాపు రూ.20 కోట్లకు అమ్ముడుపోయిన ఆశ్చర్యపోన్కర్లేదని ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ పేర్కొన్నాడు. చదవండి: IPL 2024 Auction Updates: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. జాక్పాట్ ఎవరికో? -
Aus Vs Pak: ఆస్ట్రేలియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్గా వరల్డ్కప్ హీరో
Australia vs Pakistan, 1st Test: పాకిస్తాన్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. షాన్ మసూద్ బృందంతో తలపడబోయే జట్టులో వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్కు చోటిచ్చినట్లు తెలిపింది. కాగా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. కంగారూ వంటి పటిష్ట జట్టుతో పోరుకు సన్నద్ధమయ్యే క్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా ఆడింది. కాన్బెర్రాలోని మనుకా ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇదిలా ఉంటే.. గురువారం (డిసెంబరు 14) నుంచి అసలైన సిరీస్ ఆరంభం కానుంది. వైస్ కెప్టెన్గా వరల్డ్కప్-2023 హీరో పెర్త్లో జరుగనున్న ఈ మ్యాచ్కు సంబంధించిన తమ తుది జట్టు ఇదేనంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బుధవారం వివరాలు వెల్లడించాడు. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ హీరో ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్లో తనకు డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు. మర్ఫీకి బైబై.. లియోన్ ఇన్ మాజీ సారథి స్టీవ్ స్మిత్తో కలిసి హెడ్.. కో-వైస్ కెప్టెన్గా ఉంటాడని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్తో మ్యాచ్తో నాథన్ లియోన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. ఇక పాక్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగనుంది. అదే విధంగా ఆల్రౌండర్ స్లాట్లో కామెరాన్ గ్రీన్తో పోటీ పడ్డ మిచెల్ మార్ష్వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపడంతో అతడు ఈ మ్యాచ్లో భాగం కానున్నాడు. ఇదిలా ఉంటే.. స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ వైస్ కెప్టెన్ అయినప్పటికీ.. ఒకవేళ కమిన్స్ గైర్హాజరైతే ఈ మ్యాచ్లో కెప్టెన్గా స్టీవ్ స్మిత్కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. పాకిస్తాన్తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
భారత్తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పులు.. స్టార్ ఆటగాళ్లంతా ఇంటికి
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా గౌహతి వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 28) జరుగబోయే మూడో మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత జట్టులోని సభ్యుల్లో ఆరుగురు స్వదేశానికి బయల్దేరతారని వెల్లడించింది. వరల్డ్కప్ విన్నింగ్ టీమ్లో సభ్యులైన మ్యాక్స్వెల్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా, స్టోయినిస్, ఇంగ్లిస్, సీన్ అబాట్లకు విశ్రాంతినిస్తున్నట్లు పేర్కొంది. వీరిలో స్టీవ్ స్మిత్, ఆడమ్ జంపా రెండో టీ20 ముగిసిన అనంతరమే స్వదేశానికి బయల్దేరగా.. మిగతా నలుగురు ఇవాళ మ్యాచ్ (మూడో టీ20) అనంతరం స్వదేశానికి బయల్దేరతారని ప్రకటించింది. ఈ ఆరుగురికి ప్రత్యామ్నాయంగా క్రికెట్ ఆస్ట్రేలియా నలుగురు ఆటగాళ్లను ప్రకటించింది. వీరిలో జోష్ ఫిలిప్, బెన్ మెక్డెర్మాట్ ఇదివరకే భారత్కు చేరుకోగా.. బెన్ డ్వార్షుయిస్, క్రిస్ గ్రీన్లు నాలుగో టీ20 సమయానికంతా జట్టులో చేరతారని వెల్లడించింది. ఇదిలా ఉంటే, స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. విశాఖ, తిరువనంతపురం వేదికలుగా జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో భారత్ ఘన విజయాలు సాధించింది. ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు మిస్ కానుండటంతో ఈ సిరీస్ ఇకపై కల తప్పనుంది. భారత్ జట్టులోని స్టార్ ఆటగాళ్లు సైతం వరల్డ్కప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు. భారత్తో టీ20 సిరీస్కు అప్డేట్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. మాథ్యూ వేడ్ (కెప్టెన్), బెహ్రెన్డార్ఫ్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, క్రిస్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రవిస్ హెడ్, బెన్ మెక్డెర్మాట్, జోష్ ఫిలిప్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, కేన్ రిచర్డ్సన్ -
బంగ్లాదేశ్తో ఆసీస్ మ్యాచ్.. అందుకే వాళ్లిద్దరికి రెస్ట్..
CWC 2023- Australia vs Bangladesh: వన్డే వరల్డ్కప్-2023 లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్తో తలపడుతోంది. పుణె వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా.. తాము రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కంగారూ జట్టు సారథి ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. అందుకే వాళ్లిద్దరికి రెస్ట్ ‘‘పొద్దు పొద్దున్నే బౌలింగ్ చేయడం మాకు అనుకూలిస్తుందనుకుంటున్నాం. బంతి బాగా స్వింగ్ అవుతుంది. కాబట్టి బౌలింగ్ ఎంచుకున్నాం. తుదిజట్టులో రెండు మార్పులు చేశాం. మాక్స్వెల్, స్టార్క్లకు విశ్రాంతినిచ్చాం. సెమీస్లో వారిద్దరి పాత్ర కీలకం కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. స్మిత్, అబాట్ జట్టులోకివచ్చారు. అబాట్కు ఈ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. ఇప్పటి వరకు మేము మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేదు. ఈ మ్యాచ్లో పూర్తిస్థాయిలో రాణించాలనుకుంటున్నాం’’ అని కమిన్స్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అజేయ డబుల్ సెంచరీతో సెమీస్ చేర్చి అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో అనూహ్య రీతిలో గ్లెన్ మాక్స్వెల్ అజేయ డబుల్ సెంచరీతో ఆసీస్ను గెలిపించి.. సెమీస్ చేర్చాడు. అంతకు ముందు తలకు తగిలిన గాయం కారణంగా జట్టుకు దూరమైన మాక్సీ.. క్రీజులో కదల్లేని స్థితిలో ఉన్నా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ వహ్వా అనిపించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో నామమాత్రపు మ్యాచ్లో అతడికి రెస్ట్ ఇచ్చింది యాజమాన్యం. ఇక అనారోగ్య సమస్యలతో అఫ్గన్తో మ్యాచ్కు దూరమైన స్టీవ్ స్మిత్ అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు. మరోవైపు.. ప్రపంచకప్-2023లో అన్నింటికంటే ముందే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్.. తమ ఆఖరి మ్యాచ్లో పటిష్ట ఆసీస్ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో నజ్ముల్ హుసేన్ షాంటో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. తుదిజట్లు: ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినిస్, సీన్ అబాట్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), ఆడం జంపా, జోష్ హాజిల్వుడ్. బంగ్లాదేశ్ తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్( వికెట్ కీపర్), తౌహిద్ హృదోయ్, మెహిదీ హసన్ మిరాజ్, మహేదీ హసన్, నసూమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్. చదవండి: CWC 2023- Semis: ఏమైనా జరగొచ్చు.. మేమింకా రేసులోనే ఉన్నాం.. ఆ ముగ్గురు కీలకం: బాబర్ ఆజం View this post on Instagram A post shared by ICC (@icc) -
సచిన్ విగ్రహంపై అభిమానుల అసంతృప్తి.. స్టీవ్ స్మిత్లా ఉందంటూ కామెంట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్తగా ఏర్పాటైన సచిన్ టెండూల్కర్ విగ్రహంపై భారత క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ విగ్రహం ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ను పోలి ఉండటంతో సచిన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని విగ్రహ రూపకర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కీర్తించే సచిన్ విగ్రహాన్ని తయారు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని తాయారు చేసి ఉండాల్సిందని విగ్రహ రూపకర్తను దూషిస్తున్నారు. సచిన్ అంటే గిట్టని వారు, క్రికెట్ పరిజ్ఞానం లేని వారు స్టీవ్ స్మిత్ విగ్రహం భారత్లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వాంఖడేలో నిన్న భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ నుంచి సచిన్ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది. కాగా, నవంబర్ 1న ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వాంఖడేలో సచిన్ స్టాండ్ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ ఆఫ్సైడ్ షాట్ ఆడే పోజ్లో ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని రూపొందించారు. సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా విగ్రహావిష్కరణ చేశారు. కాగా, సచిన్ తన సొంత మైదానమైన వాంఖడేలో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ (నవంబర్ 16, 2013) ఆడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే
టీమిండియాతో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత భారత పర్యటనలో బిజీ కానున్న 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించింది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్కు మాథ్యూ వేడ్ను కెప్టెన్గా నియమించింది. ఈ మేరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది. టీమిండియాతో పోటీ పడనున్న జట్టులో ప్రపంచకప్-2023 ఆడుతున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ సహా ట్రవిస్ హెడ్ తదితరులకు చోటు దక్కింది. ఇక గాయం కారణంగా అష్టన్ అగర్ ఈ సిరీస్కు దూరం కానున్నాడు. అదే విధంగా.. మల్లీ ఫార్మాట్ ఆల్రౌండర్లు అయిన కామెరాన్ గ్రీన్, మిచెల్ మార్ష్లకు విశ్రాంతినిచ్చినట్లు ఆసీస్ బోర్డు తెలిపింది. ఫాస్ట్బౌలర్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ కూడా గ్రీన్, మార్ష్తో పాటే స్వదేశానికి తిరిగి రానున్నట్లు పేర్కొంది. వీరంతా వరల్డ్కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాకు పయనం కానున్నారని తెలియజేసింది. కాగా నవంబరు 23 నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య వైజాగ్లో టీ20 సిరీస్ ఆరంభం కానుంది. హైదరాబాద్లో డిసెంబరు 3 నాటి మ్యాచ్తో ఈ సిరీస్ ముగుస్తుంది. టీమిండియాతో టీ20 సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), జేసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్వెల్, తన్వీర్ సంగా, మ్యాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా. SQUAD! There's more cricket to come in India next month, with Matthew Wade set to lead this talented bunch in five T20I's against India #INDvAUS pic.twitter.com/Mqc8cLe5Ur — Cricket Australia (@CricketAus) October 28, 2023 -
స్మిత్ది ఔటా? నాటౌటా? టెక్నాలజీ లోపానికి..! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి పాలైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దురదృష్టకరరీతిలో ఔటయ్యాడు. అతడు ఔటైన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అతడి ఔట్పై వివాదం చెలరేగింది. అసలేం జరిగిందంటే? 312 పరుగుల లక్ష్య ఛేదనలో 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాలో పడింది. ఈ సమయంలో స్మిత్, లాబుషేన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 10 ఓవర్ వేసిన రబాడ బౌలింగ్లో మూడో, నాలుగో బంతులను స్మిత్ బౌండరీలగా మలిచాడు. ఆ తర్వాతి బంతిని కూడా లెగ్ సైడ్ ఆడటానికి స్మిత్ ప్రయత్నించాడు. కానీ బంతి మిస్ అయ్యి స్మిత్ ప్యాడ్కు తాకింది. వెంటనే బౌలర్తో వికెట్ కీపర్ ఎల్బీకి అప్పీల్ చేశారు. కానీ అంపైర్ విల్సన్ నో అంటూ తలఊపాడు. అయితే దక్షిణాఫ్రికా కెప్టెన్ మాత్రం రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో తొలుత బంతి ఈజీగా లెగ్స్టంప్ మిస్అవుతున్నట్లు కన్పించింది. కానీ బాల్ ట్రాకింగ్లో మాత్రం బంతి లెగ్స్టంప్ను తాకినట్లు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ స్మిత్ను ఔట్గా ప్రకటించాడు. థర్డ్అంపైర్ తీసుకున్న నిర్ణయం బ్యాటర్ స్టీవ్ స్మిత్తో పాటు ఫీల్డ్ అంపైర్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కనీసం అంపైర్ కాల్ అయినా వస్తుందని భావించారు. కానీ అందరి అంచనాలను 'హాక్ ఐ' టెక్నాలజీ తారుమారు చేసింది. కాగా గత కొంతకాలంగా ఎల్బీ డబ్ల్యూ రివ్యూ, క్యాచ్ల ఫలితాల తేల్చడంలో 'హాక్ ఐ' టెక్నాలజీని ఐసీసీ వాడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది. టెక్నాలజీ లోపానికి స్మిత్ బలయ్యాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ICC World Cup 2023 SA vs AUS: కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా? View this post on Instagram A post shared by ICC (@icc) -
జడేజా సూపర్ డెలివరీ.. దెబ్బకు స్మిత్ ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. తన 10 ఓవర్ల కోటాలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను జడేజా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఫాస్ట్ బౌలర్లను మెరుగ్గా ఆడుతూ స్మిత్ క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని జడేజా చేతికి ఇచ్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 28 ఓవర్లో జడ్డూ వేసిన తొలి బంతికి స్మిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మిడిల్ పడిన బంతి అనుహ్యంగా టర్న్ అయ్యి హాఫ్ స్టంప్ను గిరాటేసింది. జడ్డూ దెబ్బకు స్మిత్కు దిమ్మతిరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది. భారత బౌలర్ల దాటికి 199 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, కుల్దీప్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు సిరాజ్, అశ్విన్, హార్దిక్ చెరో వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(46) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: హార్దిక్ కాదు! ధోని మాదిరి ప్రభావం చూపగల బ్యాటర్ అతడే: సురేశ్ రైనా View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్ చేరితే ఆపడం కష్టం!
ICC ODI World Cup 2023: 1987, 1999, 2003, 2007, 2015... ఏకంగా ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ గెలిచిన ఘనత ఆస్ట్రేలియా సొంతం. పటిష్టమైన కంగారూ జట్టుతో పోటీ అంటే ప్రత్యర్థి జట్లకు ఒకప్పుడు వణుకుపుట్టేది! కానీ గత కొన్నాళ్లుగా ఆసీస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. 2019 వన్డే వరల్డ్కప్ టోర్నీలో సెమీస్లోనే నిష్క్రమించిన ఆస్ట్రేలియా.. గతేడాది టీ20 వరల్డ్కప్లో సెమీ ఫైనల్కు కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరి ఆస్ట్రేలియా పటిష్ట జట్టుగా కనిపించడం లేదని పేర్కొన్నాడు. అయితే, వన్డే వరల్డ్కప్-2023లో టాప్-4కు చేరితే మాత్రం వారిని ఆపడం కష్టమని ఇతర జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. మునుపటిలా లేదు.. కానీ ‘‘ఆస్ట్రేలియా ఇంతకు ముందున్నట్లు లేదు. వాళ్లు ఇంతవరకు మెగా టోర్నీలో ఆడే తమ వికెట్ కీపర్ను ఫైనల్ చేయలేదు. జోష్ ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ ఇద్దరూ మంచి ఆటగాళ్లే. కానీ ఇద్దరిలో ఒక్కరికే చోటు దక్కుతుంది. మాక్స్వెల్ వికెట్లు తీస్తున్నాడు. కానీ.. జట్టు అతడి నుంచి బ్యాటింగ్ మెరుపులు ఆశిస్తోంది. స్పిన్ను ఎదుర్కోవడంలో ఆసీస్ బ్యాటర్లు తడబడటం ఆందోళన కలిగించే అంశం. ఇక కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టొయినిస్ పోషించాల్సిన పాత్రలేమిటో కూడా ఇంతవరకు స్పష్టం కాలేదు. నిజానికి గ్రీన్ కంటే స్టొయినిస్ బెటర్. లోయర్ ఆర్డర్లో మెరుగ్గా బ్యాటింగ్ చేయగలడు. నా వరకైతే ఈ జట్టు బాగానే అనిపిస్తోంది. ఫైనల్ ఫోర్ జట్లలో ఆస్ట్రేలియా కూడా ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్ ఆసీస్ను సెమీస్కు చేర్చగలరు. ఒక్కసారి సెమీస్ చేరితే ఆపడం కష్టం ఒక్కసారి టాప్-4లో అడుగుపెడితే నాకౌట్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా అత్యంత ప్రమాదకారిగా మారి ప్రత్యర్థి జట్లకు సవాల్ విసరడం ఖాయం’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గతేడాది సొంతగడ్డపై జరిగిన టీ20 వరల్డ్కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఆసీస్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇక తాజా ప్రపంచకప్నకు ముందు దక్షిణాఫ్రికాతో 2-3తో.. టీమిండియాతో 2-1తో వన్డే సిరీస్ను కోల్పోయింది. కాగా అక్టోబరు 8న రోహిత్ సేనతో మ్యాచ్తో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్కప్-2023 ప్రయాణాన్ని ఆరంభించనుంది. చదవండి: కోహ్లి కాదు! అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. మోస్ట్ డేంజరస్: పాక్ వైస్ కెప్టెన్ -
IND VS AUS 3rd ODI: అరుదైన క్లబ్లో చేరిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్లో చేరాడు. రాజ్కోట్ వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 27) జరుగుతున్న మూడో వన్డేలో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును అందుకున్న 17వ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. కెరీర్లో 145 వన్డేలు ఆడిన స్మిత్.. 12 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5049 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్మిత్ 70 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. కాగా, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (463 మ్యాచ్ల్లో 18426 పరుగులు) పేరిట ఉంది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ రికార్డు రికీ పాంటింగ్ సొంతం చేసుకున్నాడు. పాంటింగ్ 374 వన్డేల్లో 13589 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున వన్డేల్లో 10000 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడు కూడా పాంటింగే కావడం విశేషం. ఇదిలా ఉంటే, టీమిండియాతో మూడో వన్డేలో ఆసీస్ ధాటిగా ఆడుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 31 ఓవర్ల తర్వాత 2 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. డేవిడ్ వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. స్మిత్ (70), లబూషేన్ (13) క్రీజ్లో ఉన్నారు. 3 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
వారిద్దరే మా కొంపముంచారు.. చాలా విషయాలు నేర్చుకున్నాం: స్మిత్
ఇండోర్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 0-2 తేడాతో ఆసీస్ కోల్పోయింది. బ్యాటింగ్ , బౌలింగ్ రెండు విభాగాల్లో ఆస్ట్రేలియా విఫలమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్(105), శుబ్మన్ గిల్ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్( 72 నాటౌట్), కేఎల్ రాహుల్(52) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటరల్లో సీన్ అబాట్(54) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. "ఇండోర్ వికెట్ బ్యాటింగ్కు మంచిగా అనుకూలించింది. నిజంగా గిల్, శ్రేయస్ తమ అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి దూరం చేశారు. కేఎల్, సూర్య బ్యాటింగ్ తీరు కూడా అత్యుత్తమం. అయితే వర్షం పడిన తర్వాత పిచ్కు అనుకూలించింది. బంతి అద్బుతంగా స్పిన్ అయింది. మేము దక్షిణాఫ్రికాపై కూడా అన్ని మ్యాచ్లను ఓడిపోయాం. ఇక్కడే అదే కొనసాగిస్తున్నాము. మేము గత కొన్ని ఓటములనుంచి చాలా విషయాలు నేర్చకున్నాం. మా తదుపరి మ్యాచ్లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. వరల్డ్కప్కు ముందు మా రిథమ్ను తిరిగి పొందడం చాలా ముఖ్యమని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో స్మిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: రాహులా మజాకా.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్ -
భారత్లో అడుగుపెట్టిన ఆసీస్ క్రికెటర్లు.. వార్నర్ పోస్ట్ వైరల్
Ind Vs Aus: David Warner Thrilled To Be Back In India: సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న ఆస్ట్రేలియా టీమిండియాతో సిరీస్కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన కంగారూలు.. వన్డే సిరీస్ను మాత్రం 3-2తో చేజార్చుకున్నారు. ఈ క్రమంలో వన్డే వరల్డ్కప్-2023కి ముందు చివరిసారిగా రోహిత్ సేనతో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లు భారత్కు చేరుకున్నారు. వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సహా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ, మిచెల్ మార్ష్ తదితరులు ఇండియాలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వార్నర్ భాయ్ భావోద్వేగ నోట్ షేర్ చేశాడు. జాగ్రత్తగా చూసుకుంటారు ‘‘ఇండియాలో మళ్లీ అడుగుపెట్టడం.. ఎల్లప్పుడూ గొప్పగానే అనిపిస్తుంది. ఇక్కడ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు’’ అంటూ భద్రతా సిబ్బందితో దిగిన ఫొటోను పంచుకున్నాడు. మరోవైపు.. తాము హోటల్ గదిలో సేద తీరుతున్న ఫొటోలను అలెక్స్ క్యారీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాగా ప్రొటిస్తో తొలి రెండు వన్డేల్లో వరుసగా 106, 78 పరుగులు సాధించిన 36 ఏళ్ల వార్నర్.. మలి మూడు మ్యాచ్లలో కనీసం 20 పరుగులు మార్కును కూడా దాటలేక విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్కు ముందు ఈ వెటరన్ బ్యాటర్.. టీమిండియాతో సిరీస్లో ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సి ఉంది. స్టార్లు తిరిగి వచ్చారు భారత్తో వన్డే సిరీస్లో ఈ లెఫ్టాండర్.. మిచెల్ మార్ష్తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గాయాల కారణంగా ఇన్నాళ్లు జట్టుకు దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ తిరిగి రావడం ఆసీస్కు ఉత్సాహాన్నిస్తోంది. ఇక సెప్టెంబరు 22-27 వరకు మొహాలీ, ఇండోర్, రాజ్కోట్లలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్లు జరుగునున్నాయి. అదే విధంగా ఇరు జట్లు అక్టోబరు 8న తమ వరల్డ్కప్ ప్రయాణం ఆరంభించనున్నాయి. చదవండి: సిరాజ్ మియా.. మరోసారి వరల్డ్ నంబర్ 1 బౌలర్గా.. ఏకంగా.. అంబానీ ఇంట పూజకు భార్య అతియాతో రాహుల్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
WC: ఇప్పటికే నలుగురికి గాయాలు.. మరో షాక్! స్టార్ బ్యాటర్ చెయ్యి ఫ్రాక్చర్
Travis Head Injury: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఐసీసీ ఈవెంట్కు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. సౌతాఫ్రికాతో నాలుగో వన్డే సందర్భంగా అతడి ఎడమ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే హెడ్ రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు ప్రపంచకప్ టోర్నీకి ముందు ఇలా కీలక బ్యాటర్ గాయపడటం ఆసీస్ను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో ట్రావిస్ హెడ్ గాయం గురించి ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ అప్డేట్ ఇస్తూ.. ‘‘ఫ్రాక్చర్ అయిన మాట వాస్తవమే. అయితే, హెడ్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఇప్పటికే నలుగురు స్టార్లకు గాయాలు స్కానింగ్ తర్వాతే గాయం తీవ్రత గురించి తెలుస్తుంది. ప్రపంచకప్నకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇలా జరగడం దురదృష్టకరం’’ అని పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్వెల్ వంటి స్టార్లు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న వేళ హెడ్ గాయంతో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలినట్లయింది. అదొక్కటే కాస్త ఊరట కాగా కమిన్స్కు మణికట్టు భాగంలో ఫ్రాక్చర్ అయింది. స్టార్క్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. మాక్స్వెల్కు మడిమ నొప్పితో సతమతమవుతున్నాడు. అయితే, స్టీవ్ స్మిత్ మణికట్టు గాయం నుంచి కోలుకుని నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నా.. పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అయితే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే సందర్భంగా గాయపడిన ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ కోలుకుని వైద్య బృందం పరీక్షల్లో పాస్ కావడం ఆస్ట్రేలియాకు కాస్త ఊరట కలిగించింది. గాయాల బెడద.. మాజీ చాంపియన్ ఏం చేస్తుందో? ఇక భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్కప్ ఈవెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు జట్లకు అవకాశం ఉంది. ఆటగాళ్ల గాయాల నేపథ్యంలో.. వన్డే వరల్డ్కప్ ట్రోఫీని అత్యధికంగా 5 సార్లు గెలిచిన ఆసీస్ ఈసారి టీమ్ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలి! ప్రపంచకప్-2023కి ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆష్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. చదవండి: అతడు అద్భుతం.. క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందే.. మేం ఓడినా: రోహిత్ శర్మ -
క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ప్రతి ఆస్ట్రేలియా ఆటగాడు (దేశవాలీ, అంతర్జాతీయ ఆటగాళ్లు) నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్తో బ్యాటింగ్కు దిగడం తప్పనిసరి చేసింది. ఇటీవలికాలంలో బ్యాటర్లు తరుచూ ఫాస్ట్ బౌలింగ్లో గాయపడుతుండటంతో సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. సీఏ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలామంది ఆసీస్ క్రికెటర్లు తమ మునుపటి ప్రాక్టీస్ను మార్చుకోవాల్సి వస్తుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ తదితరులు నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడరు. సీఏ తాజా నిర్ణయంతో వీరంతా తప్పనిసరిగా మెడ భాగం సురక్షితంగా ఉండేలా హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. కాగా, నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్లను క్రికెట్ ఆస్ట్రేలియా ఫిలిప్ హ్యూస్ మరణాంతరం (2012) ప్రత్యేకంగా తయారు చేయించింది. హ్యూస్ ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోయే వాడు కాదు. 2019 యాషెస్ సిరీస్లో ఇంచుమించు ఇలాంటి ప్రమాదమే మరొకటి సంభవించి ఉండేది. నాడు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్ స్టీవ్ స్మిత్ను మెడ భాగంలో బలంగా తాకింది. అంత జరిగాక కూడా స్మిత్ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించేందుకు ఇష్టపడే వాడు కాదు. ఇది ధరిస్తే అతని హార్ట్ బీట్ అమాంతంగా పెరుగుతుందని అతను చెప్పుకొచ్చేవాడు. వార్నర్ సైతం నెక్ ప్రొటెక్టర్ ధరిస్తే, అది తన మెడలోకి చొచ్చుకుపోయేదని చెప్పి తప్పించుకునే వాడు. సీఏ తాజా నిర్ణయంతో వీరు కారణాలు చెప్పి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతున్న సిరీస్ సందర్భంగా రబాడ వేసిన ఓ రాకాసి బౌన్సర్ కెమారూన్ గ్రీన్ మెడ భాగంలో బలంగా తాకింది. అయితే అతను ఈ నెక్ ప్రొటెక్టర్ ఉండటంతో బ్రతికి బయటపడ్డాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే క్రికెట్ ఆస్ట్రేలియా నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మరోవైపు స్వదేశంలోనూ బౌన్సీ పిచ్లు ఎక్కువగా ఉండటంతో దేశవాలీ క్రికెటర్లు కూడా ముందు జాగ్రత్తగా ఈ నెక్ ప్రొటెక్టర్ హెల్మెట్ ధరించి బ్యాటింగ్కు దిగాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆసీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్.. 5 మ్యాచ్ల వన్డే సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఆసీస్ సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు టీమిండియాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతుంది. తదనంతరం అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్కప్లో పాల్గొంటుంది. -
ప్రపంచకప్నకు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ఆ ముగ్గురు అవుట్! కెప్టెన్ సహా..
Australia 15 Man Squad For WC 2023: వన్డే ప్రపంచకప్-2023 టోర్నీకి ఆస్ట్రేలియా తమ జట్టును ఖరారు చేసింది. ఐసీసీ ఈవెంట్లో భాగం కానున్న 15 మంది సభ్యుల పేర్లను ఫైనల్ చేసింది. ప్రాథమిక జట్టులో.. తొలిసారిగా చోటు దక్కించుకున్న యువ ఆల్రౌండర్ ఆర్డోన్ హార్డీ, తన్వీర్ సంఘాకు మొండిచేయి ఎదురైంది. అతడు కూడా అవుట్ అదే విధంగా.. యువ పేసర్ నాథన్ ఎల్లిస్కు కూడా చోటు దక్కకపోగా... రైట్ ఆర్మ్ పేసర్ సీన్ అబాట్ మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక టెస్టు స్పెషలిస్టు మార్నస్ లబుషేన్ పేరును ఈసారి కూడా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ మూడే మార్పులు ఎల్లిస్, తన్వీర్, హార్డీ.. ఈ ముగ్గురు తప్ప ప్రిలిమినరీ జట్టులో చోటు దక్కించుకున్న వాళ్లంతా ఫైనల్ టీమ్లో స్థానం సంపాదించారు. ఇదిలా ఉంటే.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహా కీలక ఆటగాళ్లు ఫిట్నెస్లేమితో సతమతం కావడం మాజీ చాంపియన్ను కంగారుపెడుతోంది. కెప్టెన్ సహా వాళ్లంతా ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. స్టీవ్ స్మిత్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్ ప్రపంచకప్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. మెగా ఈవెంట్కు ఇంకా సమయం ఉందని.. అప్పటికి తాము పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతామని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్కప్నకు ముందు సౌతాఫ్రికా, టీమిండియా(సెప్టెంబరు 22-27)తో తాము ఎనిమిది వన్డేలు ఆడటం సానుకూలాంశమన్న బెయిలి.. కీలక టోర్నీకి ముందు ఈ సిరీస్లు తమకు సన్నాహకాలుగా ఉపయోగపడుతాయని హర్షం వ్యక్తం చేశాడు. అప్పటిదాకా టైమ్ ఉంది.. కాబట్టి కాగా 15 మంది సభ్యుల జట్టులో ప్రధాన వికెట్ కీపర్గా అలెక్స్ క్యారీ ఉండగా.. అతడికి బ్యాకప్గా జోష్ ఇంగ్లిస్కు స్థానం దక్కింది. ఇక భారత్ వేదికగా అక్టోబరు 5 నుంచి మెగా ఈవెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరు 8న టీమిండియాతో ఆసీస్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునేందుకు జట్లకు అవకాశం ఉంది. కాబట్టి ఫిట్నెస్లేని ఆటగాళ్ల స్థానంలో వేరే వాళ్లు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్ ట్రోఫీని ఆస్ట్రేలియా అత్యధికంగా 5 సార్లు గెలిచిన విషయం తెలిసిందే. వరల్డ్కప్-2023కి ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆష్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. చదవండి: WC Team India: అంతా బాగానే ఉంది.. కానీ అదొక్కటే లోటు! ఆ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్.. Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup! The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi — Cricket Australia (@CricketAus) September 6, 2023 View this post on Instagram A post shared by Cricket Australia (@cricketaustralia) -
కేన్ విలియమ్స్ ఒక్కడే.. స్మిత్, రూట్, విరాట్ల కంటే ముందే..!
2023 ఆగస్ట్ 8న 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్న న్యూజిలాండ్ వన్డే జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్కు యావత్ క్రికెట్ ప్రపంచ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది. విలియమ్సన్ బర్త్ డే విషెస్తో ఇవాళ సోషల్మీడియా మొత్తం హోరెత్తిపోతుంది. 13 ఏళ్ల కెరీర్లో కేన్ మామ సాధించిన ఘనతలను ప్రస్తావిస్తూ అభిమానులు రకరకాల పోస్ట్లు పెడుతున్నారు. ఆ దేశం ఈ దేశం అన్న తేడా లేకుండా యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం కేన్ను కీర్తిస్తుంది. ఈ క్రమంలో అతనికి సంబంధించిన పలు ఆసక్తికర గణాంకాలు, రికార్డులు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యుత్తముల్లో ఒకడిగా, ఫాబ్-4 క్రికెటర్లలో ముఖ్యుడిగా, ఈ తరం క్రికెటర్లలో అత్యంత నెమ్మదస్తుడిగా పేరున్న కేన్ మామ.. అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) 17000కు పైగా పరుగులు సాధించి, న్యూజిలాండ్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా చలామణి అవుతున్నాడు. 2019 వన్డే వరల్డ్కప్లో న్యూజిలాండ్ను దాదాపు గెలిపించినంత పని చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఈ వరల్డ్కప్ ఫైనల్లో ఇంగ్లండ్ను అదృష్టం వరించి ఛాంపియన్గా నిలిచింది. ఇనాగురల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో (2019-2021) న్యూజిలాండ్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక సెంచరీలు (41), ప్రస్తుత తరం క్రికెటర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో ఆటగాడు (17142), బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుతమైన ట్రాక్ రికార్డు.. ఇలా కేన్ మామ తన ప్రతిభ, ప్రవర్తనలతో క్రికెట్ ప్రపంచం మొత్తానికి ఆరాధ్యుడిగా నిలిచాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లతో పోలిస్తే టెస్ట్ల్లో ఘనమైన రికార్డు కలిగిన కేన్ (28 టెస్ట్ సెంచరీలు), ఫాబ్ ఫోర్గా పిలువబడే స్టీవ్ స్మిత్ (32 సెంచరీలు), జో రూట్ (30), విరాట్ కోహ్లి (29)ల కంటే ఒకటి, రెండు సెంచరీలు తక్కువగా చేసినా, వీరందరి కంటే ముందే ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్మిత్, రూట్,కోహ్లిలతో పాటు ప్రస్తుత తరం క్రికెటర్లలో అందరికంటే ముందే అన్ని టెస్ట్ ప్లేయింగ్ దేశాలపై సెంచరీలు సాధించి, తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కేన్ మామ 2018కి ముందే అప్పటికి టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలన్నిటిపై సెంచరీలు సాధించాడు. అప్పటికి స్మిత్, కోహ్లి, రూట్లు ఈ ఘనత సాధించలేదు. కేన్ ఈ ఘనత సాధించిన సమయానికి దిగ్గజాలు మర్వన్ ఆటపట్టు, రాహుల్ ద్రవిడ్, ఆడమ్ గిల్క్రిస్ట్, జయవర్ధనే, కలిస్, కిర్స్టెన్, లారా, పాంటింగ్, సంగక్కర, యూనిస్ ఖాన్, సచిన్, స్టీవ్ వాలు మాత్రమే ఈ ఘనత సాధించారు. కేన్ విలియమ్సన్ గణంకాలు.. 54.9 సగటుతో 8124 టెస్ట్ పరుగులు (28 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు) 47.8 సగటుతో 6555 వన్డే పరుగులు (13 సెంచరీలు, 42 హాఫ్ సెంచరీలు) 123 స్ట్రయిక్రేట్తో 2464 టీ20 పరుగులు (17 హాఫ్ సెంచరీలు) 126 స్ట్రయిక్రేట్తో 2101 ఐపీఎల్ పరుగులు (18 హాఫ్ సెంచరీలు) 2018 ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ -
ముందే సంబరపడితే ఇలాగే ఉంటది.. కీలకమైన స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టి వదిలేసిన స్టోక్స్
యాషెస్ సిరీస్ 2023 ఐదో టెస్ట్ చివరి రోజు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఘోర తప్పిదం చేశాడు. కీలక సమయంలో (లంచ్కు ముందు ఓవర్ తొలి బంతికి) మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే స్టీవ్ స్మిత్ (40) క్యాచ్ను జారవిడిచాడు. మొయిన్ అలీ బౌలింగ్లో స్మిత్ గ్లవ్స్ను తాకిన బంతిని లెగ్ గల్లీలో ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్ అతికష్టం మీద (చాలా ఎత్తుకు ఎగిరి) పట్టుకున్నట్లే పట్టుకుని వదిలేశాడు. STOKES 😒pic.twitter.com/OUD88ZWZkF — CricTracker (@Cricketracker) July 31, 2023 సంబురాలు చేసుకునే తొందరలో స్టోక్స్ మోకాలికి తగిలి బంతి నేలపాలైంది. ఇంతటితో ఆగకుండా స్టోక్స్ రివ్యూకి వెళ్లి ఇంకో ఘోర తప్పిదం చేశాడు. రీప్లేలో బంతి స్మిత్ గ్లవ్స్కు తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. బంతి నిర్దిష్ట సమయం పాటు స్టోక్స్ చేతిలో లేకపోవడంతో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఇంగ్లండ్ అప్పీల్కు నాటౌట్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో కీలక సమయంలో ఇంగ్లండ్కు వికెట్ దక్కకపోగా, రివ్యూ కోల్పోయింది. It's lunch on Day 5. Steve Smith and Travis Head keep Australia steady as teams head for Lunch. pic.twitter.com/8mTKpA0eXZ — CricTracker (@Cricketracker) July 31, 2023 కాగా, స్టోక్స్.. స్టీవ్ స్మిత్ క్యాచ్ జారవిడిచాక ఆట మరో 5 బంతుల పాటు సాగింది. అనంతరం అంపైర్లు లంచ్ విరామం ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కూడా మొదలైంది. లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ స్కోర్ 238/3గా ఉంది. స్టీవ్ స్మిత్ (40), ట్రవిస్ హెడ్ (31) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఆసీస్ గెలవాలంటే 146 పరుగులు, ఇంగ్లండ్ విజయానికి 7 వికెట్లు కావాల్సి ఉంది. లంచ్ విరామ సమయం పూర్తయ్యాక కూడా వర్షం పడుతుండటంతో అంపైర్లు మ్యాచ్ను పాక్షికంగా నిలిపివేశారు. ఇదిలా ఉంటే, 384 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 135/0 ఓవర్నైట్ స్కోర్ వద్ద ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా, తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కొత్త బంతితో ఇంగ్లండ్ పేసర్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా క్రిస్ వోక్స్, మార్క్ వుడ్లు ఆసీస్ ఆటగాళ్లను వణికించారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (60), ఉస్మాన్ ఖ్వాజా (72).. తమ ఓవర్నైట్ స్కోర్లకు రెండు, మూడు పరుగుల చొప్పున జోడించి ఔట్ కాగా.. లబూషేన్ 13 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. -
ఇకపై కోహ్లిని అలా పిలువకండి.. 'కింగ్' ఆ ముగ్గురి సరసన నిలిచే అర్హత కోల్పోయాడు..!
రన్ మెషీన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి ఇకపై ఎంతమాత్రం ఫాబ్-4లో భాగంగా కాదని, టెస్ట్ల్లో తరుచూ విఫలమవుతున్న కోహ్లి ఫాబ్-4లో నిలిచే అర్ఘత కోల్పోయాడని, ఇకపై ఎవ్వరూ కోహ్లిని ఫాబ్-4లో ఒకడిగా పిలవకండని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఫాబ్-4గా పిలువబడే వారిలో స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్లు తమకిచ్చిన బిరుదుకు న్యాయం చేస్తున్నారని.. కోహ్లి ఒక్కడే వరుసగా విఫలమవుతూ, అందుకు న్యాయం చేయలేకపోతున్నాడని అన్నాడు. కెరీర్లో (యాషెస్ మూడో టెస్ట్) వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్మిత్.. ఇటీవలే 32వ టెస్ట్ శతకాన్ని నమోదు చేయగా.. రూట్ సైతం ఇదే యాషెస్ సిరీస్లో సెంచరీ చేసి ఫామ్లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. విరాట్ విషయానికొస్తే.. ఇతను గత మూడేళ్లలో కేవలం ఒక టెస్ట్ సెంచరీ మాత్రమే చేశాడు. దీంతో అతన్ని ఫాబ్-4లో ఒకడిగా సంబోధించడంపై చాలా మంది ప్రశ్నించారు. ఈ విషయంలో ఆకాశ్ చోప్రా ఓ అడుగు ముందుకేసి, ఎవరూ చేయలేని సాహసం (కోహ్లిని బహిరంగంగా విమర్శించడం) చేశాడు. ఇకపై విరాట్ ఫ్యాబ్ 4లో ఒకడిగా పిలుపించుకోవడానికి ఎంతమాత్రం అర్హుడు కాదని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్లతో ఫ్యాబ్-3 మాత్రమే ఉందని అన్నాడు. ఆకాశ్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఘాటుగా ఉన్నా, ఇందులో నిజం లేకపోలేదు. 2014-2019 వరకు అద్భతంగా ఆడి (58.71 సగటుతో 5695 పరుగులు, 22 సెంచరీలు, 4 డబుల్ సెంచరీలు) ఫాబ్-4లో చోటు దక్కించుకున్న విరాట్.. ఆ తర్వాత మూడేళ్లలో 25 మ్యాచ్లు ఆడి కేవలం 1277 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవగం 29.69గా ఉంది. -
'వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది'
యాషెస్ సిరీస్లో మ్యాచ్లు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో.. మ్యాచ్ బయట జరిగే విషయాలు కూడా అంతే ఆసక్తిగా ఉంటున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో జానీ బెయిర్ స్టో వివాదాస్పద ఔట్ తర్వాత ఇంగ్లీష్ మీడియా, అభిమానులు వీలు చిక్కినప్పుడల్లా ఆసీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీని విలన్గా ముద్రించారు. అతను కనిపించిన ప్రతీసారి ఏదో ఒకరీతిలో అతన్ని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. లీడ్స్ వేదికగా మొదలైన మూడో టెస్టులో బ్యాటింగ్, కీపింగ్కు వచ్చిన సందర్భంలో మైదానంలోని ఇంగ్లండ్ అభిమానుల నుంచి అతనికి చీత్కారాలే ఎక్కువగా వచ్చాయి. దీనికి తోడు ఇంగ్లీష్ పత్రిక ది సన్ అలెక్స్ కేరీ కటింగ్షాపు ఓవర్కు డబ్బులు ఎగ్గొట్టాడంటూ ఒక కథనాన్నే ప్రచురించింది. ''లీడ్స్లోని ఒక కటింగ్షాపుకు వెళ్లిన కేరీ హెయిర్ కట్ అనంతరం ఓనర్కు డబ్బులు ఎగ్గొట్టాడు. దాంతో సదరు వ్యక్తి కేరీకి డెడ్లైన్ విధించాడంటూ'' రాసుకొచ్చింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తన థ్రెడ్స్ ఖాతాలో వివరణ ఇస్తూ సదరు పత్రికపై విమర్శలు గుప్పించాడు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదంటూ హితభోద చేశాడు. ''అలెక్స్ కేరీ లండన్ వచ్చినప్పటి నుంచి హెయిర్ కటింగ్ చేయించుకోలేదు. దానిని నేను కచ్చితంగా చెప్పగలను. ముందు నిజాలను తెలుసుకుంటే బాగుంటుంది'' అని స్మిత్ పోస్టు చేశాడు. ఇక యాషెస్ సిరీస్ మూడో టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. 251 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. డకెట్ (18 నాటౌట్), క్రాలీ (9 నాటౌట్) క్రీజ్లో ఉన్నారు. ఆ జట్టు మరో 224 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: #PrithviShaw: ''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!' విలన్గా మారిన ఆసీస్ కీపర్.. కటింగ్షాపులో డబ్బులు ఎగ్గొట్టి -
వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడినట్లుగా అనిపిస్తుంది. లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 5, ట్రెవిస్ హెడ్ 10 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఆసీస్ బ్యాటింగ్లో మార్నస్ లబుషేన్ 21, స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ చెరొక వికెట్ తీశారు. ఇక ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో మెరిశాడు. అయితే మూడో టెస్టులో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో స్మిత్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్టీవ్ స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. లీడ్స్ టెస్టులో 22 పరుగులు చేసిన స్మిత్ ఇప్పటివరకు 3226 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్(3222 పరుగులు)ను దాటిన స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. స్మిత్ కంటే ముందు జాక్ హాబ్స్(3636 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. తొలి స్థానంలో ఆస్ట్రేలియన్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మన్(5028 పరుగులు) ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక స్మిత్కు ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలిస్తే, సిరీస్ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు.కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు. 100 seconds of Steve Smith gold, ahead of his 100th Test for Australia tonight! #Ashes pic.twitter.com/y1JbDt3k8t — cricket.com.au (@cricketcomau) July 6, 2023 చదవండి: భారత్లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరో తెలుసా?.. కోహ్లి, సచిన్, ధోనిలు కాదు! -
టెస్ట్ల్లో స్టీవ్ స్మిత్ను మించినోడే లేడు.. బౌలర్గా మొదలుపెట్టి అత్యున్నత శిఖరాలకు..!
హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) యాషెస్ మూడో టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆడటం ద్వారా ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 100 టెస్ట్ల మైలురాయిని చేరుకోనున్నాడు. 2010లో లార్డ్స్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన స్మిత్.. తన కెరీర్లో ఇప్పటివరకు 99 మ్యాచ్లు ఆడి 59.56 సగటున 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 9113 పరుగులు చేశాడు. Steve Smith is all set for his special 💯#Ashes2023 pic.twitter.com/xbcaiescXJ— CricTracker (@Cricketracker) July 6, 2023 టెస్ట్ల్లో స్మిత్ను మించినోడే లేడు.. 99 టెస్ట్ మ్యాచ్ల తర్వాత ప్రపంచ మేటి బ్యాటర్లను స్టీవ్ స్మిత్తో పోలిస్తే.. ఒక్కరు కూడా ఈ ఆసీస్ స్టార్ దరిదాపుల్లో లేరు. గణాంకాల ప్రకారం చూసినా, జట్టు విజయాల్లో పాత్ర ప్రకారం చూసినా.. స్మిత్ తిరుగులేని ఆటగాడిగా ఉన్నాడు. 99 టెస్ట్ తర్వాత స్మిత్ 9113 పరుగులు చేస్తే.. దిగ్గజ క్రికెటర్లు బ్రియాన్ లారా 8833 పరుగులు, సంగక్కర 8572 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 8492 పరుగులు, సచిన్ టెండూల్కర్ 8351 పరుగులు చేశారు. ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్గా చలామణి అవుతున్న విరాట్ కోహ్లి 99 టెస్ట్ల తర్వాత 7962 పరుగులు చేసి స్మిత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. Most runs after 99 tests:9113 - Steven Smith (175 innings)8833 - Brian Lara (174 innings)8594 - Younis Khan (176 innings)8572 - Kumar Sangakkara (166 innings)8492 - Rahul Dravid (167 innings)— CricTracker (@Cricketracker) July 6, 2023 ఇక, ఆయా జట్ల విజయాల్లో దిగ్గజాల పాత్రతో పోలిస్తే స్మిత్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియా విజయాల్లో స్మిత్ పాత్ర 70.41 శాతంగా ఉంటే, టీమిండియా విజయాల్లో కోహ్లి కాంట్రిబ్యూషన్ 55.34 శాతంగా ఉంది. Steve Smith's first Test - Batted No.8 & No.9, bowled 21 overs in the second innings with 3 scalps to boot!Today, he'll play his 100th Test as an all-time batting great 🙂 #Ashes #CricketTwitter pic.twitter.com/iV43G3GALZ— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023 బౌలర్గా మొదలుపెట్టి, ఆల్టైమ్ గ్రేట్ బ్యాటర్గా.. లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలర్గా ప్రస్తానాన్ని ప్రారంభించిన స్మిత్.. ఆల్టైమ్ గ్రేట్ టెస్ట్ బ్యాటర్గా చలామణి అవుతున్నాడు. గణాంకాల ప్రకారం తిరుగులేని బ్యాటర్గా ఉన్న స్మిత్.. తన తొలి టెస్ట్ మ్యాచ్లో 8,9 స్థానాల్లో బ్యాటింగ్ బరిలోకి దిగి కేవలం 13 పరుగులు (1, 12) మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో తేలిపోయిన స్మిత్ బౌలింగ్లో రాణించి 3 వికెట్లు (సెకెండ్ ఇన్నింగ్స్లో) పడగొట్టాడు. స్మిత్ బౌలర్గా రాణించడంతో అంతా ఇతను బౌలర్గా స్థిరపడతారని అనుకున్నారు. అయితే స్మిత్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ.. వరల్డ్ బెస్ట్ టెస్ట్ బ్యాటర్గా మారాడు. Steve Smith's peak years in Test Cricket:2014 - 1146 runs & 81.86 Average2015 - 1474 runs & 73.70 Average2016 - 1079 runs & 71.93 Average2017 - 1305 runs & 76.76 Average21 hundreds & 17 fifties from just 45 matches - The GOAT. pic.twitter.com/K0l7OvFZmE— Johns. (@CricCrazyJohns) July 5, 2023 The last time Steve Smith played a Test in Headingley, it was July 2010 & he was one Test old. Made a valiant 77, his first fifty, batting No 8 against Pakistan. Here he is on the cusp of playing his 100th Test. One of the more unique journeys to No 100 in cricket history #Ashes pic.twitter.com/4AsjldVDqW— Bharat Sundaresan (@beastieboy07) July 4, 2023 -
Ashes Series 3rd Test: అరుదైన మైలురాయిని చేరుకోనున్న స్టీవ్ స్మిత్
హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్తో స్మిత్ అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 40 మంది ఆటగాళ్లు 100 టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఘనతను సొంతం చేసుకోగా.. ఎల్లుండి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్తో స్మిత్ వీరి సరసన చేరనున్నాడు. ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కానున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఆసీస్ గెలిస్తే, సిరీస్ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు. తాజాగా ముగిసిన యాషెస్ రెండో టెస్ట్లోనూ స్మిత్ సెంచరీ చేశాడు. ప్రస్తుత తరం అత్యుత్తమ ఆటగాళ్లలో ప్రథముడిగా చలామణి అవుతున్న స్మిత్.. వంద టెస్ట్లోనూ సెంచరీ చేసి ఫాబ్ ఫోర్గా పిలువబడే కోహ్లి, రూట్, విలియమ్సన్ల కంటే చాలా స్పెషల్ అని మరోసారి నిరూపించుకోవాలని అతని అభిమానులు ఆరాటపడుతున్నారు. సెంచరీల పరంగా, యావరేజ్ పరంగా కోహ్లి (28 సెంచరీలు, 48.72 యావరేజ్), రూట్ (30, 50.43)), విలియమ్సన్ (28, 54.89)ల కంటే చాలా మెరుగ్గా ఉన్న స్మిత్.. 100వ మ్యాచ్లో సెంచరీ చేసి, ఆల్టైమ్ గ్రేట్ అనిపించుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే, 5 మ్యాచ్ల యాషెస్ సిరీస్లో పర్యాటక ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సిరీస్ను ఇంగ్లండ్ గెలవలేదు. అయినా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం తాము ఈ సిరీస్ను గెలిచి తీరతామని అంటున్నాడు. -
స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్.. థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు!
యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 325 పరుగులకే పరిమితం చేసిన ఆసీస్ 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లోనూ ఆసీస్ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. ప్రస్తుతం 149 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఆసీస్ పట్టు బిగించేలా కనిపిస్తోంది. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీసుకుంటున్న పలు క్యాచ్లు వివాదాస్పదంగా మారుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో గిల్ క్యాచ్ను గ్రీన్ అందుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం యాషెస్ సిరీస్లోనూ బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టులోనూ మళ్లీ గ్రీన్ మరో వివాదాస్పద క్యాచ్తో వార్తల్లో నిలిచాడు. బెన్ డక్కెట్ ఇచ్చిన క్యాచ్ను థర్డ్ స్లిప్లో ఉన్న గ్రీన్ అందుకున్నాడు. అయితే బంతి నేలను తాకినట్లు క్లియర్గా ఉన్నా థర్డ్ అంపైర్ మరోసారి గ్రీన్కే ఓటు వేశాడు. ఈ రెండు సందర్భాల్లో గ్రీన్ విలన్గా మారితే.. తాజాగా స్టీవ్ స్మిత్ వివాదాస్పద క్యాచ్ల జాబితాలో చేరాడు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్కు తొలి ఇన్నింగ్స్లో మంచి ఆరంభం లభించింది. అయితే రూట్ (10 పరుగులు) ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్టార్క్ వేసిన బంతిని(46.3వ ఓవర్లో) రూట్ ఎదుర్కొనే క్రమంలో బ్యాక్వర్డ్ స్క్వేర్ వద్ద స్మిత్ చేతికి చిక్కాడు. అయితే క్యాచ్ అందుకున్న విధానంపై అనుమానంతో ఫీల్డ్ అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించారు. రిప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. రిప్లేలో బంతి నేలను తాకుతుందని క్లియర్గా తెలుస్తున్నప్పటికి.. ఔట్ ఇవ్వడం ఏంటని ఇంగ్లండ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Nine wickets ☝ Three hundred and thirty-five runs 🏏 Another day of Test match cricket to savour 👇 pic.twitter.com/48K4lXmk2J — England Cricket (@englandcricket) June 30, 2023 -
ఇంగ్లండ్ పోరాటం...
లండన్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు పోరాటం సాగిస్తోంది. ఒకదశలో 188/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు 34 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి 222/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో మరో రెండు వికెట్లు పడి ఉంటే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలేది! కానీ హ్యారీ బ్రూక్ (51 బంతుల్లో 45 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ (57 బంతుల్లో 17 బ్యాటింగ్; 1 ఫోర్) పట్టుదలతో ఆడి ఐదో వికెట్కు అజేయంగా 56 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 61 ఓవర్లలో 4 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలీ (48; 5 ఫోర్లు) రెండు పరుగులతో అర్ధ సెంచరీ... డకెట్ (98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నారు. ఓలీ పోప్ (42; 4 ఫోర్లు) రాణించగా, జో రూట్ (10) విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా స్కోరుకు ఇంగ్లండ్ మరో 138 పరుగుల దూరంలో ఉంది. మూడో రోజు స్టోక్స్, బ్రూక్లతోపాటు బెయిర్స్టో క్రీజులో నిలబడితే ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్పై ఆశలు ఉంచుకోవచ్చు. ఆసీస్ మేటి స్పిన్నర్ నాథన్ లయన్ కాలి పిక్క గాయం కారణంగా మూడో రోజు బౌలింగ్కు దిగుతాడో లేదో అనుమానం. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 339/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 77 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయి 416 పరుగులవద్ద ఆలౌటైంది. ఓవర్నైట్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (110; 15 ఫోర్లు) కెరీర్లో 32వ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జోష్ టంగ్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 22 టెస్టులోని తొలి ఇన్నింగ్స్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్గా స్మిత్ నిలిచాడు. ఇప్పటి వరకు స్మిత్ తొలి ఇన్నింగ్స్లో 22 సెంచరీలు చేశాడు. 21 సెంచరీలతో రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును స్మిత్ సవరించాడు. -
Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
The Ashes, 2023: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో విఫలమైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండో మ్యాచ్లో బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ టెస్టులో స్మిత్ వరుసగా 16, 6 పరుగులు మాత్రమే చేసిన విషయం తెలిసిందే. అయితే, తదుపరి మ్యాచ్లో మాత్రం అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో రెండో టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా 110 పరుగులు సాధించాడు. తద్వారా టెస్టు కెరీర్లో 32వ శతకం నమోదు చేసిన స్మిత్.. అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 44వ శతకం సాధించాడు. రోహిత్ శర్మను వెనక్కినెట్టిన స్మిత్ తద్వారా టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మను అధిగమించాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఇక దీనితో పాటు మరో రికార్డును కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసీస్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీ వీరుల జాబితాలో ఆసీస్ తరఫున దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా(32 సెంచరీలు)తో సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. సచిన్ టెండుల్కర్(51), జాక్ కలీస్(45), రికీ పాంటింగ్(41) ఈ జాబితాలో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. యాషెస్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 416 పరుగులకు ఆలౌట్ అయింది. 416 పరుగులకు ఆలౌట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 66 పరుగులతో రాణించగా.. వన్డౌన్లో వచ్చిన లబుషేన్ 47, ఐదోస్థానంలో బ్యాటింగ్కు దిగిన ట్రవిస్ హెడ్ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ 22, కెప్టెన్ కమిన్స్ 22 రన్స్ తీశారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. రూట్ రెండు వికెట్లు పడగొట్టారు. స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్కు ఒక్కో వికెట్ దక్కింది. ప్రస్తుత తరం క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్-5 బ్యాటర్లు ►విరాట్ కోహ్లి(భారత్)- 75 ►జో రూట్(ఇంగ్లండ్)- 46 ►డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా)- 45 ►స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 44 ►రోహిత్ శర్మ(భారత్)- 43. చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం! వాళ్లకు ఊరటనిచ్చేలా.. ఇక ధావన్ కెప్టెన్గా.. 🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez — Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023 -
లంచ్ విరామం.. స్మిత్ సెంచరీ, ఆస్ట్రేలియా 416 ఆలౌట్
యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 110 పరుగులతో సెంచరీ చేయగా.. ట్రెవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేశారు. 339/5 ఓవర్నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి సెషన్లోనే తమ పోరాటాన్ని ముగించింది. రెండోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే అలెక్స్ కేరీ వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టార్క్ కూడా 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కమిన్స్ స్మిత్కు జత కలిశాడు. ఇద్దరు కలిసి 8వ వికెట్కు 35 పరుగులు జోడించి జట్టు స్కోరును 400 దాటించారు. ఈ దశలో స్మిత్ టెస్టుల్లో 32వ సెంచరీ మార్క్ను సాధించాడు. అయితే కాసేపటికే స్మిత్ ఔట్ కావడం.. తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు టెయిలెండర్ల పని కానిచ్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్లు చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్ 2, అండర్సన్, బ్రాడ్లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 6, బెన్ డకెట్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన -
టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ శతకంతో మెరిశాడు. యాషెస్ సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ 169 బంతుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు ఉన్నాయి. కాగా స్మిత్కు తన టెస్టు కెరీర్లో ఇది 32వ శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అత్యధిక సెంచరీల విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వాతో(32 టెస్టు సెంచరీలు) కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. జాక్ కలీస్(45 సెంచరీలు) రెండో స్థానంలో, రికీ పాంటింగ్(41 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన క్రికెటర్లలో స్మిత్.. స్టీవ్ వాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుత తరంలో టెస్టుల్లో యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు స్మిత్వే కావడం విశేషం. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్గా స్మిత్ చరిత్ర సృష్టించాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో ఆడుతున్న స్మిత్ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో ఒత్తిడికి గురయ్యాడు. మరోవైపు ఆసీస్ కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో స్మిత్ సెంచరీ చేస్తాడా అన్న అనుమానం వచ్చింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక ఎండ్లో నిలబడి స్మిత్ సెంచరీ అయ్యేలా చూశాడు. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిది. స్మిత్ 110 పరుగులు, పాట్ కమిన్స్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. 🚨Steve Smith is the fastest batsman to score 32nd Hundreds in Test Cricket🚨#Ashes23 #ENGvAUS#ENGvsAUS #Ashespic.twitter.com/bKwZYRL5Ez — Cricket Videos 🏏 (@Abdullah__Neaz) June 29, 2023 A fine innings comes to an end for Steve Smith 🤝 https://t.co/gywkuUUD3T pic.twitter.com/Bxn4vbbRg5 — England Cricket (@englandcricket) June 29, 2023 In 2010 - Steve Smith made his Test debut at Lord's & batted at 8. In 2023 - Steve Smith completed his 32nd Test hundred at Lord's. One of the Greatest turn-arounds in cricket history. pic.twitter.com/UjjS9cc9Oy — Johns. (@CricCrazyJohns) June 29, 2023 చదవండి: సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్కు దిమ్మతిరిగే షాక్ హ్యాట్రిక్ సెంచరీ.. వరల్డ్కప్కు చేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడా! -
సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్కు దిమ్మతిరిగే షాక్
ఇంగ్లండ్ జట్టు బజ్బాల్ ఆటతీరుతో వరుసగా సిరీస్లు గెలిచిన సంగతి తెలిసిందే. స్టోక్స్ కెప్టెన్గా.. మెక్కల్లమ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లండ్ జట్టు 13 టెస్టుల్లో 11 విజయాలు సాధించింది. అన్నింటిలోనూ బజ్బాల్ ఆట దూకుడునే ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించి సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్ జట్టు తమ బజ్బాల్ దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఆసీస్తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్ను ఒక్కరోజులోనే డిక్లేర్ చేసింది. అయితే ప్రతీసారి మనది కాదని తెలుసుకోని ఇంగ్లండ్ ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు తలవంచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఐదోరోజు సూపర్గా బౌలింగ్ చేసినప్పటికి పాట్ కమిన్స్, నాథన్ లయోన్ల అద్బుత పోరాటం ఇంగ్లండ్కు విజయాన్ని దూరం చేసింది. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం బజ్బాల్ ఆటను సమర్థించుకున్నాడు. ఒక్క టెస్టులో ఓడిపోయినంత మాత్రానా బజ్బాల్ను పక్కనపెట్టేదే లేదని కుండబద్దలు కొట్టాడు. సీన్ మొత్తం రివర్స్.. అయితే బుధవారం(జూన్ 28న) లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్బాల్ ఆటతో దూకుడు కనబరుస్తామనుకున్న ఇంగ్లండ్కు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా వేగంగా ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇలాగే ఆడుతామంటూ బజ్బాల్ ఆటను ఇంగ్లండ్కు చూపించింది. డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్లు వన్డే స్టైల్లో వేగంగా ఆడితే.. స్మిత్ ఎప్పటిలాగే తన నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ 85 పరుగులతో నాటౌట్గా నిలిచి సెంచరీకి దగ్గరయ్యాడు. ఓవర్కు 4.08 రన్రేట్తో 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఒక దశలో వార్నర్-లబుషేన్, ట్రెవిస్ హెడ్- స్మిత్ జోడి ఓవర్కు ఐదు పరుగుల చొప్పున జోడించారు. నిజంగా ఇది ఇంగ్లండ్ ఇది ఊహించలేదు. ఇక రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలెక్స్ క్యారీ, లాస్ట్ మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ ఇంకా బ్యాటింగ్కు రావాల్సి ఉంది. తొలి సెషన్లో వీరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్కు అంత మంచిది. రెండు సెషన్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 500 స్కోరు దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇంగ్లండ్కు కష్టాలు మొదలైనట్లే. బజ్బాల్తో ప్రత్యర్థికి చుక్కలు చూపిద్దామనుకున్న ఇంగ్లండ్కు ఆస్ట్రేలియానే ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తోంది. చదవండి: రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్ -
అరుదైన మైలురాయిని దాటిన స్టీవ్ స్మిత్.. ఇతని కంటే కోహ్లి ఒక్కడే బెటర్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా నిన్న (జూన్ 28) మొదలైన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ సాధించింది ప్రధానమైనది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో అజేయంగా నిలిచిన స్మిత్.. అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలురాయిని దాటాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 41 మంది మాత్రమే ఈ మైల్స్టోన్ను చేరుకున్నారు. వీరిలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి (53.44) ఒక్కడే స్మిత్ (49.67) కంటే మెరుగైన యావరేజ్ కలిగి ఉన్నాడు. ఇదే మ్యాచ్లో స్మిత్ టెస్ట్ల్లో 9000 పరుగుల మార్కును కూడా అధిగమించాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మిత్ ఈ ఫీట్ను సాధించాడు. 2000 పరుగులు, 20 వికెట్లు.. ఇక ఈ మ్యాచ్లో మరో రెండు సాధారణమైన రికార్డులు కూడా నమోదయ్యాయి. తొలి రోజు 2 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్.. యాషెస్ సిరీస్లో 2000 పరుగులు, 20 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు వార్విక్ ఆర్మ్స్ట్రాంగ్ (2172, 74), వాలీ హామ్మండ్ (2852, 36) ఈ ఘనత సాధించారు. ఆరో ఇంగ్లండ్ వికెట్కీపర్.. తొలి రోజు ఆటలో ట్రవిస్ హెడ్ను స్టంపౌట్ చేయడం ద్వారా జానీ బెయిర్స్టో ఓ రికార్డు నెలకొల్పాడు. యాషెస్ సిరీస్లో 50 డిస్మిసల్స్ చేసిన ఆరో ఇంగ్లండ్ వికెట్కీపర్గా రికార్డుల్లోకెక్కాడు. బెయిర్స్టోకు (50) ముందు అలెన్ నాట్ (101), డిక్ లిల్లీ (84), అలెక్ స్టివర్ట్ (78), గార్ఫ్రే ఈవాన్స్ (76), మ్యాట్ ప్రయర్ (63) ఈ ఘనత సాధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (66), ట్రవిస్ హెడ్ (77), స్టీవ్ స్మిత్ (85 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించగా.. లబూషేన్ (47) పర్వాలేదనిపించాడు. తొలి టెస్ట్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (17), కెమారూన్ గ్రీన్ (0) నిరాశపరిచారు. స్మిత్తో పాటు అలెక్స్ క్యారీ (11) క్రీజ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జో రూట్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఓలీ రాబిన్సన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
ఆసీస్దే తొలిరోజు
లండన్: బ్యాటర్లు క్రీజులో పాతుకుపోవడంతో రెండో టెస్టు ఆ్రస్టేలియా ఆధిపత్యంతో మొదలైంది. యాషెస్ సిరీస్లో భాగంగా ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టులో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్లో 83 ఓవర్లలో 5 వికెట్లకు 339 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (85 బ్యాటింగ్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో నిలువగా, ట్రావిస్ హెడ్ (77; 14 ఫోర్లు), వార్నర్ (66; 8 ఫోర్లు, 1 సిక్స్) వన్డేలా ఆడి వేగంగా ఫిఫ్టీలు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, రూట్ చెరో 2 వికెట్లు తీశారు. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ ఫీల్డింగ్కే మొగ్గు చూపింది. దీనికి తగ్గట్లే బౌలర్లు కూడా ఓపెనర్లను పెవిలియన్కు పంపేవారు! కానీ పేలవమైన ఫీల్డింగ్ విలువైన వికెట్ అందిపుచ్చుకోలేకపోయింది. 13వ ఓవర్ ఆఖరి బంతి వార్నర్ బ్యాట్ అంచును తాకుతూ నాలుగో స్లిప్లో ఉన్న పోప్ వైపు వెళ్లింది. కానీ సునాయాసమైన ఈ క్యాచ్ను అతను నేలపాలు చేశాడు. అప్పటికి వార్నర్ స్కోరు 20 పరుగులే. కాసేపటికి ఉస్మాన్ ఖ్వాజా (17; 2 ఫోర్లు)ను టంగ్ బౌల్డ్ చేయగా, లైఫ్తో వార్నర్ ఎంచక్కా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లా ఆడుతున్న అతన్ని కూడా టంగ్ బౌల్డ్ చేయగా, లబుషేన్–స్మిత్ జోడీ ఆతిథ్య బౌలర్లకు మింగుడుపడని భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఇద్దరు మూడో వికెట్కు 102 పరుగులు జత చేశారు. అనంతరం లబుషేన్ ఆటకు రాబిన్సన్ ముగింపు పలికాడు. అయితే హెడ్ వచ్చాక స్మిత్ తన నిలకడైన బ్యాటింగ్ను కొనసాగించడంతో ఆతిథ్య బౌలర్లకు మళ్లీ కష్టాలు తప్పలేదు. ఇద్దరు ఆఖరి సెషన్లో అదరగొట్టారు. ఈ జోడీ ఇంగ్లండ్ పాలిట కొరకరానికొయ్యలా మారింది. నాలుగో వికెట్కు 118 పరుగులు జోడించాక రూట్ ఒకే ఓవర్లో హెడ్తో పాటు, గ్రీన్ (0)ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. స్మిత్తో పాటు క్యారీ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 1 ఈ మ్యాచ్తో ఆ్రస్టేలియా స్పిన్నర్ నాథన్ లయన్ తన కెరీర్లో 100 టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వరుసగా 100 టెస్టులు ఆడిన తొలి బౌలర్గా లయన్ ఘనత సాధించాడు. గతంలో ఆలిస్టర్ కుక్ (159 టెస్టులు), బోర్డర్ (153), మార్క్ వా (107), సునీల్ గావస్కర్ (106), మెకల్లమ్ (101) వరుసగా 100కుపైగా టెస్టులు ఆడినా వారందరూ బ్యాటర్లు కావడం గమనార్హం. -
స్టీవ్ స్మిత్ను దారుణంగా అవమానించిన ఇంగ్లండ్ ఫ్యాన్స్
ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్-2023 తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ను దారుణంగా అవమానించారు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ను ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తూ రాక్షసానందం పొందారు. 2018 బాల్ టాంపరింగ్ ఇష్యూ తదనంతరం జరిగిన ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ గేలి చేశారు. Atmosphere 💀pic.twitter.com/Oxt4mQ860k — Shivani (@meme_ki_diwani) June 19, 2023 బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్మిత్ మీడియా ముందు ఏడుస్తూ తప్పు ఒప్పుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ పాట ద్వారా టీజ్ చేశారు. We Saw You Crying On Telly (నువ్వు టీవీలో ఏడుస్తుంటే మేము చూశాం) అంటూ స్టేడియం మొత్తం ముక్తకంఠంతో పాట పాడుతూ స్మిత్ మనసు గాయపడేలా ప్రవర్తించారు. Heartbreaking. Steve Smith has broken down delivering a message to young Aussie cricket fans. pic.twitter.com/l14AsvAhXz — cricket.com.au (@cricketcomau) March 29, 2018 స్టేడియంలో ప్రేక్షకులు ఇలా చేస్తుంటే స్మిత్ తెగ ఇబ్బంది పడ్డాడు. పైకి నవ్వుతూ ఇంకా పాడండి అంటున్నట్లు తల ఊపినప్పటికీ.. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. నెటిజన్లు ఇంగ్లండ్ ప్రేక్షకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. ఎలాంటి వ్యక్తినైనా ఈ తరహాలో ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. Steve Smith heads over to the Hollies for the first time this series….#Ashes pic.twitter.com/Hs1cRB56Lb — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 19, 2023 ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే. -
Ashes 1st Test: స్టీవ్ స్మిత్కు అలా.. ఉస్మాన్ ఖ్వాజాకు ఇలా..!
యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెప్టెన్సీ నైపుణ్యాన్నంతా బయటపెట్డాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో పదేపదే బౌలర్లను మార్చి ఒకింత సక్సెస్ సాధించిన స్టోక్స్.. ఫీల్డింగ్ మొహరింపు విషయంలో తన వైవిధ్యాన్నంతా రంగరించి ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తొలుత స్టీవ్ స్మిత్ను ఔట్ చేసేందుకు నాలుగు స్లిప్లు, రెండు లెగ్ స్లిప్లు మొహరించిన స్టోక్స్.. ఆట మూడో రోజు (ఇవాళ, జూన్ 18) ఉస్మాన్ ఖ్వాజాపై ఒత్తిడి తెచ్చేందుకు క్వార్టర్ సర్కిల్లో ఆరుగురు ఫీల్డర్లను మొహరించాడు. స్టోక్స్ ఫీల్డ్ సెట్టింగ్ వల్ల ఒత్తిడికి లోనైన ఖ్వాజా.. వారిపై నుంచి భారీ షాట్ అడేందుకు ప్రయత్నించి రాబిన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఇలా వైవిధ్యభరితమైన ఫీల్డ్ సెటింగ్ ద్వారా.. ఆసీస్ ప్రధాన బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చి ఔటయ్యేలా చేశాడు స్టోక్స్. SIX catchers in and the plan works 👏 Khawaja gone for 141.COME ON ENGLAND! 🏴 #EnglandCricket | #Ashes pic.twitter.com/6MLJcQxzCX— England Cricket (@englandcricket) June 18, 2023 కాగా, 311/5 స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా.. మరో 75 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయి 386 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (141) వీరోచిత శతకంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ను దాదాపుగా చేరుకునేలా చేశాడు. ఖ్వాజాతో పాటు ట్రవిస్ హెడ్ (50), కెమారూన్ గ్రీన్ (38), అలెక్స్ క్యారీ (66), పాట్ కమిన్స్ (34) పోరాడటంతో ఇంగ్లండ్కు కేవలం 7 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం మాత్రమే దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్లో డేవిడ్ వార్నర్ (9), లబూషేన్ (0), స్టీవ్ స్మిత్ (16), లయోన్ (1), బోలండ్ (0) విఫలం కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, రాబిన్సన్ తలో 3 వికెట్లు, మొయిన్ అలీ 2 వికెట్లు, ఆండర్సన్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (118 నాటౌట్), జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించగా 393/8 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. -
Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఆసీస్ స్టార్ బ్యాటర్, ఇన్ ఫామ్ ఆటగాడు స్టీవ్ స్మిత్ భరతం పట్టాడు. భీకర ఫామ్లో ఉన్న స్మిత్ (16)ను స్టోక్స్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. స్టోక్స్ సంధించిన అద్భుతమైన ఇన్ స్వింగర్ను మిస్ అయిన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. స్మిత్.. రివ్యూకి వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎత్తు విషయంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ.. రీప్లేలో బంతి వికెట్ల టాప్ ఎడ్జ్ తగులుతుందని తేలింది. దీంతో స్మిత్ వెనుదిరగక తప్పలేదు. Ben Stokes delivers a HUGE wicket - Steve Smith lbw for 16!#ENGvAUS | #Ashes pic.twitter.com/whxBbi3x8s — ESPNcricinfo (@ESPNcricinfo) June 17, 2023 స్టోక్స్ గర్జిస్తూ సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్ మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ బౌలింగ్కు దిగి కీలకమైన స్మిత్ వికెట్ను పడగొట్టాడు. 2019 యాషెస్ సిరీస్లో తొలి టెస్ట్లో రెండు సెంచరీలు బాదిన స్మిత్.. ఈ మ్యాచ్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ గడ్డపై స్మిత్కు ఉన్న ట్రాక్ రికార్డు చూసి ఇంగ్లండ్ బౌలర్లు వణిపోయారు. అతను ఇక్కడ ఆడిన గత 9 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే స్మిత్ తన భీకర ఫామ్ను ఈ మ్యాచ్లో కొనసాగించలేకపోయాడు. స్టోక్స్ వ్యూహంలో చిక్కుకుని ఔటయ్యాడు. కాగా, స్మిత్ ఔటయ్యే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసి, కష్టాల్లో పడింది. తొలుత స్టువర్ట్ బ్రాడ్ వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ను పెవిలియన్కు పంపాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి రోజే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి (392/8) సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను నిర్మించగా.. జాక్ క్రాలే (61), బెయిర్స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: నిప్పులు చెరుగుతున్న బ్రాడ్.. వరుస బంతుల్లో వార్నర్, లబూషేన్ ఔట్ -
యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్ల టెస్టుల సిరీస్లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది. బజ్బాల్తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్ఫామ్లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. డాన్ బ్రాడ్మన్: ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ యాషెస్ సిరీస్లో లీడింగ్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్లో 37 టెస్టులాడిన బ్రాడ్మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్లోనే వచ్చాయంటే బ్రాడ్మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్మన్ 1930లో జరిగిన సిరీస్లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది. జాక్ హబ్స్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్గా గుర్తింపు పొందాడు. అలెన్ బోర్డర్: ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్కు కూడా యాషెస్ సిరీస్లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు. స్టీవ్ వా: ఆసీస్ దిగ్గజ కెప్టెన్గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్లో మంచి రికార్డు ఉంది. ఆల్రౌండర్గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్లో కెప్టెన్గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్లో తొమ్మిది మ్యాచ్లు ఆడి ఎనిమిది మ్యాచ్ల్లో విజయాలు అందుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్: ప్రస్తుతం బ్రాడ్మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్గా పేరు పొందిన స్మిత్ యాషెస్లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్లో స్టీవ్స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు. వాలీ హామండ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు. హెర్బర్ట్ సట్క్లిఫ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్గా పేరు పొందిన హెర్బర్ట్ సట్క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు. క్లిమెంట్ హిల్: ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు. జాన్ హెడ్రిచ్: ఇంగ్లండ్కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్లో 32 మ్యాచ్లాడి 2644 పరుగులు సాధించాడు. చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్లో రోహిత్ శర్మ 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
Ashes Series 2023: స్టీవ్ స్మిత్ను చూసి వణికిపోతున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు..!
యాషెస్ సిరీస్ 2023 ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లకు స్టీవ్ స్మిత్ భయం పట్టుకుంది. పైకి బజ్బాల్ అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. లోలోపల వారు వణకిపోతున్నారు. ఇంతకీ వారి భయానికి కారణం ఏంటంటే.. ఇంగ్లండ్లో స్టీవ్కు ఉన్న అరివీర భయంకరమైన ట్రాక్ రికార్డు. మరి ముఖ్యంగా గడిచిన 9 ఇన్నింగ్స్ల్లో ఇంగ్లండ్లో స్మిత్ చేసిన పరుగులు. ఇంగ్లండ్ గడ్డపై స్మిత్ గడిచిన 9 ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు. ఓవల్లో ఇటీవలి ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ (121, 34) చేసిన స్మిత్.. దీనికి ముందు 2019 యాషెస్ 5వ టెస్ట్లో 80, 24 పరుగులు.. అదే సిరీస్ నాలుగో టెస్ట్లో 211, 82 పరుగులు.. రెండో టెస్ట్లో 92.. తొలి టెస్ట్లో 144, 142 పరుగులు చేసి ఇంగ్లండ్ గడ్డపై తిరుగులేని రికార్డును కలిగి ఉన్నాడు. ఈ ఫామే ప్రస్తుతం ఇంగ్లండ్ ఆటగాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. స్మిత్కు కట్టడి చేసేందుకు వారు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నప్పటికీ, అవి ఏ మేరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి. స్మిత్ ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నాడా.. అతన్ని ఔట్ చేయడం ఇంగ్లండ్ బౌలర్లకు కత్తి మీద సామే అవుతుంది. కాగా, 5 మ్యాచ్ల యాషెస్ 2023 సిరీస్ రేపటి (జూన్ 16) నుంచి ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా, రెండోది లార్డ్స్లో, మూడో మ్యాచ్ హెడింగ్లేలో, నాలుగోది ఓల్డ్ ట్రాఫర్డ్లో, ఐదో టెస్ట్ కెన్నింగ్టన్ ఓవల్లో జరుగుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి యాషెస్ సిరీస్లో (5 మ్యాచ్లు) ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుపొందింది. యాషెస్ 2023 షెడ్యూల్.. తొలి టెస్ట్: జూన్ 16-20 రెండో టెస్ట్: జూన్ 28-జులై 2 మూడో టెస్ట్: జులై 6-10 నాలుగో టెస్ట్: జులై 19-23 ఐదో టెస్ట్: జులై 27-31 తొలి టెస్టుకు తుది జట్లు(అంచనా).. ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, ఓలీ పోప్ (వికెట్ కీపర్), జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్ ఆసీస్: ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, బోలాండ్, నాథన్ లైయన్ -జాన్పాల్, సాక్షివెబ్డెస్క్ -
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..!
Roger Binny: ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, మాజీలు, విశ్లేషకులు టీమిండియాను ఏకి పారేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే సోషల్మీడియా వేదికగా భారత ఆటగాళ్లను ఓ రేంజ్లో ఎండగడుతున్నారు. మాజీలు, విశ్లేషకులు సైతం ఎన్నడూ లేనంతగా స్వరం పెంచి టీమిండియా వైఫల్యాలను తూర్పారబెడుతున్నారు. బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ సైతం టీమిండియాను వదిలిపెట్టలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ చేసిన సెంచరీలే భారత్కు ఆసీస్కు మధ్య వత్యాసమని తెలిపాడు. హెడ్, స్మిత్ భాగస్వామ్యమే టీమిండియా కొంపముంచిందని అభిప్రాయపడ్డాడు. ఈ పార్ట్నర్షిపే ఆసీస్ టీమిండియాపై ఆధిక్యత ప్రదర్శించేలా చేసిందని అన్నాడు. హెడ్, స్మిత్ సెంచరీ చేయకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలిపాడు. భారత ఆటగాళ్ల పోరాటం మూలాన మ్యాచ్ ఆఖరి రోజు వరకు వచ్చింది కాని, నా దృష్టిలో టీమిండియా తొలి రోజే ఓడిపోయిందంటూ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఐపీఎల్లో అలా అడగడం లేదు కదా.. రోహిత్ శర్మపై మాజీ లెజెండ్ ఫైర్ -
కోహ్లి వికెట్.. స్మిత్కు రికార్డు అందించిన వేళ
ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో కోహ్లి క్యాచ్ తీసుకోవడం ద్వారా టెస్టు క్రికెట్లో ఆసీస్ తరపున అత్యధిక క్యాచ్లు అందుకున్న జాబితాలో స్మిత్ మూడో స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి క్యాచ్ స్మిత్కు 157వది. తొలి స్థానంలో రికీ పాంటింగ్ 196 క్యాచ్లతో ఉన్నాడు. 181 క్యాచ్లతో మార్క్ వా రెండో స్థానంలో ఉండగా.. మార్క్ టేలర్తో కలసి స్టీవ్ స్మిత్ 157 క్యాచ్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. అలెన్ బోర్డర్ 156 క్యాచ్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓడుతుందా లేక మ్యాచ్ డ్రా చేసుకుంటుందా అన్నది చూడాలి. కోహ్లి ఉన్నంతవరకు గెలుపుపై ఆశలు ఉన్నా అతను ఔట్ కావడం టీమిండియాకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక రిస్క్ తీసుకోకుండా డ్రా కోసం ఆడితే మంచిదని అభిమానులు అభిప్రాయపడ్డారు. ఐదోరోజు ఆట ప్రారంభమైన తర్వాత స్కాట్ బోలాండ్ బౌలింగ్లో కోహ్లి తన ఆఫ్స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టాడు. కోహ్లి ఇచ్చిన క్యాచ్ను స్మిత్ అద్బుతంగా డైవ్ చేస్తూ అందుకున్నాడు. He's an absolute G.O.A.T in slip fielding.#INDvsAUS #WTCFinals #WTC23Final #WTC2023Final #WTCFinals #TeamIndia #KingKohli #ViratKohli #AUSvsIND #ViratKohli𓃵 #SteveSmith pic.twitter.com/IHSn0rnlV0 — myKhel.com (@mykhelcom) June 11, 2023 చదవండి: 'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్లోనే ఉంది!' -
బజ్బాల్ లేదు తొక్కా లేదు..మీ పప్పులు మా ముందు ఉడకవు..ఇంగ్లండ్కు స్టీవ్ స్మిత్ వార్నింగ్
టీమిండియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో సెంచరీతో కదంతొక్కి, తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచిన ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్.. త్వరలో ఇంగ్లండ్తో ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైండ్ గేమ్లో భాగంగా స్టీవ్.. ఇప్పటి నుంచే ఇంగ్లండ్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ఇంగ్లీష్ క్రికెటర్లను మానసికంగా దెబ్బకొట్టేందుకు మాటల యుద్దానికి దిగాడు. ఇటీవలికాలంలో టెస్ట్ల్లో ఇంగ్లండ్ అవళంభిస్తున్న బజ్బాల్ అప్రోచ్ను తక్కువ చేస్తూ.. మాపై ఇంగ్లీష్ బ్యాటర్లకు అంత సీన్ ఉండదని విర్రవీగాడు. ఇతర జట్లపై బజ్బాల్ అప్రోచ్ ప్రభావం చూపి ఉంవచ్చని, మా ముందు మాత్రం వారి పప్పులు ఉడకవని గొప్పలు పోయాడు. తమ బౌలర్ల ముందు బజ్బాల్ అప్రోచ్ వర్కౌట్ కాదని ధీమా వ్యక్తం చేశాడు. ఇంకా చెప్పాలంటే తమ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని తెలిపాడు. కాగా, ఇంగ్లండ్ బజ్ బాల్ అప్రోచ్ అంటూ టెస్ట్ల్లో వేగాన్ని పెంచింది. గడిచిన ఏడాది కాలంలో ఆ జట్టు 4.85 రన్రేట్తో పరుగులు సాధించి, 13 మ్యాచ్ల్లో 11 విజయాలు సాధించింది. ఇంగ్లీష్ టీమ్లోని ఐదుగురు 75కుపైగా స్ట్రయిక్ రేట్తో పరుగులు సాధించారు. ఇదే జోరును ఇంగ్లండ్ త్వరలో ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్లో కూడా కొనసాగించాలని చూస్తుంది. అయితే, పటిష్టమైన ఆసీస్ బౌలింగ్ అటాక్ ముందు బజ్బాల్ అప్రోచ్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చని విశ్లేషకుల అంచనా. మరి బజ్బాల్తో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆసీస్పై పైచేయి సాధిస్తారో లేక ఆసీస్ బౌలర్లే ఎదురుదాడికి దిగి ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతారో వేచి చేడాలి. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్, జూన్ 16-20, ఎడ్జ్బాస్టన్ రెండో టెస్ట్, జూన్ 28-జులై 2, లార్డ్స్ మూడో టెస్ట్, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్, జులై 19-23, ఓల్డ్ ట్రాఫర్డ్ ఐదో టెస్ట్, జులై 27-31, ఓవల్ చదవండి: మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్పై ఫ్యాన్స్ ఫైర్ -
బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్ స్మిత్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తెలుగు సినిమాల్లోని డైలాగులు చెప్పి అభిమానులను అలరించాడు. లండన్ వేదికగా భారత్తో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో బీజీగా ఉన్న స్మిత్.. ఖాళీ సమయంలో స్టార్స్పోర్ట్స్-1 తెలుగుతో ముచ్చటించాడు. ఈ క్రమంలో యాంకర్ చెప్పిన డైలాగ్లను స్మిత్ తనదైన స్టైల్లో చెప్పి నవ్వులు పూయించాడు. ముఖ్యంగా టాలీవుడ్ హీరో బాలకృష్ణ డైలాగ్లను స్మిత్ తనదైన మేనరిజంతో చెప్పాడు. అపాయింట్మెంట్ లేకుండా వస్తే వకేషన్ చూడను, లొకేషన్ చూడను “, ” డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ట్రుత్ వంటి డైలాగ్లు స్మిత్ నోటి నుంచి వచ్చాయి. అదే విధంగా చివరకు ” తగ్గేదేలే “.. అంటూ అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ను స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్స్పోర్ట్స్-1 ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో లభించిన పరుగులతో మొత్తంగా ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. చదవండి: WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. అందుకే ఈ పరిస్థితి: ఆసీస్ దిగ్గజం స్టీవ్ స్మిత్ నోట 🥳 మన తెలుగు సినిమా డైలాగ్స్ 😎 మరి తనదైన మనేరిజంతో 🔥 ఎలా అలరించాడో మీరే చూసేయండి 😉 చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND Day 3 Live మీ 📺 #StarSportsTelugu/HD & Disney+Hotstar లో #BelieveInBlue pic.twitter.com/maudxIGLoJ — StarSportsTelugu (@StarSportsTel) June 9, 2023 -
టీమిండియాకు కొరకరాని కొయ్య.. ఔట్ చేయడం చాలా కష్టం
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు టీమిండియాతో మ్యాచ్ అంటే ఎంత ఇష్టమే మరోసారి రుచి చూపించాడు. ఇప్పటికే టీమిండియాతో టెస్టుల్లో మంచి ఇన్నింగ్స్లు ఆడిన స్మిత్ ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. టీమిండియాకు కొరకరాని కొయ్యగా తయారైన స్మిత్ తాజాగా మరో సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో టీమిండియాపై మంచి రికార్డు కలిగిన స్మిత్.. ఈసారి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 229 బంతుల్లో 17 ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న స్మిత్కు టెస్టుల్లో ఇది 31వ సెంచరీ కాగా.. టీమిండియాపై తొమ్మిదవది. ఈ నేపథ్యంలో స్మిత్ ఒక అరుదైన రికార్డు సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రూట్తో కలిసి స్మిత్(9 సెంచరీలు) సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్, వివ్ రిచర్డ్స్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్లు ఎనిమిదేసి సెంచరీలతో ఉన్నారు. Steve Smith loves batting at The Oval 😍 Third century at the ground for the Aussie star ⭐ Follow the #WTC23 Final 👉 https://t.co/wJHUyVnX0r pic.twitter.com/jnZP7Z757F — ICC (@ICC) June 8, 2023 THE GOAT OF TEST CRICKET IN THIS GENERATION - Steve Smith. pic.twitter.com/bqjUhlhLBa — Johns. (@CricCrazyJohns) June 8, 2023 చదవండి: WTC Final: కామెరాన్ గ్రీన్(6) ఔట్.. ఐదో వికెట్ డౌన్ -
WTC Final: సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్, ఒక్క సెంచరీతో ఎన్ని రికార్డులో..!
ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాది స్మిత్ కెరీర్లో 31వ శతకాన్ని సాధించాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను నెలకొల్పాడు. ఇంగ్లండ్ గడ్డపై స్మిత్కు ఇది 7వ సెంచరీ ఆస్ట్రేలియా తరఫున టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానం. రికీ పాంటింగ్ (41), స్టీవ్ వా (32) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్తో పాటు అగ్రస్థానం. రూట్, స్మిత్లు ఇద్దరు టీమిండియాపై 9 శతకాలు బాదారు. పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ వాతో పాటు రెండో స్థానం. స్టీవ్ వా, స్మిత్లు ఇద్దరు చెరో 7 సెంచరీలు చేయగా.. టాప్లో సర్ డాన్ బ్రాడ్మన్ (11) ఉన్నారు. పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్లోని ఓ వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానం. స్టీవ్ స్మిత్ ఓవల్ మైదానంలో 3 సెంచరీలు చేశాడు. డాన్ బ్రాడ్మన్ హెడింగ్లేలో అత్యధికంగా 4 సెంచరీలు, ట్రెంట్బ్రిడ్జ్లో 3 సెంచరీలు చేశాడు. భారత్ తరఫున దిలీప్ వెంగ్సర్కార్ లార్డ్స్లో 3 సెంచరీలు చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్యలో టెస్ట్ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం (9). ఈ జాబితాలో సచిన్ (11) టాప్లో ఉన్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో కనీసం 2 సెంచరీలు చేసిన ఏడో ఆటగాడు. గంగూలీ (3), పాంటింగ్ (3), సయీద్ అన్వర్ (3), జయవర్దనే (2), రోహిత్ శర్మ (2), వాట్సన్ (2) స్టీవ్ స్మిత్ కంటే ముందున్నారు. కాగా, 91 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 361/3గా ఉంది. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (110) క్రీజ్లో ఉన్నారు. చదవండి: WTC Final: ట్రవిస్ హెడ్.. ద గేమ్ ఛేంజర్, ఎదురుదాడే లక్ష్యం -
తొలిరోజు ఆసీస్దే.. పూర్తిగా తేలిపోయిన టీమిండియా బౌలర్లు
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా తొలి రోజే 300 మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది. ట్రెవిస్ హెడ్(146 పరుగులు బ్యాటింగ్), స్టీవ్ స్మిత్(95 పరుగులు బ్యాటింగ్) టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. ఈ ఇద్దరు ఇప్పటికే నాలుగో వికెట్కు రికార్డు స్థాయిలో 251 పరుగులు జోడించారు. తొలి సెషన్లో రెండు వికెట్లు తీసిన టీమిండియా బౌలర్లు.. మలి రెండు సెషన్లు కలిపి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టారు. ఇక రోజంతా కలిపి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసిన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆస్ట్రేలియాకు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన మంచి ఆరంభాన్ని ట్రెవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కొనసాగించారు. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా ట్రెవిస్ హెడ్ వన్డే తరహా బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. రోజు ముగిసే సరికి 150 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ ఇదే దూకుడు కొనసాగిస్తే రెండోరోజు ఆటలో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అటు తన మార్క్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న స్మిత్ 95 పరుగులతో బ్యాటింగ్ చేస్తూ డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కే పనిలో ఉన్నాడు. రెండో రోజు ఆటలో స్మిత్ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: WTC Final: ట్రెవిస్ హెడ్ చరిత్ర.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా -
ఆ ఒక్కడిని అవుట్ చెయ్యకపోతే ఇండియా పని అంతే
-
క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ ఫైర్..!
-
WTC Final: టీమిండియా బహుపరాక్.. ఓవల్లో స్టీవ్ స్మిత్ను ఆపడం చాలా కష్టం..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు టీమిండియాను ఓ విషయం బయపెడుతుంది. అదేంటంటే.. ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు మ్యాచ్ వేదిక అయిన ఓవల్లో అద్భుతమైన రికార్డు ఉండటం. ఈ ఆసీస్ స్టార్ ఓవల్ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 97.75 సగటున 391 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు (138*, 143), ఓ హాఫ్ సెంచరీ (80) ఉన్నాయి. ఓవల్లో స్మిత్కు ఉన్న ఈ రికార్డే ప్రస్తుతం టీమిండియాను కలవరపెడుతుంది. స్మిత్కు కళ్లెం వేసే వ్యూహరచనలో భారత బౌలర్లు నిమగ్నమయ్యారు. అతన్ని ఎలాగైనా తొందరగా ఔట్ చేయాలని వారు భావిస్తున్నారు. స్మిత్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. స్మిత్ను తొందరగా పెవిలియన్కు పంపితే మంచిదని, అతను క్రీజ్లో కుదురుకుంటే చాలా ప్రమాదమని వారు వార్నింగ్ ఇస్తున్నారు. స్మిత్కు ఇంగ్లండ్లో వాతావరణ పరిస్థితులపై కూడా పూర్తి అవగాహణ ఉందని, అక్కడి పిచ్లపై అతను ఏకంగా 6 శతాకలు బాదాడని గుర్తు చేస్తున్నారు. మరోవైపు స్మిత్కు టీమిండియాపై కూడా ఘనమైన రికార్డు ఉన్న విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. స్మిత్ భారత్పై 35 ఇన్నింగ్స్లు ఆడి 65.07 సగటున 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాయంతో 1887 పరుగులు చేశాడన్న విషయాన్ని మరవకూడదని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా స్మిత్తో జాగ్రత్తగా ఉండాలని, లేదంటి అతను మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడని వార్నింగ్ ఇస్తున్నారు. కాగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానం వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. -
'ఓవల్లో ఆడుతున్నా ఆ భయం వెంటాడుతోంది'
జూన్ ఏడు నుంచి ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. 2019-21 డబ్ల్యూటీసీ ఫైనల్లో రన్నరప్గా నిలిచిన టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న ఆస్ట్రేలియా కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డబ్ల్యూటీసీ ఫైనల్లో రచించనున్న ప్రణాళికలపై చర్చించాడు.'' ఓవల్లోని పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నా. వాస్తవానికి యూకేలోని బెస్ట్ బ్యాటింగ్ కండిషన్ పిచ్ అయిన ఓవల్ పేస్, బౌన్స్కు అనుకూలంగా ఉంటుందని అంటారు. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భారత్లో ఉండే పిచ్ కండీషన్లా ఉంటుందేమోనని చిన్నపాటి భయం కూడా ఉంది. నాకు తెలిసి టీమిండియా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రూపంలో ఇద్దరు ఫ్రంట్లైన్ స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. వారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఒక అంచనాకు వచ్చాం. డబ్యూటీసీ(వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్) అనేది మంచి ఆలోచన. ఎంత సంప్రదాయ క్రికెట్ అయినా ఒక పోటీ ఉంటేనే మజా ఉంటుంది. డబ్ల్యూటీసీ టైటిల్ అందుకోవాలన్న కాంక్షతో ప్రతీ జట్టు తమ శాయాశక్తులా మ్యాచ్లను గెలవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అటు టీమిండియా.. ఇటు మేము డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అయ్యాం. ఇక వచ్చే వారంలోపు టెస్టు ఛాంపియన్ ఎవరనేది తేలనుంది. ఇక మ్యాచ్కు వచ్చే అభిమానుల్లో ఆస్ట్రేలియన్ల కంటే టీమిండియా అభిమానులే ఎక్కువగా ఉంటారని అనుకుంటున్నా. మ్యాచ్ మాత్రం చాలా గొప్పగా ఉంటుందని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఈ ఏడాది భారత్లో పర్యటించిన ఆస్ట్రేలియా 1-2 తేడాతో టెస్టు సిరీస్ను టీమిండియాకు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే మూడు వన్డేల సిరీస్ను మాత్రం 2-1తో చేజెక్కించుకుంది. ఇక ఐపీఎల్లో పాల్గొనని స్టీవ్ స్మిత్ ఇటీవలే ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడాడు. కౌంటీల్లో ఆడడం ద్వారా మంచి ప్రాక్టీస్ దొరికిందని.. డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు యాషెస్ సిరీస్కు కూడా సన్నద్దమైనట్లు ఇటీవలే స్మిత్ ట్విటర్లో తెలిపాడు. చదవండి: త్రిపుర క్రికెట్లో ప్రొటీస్ మాజీ ఆల్రౌండర్కు కీలక పదవి -
IPL 2023: నేను చేరబోయే టీమ్ అదే: స్టీవ్ స్మిత్ ప్రకటన
IPL 2023- Steve Smith: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తాను పునరాగమనం చేయనున్నట్లు ప్రకటించిన ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ ఎట్టకేలకు తాను భాగస్వామ్యమయ్యే జట్టు గురించి వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ టీమ్తో జతకట్టనున్నానని.. కామెంటేటర్గా అవతారం ఎత్తనున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్-2023 అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్లో భాగం కానున్నట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నాకు తెలిసినంత వరకు నేను ఆటను చాలా బాగా అర్థం చేసుకోగలను. అంతే బాగా విశ్లేషించగలను కూడా! స్టార్ స్పోర్ట్స్ టీమ్తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. నాకిది సరికొత్త అనుభవం’’ అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. కాగా గతంలో రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా ప్రస్తుతం ఉనికిలో లేని పుణె వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, కొచ్చి టస్కర్స్ కేరళ జట్ల తరఫున స్మిత్ ఐపీఎల్ ఆడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది వేలంలోకి రాగా ఏ ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేయలేదు. దీంతో కామెంటేటర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ స్టార్ బ్యాటర్ సిద్ధమయ్యాడు. ఇక ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శనకు స్మిత్ కెప్టెన్సీ వ్యూహాలే కారణం. అదే విధంగా ఆసీస్ వన్డే సిరీస్ను గెలవడంలోనూ సారథిగా అతడి అనుభవం అక్కరకు వచ్చింది. కాగా స్మిత్ ప్రస్తుతం ఆసీస్ వైస్ కెప్టెన్గా ఉండగా.. భారత పర్యటనలో ఆఖరి రెండు టెస్టులు, వన్డే సిరీస్కు ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడు జట్టును ముందుండి నడిపించాడు. ఇదిలా ఉంటే.. మార్చి 31న గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్తో ఐపీఎల్ పదహారవ సీజన్కు తెరలేవనుంది. చదవండి: PAK Vs AFG: చారిత్రాత్మక విజయం.. ఆఫ్గన్ సుందరి మళ్లీ వచ్చేసింది IPL 2023: రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ సంచలనం! pic.twitter.com/NoU1ZAtZzF — Steve Smith (@stevesmith49) March 27, 2023 -
IPL 2023: నమస్తే ఇండియా! తిరిగి వచ్చేస్తున్నా.. అద్భుతమైన జట్టుతో..
Steve Smith to join IPL 2023: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఐపీఎల్-2023 సీజన్లో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని స్మిత్ స్వయంగా ప్రకటించాడు. ‘‘నమస్తే ఇండియా. మీతో ఓ ఆసక్తికర వార్త పంచుబోతున్నా. నేను ఐపీఎల్-2023 ఎడిషన్లో జాయిన్ అవుతున్నా. అవును.. ఇది నిజమే! ఇండియాలోని అద్భుతమైన టీమ్తో నేను జట్టుకట్టనున్నాను’’ అంటూ వీడియో విడుదల చేశాడు. కాగా స్మిత్ గతంలో క్యాష్ రిచ్ లీగ్లో ఆరు ఫ్రాంఛైజీల తరఫున ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సహా ప్రస్తుతం ఉనికిలో లేని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, పుణె వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చినా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన 33 ఏళ్ల స్మిత్.. 8 మ్యాచ్లు ఆడి 152 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో మొత్తంగా 103 మ్యాచ్లు ఆడిన ఈ ఆసీస్ బ్యాటర్.. 2485 పరుగులు సాధించాడు. ఇందులో 11 అర్ధ శతకాలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఇక గతేడాది 2 కోట్ల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన స్టీవ్ స్మిత్.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. టీమిండియాతో సిరీస్లో కెప్టెన్గా హిట్ ఈ నేపథ్యంలో కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్తో కామెంటేటర్గా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇటీవల టీమిండియాతో ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్లో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో స్మిత్ పగ్గాలు చేపట్టి.. మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. తన కెప్టెన్సీ నైపుణ్యాలతో మూడో టెస్టులో ఆసీస్ను గెలిపించాడు. ఇక అతడి సారథ్యంలోనే టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. చదవండి: SA vs WI: చరిత్ర సృష్టించిన డికాక్.. టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ! BCCI: భువనేశ్వర్కు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ.. ఇక మర్చిపోవడమే! pic.twitter.com/NoU1ZAtZzF — Steve Smith (@stevesmith49) March 27, 2023 -
పరువు పోగొట్టుకున్న స్మిత్.. నవ్వుకున్న విరాట్ కోహ్లి!వీడియో వైరల్
చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1 తేడాతో స్మిత్ సేన సొంతం చేసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ చెత్త రివ్యూ తీసుకుని నవ్వులు పాలయ్యాడు. అసలు ఏం జరిగిందంటే? టీమిండియా ఇన్నింగ్స్ 10వ ఓవర్లో ఆసీస్ బౌలర్ సీన్ అబాట్.. కోహ్లికి ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని సంధించాడు. ఆ బంతిని కోహ్లి ఆఫ్సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి నేరుగా వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో బౌలర్తో పాటు వికెట్ కీపర్ కారీ క్యాచ్ ఔట్కు అప్పీల్ చేశారు. అయితే అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వికెట్కీపర్తో చర్చలు జరపి రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బ్యాట్కు బంతికి మధ్య భారీ గ్యాప్ ఉన్నట్లు తేలింది. రీప్లే చూసిన వెంటనే విరాట్ కోహ్లి ఒక్కసారిగా నవ్వుకున్నాడు. కోహ్లితో పాటు ఆసీస్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్ కూడా నవ్వుకున్నాడు. ఇక స్మిత్ అయితే రిప్లే చూశాక తెల్లముఖం వేసుకున్నాడు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. pic.twitter.com/eJ6T0JPi3v — Christopher Sodawala (@PikachuKiBijli) March 22, 2023 చదవండి: IND vs AUS: సూర్య కేవలం మూడు బాల్స్ మాత్రమే ఆడాడు! అంత మాత్రాన -
బ్యాటింగ్లో ఘోర వైఫల్యం.. సిరీస్ సమర్పయామి
నాలుగేళ్ల క్రితం ఆ్రస్టేలియా జట్టు భారత పర్యటనలో వన్డే సిరీస్లో ఒకదశలో 0–2తో వెనుకబడింది. కానీ చివరకు 3–2తో సిరీస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో వెనుకబడినా కూడా పుంజుకొని కంగారూ టీమ్ భారత గడ్డపై మరో వన్డే సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. తొలి రెండు వన్డేల్లో పేస్, స్వింగ్ బౌలింగ్ను ఆడలేక తడబడిన టీమిండియా తుదిపోరులో స్పిన్కు బోల్తా పడింది. ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయకపోయినా అంతా తలా ఓ చేయి వేయడంతో ఆసీస్ ముందుగా 269 పరుగులు సాధించింది. ఊహించినట్లుగా స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై మన బ్యాటర్లు తడబడ్డారు. రోహిత్, గిల్ ఇచ్చిన మెరుపు ఓపెనింగ్ భాగస్వామ్యం, ఆ తర్వాత కోహ్లి, రాహుల్ అర్ధ సెంచరీ పార్ట్నర్షిప్తో ఒకదశలో టీమిండియా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే 39 పరుగుల వ్యవధిలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి జట్టు ఓటమిని ఆహ్వానించింది. టెస్టు సిరీస్ కోల్పోయినా ఒక మ్యాచ్ నెగ్గిన ఆసీస్ బృందం, ఇప్పుడు వన్డే సిరీస్తో సంతృప్తిగా స్వదేశం వెళ్లనుంది. చెన్నై: స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆ్రస్టేలియా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్లో ఆసీస్ 21 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. తొలి మ్యాచ్లో ఓడి రెండో వన్డేలో నెగ్గిన కంగారూ బృందం 2–1తో సిరీస్ను దక్కించుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 47; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... పాండ్యా, కుల్దీప్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (72 బంతుల్లో 54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, హార్దిక్ పాండ్యా (40 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆడమ్ జంపా (4/45) భారత్ను దెబ్బ తీశాడు. మెరుపు వేగంతో ఈ సిరీస్లో 194 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఆసీస్ శుభారంభం... గత మ్యాచ్ల తరహాలోనే ఆసీస్కు ఓపెనర్లు హెడ్ (31 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్లు), మార్ష్ శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి 10 ఓవర్లలో 61 పరుగులు జత చేశారు. పిచ్పై స్పిన్కు అనుకూలిస్తున్నట్లు కనిపించడంతో ఆరో ఓవర్లోనే భారత్ అక్షర్తో బౌలింగ్ చేయించింది. అయితే పాండ్యా బౌలింగ్కు దిగి మ్యాచ్ పరిస్థితిని మార్చాడు. తన తొలి మూడు ఓవర్లలో అతను హెడ్, స్మిత్ (0), మార్ష్ లను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో వార్నర్ (23), లబుõషేన్ (28) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరిని కుల్దీప్ అవుట్ చేయడంతో స్కోరు 138/5 వద్ద నిలిచింది. ఈ సమయంలో క్యారీ (46 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టొయినిస్ (25) భాగస్వామ్యం జట్టు ఇన్నింగ్స్ను నడిపించింది. వీరిద్దరు 58 పరుగులు జత చేశారు. భారత బౌలర్లు మళ్లీ దెబ్బ కొట్టడంతో ఆసీస్ స్కోరు 203/7కు చేరింది. సరిగ్గా ఇక్కడే భారత్ పట్టు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ అండతో చివరి మూడు వికెట్లకు ఆసీస్ 66 పరుగులు జత చేయడం విశేషం. రాణించిన పాండ్యా... ఛేదనను ఓపెనర్లు రోహిత్ శర్మ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (49 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ప్రారంభించారు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఎదురుదాడినే నమ్ముకున్నారు. అయితే 12 పరుగుల వ్యవధిలో వీరిద్దరిని ఆసీస్ వెనక్కి పంపించింది. ఈ దశలో కోహ్లి, రాహుల్ (50 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్) జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్కు 69 పరుగులు జత చేశారు. అయితే మరీ నెమ్మదిగా ఆడిన రాహుల్తో పాటు అక్షర్ (2) కూడా నిష్క్రమించారు . కోహ్లి, పాండ్యా ఉన్నంత వరకు భారత్కు గెలుపు ఆశలు ఉన్నాయి. 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి పేలవ షాట్కు వెనుదిరగడంతో ఆసీస్ ఒత్తిడి పెంచింది. సూర్యకుమార్ (0) విఫలం కాగా, పాండ్యాను అవుట్ చేసి జంపా దెబ్బ కొట్టాడు. రవీంద్ర జడేజా (33 బంతుల్లో 18; 1 ఫోర్ ) ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోవడంతో లక్ష్యం మరీ కష్టంగా మారిపోయింది. మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆసీస్ భారత బ్యాటర్లను కట్టపడేయడంతో చివరకు ఓటమి తప్పలేదు. సూర్యకుమార్ ‘హ్యాట్రిక్ గోల్డెన్ డక్’ పాపం సూర్యకుమార్ యాదవ్... టి20ల్లో విధ్వంసకర బ్యాటింగ్తో నంబర్వన్గా ఎదిగిన అతను వన్డేల్లో మాత్రం ‘బాంబే డక్’గా మారిపోయాడు. ఈ సిరీస్కు ముందు కూడా వన్డేల్లో గొప్ప రికార్డేమీ లేకపోయినా ఈసారి ప్రదర్శన మాత్రం అయ్యో అనిపించేదే. సిరీస్లో ఆడిన మూడు వన్డే ల్లోనూ తొలి బంతికే వెనుదిరిగి 0, 0, 0తో ‘హ్యాట్రిక్ గోల్డెన్ డక్’ను నమోదు చేశాడు. గతంలో భారత ఆటగాళ్లు వరుసగా మూడు వన్డేల్లో డకౌటైనా, ఇలా మూడుసార్లు తొలి బంతికే ఎవరూ వెనుదిరగలేదు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) కుల్దీప్ (బి) పాండ్యా 33; మార్ష్ (బి) పాండ్యా 47; స్మిత్ (సి) రాహుల్ (బి) పాండ్యా 0; వార్నర్ (సి) పాండ్యా (బి) కుల్దీప్ 23; లబుõషేన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 28; క్యారీ (బి) కుల్దీప్ 38; స్టొయినిస్ (సి) గిల్ (బి) అక్షర్ 25; అబాట్ (బి) అక్షర్ 26; అగర్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 17; స్టార్క్ (సి) జడేజా (బి) సిరాజ్ 10; జంపా (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 12; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 269. వికెట్ల పతనం: 1–68, 2–74, 3–85, 4–125, 5–138, 6–196, 7–203, 8–245, 9–247, 10–269. బౌలింగ్: షమీ 6–0–37–0, సిరాజ్ 7–1–37–2, అక్షర్ 8–0–57–2, పాండ్యా 8–0–44–3, జడేజా 10–0–34–0, కుల్దీప్ 10–1–56–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్టార్క్ (బి) అబాట్ 30; గిల్ (ఎల్బీ) (బి) జంపా 37; కోహ్లి (సి) వార్నర్ (బి) అగర్ 54; రాహుల్ (సి) అబాట్ (బి) జంపా 32; అక్షర్ (రనౌట్) 2; పాండ్యా (సి) స్మిత్ (బి) జంపా 40; సూర్యకుమార్ (బి) అగర్ 0; జడేజా (సి) స్టొయినిస్ (బి) జంపా 18; కుల్దీప్ (రనౌట్) 6; షమీ (బి) స్టొయినిస్ 14; సిరాజ్ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 12; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్) 248. వికెట్ల పతనం: 1–65, 2–77, 3–146, 4–151, 5–185, 6–185, 7–218, 8–225, 9–243, 10–248. బౌలింగ్: స్టార్క్ 10–0–67–0, స్టొయినిస్ 9.1–0–43–1, అబాట్ 10–0–50–1, జంపా 10–0–45–4, అగర్ 10–0–41–2. -
అయ్యో స్మిత్.. ఇలా జరిగింది ఏంటి? ప్రతీకారం తీర్చుకున్న హార్దిక్! వీడియో వైరల్
చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 3 బంతులు ఎదుర్కొన్న స్మిత్.. డకౌట్గా వెనుదిరిగాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఓ అద్భుతమైన బంతితో స్మిత్ను బోల్తా కొట్టించాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 12 ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ఆఫ్సైడ్ బంతిని స్మిత్ కవర్ డ్రైవ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఔట్సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. దీంతో చేసేదేమి లేక స్మిత్ తన బ్యాట్ను చూసుకుంటూ పెవిలియన్కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో స్మిత్ ఓ అద్భుతమైన క్యాచ్తో హార్దిక్ను పెవిలియన్కు పంపాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ కూడా డకౌట్గా వెనుదిరిగాడు. ఇప్పుడు మూడో వన్డేలో స్మిత్ను డకౌట్గా పెవిలియన్కు పంపిన హార్దిక్.. ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. కాగా వన్డేల్లో ఇప్పటివరకు హార్దిక్ పాండ్యా చేతిలో స్మిత్ ఔట్ కావడం ఇది ఐదో సారి. ఈ మ్యాచ్లో హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా.. 44 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(47), కారీ(38), హెడ్(33) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు సాధించగా..అక్షర్ పటేల్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: IND vs AUS: కుల్దీప్పై కోపంతో ఊగిపోయిన రోహిత్, కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ Steve Smith registered his first duck in ODIs since Feb 2017.#INDvAUS pic.twitter.com/btiuBW1VUu — CricTracker (@Cricketracker) March 22, 2023 Steve Smith vs Hardik Pandya Runs - 72 Dismissed - 5 times Avg - 14.20#champion #WPL2023 #IPL2023 #ViratKohli #RohitSharma #MSDhoni #HardikPandya #PatnaJunction #INDvsAUS #75thCentury #PunjabPolice #BCCI pic.twitter.com/Yg2Y193oD1 — Slayer (@pervy_slayer) March 22, 2023 .@hardikpandya7 picks up two quick wickets as Travis Head and Steve Smith depart. Watch the two dismissals here 👇👇#INDvAUS @mastercardindia pic.twitter.com/65yyVrPR2f — BCCI (@BCCI) March 22, 2023 -
Viral Video: శతాబ్దపు అత్యుత్తమ క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్ను అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు. వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే. Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR — Rajkumar (@Rajkumar0507) March 19, 2023 అలాంటిది స్మిత్ సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్సేషనల్ డైవింగ్ క్యాచ్ను సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి స్మిత్ను వ్యతిరేకించే వారు సైతం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1), జడేజా (16) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. -
తొలి వన్డేలో టీమిండియా విజయం
India vs Australia, 1st ODI Updates: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 పరుగులు నాటౌట్) తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్తో ఆపద్భాందవుడి పాత్ర పోషించగా.. జడేజా(69 బంతుల్లో 45 పరుగులు నాటౌట్) తన స్టైల్ ఇన్నింగ్స్తో మెప్పించాడు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. స్టోయినిస్ రెండు వికెట్లు పడగొట్టాడు. టీమిండియా విజయానికి చేరువైంది. కేఎల్ రాహుల్ అర్థసెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. జడేజా అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులతో ఆడుతున్న టీమిండియా విజయానికి 17 పరుగుల దూరంలో ఉంది. ► ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా వంద పరుగుల మార్క్ను అందుకుంది. ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 25వ ఓవర్లో ఈ మార్క్ను అందుకుంది. రాహుల్ 32, జడేజా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ► పాండ్యా, రాహుల్ ఇన్నింగ్స్తో గాడిన పడిందనుకున్న టీమిండియాకు షాక్ తగిలింది. 25 పరుగులు చేసిన పాండ్యా స్టోయినిస్ బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. భారత్ విజయానికి 102 పరుగులు అవసరం ఉంది. ► గిల్(20) రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. ►189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఆరంభంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ముందుగా మూడు పరుగులు చేసిన ఇషాన్ కిషన్ స్టోయినిస్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరగ్గా.. విరాట్ కోహ్లి నాలుగు పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత మరుసటి బంతికే ఎల్బీ రూపంలో సూర్యకుమార్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. ►189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఇషాన్ కిషన్.. స్టోయినిష్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 188 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 188 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్, హార్దిక్, తలా వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్(81) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ►184 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన స్టోయినిస్.. షమీ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. ►174 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గ్రీన్ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ►140 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లబుషేన్ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. మూడో వికెట్ కోల్పోయిన ఆసీస్.. మార్ష్ ఔట్ ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 81 పరుగులతో దూకుడుగా ఆడుతోన్న మిచెల్ మార్ష్ను జడేజా పెవిలియన్కు పంపాడు. భారీ షాట్కు ప్రయత్నించిన మార్ష్.. సిరాజ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 77 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వికెట్ కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి మార్నస్ లాబుషేన్ వచ్చాడు. 11 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 70/1 (11) 50 పరుగుల మార్కును దాటిన ఆసీస్ మిచెల్ మార్ష్, స్మిత్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి మార్ష్ 6 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేయగా.. స్మిత్ 3 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరి నిలకడైన ఆటతో ఆసీస్ 50 పరుగుల మార్కును దాటింది. స్కోరు: 53-1(9) 5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 29/1 స్మిత్ 5, మార్ష్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 పరుగులు వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా తొలి వన్డేలో భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అదే విధంగా యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఈ సిరీస్కు ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. తుది జట్లు భారత్: శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. -
Ind Vs Aus: అప్పటి మ్యాచ్లో విజయం వాళ్లదే! కానీ ఈసారి..
India vs Australia, 1st ODI: హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆస్ట్రేలియాతో మొదటి వన్డేకు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా మ్యాచ్తో మూడు వన్డేల సిరీస్ శుక్రవారం (మార్చి 17) ఆరంభం కానుంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్కు దూరం కాగా పాండ్యా చేతికి పగ్గాలు వచ్చాయి. ఈ క్రమంలో భారత్కు వన్డేల్లో కెప్టెన్గా వ్యవహరించిన 27వ ఆటగాడిగా ఈ స్టార్ ఆల్రౌండర్ నిలువనున్నాడు. మరోవైపు.. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఆసీస్ సారథిగా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీకి ముందు ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా ఉపయోగపడనుంది. బలాబలాల అంచనా, వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా తుది జట్టు కూర్పు తదితర అంశాలపై మేనేజ్మెంట్లు దృష్టి సారించనున్నాయి. ఇక ఇప్పటికే సొంతగడ్డపై జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ గెలిచి ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని రోహిత్ సేన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విజయం పరిపూర్ణం చేయాలని ఈ క్రమంలో వన్డే సిరీస్నూ గెలుపొంది విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని పట్టుదలగా ఉంది టీమిండియా. ఇదిలా ఉంటే.. భారత మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఆడటం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. అన్క్యాప్డ్ ప్లేయర్ రజత్ పాటిదార్ వైపు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపుతున్న సూర్య.. వన్డేల్లో ఆ స్థాయి ప్రదర్శన కనబరచలేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఆడిన 20 వన్డే మ్యాచ్లలో సూర్య చేసిన పరుగులు 433. అత్యధిక స్కోరు 64. ఇక రోహిత్ జట్టులో లేకపోవడంతో ఇషాన్ కిషన్కు చోటు ఖాయం కాగా.. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సహా పేస్ విభాగంలో పాండ్యాతో పాటు శార్దూల్, సిరాజ్, షమీలు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయింది. తుది జట్లు (అంచనా) భారత్: శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ / రజత్ పటిదార్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ. ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, షాన్ మార్ష్ / మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా, నాథన్ ఎల్లిస్. పిచ్, వాతావరణం మొదటి నుంచీ వాంఖెడేమైదానం బ్యాటింగ్కు బాగా అనుకూలం. భారీ స్కోర్ల కు అవకాశం ఉంది. ఛేదన ఇంకా సులు వు కాబట్టి గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. ఇరు జట్ల మధ్య ఈ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్ (2020)లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో వార్నర్, ఫించ్ మెరుపు సెంచరీలు చేశారు. చదవండి: WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం ICC WC Qualifier: డక్వర్త్ రూపంలో అదృష్టం.. ఐసీసీ వరల్డ్కప్ క్వాలిఫయర్కు అర్హత -
Ind Vs Aus: భారత్- ఆసీస్ వన్డే సిరీస్.. షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
Australia tour of India, 2023- ODI Series: ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023ని ముద్దాడిన టీమిండియా తదుపరి వన్డే సిరీస్కు సిద్ధమవుతోంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన రోహిత్ సేన.. కంగారూలతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పరిమిత ఓవర్ల సిరీస్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. స్వదేశంలో జరుగనున్న మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాగా.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్.. తల్లి మరణం నేపథ్యంలో ఈ సిరీస్కు దూరం కాగా.. స్టీవ్ స్మిత్ పగ్గాలు చేపట్టనున్నాడు. మరి క్రికెట్ ప్రేమికులకు మజాను అందించే టాప్ 2 ర్యాంకింగ్ (టీమిండియా- ఆస్ట్రేలియా) జట్ల మధ్య మరో ఆసక్తికరపోరుకు సంబంధించిన వివరాలు చూద్దామా?! భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ 2023 షెడ్యూల్ 1. మొదటి వన్డే- మార్చి 17- శుక్రవారం- ముంబై- వాంఖడే స్టేడియం- ముంబై 2. రెండో వన్డే- మార్చి 19- ఆదివారం- డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం 3. మూడో వన్డే- మార్చి 22- బుధవారం- ఎంఏ చిదంబరం స్టేడియం- చెన్నై మ్యాచ్ ఆరంభ సమయం ►టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆరంభం కానున్నాయి. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ? ►టీవీ: స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ►డిజిటల్: డిస్నీ+ హాట్స్టార్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్(వెన్నునొప్పి కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం) టీమిండియాతో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్(జై రిచర్డ్సన్ స్థానంలో జట్టులోకి). చదవండి: Virat Kohli: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్1 అశూ! ఇక కోహ్లి ఏకంగా Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్ -
టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
మార్చి 17 నుంచి టీమిండియాతో ప్రారంభంకాబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన తల్లి మరణాంతర కార్యక్రమాలు జరిపించేందుకు కమిన్స్ స్వదేశంలోనే ఉండిపోనున్నాడు. దీంతో అతని గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇవాళ (మార్చి 14) అధికారికంగా ప్రకటించింది. అయితే సీఏ.. కమిన్స్కు రీప్లేస్మెంట్ను ప్రకటించకపోవడం విశేషం. భారత్తో వన్డేలకు ఆసీస్ 15 మంది సభ్యులతోనే కంటిన్యూ కానుంది. టెస్ట్ సిరీస్ మధ్యలో గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిన డేవిడ్ వార్నర్, దేశవాలీ టోర్నీ ఆడేందుకు వెళ్లిన ఆస్టన్ అగర్ తిరిగి వన్డే జట్టులో చేరిపోగా.. అదే టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన జై రిచర్డ్సన్ రీప్లేస్మెంట్ నాథన్ ఇల్లీస్ కూడా వన్డే జట్టులో కొనసాగనున్నాడు. The Australia captain will remain home and miss the upcoming ODIs in India. Details 👇https://t.co/NjZD2zdy41 — ICC (@ICC) March 14, 2023 కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో రెండో టెస్ట్ అనంతరం కమిన్స్ తల్లి బాగోగులు చూసుకునేందుకు ఆస్ట్రేలియాకు బయలుదేరిన విషయం తెలిసిందే. తదనంతరం తల్లి మారియా మరణించడంతో కమిన్స్ ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ 3, 4 టెస్ట్ల్లో ఆస్ట్రేలియాను విజయవంతంగా ముందుండి నడిపించాడు. స్మిత్ సారధ్యంలో మూడో టెస్ట్లో ఆసీస్ భారత్ను ఓడించగా, నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఫలితంగా 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, స్టీవ్ స్మిత్ ఆసీస్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టనుండటంతో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. భారత్తో తొలి వన్డే కలుపుకుని 5 వన్డేల్లో (ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్, స్టీవ్ స్మిత్) ఆసీస్కు నలుగురు కెప్టెన్లు సారధ్యం వహించారు. భారత్తో వన్డే సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు.. డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబూషేన్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, అలెక్స్ క్యారీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అస్టన్ అగర్, మిచెల్ స్టార్క్, నాథన్ ఇల్లిస్, ఆడమ్ జంపా -
డ్రాగా ముగిసిన అహ్మదాబాద్ టెస్టు ( ఫొటోలు)
-
BGT 2023: ఆఖరి టెస్టు డ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టీమిండియాదే
India vs Australia, 4th Test Drawn: టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 భారత్ సొంతమైంది. స్వదేశంలో రోహిత్ సేన 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసీస్తో సోమవారం ముగిసిన ఆఖరి రోజు ఆట కంటే ముందే టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్- శ్రీలంక మధ్య తొలి టెస్టులో కివీస్ గెలవడంతో భారత్కు బెర్తు ఖరారైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్లో జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ- 2023 అహ్మదాబాద్- నాలుగో టెస్టు మార్చి 9- 13 ►టాస్- ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ ►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 480 ►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 571 ►ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్- 175/2 డిక్లేర్డ్ ►ఫలితం- డ్రా ►2-1తో సిరీస్ టీమిండియా సొంతం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(364 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 186 పరుగులు) ►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- స్పిన్ ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు తుది జట్లు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ. ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 హైలైట్స్ 1. నాగ్పూర్ టెస్టు ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన రవీంద్ర జడేజా ఏడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన రవీంద్ర జడేజా కీలక సమయంలో 70 పరుగులతో జట్టును ఆదుకున్న జడ్డూ రెండున్నర రోజుల్లో ముగిసిన టెస్టు ఫిబ్రవరి9- 11 స్కోర్లు: టీమిండియా- 400 ఆస్ట్రేలియా- 177 & 91 2. ఢిల్లీ టెస్టు ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవీంద్ర జడేజా 10 వికెట్లతో రాణించి జడ్డూ స్కోర్లు: ఆస్ట్రేలియా- 263 & 113 టీమిండియా- 262 & 118/4 3. ఇండోర్ టెస్టు టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నాథన్ లియోన్(ఆసీస్ ప్రధాన స్పిన్నర్) 11 వికెట్లు పడగొట్టిన లియోన్ స్కోర్లు: ఇండియా 109 & 163 ఆస్ట్రేలియా- 197 & 78/1 చదవండి: Axar Patel: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశ్విన్కూ సాధ్యం కానిది.. Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺 The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT — BCCI (@BCCI) March 13, 2023