TDP - BJP alliance
-
కూటమిలో చిచ్చురేపిన చేరికలు?
సాక్షి, విశాఖపట్నం: ఏపీ కూటమిలో పార్టీ నేతల చేరికల విషయంలో రాజకీయ లుకలుకలు చోటుచేసుకుంటున్నాయి. ఒక పార్టీ చేరికలను ప్రోత్సహిస్తుంటే.. మరో పార్టీ నేత మాత్రం చేరికలు వద్దంటూ సూచనలు చేస్తున్నారు. దీంతో, కూటమిలో కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ మొదలైంది.తాజాగా ఓ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) మాట్లాడుతూ.. ఏపీలో(Andhra Pradesh) కూటమి పార్టీల్లో మనకు కావాల్సినంత మంది నేతలు ఉన్నారు. పార్టీలు మారే నేతలు నేతలు మనకు అవసరం లేదు. ఇతరులు ఎవరు వచ్చినా.. కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దు అంటూ కామెంట్స్ చేశారు. అయితే, అయ్యన్న ఇలా వ్యాఖ్యలు చేసి 48 గంటలైనా గడవక ముందే బీజేపీలోకి ఒక నేత చేరడం చిచ్చు రేపినట్టు తెలుస్తోంది. దీంతో, కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారింది.ఇక, అయ్యన్న మాటలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Daggubati Purandeswari) పట్టించుకోలేదు. అయ్యన్న సూచనను పరిగణలోకి ఆమె పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలోనే విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. బీజేపీలో చేరికకు రంగం సిద్దమైనట్టు సమాచారం. నేడో, రేపో.. పురందేశ్వరి సమక్షంలో ఆనంద్ బీజేపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. విశాఖ డైరీ అవినీతిపై ఇటీవల స్పీకర్ అయ్యన్నపాత్రుడు హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతుండటంతో ట్విస్ట్ చోటుచేసుకుంది. -
దోచుకోవడంలో ‘స్కిల్’ నిజమే
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కొల్లగొట్టి అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంబంధించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరోసారి కొరఢా ఝుళిపించింది. ఈ కేసులో ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు చంద్రబాబు ముఠాకు సహకరించిన షెల్ కంపెనీ డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్, సీమెన్స్ కంపెనీ అప్పటి ఎండీ సుమన్ బోస్కు చెందిన రూ.23.54 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబయి, పూణేల్లోని స్థిరాస్తులతోపాటు వారి పేరిట ఉన్న షేర్లు, బ్యాంకు ఖాతాల్లోని నిధులను అటాచ్ చేసినట్టు ఈడీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే కేసులో గతంలో డిజైన్ టెక్కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా రూ.54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లయింది. తద్వారా 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి సాగించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు మరోసారి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సిట్ చంద్రబాబును అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య కాదన్నది స్పష్టమైంది. ఎందుకంటే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్లో అవినీతి జరిగినట్టు.. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించినట్టు ఆధారాలతో సహా నిర్ధారించి కఠిన చర్యలను వేగవంతం చేయడమే అందుకు నిదర్శమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచడంతో ‘స్కిల్’ క్రిమినల్స్లో గుబులు మొదలైంది.గత ఏడాది డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ, సీమెన్స్ ఎండీలను అరెస్టు చేసినట్లు ఈడీ చేసిన ట్వీట్ ప్రజాధనం కొల్లగొట్టడమే లక్ష్యంగా అడుగులు⇒ 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరిట ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ను తెరపైకి తెచ్చారు. భారత్లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు. ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బు ఇచ్చేందుకు 2016లో సీఎంగా చంద్రబాబు చేసిన డిజిటల్ సంతకం ⇒ కేబినెట్ ఆమోదం లేకుండానే చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ఏర్పాటు చేసి, అనంతరం ఏపీఎస్ఎస్డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లు, ప్రాథమిక నివేదిక ప్రకారం రూ.370 కోట్లు మాత్రమే ఉన్న ప్రాజెక్ట్ విలువను అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేశారు. ⇒ ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ⇒ ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆర్ధిక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. కానీ ఏపీఎస్ఎస్డీసీ తన 10 శాతం వాటాను జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి చెల్లించేసింది. దీనిపై అప్పటి ఆర్ధిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ నిధులు విడుదల చేయాలని సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ నిధులు కొల్లగొట్టేందుకుగాను చంద్రబాబు ఏకంగా మొత్తం 13 నోట్ ఫైళ్లలో సంతకాలు చేశారు. ⇒ డిజైన్ టెక్కు చెల్లించిన రూ.371 కోట్లలో సాఫ్ట్వేర్ కొనుగోలు కోసం రూ.56 కోట్లు చెల్లించారు. మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ రూ.241 కోట్లు హవాలా మార్గంలో హైదరాబాద్లోని చంద్రబాబు బంగ్లాకు తరలించారు.కడిగిపారేసిన కాగ్రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.ఏ–1గా తేలడంతో బాబు అరెస్ట్⇒ 2018లోనే కేంద్ర జీఎస్టీ అధికారులు షెల్ కంపెనీల్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం బయట పడింది. దీనిపై అప్పట్లోనే జీఎస్టీ అధికారులు రాష్టఏసీబీకి సమాచారం ఇచ్చారు. కానీ చంద్రబాబు ఒత్తిడితో ఆ అంశాన్ని తొక్కిపెట్టారు. ఆ వెంటనే ఏపీఎస్ఎస్డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. ⇒ 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కిల్ స్కామ్పై విచారణకు సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది. ఈ కేసు విచారణ కోసం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసానిలకు సిట్ నోటీసులు జారీ చేయగానే వారిద్దరూ విదేశాలకు పరారయ్యారు. దాంతో ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని భావించి ఆయన్ను గత ఏడాది సెపె్టంబర్ 9న అరెస్ట్ చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ ఆయనతోపాటు 9 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టైంది. ⇒ సిట్ రిమాండ్ రిపోర్ట్తో ఏకీభవించిన విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. దాంతో చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతరం బెయిల్పై విడుదల అయ్యారు.పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా..యువతకు ఉపాధి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామనే ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందని ఈడీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం.. సీమెన్స్ కంపెనీకి అప్పటి ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ తమ సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెడ్ అకౌంటెంట్) ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా దారి మళ్లించారు. ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్లు సమర్పించి నిధులు విడుదల చేశారు. ఆ నిధులను షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి, ఏయే బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్కు తరలించారు.. తిరిగి ఆ నిధులు దేశంలోని ఏయే ఖాతాలకు వచ్చాయన్న విషయాన్ని ఈడీ గుర్తించింది. ఇప్పటికే రూ.70 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు నిర్ధారించింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. ఈ కేసులో నిందితులు సుమన్ బోస్, వికాస్ ఖన్విల్కర్, ముకుల్చంద్ర అగర్వాల్, సురేశ్ గోయల్లను అరెస్టు చేయడంతోపాటు విశాఖపట్నంలోని పీఎంఎల్ఏ న్యాయస్థానంలో చార్జ్షీట్ దాఖలు చేసింది.ఇక టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై ఈడీ కన్నుస్కిల్ స్కాం కేసులో ప్రధాన నిందితుడి (ఏ1)గా చంద్రబాబును పేర్కొంటూ న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్షీట్ కాపీని సిట్ ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. ఇప్పటికే షెల్ కంపెనీ అక్రమాలను వెలికి తీసి, కఠిన చర్యలు చేపట్టిన ఈడీ.. ఈ కుంభకోణం సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులు అయిన టీడీపీ ప్రభుత్వ పెద్దల పాత్రపై దర్యాఫ్తు వేగవంతం చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. దాంతో ఫేక్ న్యూస్ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈడీ మంగళవారం జారీ చేసిన అధికారిక ప్రకటనలో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టు ప్రకటించ లేదు. షెల్ కంపెనీల ప్రతినిధులపై తీసుకున్న చర్యలను తెలిపింది. సీబీఐకి అప్పగించాలి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో చంద్రబాబుపై సిట్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త తిలక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో ప్రధాన నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటంతో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాబట్టి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. -
కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలి: ఎంపీ గొల్లబాబురావు
సాక్షి,విశాఖపట్నం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లబాబురావు గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం (సెప్టెంబర్ 16) మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్చిన మాటను పవన్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి. పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి. టీడీపీ నేతల రాజీనామాలతో ఎటువంటి ప్రయోజనం లేదు.కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి. లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాదిమంది రోడ్డున పడతారు’అని బాబురావు అన్నారు. ఇదీ చదవండి.. తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు -
బిల్లుపై బాదుడు
సాక్షి, అమరావతి: ప్రతి నెలా మనం వాడుకున్న విద్యుత్కు తగ్గట్టు బిల్లు రావడం సహజం. కానీ ఇప్పుడు బిల్లు పైనే చార్జీలు పడటం వినియోగదారులను షాక్కు గురి చేస్తోంది. బిల్లుపై మళ్లీ బిల్లు ఏమిటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ విద్యుత్తు వినియోగదారులపై ప్రతి నెలా దాదాపు రూ.30 కోట్ల వరకూ ఆర్ధిక భారం పడింది! అది కూడా విద్యుత్ చార్జీ లపై వేసే చార్జీ కావడం విశేషం. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబో మని ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.ఇదీ సంగతి...!ఇప్పుడు నెలవారీ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు వివిధ రకాల యాప్లు అందుబాటులోకి వచ్చాయి. చివరి రోజైనా సరే ఇంటి నుంచే క్షణాల్లో కట్టవచ్చు. ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిన తేదీతో సహా మెసేజ్ రూపంలో యాప్లు గుర్తు చేస్తుంటాయి. పని ఒత్తిడిలో మర్చిపోకుండా ఆటో పే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఇకపై థర్డ్ పార్టీ యాప్లతో విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యం కాదు. డిస్కమ్ల వెబ్సైట్, వాటి మొబైల్ యాప్లోనే విద్యుత్తు బిల్లుల చెల్లింపులు చేయాలి. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) వెల్లడించాయి.చెల్లింపులపై చార్జీలు ఎలా అంటే..నూతన విధానాల ప్రకారం వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత డిస్కమ్ల యాప్ను డౌన్లోడ్ చేసుకుని విద్యుత్తు బిల్లులు చెల్లించవచ్చు. ఏపీసీపీడీసీఎల్ వినియోగదారులు www.apcpdcl.in ద్వారా, ఈపీడీసీఎల్ వినియోగదారులు www. apeasternpower. com ద్వారా, ఎస్పీడీసీఎల్ వినియోగదారులు www.apspdcl.in వెబ్సైట్ ద్వారా కూడా బిల్లులు కట్టవచ్చు. అయితే ఇక్కడే ఓ మెలిక ఉంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా కరెంట్ బిల్లు చెల్లిస్తే ప్రతి లావాదేవీకి రూ.2.50 చొప్పున చార్జీ పడుతుంది. భారత్ క్యూఆర్ ద్వారా కడితే బిల్లు మొత్తంపై 0.85 పైసలు చార్జీ పడుతుంది. డెబిట్ కార్డులు ద్వారా కడితే బిల్లు మొత్తం అమౌంట్లో 0.90 శాతం అదనంగా చెల్లించాలి. క్రెడిట్ కార్డులు, ఇతర పేమెంట్ పద్ధతుల ద్వారా బిల్లు చెల్లించాలంటే 1 శాతం అదనంగా పడుతుంది. ఉదాహరణకు రూ.5 వేలు విద్యుత్తు బిల్లు కట్టాలంటే రూ.50 అదనంగా సమర్పించుకోవాలి. ఇలా రాష్ట్రంలోని దాదాపు 1.92 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ప్రతి నెలా చెల్లించే దాదాపు రూ.3 వేల కోట్ల విద్యుత్ బిల్లులపై 1 శాతం అదనంగా వేసుకుంటే రూ.30 కోట్లు భారం పడుతుంది. కాగా ఫోన్పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్ల ద్వారా ఇన్నాళ్లూ ఫ్లాట్ ఫామ్ చార్జీ కింద బిల్లుకు కేవలం రూ.1 మాత్రమే వసూలు చేయడం గమనార్హం.నిర్లక్ష్యంగా డిస్కమ్లు...తాజాగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. అయితే ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు ఈ బిల్ పేమెంట్ సిస్టమ్ను ఎనేబుల్ చేసుకోలేదు. దీంతో డిస్కమ్లు తమ వెబ్సైట్, యాప్లో చెల్లించమని సూచించడం మినహా అదనపు భారం నుంచి ఊరట కల్పించే నిర్ణయాలు తీసుకోలేదు. కనీసం ప్రజల్లో అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బిల్లుల చెల్లింపులపై గందరగోళం నెలకొంది. బిల్లు కట్టడం ఆలస్యమైతే విద్యుత్ సర్వీసులను నిలిపివేయడం, లేట్ పేమెంట్ చార్జీలు విధించటం లాంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సిన విద్యుత్తు సంస్థలు ఉదాశీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీ అంటే షాకులే..76 యూనిట్లు విద్యుత్ వినియోగానికి 2015–16లో టీడీపీ హయాంలో రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60 వచ్చింది. అంటే బిల్లు 41.04 శాతం పెరిగింది. నాడు 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే 100 యూనిట్లలోపు విద్యుత్ వినియోగంపై చార్జీలు ఏపీలోనే తక్కువగా ఉండేవి. ఇతర చోట్ల యూనిట్ రూ.8.26 వరకూ ఉంటే ఏపీలో రూ.3.11 చార్జీ పడేది. 75 యూనిట్ల వరకు వినియోగానికి టారిఫ్ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువే విధించారు. వ్యవసాయానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) ద్వారా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను సగటు కొనుగోలు ధర యూనిట్ రూ.5.10 చొప్పున ఉన్నప్పటికీ గత ప్రభుత్వం రూ.2.49కే సేకరించేలా చర్యలు తీసుకుంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా కానుంది. 2021లో విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా కాగా ఇందులో రూ.3,373 కోట్లను వినియోగదారులకే తిరిగి ఇచ్చేశారు. -
కుర్చీలపై కన్ను!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చెన్నా..! రామ్మోహనా!ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.నిమ్మలకు పక్కాఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.చింతమనేని ప్రభాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.నారాయణకు మళ్లీ ఛాన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.పవన్కు పదవిపై అస్పష్టతే..జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.బీజేపీ కోటాలో సుజనాబీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
సాక్షి, నరసరావుపేట : ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా సృష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ శనివారం తన స్వగ్రామం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్లో 49.41 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 94–104 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 47.55 శాతం ఓటు షేర్తో 71–81ఎమ్మెల్యే స్థానాలు పొంది ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఇతరులకు 3 శాతం ఓట్లు పడవచ్చన్నారు. లోక్సభ ఫలితాలలో వైఎస్సార్సీపీ 13–15 ఎంపీ స్థానాలు, టీడీపీ కూటమి 10–12 స్థానాలు పొందే అవకాశం ఉందన్నారు. ఆరా మస్తాన్ ఇంకా ఏం చెప్పారంటే.. షర్మిలకు కనీసం డిపాజిట్ దక్కదు కడప ఎంపీగా పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఓడిపోవడంతోపాటు కనీసం డిపాజిట్ కూడా దక్కదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం ద్వారా వైఎస్సార్సీపీ 3 ఎంపీ స్థానాలను కోల్పోతుంది. మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో ఓడిపోతున్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి గతంలో కంటే కొంత ఓటు శాతం పెరిగినప్పటికీ అధికారం మాత్రం దక్కడం లేదు. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ ఎంపీలు తెలంగాణ లోక్సభ ఫలితాల్లో బీజేపీకి 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్కు 7–8 ఎంపీలు, ఎంఐఎంకు ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానం పొందిన బీఆర్ఎస్కు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాంగ్రెస్కు 38.43 శాతం, బీజేపీకి 36.65 శాతం, బీఆర్ఎస్కు 18.99 శాతం ఓట్లు నమోదవుతాయి. మా సర్వే ఫలితాలు వంద శాతం నిజం కావాలని కోరుకుంటున్నా. గతంలో మా అంచనా ఫలితాలు నిజమయ్యాయి.ఈసారి కూడా అదే జరగనుంది. పార్టీల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోను కాకుండా వృత్తిని వృత్తిగా భావించి ఫలితాలను వెల్లడించాను. వైఎస్సార్సీపీ అభ్యర్థులను మార్చడం కొన్ని చోట్ల మేలు చేసింది. పేదలు–పెత్తందార్ల మధ్య యుద్ధం అన్న జగన్ మాటలు పని చేశాయి. బీజేపీతో పొత్తు వల్ల ఓట్ల పరంగా నష్టపోయినా, పోల్ మేనేజ్మెంట్ పరంగా టీడీపీకి ఉపయోగపడింది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం కూటమికి ఇబ్బందిగా మారింది.వైఎస్సార్సీపీ వైపు మహిళలు, గ్రామీణ ఓటర్లుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన వైపు మహిళలు, గ్రామీణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొగ్గు చూపినట్టు మా సర్వేలో తేలింది. కరోనా వల్ల కొంత సమయం వృథా అయినా, పాలనలో నూతన విధానాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకు పాలన తేవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 71 శాతానికి పైగా ఉన్న గ్రామీణ ఓటర్ల అభిమానాన్ని పొందింది. పింఛన్దారులు సంతోషంగా ఉన్నారు. మహిళల ఖాతాల్లో ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఓ పథకం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలి్పంచడంతో రాష్ట్రంలో 56 శాతం మహిళలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు.కూటమికి మహిళలు కేవలం 42 శాతం మాత్రమే మద్దతిచ్చారు. పురుషులు కూటమికి 51.56 శాతం, వైఎస్సార్సీపీకి 45.53 శాతం ఓటు వేశారు. మహిళలు పురుషుల కన్నా సుమారు 4.7 లక్షల మంది అధికంగా ఓటు వేయడం, అందులోనూ 56 శాతం మంది వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వడంతో మరోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్సీపీకి అండగా నిలవడంతో 2019లో వచ్చిన ఓటు శాతాన్ని వైఎస్ జగన్ నిలుపుకున్నారు. -
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్లను కరణ్థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్థాపర్పై విరుచుకుపడ్డారు. బిహార్లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే. -
May 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 20th AP Elections 2024 News Political Updates9:01 PM, May 20th, 2024తూర్పు గోదావరి జిల్లా :ఓర్వలేకే టీడీపీ కుట్రలకు, భౌతిక దాడులకు పాల్పడుతుంది: హోంమంత్రి తానేటి వనితకుట్రలు, భౌతిక దాడులు ఈ కూటమి నేతలు చేస్తున్న తీరు చూస్తుంటే జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అని స్పష్టమవుతోంది.మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కడుపు మంటతో టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు.ఇటీవల నల్లజర్లలో సైతం స్వయంగా నామీదకు దాడికి పాల్పడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెబుతారు.టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేశారుప్రజలకు తెలుసు జగనన్న పేదలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని.పోలీసులు వైఎస్సార్సీపీకి కొమ్ముకాశారు అనడం అవాస్తవం.అలాగైతే ఇటీవల స్వయంగా నామీద జరిగిన దాడికి పోలీసులు ఏం చేశారో చెప్పాలి.టీడీపీ, జనసేన నేతలు కలసి అధికార దాహంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. 4:41 PM, May 20th, 2024మంగళగిరి:సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలుఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలుపోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ చీఫ్ని కలిశాం: అంబటి రాంబాబుటీడీపీతో కొందరు పోలీస్ అధికారులు కుమ్మక్కై అయ్యారనే దానిపై ఇసి ఆదేశాలతో బయటపడిందిఈసి ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కలిసి ఫిర్యాదు చేశాంహింసాత్మక ఘటనలలో కొందరు ఐపిఎస్ అధికారుల పాత్ర కూడా ఉందిఎన్నికల సమయంలో అధికారులని మార్చడం సహజంకానీ ఎపిలో జరిగిన బదిలీలలో పురందేశ్వరి లేఖ ఆధారంగానే జరిగిందిఅధికారులని మార్చిన చోటే హింసాత్మక ఘటనలు జరిగి అధికారులు సస్పెండ్లు జరిగాయిఅనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలలో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చిన చోటే హింస జరిగింది... అక్కడే సస్పెన్షన్లు జరిగాయిఇద్దరు ఐపిఎస్లని సస్పెండ్ చేశారంటే పోలీసుల పాత్ర అర్ధమవుతుందిపోలీసు శాఖ టీడీపీతో పూర్తిగా కుమ్మక్కైందిఇది చాలా దురదృష్టకరమైన పరిస్ధితిపోలీస్ యంత్రాంగం బాద్యత వహించాలివైఎస్సార్ సిపి ఇచ్చిన ఫిర్యాదులని కనీసం ఎన్నికల సమయంలో తీసుకోలేదువైఎస్సార్ పై తప్పుడు సెక్షన్లు, కేసులని నమోదు చేయాలని చూస్తున్నారుతప్పుడు కేసులని నివారించాలని కోరాంపోలీస్ అధికారుల కాల్ డేటాని పరిశీలించాలని కోరాంప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిట్ ఛీఫ్ ని కోరాందేశంలోనే పోలీస్ అధికారులు టిడిఇతో కుమ్మక్కు కావడం చాలా సీరియస్ అయిన విషయంవినీత్ బ్రిజ్ లాల్ మంచి సమర్ధవంతమైన అధికారి అని నమ్ముతున్నాం.నాగరిక సమాజంలో ఈ తరహా సంఘటనలు జరగకూడదుపెద్దారెడ్డి ఇంటికి వెళ్లి సిసి కెమారాలు ద్వంసం చేసి టీడీపీ జెండాలు ఎగురవేయడం ఏమిటిఅధికారుల మార్పు వల్ల టీడీపీకి మేలు జరుగుతుందనే ఇలా చేశారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి కుట్రలు చేసింది: జోగి రమేష్హింసాత్మక సంఘటనలు ప్రేరేపించడానికి కూటమే కారణంకలెక్టర్లు, ఎస్పీలు మార్చిన చోటే పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయిప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించింది చంద్రబాబేమళ్లీ సిఎంగా వైఎస్ జగన్ వస్తారుప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయిపూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ, బిసిలు వైఎస్ జగన్కి అండగా ఉన్నారనే కక్షతో హింసకి పాల్పడ్డారు: రావెల కిషోర్బాబుచాలా గ్రామాలలో ఎస్సీ, బిసీలు ఊళ్లకి ఊళ్లే ఖాళీ అవుతున్నాయి.టీడీపీ పై చర్యలు తీసుకోవాలిగ్రామాలలో సాధారణ పరిస్ధితులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిఘటనలకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలిప్రజాస్చామ్యాన్ని పునరుద్దించాలి 3:41 PM, May 20th, 2024విజయవాడఢీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ప్రాధమిక నివేదిక అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఈసి ఆదేశాల మేరకు సిట్ విచారణరెండు రోజుల పాటు నాలుగు బృందాలగా క్షేత్ర స్ధాయిలో పర్యటనపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో పర్యటించిన సిట్ బృందాలుహింసాత్మక ఘటనలకి కారణాలు విశ్లేషిస్తూ ప్రాధమిక నివేదిక150 పేజీల ప్రాధమిక నివేదిక డిజిపికి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ 2:20 PM, May 0th, 2024ఏపీలో కొత్త పోలీస్ అధికారుల నియామకంఈసీ సస్పెండ్ చేసిన అధికారుల అధికారుల స్థానంలో కొత్తవాళ్ల నియామకం నరసరావుపేట డీఎస్పీ గా - ఎం.సుధాకర్ రావు గురజాల డీఎస్పీగా - సీహెచ్ శ్రీనివాసరావు తిరుపతి డీఎస్పీగా - రవి మనోహరచారి తిరుపతి ఎస్ బీ డీఎస్పీగా - ఎం.వెంకటాద్రి తాడిపత్రి డీఎస్పీగా - జనార్దన్ నాయుడు నియామకంపల్నాడు DSB - I సీఐగా- సురేష్ బాబు పల్నాడు DSB - II సీఐగా - U. శోభన్ బాబు కారంపూడి ఎస్సై గా - కె.అమీర్ నాగార్జున సాగర్ ఎస్సై గా - ఎం.పట్టాభి 2:06 PM, May 20th, 2024కాసేపట్లో డీజీపీకి సిట్ నివేదికఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాధమిక నివేదిక సిద్దంఉదయం నుంచి డిజిపి ప్రధాన కార్యాలయంలోనే కూర్చుని ప్రాధమిక నివేదిక సిద్దం చేస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్మరికాసేపట్లో డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ప్రాధమిక నివెదికసిట్ ప్రాధమిక నివేదికపై తీవ్ర ఉత్కంఠగత రెండు రోజులగా పల్నాడు, అనంతపురం,తిరుపతి జిల్లాలలో సిట్ బృందాలు క్షేత్రస్ధాయి పర్యటన33 ఎఫ్ఐఆర్ లు, సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలనఘటనలు జరిగిన గ్రామాలు సందర్శన1:32 PM, May 20th, 2024చింతమనేని ఎక్కడ?పరారీలో దెందులూరు కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పోలింగ్ టైంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పీఎస్పై చింతమనేని దాడిసినీ ఫక్కీలో దాడి చేసి అరెస్టైన వ్యక్తిని విడిపించిన చింతమనేనిచింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారంఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపునూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు12:51 PM, May 20th, 2024మంగళగిరిపల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలుమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలుటీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలుపోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదుతమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలుసాక్షితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మిపల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మిబాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మిఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మిప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మిమహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మివారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..? : గజ్జల వెంకటలక్ష్మిచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మిఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మిఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మిత్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి 12:11 PM, May 20th, 2024విజయనగరండిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలుఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.12:00 PM, May 20th, 2024పోలీసుల అదుపులో బళ్ల బాబీఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యంపశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడికారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులుమీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్ కోమీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులుఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు11:32 AM, May 20th, 2024విజయవాడఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదికపోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్ఛార్జి వినీత్ బ్రిజ్లాల్నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలుతాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణకేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్11:01 AM, May 20th, 2024గుంటూరుసాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంపోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదుపల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశంఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం10:38 AM, May 20th, 2024ప్రకాశంఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహంతప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తాఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయంరాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందిజూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్ బ్యూరో) అలర్ట్కౌంటింగ్కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్ రిపోర్ట్ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్ కిషోర్చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్ టీం కష్టం ఉందన్న సీఎం జగన్జగన్ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొన్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్ -
పెత్తందారులకు మళ్లీ షాకే!
సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్లోడింగ్ సెక్షన్లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్ఆర్ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు. -
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
ఎన్నికలు వచ్చేశాయి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, జనసేనలతో జతకట్టి ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి రకరకాలవాళ్ళను ప్రచారానికి దించుతోంది.బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీమ్ మొత్తం కొన్నాళ్లపాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటివాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇలా కూటమి వైపు మొత్తం పెద్దపెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేస్తున్నారు.లబ్ధిదారులే జగన్ స్టార్ క్యాంపెయినర్లు అటు ప్రచారం అలా ఉండగా ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్సీపీ మాత్రం ప్రజలే ప్రచార సారధులుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు అంతా తానై సీఎం జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్దిపొందినవాళ్లు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత.. అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క.. జగనన్న విద్యాకానుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి.. ఆసరా అనుకున్న ఓ అక్క.. ఇలా పేదలే సీఎం జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu8:18 PM, May 8th, 2024షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోసారి షాక్ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కొట్టేసిన కోర్టుఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీతకడప కోర్టులోనే తేల్చుకొవాలన్న హైకోర్టుహైకోర్టు అదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టుఇరువురి వాదనలు విన్న కడప కోర్టుసునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన కడప కోర్టుతప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాజరిమానానుజిల్లా లీగల్ సెల్ కు కట్టాలన్న కడప కోర్టు2:30 PM, May 8th, 2024కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించిందినేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనంపురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషిFIRలో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారురాజకీయ నీచుడు చంద్రబాబుబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారుఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకంఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడుసీఎం జగన్ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలినేను రాష్ట్రం మొత్తం తిరిగానుగీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడుగీతం భరత్ను ఓడించాలిగీతం అంటేనే భూ కబ్జాలుఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.1:50 PM, May 8th, 2024మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి కాదు .2014లో ఇదే కూటమి జతకట్టింది.కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.పొత్తులు ముక్కలవడం ఖాయం .అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారురెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు 1:30 PM, May 8th, 2024టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనితటీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలిటీడీపీ నేతల దాడులు నశించాలిప్రజాస్వామ్యం పరిరక్షించాలినేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దుప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయిప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారుటీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారుభౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్లు పెట్టారు.గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారురాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసామునేనేమీ వారికి ఛాలెంజ్లు కూడా చేయలేదుమా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారుజగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారుదళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారుఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.ప్రతీ కార్యకర్త ఎలక్షన్పై దృష్టి పెట్టాలి. 12:30 PM, May 8th, 2024చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడురాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారుమైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడుమైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు 12:00 PM, May 8th, 2024పవన్పై ముద్రగడ సంచలన కామెంట్స్పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలినేను నిఖార్సైన కాపుని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబంపవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.మా వంగా గీతా కాపు కాదా?కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయిందిమళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం 11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి. చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం -
మోసం.. వంచన.. అప్పుడూ, ఇప్పుడూ బాబు మేనిఫెస్టో అదే..
2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన సీఎం జగన్👉: 58 నెలల్లో నవరత్నాల పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లు జమ 👉: సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో మరో రూ.95,001 కోట్లు 👉: డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.3,61,811 కోట్లు.. ఏటా సగటున రూ.72,362 కోట్లు వ్యయం 👉: సీఎం రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు అండ్ గ్యాంగ్ 👉: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: అంటే.. ఇప్పటి కంటే ఏటా రూ.92,638 కోట్లకుపైగా అదనంగా అవసరం 👉: టీడీపీ మేనిఫెస్టో అమలుకు ఐదేళ్లలో మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లకుపైగా అవసరం 👉: డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు వ్యయం చేసిన దాని కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం 👉: సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు 👉: పద్నాలుగేళ్ల బాబు పాలనలో ప్రతిఏటా రెవెన్యూ లోటేనని సాక్ష్యాలతో వివరించిన సీఎం జగన్👉: ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ పేరుతో మురళీమోహన్ వంటి బినామీలకే సంపద సృష్టించిన చంద్రబాబు 👉: 2014–19 మధ్య అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా బినామీలకు భూ సంపద సృష్టించిన వైనం 👉: ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఖజానా నుంచి ఖర్చు పెట్టి బినామీలకు సంపద సృష్టించేలా ఎత్తుగడ 👉: 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నారని మేనిఫెస్టోను ముట్టుకోని బీజేపీ 👉: పథకాల అమలుకు నిధులు ఎలా తెస్తారో వివరణ ఇవ్వాలంటున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు 👉: వివరణ ఇవ్వకపోతే తాను మోసం చేస్తున్నట్లు చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టీకరణసాక్షి, అమరావతి: ఎన్నికల్లో అలవికాని హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈసారి విశ్వరూపం ప్రదర్శించారు. జనసేన, బీజేపీలతో జత కట్టినా ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి వచ్చి ఉనికి చాటుకోవడం కోసం ఆచరణలో అమలుకు వీలుకాని రీతిలో హామీలతో ముంచెత్తుతూ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన తరహాలోనే ఈసారీ ప్రజలను వంచించడానికి సిద్ధమయ్యారని గ్రహించిన బీజేపీ.. మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా ముందుకు రాలేదని టీడీపీ వర్గాలే చర్చించుకుంటుండటం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. గత 58 నెలల్లో నవరత్నాలు–సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్ష చూపకుండా.. అవినీతికి తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2,66,810 కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.95,001 కోట్లు వ్యయం చేశారు. డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటిదాకా రూ.3,61,811 కోట్లు వ్యయం చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.72,362 కోట్లు ఖర్చు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తుంటే.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి శ్రీలంకగా మార్చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడితే.. ఎల్లో మీడియా అదే పల్లవి అందుకుంది.అదనంగా రూ.4,63,189 కోట్లు ఎలా తెస్తావ్ బాబూ? టీడీపీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్తోపాటు పేర్కొన్న ఇతర హామీల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లకుపైగా అవసరమని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే అదనంగా ఏటా రూ.92,638 కోట్లు అవసరం. ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు మొత్తంగా రూ.8.25 లక్షల కోట్లు అవసరం. అంటే.. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే అదనంగా రూ.4,63,189 కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎలా తెస్తావని ప్రశి్నస్తుంటే సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు తప్పించి స్పష్టంగా లెక్క చెప్పలేక తప్పించుకుంటున్నారు. హైటెక్ సిటీలో, అమరావతిలో బినామీలకే సంపద సృష్టి గతంలో సంపద సృష్టించానని, ఇప్పుడూ సంపద సృష్టించి.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు.. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో మురళీమోహన్ వంటి బినామీలు, వందిమాగధులతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేయించారు. ఆ తర్వాత హైటెక్ సిటీ పేరుతో ప్రభుత్వ ఖజానా నుంచి మౌలిక సదుపాయాలకు ఖర్చు చేసి బినామీలకు సంపద సృష్టించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వచ్చాక.. విజయవాడ–గుంటూరు ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేసే చోటు గురించి బినామీలు, వందిమాగధులకు ముందుగా లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారు. వేలాది ఎకరాల భూములు తక్కువ ధరలకే కొల్లగొట్టారు. ఆ భూ సంపదను రెట్టింపు చేయడానికి రాజధానిగా అమరావతిని చేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రభుత్వ ఖజానా నుంచి అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసి.. బినామీలు, వందిమాగధులు కాజేసిన భూ సంపదను మరింతగా పెంచడానికి ఎత్తులు వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజన తర్వాత రాష్ట్రాన్ని 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పాలించా రు. ఆ 14 ఏళ్లు.. ప్రతి ఏటా రెవెన్యూ లోటే. ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలోకి నెట్టిందీ చంద్రబాబే. 2014 నుంచి 2019 వరకు అప్పుల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్రేట్ (సీఏజీఆర్) 21.87 శాతం. కానీ.. సీఎం జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు చూస్తే అది 12.13 శాతం. దీన్ని బట్టి చంద్రబాబే ఎడాపెడా అప్పులు తెచ్చినట్లు స్పష్టమవుతోంది. 👉: అప్పుల మొత్తాన్ని చూసినా... చంద్రబాబు అధికారంలోకి రాక ముందు అంటే 2014 జూన్ 7 నాటికి రాష్ట్రానికి రూ.1,53,346 కోట్ల అప్పు ఉంటే.. 2019 మే 29 నాటికి అది రూ.4,12,288 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ అప్పులు రూ.7,03,471 కోట్లకు చేరాయి. 👉: సంపద సృష్టించానని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ.. వాస్తవానికి చంద్రబాబు హయాం (2014–19)లో మూలధన వ్యయం ఏటా సగటున రూ.15,227 కోట్లు ఖర్చు చేస్తే.. సీఎం జగన్ గత ఐదేళ్లు ఏటా సగటున రూ.17,757 కోట్లు ఖర్చు చేశారు. 👉: జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో సగటున 4.47 శాతం ఉంటే.. సీఎం జగన్ హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది. కోవిడ్ లాంటి క్లిష్ట సమయాన్ని కలిపినా 4.83 శాతం మన వాటా ఉందంటే ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందన్నది స్పష్టమవుతోంది. 👉: చంద్రబాబు హయాంలో జీఎస్డీపీలో పన్నుల భారం సగటున 6.57 శాతం ఉంటే.. జగన్ హయాంలో అది 6.35 శాతమే. అంటే.. సీఎం జగన్ హయాంలోనే పన్నుల భారం తక్కువ. ఇది ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా), కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చిన లెక్క.అప్పుడు అమెరికా అవుతుందా? పేదరిక నిర్మూలనే ధ్యేయంగా.. అవసరమైన మేరకు తక్కువగా అప్పులు చేస్తూ.. ప్రజలపై తక్కువగా పన్నుల భారం మోపుతూ.. ఆరి్థక క్రమశిక్షణ పాటిస్తూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి.. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలకు ఐదేళ్లలో రూ.8.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రం అమెరికా అవుతుందా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.నిధులు ఎలా తెస్తారో చెప్పండిటీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాల అమలుకు ఏటా రూ.1.65 లక్షల కోట్లు అవసరం. ప్రస్తుతం సీఎం జగన్ డీబీటీ, నాన్ డీబీటీ పథకాలకు చేస్తున్న వ్యయం కంటే రూ.92,638 కోట్లు అదనంగా అవసరం. ఈ లెక్కన ఐదేళ్లలో ఆ పథకాల అమలుకు అదనంగా రూ.4,63,189 కోట్లు అవసరం. ఆ నిధులను ఎలా తెస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆర్థిక నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. 2014 ఎన్నికల తరహాలోనే ఇప్పుడూ ప్రజలను మోసం చేస్తున్నానని చంద్రబాబు అంగీకరించినట్లేనని స్పష్టం చేస్తున్నారు. -
పేదలకు మంచి చేస్తుంటే వాళ్లు తట్టుకోలేక పోతున్నారు.. కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తారంట..!
-
చంద్రబాబు, పవన్కు పొలిటికల్ ట్విస్ట్.. బీజేపీ కీలక ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. టీడీపీ, జనసేనకు బీజేపీ ఊహించని షాకిచ్చింది. ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని.. తెలుగుదేశం, జససేన నిర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది.ఇక, ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది. ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో.. టీడీపీ, జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది. Truth: If BJP comes into power, we will make an end of the unconstitutional Muslim reservations. Meanwhile it's the right of SC, ST & OBC people of Telangana. We will ensure them that they get it. Therefore, We will end the Muslim Reservations.Fake Video: If BJP comes to power,… pic.twitter.com/4OxR8LP9Z9— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) April 30, 2024బాబును నమ్మని బీజేపీ ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లాడినప్పటికీ, ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు. చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు, బీజేపీలో ఉన్న తన అనుంగులు, ఇతరత్రా పైరవీలు చేశారు. అయినా బీజేపీ పెద్దలు ఆయన్ని నమ్మలేదు. ఢిల్లీలో రాత్రింబవళ్లు పడిగాపులు గాసి, కాళ్లా వేళ్లా పడి చిట్టచివరకు పొత్తు పెట్టుకోగలిగారు. బీజేపీ పొత్తయితే పెట్టుకొంది కానీ, చంద్రబాబును ఆ పార్టీ పెద్దలు నమ్మడంలేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడుతోంది. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన గెలుపే అసాధ్యమైతే, మేనిఫెస్టో విషయంలోనూ మరోసారి అభాసుపాలు కాకూడదని బీజేపీ అధిష్ఠానం భావించింది. దీంతో ఈసారి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి ఓ పరిశీలకుడిని మాత్రమే పంపి మమ అనిపించింది. కనీసం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా హాజరుకాలేదు.అంతేకాదు.. మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫొటోగానీ, కమలం గుర్తు గానీ ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఫొటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు. అయితే, చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ, ఇతర నాయకుల ఫొటోలు లేకుండా, కమలం గుర్తును మాత్రం వేయించారు. బీజేపీ దీనికీ అంగీకరించలేదు. దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకుడు సిద్ధార్థనాథ్సింగ్ పట్టుబట్టారు. దీంతో మేనిఫెస్టో ముఖచిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు. -
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
బయటపడ్డ చంద్రబాబు నిజస్వరూపం
-
టీడీపీకి రెబెల్స్ పోటు.. అయోమయంలో బాబు
-
కూటమిలో కొత్త ట్విస్ట్.. చంద్రబాబుకు షాకిచ్చిన బీజేపీ!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. కూటమిలో ఇప్పటికే పలు ట్విస్ట్లు చోటుచేసుకోగా.. తాజాగా బీజేపీ సంచలన ప్రకటన చేసింది. బీజేపీ ప్రకటనతో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త టెన్షన్ మొదలైంది. కాగా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గురువారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఈ క్రమంలోనే ముస్లిం రిజర్వేషన్లపై కూడా వారిద్దరూ చర్చించారు. దీంతో, రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ స్పష్టం చేసింది. ఇక, వీరి సమావేశం అనంతరం విలేకరులు సమావేశంలో పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. తాము ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని గోయల్ తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు మాత్రమే తాము అనుకూలమని గోయల్ స్పష్టం చేశారు. ముస్లింలకు మాత్రం రిజర్వేషన్లు ఇచ్చేదేలేదని ప్రకటన చేశారు.అయితే, బీజేపీ ప్రకటన కారణంగా చంద్రబాబుకు కొత్త టెన్షన్ క్రియేట్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ప్రకటనతో ఏపీలో కూటమికి ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక, ఏపీలో వైఎస్సార్సీపీ మైనార్టీల విషయంలో సామాజిక న్యాయం పాటిస్తోంది. తాజాగా కూటమి నేతల ప్రకటనతో వైఎస్సార్సీపీ గెలుపునకు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. -
టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు. దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్షా, మరో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూటమి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించారన్నారు. జగన్తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు. -
నన్ను చూడొద్దు..ఎన్డీఏను చూడండి
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘నన్ను కాదు.. ఎన్డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్ 8న కొలువుదీరిన సర్కార్ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు. పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. విషయం లేకే బాబు విన్యాసాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్ కళ్యాణ్ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి చాన్స్ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్సభ సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు. -
April 17th: ఏపీ ఎన్నికల సమాచారం
April 17th AP Elections 2024 News Political Updates.. 09:32 PM, Apr 17th, 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు, పవన్లకు షాక్ మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు పవన్లకు షాక్ సభను పట్టించుకోకుండా మద్యం షాపులకు క్యూ కట్టిన జనసేన, టీడీపీ శ్రేణులు మందేసి చిల్ అవుతున్న ఇరుపార్టీల కార్యకర్తలు చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న పసుపు క్యాడర్ 07:24 PM, Apr 17th, 2024 కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్రెడ్డి చంద్రబాబు నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట షర్మిల, సునీతను చంద్రబాబు ట్రాప్ చేశాడు చంద్రబాబు స్క్రిప్ట్నే వాళ్లు చదువుతున్నారు అవినాష్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు తనకు నచ్చిన వాళ్ల దగ్గరే సీబీఐ వాంగ్మూలం తీసుకుంది రాజశేఖర్ అనే వ్యక్తిని హత్య జరిగే ముందురోజే కాణిపాకం పంపారు చెవ్వులు వినపడని రంగన్నను ఇంటి వద్ద ఉంటారు వివేకా హత్య డ్రామా ప్లే చేసిందే సునీత, రాజశేఖర్రెడ్డి షర్మిల కడపలోనే ఎందుకు పోటీ చేస్తోంది? షర్మిలకు డబ్బులు ఇచ్చేందుకే బాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు 06:23 PM, Apr 17th, 2024 మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ మేమంతా సిద్ధం - 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 06:19 PM, Apr 17th, 2024 జుగుప్సాకరంగా బాలకృష్ణ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ బాలకృష్ణ, లోకేష్, ఎల్లో మీడియా కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు చేశాం బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి సీఎం ఇమేజ్ని డామేజ్ చేసేలా బాలకృష్ణ మాట్లాడారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ఈసీకి ఫిర్యాదు చేసినా టీడీపీ నేతల తీరు మారలేదు బుద్ది లేకుండా అసభ్యకర పదజాలం వాడుతున్నారు హిందుపురం మొహం చూడని బాలకృష్ణ స్వర్ణాంధ్ర యాత్ర చేయటం సిగ్గుచేటు సీఎస్పై తప్పుడు కథనాలు రాయటం సరికాదు ఎన్నారైలు పేదల ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్నారైల తీరును ఖండిస్తున్నాము ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలి రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదు 06:11 PM, Apr 17th, 2024 ప్రశాంత్ కిశోర్ పై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు చంద్రబాబు కోసం ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు దీనిపై నాకు స్పష్టమైన సమాచారం ఉంది బాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు ప్రస్తుతం నా కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం లేదు ప్రశాంత్ కిశోర్ కు ఏవో సమస్యలున్నాయి ఇటీవలే చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్ బాబును కలిశాక కూటమి గెలుస్తుందంటూ ప్రశాంత్ కిశోర్ ప్రచారం మమతా వ్యాఖ్యలతో స్పష్టమైన చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ బంధం 05:18 PM, Apr 17th, 2024 సీఎం హత్యాయత్నం కేసు విచారణ.. చంద్రబాబుకు ఎందుకీ ఉలిక్కిపాటు? చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రా రెడ్డి మండిపాటు బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు అసలు బోండా ఉమా ఈ కేసులో ఉన్నాడని మికేలా తెలుసు? అంటే సీఎం జగన్ పై దాడి చేయించింది మిరే అని అంగీకరిస్తున్నారా..? చంద్రబాబుకి ఈ కేసులో విచారణ తన వరకు వస్తుందని భయపడుతున్నాడా? సీఎం జగన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు చంద్రబాబు దిగజారుతున్నాడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాదరణ లేక ఇలా తెగిస్తున్నారు మూడు పార్టీలకు ఎల్లో మీడియా తోడై తప్పుడు ప్రచారం చేస్తున్నారు రామోజీరావు మార్గదర్శి స్కాం సొమ్ము కాపాడుకునేందుకు చంద్రబాబుకి కొమ్ము కాస్తున్నాడు సీఎం జగన్కి బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం పడితే చూసి ఓర్వలేకపోతున్నారు చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేశాడో చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటు ఎన్నికలకు ముందే టీడీపీ దివాలా తీసేసింది సీఎం జగన్పై దాడి కేసులో అసలు దొంగ చంద్రబాబు అని అర్థమవుతోంది బోండా ఉమని విచారించకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నాడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడు 05:02 PM, Apr 17th, 2024 ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు రేపు కేసు విచారణ జరగబోతుంది అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా? ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు 03:57 PM, Apr 17th, 2024 రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల రేపు నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 25 నామినేషన్లకు చివరి తేదీ 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్డ్రాకు గడువు, మే 13న పోలింగ్ 02:52 PM, Apr 17th, 2024 అమరావతి : జనసేన అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ తొలి బీఫాంను నాదెండ్ల మనోహర్ కు అందజేసిన పవన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ పాలకొండ అభ్యర్థి జయకృష్ణ గైర్హాజరు ఈ ఎన్నికలు అత్యంత కీలకమన్న పవన్ క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరు పర్యటనలు, ప్రచారం చేయాలని విజ్ఞప్తులు బీజేపీ, టీడీపీ నేతలు కలిసి రావడం లేదన్న అభ్యర్థులు ఎలాగైనా కలుపుకుని ముందుకెళ్లాలని సూచన 02:47 PM, Apr 17th, 2024 కుప్పంలో ఈనెల 19న చంద్రబాబు నామినేషన్ చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి 19న మ.12.33 గంటలకు చంద్రబాబు తరపున నామినేషన్ 02:45 PM, Apr 17th, 2024 బాలకృష్ణ పై మండిపడ్డ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నా పై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి నేను మద్యం, ఇసుక వ్యాపారం చేస్తున్నట్టు దమ్ముంటే బాలకృష్ణ నిరూపించాలి బాలకృష్ణ ఇసుకవ్యాపారం చేస్తున్నారని నేనూ ఆరోపిస్తా ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి గెలుస్తా: బాలనాగిరెడ్డి 02:40 PM, Apr 17th, 2024 మళ్లీ జగనే ఏపీ నెక్ట్స్ సీఎం : హీరో విశాల్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్ వేల కిలో మీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు విద్య విషయంలో ఏపీ సూపర్ విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు: హీరో విశాల్ 02:36 PM, Apr 17th, 2024 రాజమండ్రిలో ఎల్లుండి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్ ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు నామినేషన్ వేయనున్న పురంధేశ్వరి 02:35 PM, Apr 17th, 2024 సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ పాత్ర ఉండొచ్చు కేశినేని నాని విజయవాడ : బోండా ఉమ ఒక రౌడీ షీటర్ విజయవాడలో బోండా ఉమ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు బోండా ఉమ కాళకేయుడు, కీచకుడు: కేశినేని నాని 02:32 PM, Apr 17th, 2024 రేపు మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ అమరావతి: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నారా లోకేష్ రేపు ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీ భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి మంగళగిరి కాకపోతే చుట్టు పక్కల నుంచి తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచనలు 02:30 PM, Apr 17th, 2024 ఢిల్లీ: రేపు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబిఐకి అప్పగించాలని పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత విచారణలో వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తెలంగాణ ఏసీబీ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసీబీ "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 01:00 PM, Apr 17th, 2024 అనపర్తి సీటుకు టీడీపీ ఎసరు ? బీజేపీ కోటలో ఉన్న సీటును మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన సీటును మార్చవద్దని అధిష్టానానికి ఫిర్యాదులు అనపర్తి సీటును మార్చే ప్రయత్నాలను ఆపాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసిన మాజీ సైనిక ఉద్యోగ సంఘాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఎమ్మెస్ఆర్కే.రాజు కు ఇచ్చిన సీటును మారిస్తే దేశవ్యాప్తంగా మాజీ సైనిక ఉద్యోగులను అవమానించినట్లు అవుతుందని ఫిర్యాదులు 12:00 PM, Apr 17th, 2024 రాయచోటి లో టీడీపీకి భారీ షాక్. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లాతో సహ పలు కీలక నాయకులు మైనారిటీ నాయకుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక. కొత్తగా వైఎస్సార్సీపీలోలో చేరిన నాయకులకు ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిలు. సీఎం జగన్ పాలన నచ్చింది, ఎంతగానో ఆకట్టుకుంది, జగన్ వెంట నడవాలని పార్టీ లో చేరామంటున్న నూతన నేతలు. 11:00 AM, Apr 17th, 2024 రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబుది: పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచర్ల మండలంలో నేడు 12 పంచాయతీల్లో మంత్రి పర్యటన. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి. పుంగనూరు నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం: పెద్దిరెడ్డి ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం గతంలో ఎన్నడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగాం. మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనమంతా కృషి చేయాలి. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ఐదేళ్లు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో చంద్రబాబు పనిచేశారు. కరోనాతో రెండేళ్లు పోయినా హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ది. నేడు సూపర్ సిక్స్, మీ భవిష్యత్తు కు నా గ్యారంటీ అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడు. సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుందన్న చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికలు కోసం చంద్రబాబు అమలు చేయడం వీలుకాని హామీలు అన్ని ఇస్తున్నారు. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు, లబ్ది అందించేవారు. సిఎం వైఎస్ జగన్ ఆలోచన వలన ప్రతి ఇంటికి నేడు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. మన కోసం శ్రమించే వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి 10:20 AM, Apr 17th, 2024 దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు: దేవినేని అవినాష్ దశాబ్దాలుగా దేవినేని నెహ్రూతో సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్తో కలిసి ప్రజాసేవ చేశారు నెహ్రూ చేసిన మంచిపనులు చిరస్థాయిగా నిలిచిపోయాయి కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రును ఎప్పటికీ మరిచిపోయారు నెహ్రూ ఆశయ సాధన కోసం, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తాం చనిపోయి ఏడేళ్లయినా నెహ్రూ మీద అభిమానం అందరికి అలాగే ఉంది నెహ్రూ అభిమానులకు నెహ్రూ కుటుంబంగా ఎల్లప్పుడు అండగా ఉంటాం 09:40 AM, Apr 17th, 2024 రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ.. రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం రేపు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ 08:30 AM, Apr 17th, 2024 కూటమిలో ఇంకా కొలిక్కిరాని సీట్ల పంచాయితీ.. కూటమి సీట్లపై ఇప్పటికీ అయోమయంలో చంద్రబాబు రఘురామకృష్ణరాజు కోసం రకరకాల విన్యాసాలు నర్సాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రయత్నాలు నర్సాపురం నుంచి బీజేపీని తప్పించడానికి ప్రత్యామ్నాయాలు ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం దెందులూరు, అనపర్తి, మాడుగల స్థానాలపైనా లీకులు మరికొన్ని స్థానాల్లోనూ మార్పు తథ్యమని హడావుడి నామినేషన్ల పర్వం మొదలవుతున్నా ఇంకా రాని స్పష్టత 07:20 AM, Apr 17th, 2024 రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్: సీఎం జగన్ చంద్రబాబుకు పది మంది సేనానులు.. మీ గురి ఎవరిపై?.. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాలా? నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు.. నాకు తోడుగా పేదల సైన్యం రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్ను కోరుకుంటున్నాయి రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్ బాబుకు – అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్ డబ్బా.. సింగపూర్ కట్టాడా? మైక్రోసాఫ్ట్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైను తెచ్చాడా? కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు తెచ్చాడా? జిల్లాకో హైటెక్ సిటీ కనిపించిందా? బాబు రిపోర్ట్ అంతా బోగస్.. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు.. కోపంతో ఊగిపోతున్నారు దత్తపుత్రుడు కార్లు, భార్యల మాదిరిగా నియోజకవర్గాలనూ మారుస్తున్నాడు నిన్ను మిగతా వాళ్లూ అనుసరిస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? 07:00 AM, Apr 17th, 2024 ఏపీలో ఫ్యాను గాలి ప్రచండం.. ఏ ఊళ్లో ఏ నోట విన్నా ఈ మాటే జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలదీ అదే మాట రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులదీ ఆ మాటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ బస్సు యాత్రలో జగన్కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటమే తార్కాణం జనసేన, బీజేపీతో జత కలిసిన టీడీపీకి మరోసారి ఘోర పరాభవం ఖాయం సీఎం జగన్పై నమ్మకమే వైఎస్సార్సీపీ చారిత్రక విజయానికి బాట చంద్రబాబు మోసకారి కావడం వల్లే ఘోర ఓటమి బాటలో కూటమి 06:50 AM, Apr 17th, 2024 ఓ భూం.. భూమి స్వాహా! భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–3 కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. అమరావతి భూ దోపిడీలో చినబాబూ సూత్రధారే తెరవెనుక పాత్రధారులుగా బాబు అండ్ కో బినామీ పేర్లతో పేదల భూములపై పచ్చదండు దాడి రాజధాని లీక్స్తో రూ.2 లక్షల కోట్ల భూ దురాక్రమణ నారాయణ, లింగమనేని, సుజనా, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల దోపిడీ లీలలు.. కొమ్మాలపాటి, కోడెల,పయ్యావుల, మురళీ మోహన్ల భూ దందా 06:45 AM, Apr 17th, 2024 అవినీతిలో మేటి పత్తిపాటి.. సీసీఐలో పత్తి కొనుగోలు పేరిట రూ.650 కోట్లు హాంఫట్ మాజీ మంత్రి ప్రత్తిపాటి అక్రమాల చిట్టా యడవల్లిలో దళితుల భూముల కాజేతకు కుట్ర రేషన్ బియ్యం మాఫియా కింగ్గానూ పేరు తక్కువ ధరకు అగ్రిగోల్డ్ భూముల స్వాదీనం భార్య వెంకాయమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ 06:40 AM, Apr 17th, 2024 పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేదు అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా? టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది వైఎస్సార్సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్ సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్లలో తిరిగే వ్యక్తి 06:40 AM, Apr 17th, 2024 సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్సీపీదే -
పురందేశ్వరికి కొత్త ట్విస్ట్.. రూట్ మార్చిన జీవీఎల్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమిలో కొత్త ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. టికెట్ దక్కని కొందరు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమకు టికెట్ దక్కించుకునేందుకు వీలున్న మార్గాలన్నింటినీ వెతుకుతూ పార్టీలకు షాకిస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్లోకి బీజేపీ ఎంపీ, సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కూడా చేరారు. కాగా, విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో జీవీఎల్ పట్టువిడవటం లేదు. ఎలాగైనా విశాఖ నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే, ఇప్పటికే విశాఖ సీటును టీడీపీ నేత భరత్కు ఇచ్చినప్పటికీ జీవీఎల్ మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. ఈ క్రమంలో తనకే టికెట్ దక్కేలా లాబీయింగ్కు దిగారు. తాజాగా, ఉత్తరాది నేతలో జీవీఎల్ మంతనాలు ప్రారంభించారు. అలాగే, ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ సమావేశమయ్యారు. జీవీఎల్.. రూట్ మార్చి ఉత్తరాది నేతలతో చర్చించి బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. విశాఖ సీటు తనకే దక్కేలా వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు.. జీవీఎల్కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో జీవీఎల్కు మద్దతుగా బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డాను కూడా కలవడంతో విషయం మరోసారి చర్చకు వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రచారంలో భాగంగా జీవీఎల్ షాకిలిస్తున్నారు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి జీవీఎల్ దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. టీడీపీ కార్యక్రమాలకు కూడా జీవీఎల్ వెళ్లడం లేదు. అంతేకాకుండా పురంధేశ్వరి, చంద్రబాబు తీరుపై జీవీఎల్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. -
పొత్తు చిత్తే! బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు. ►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు. ►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది. ►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు. కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. తణుకులో బాబు, పవన్ల నిలదీత ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్ఛార్జి ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు. ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్ఫ్లాప్ అయ్యింది. టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అంతటా అదే తీరు ► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు. ►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు. ►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు. ►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు. -
బాబు రాసిన పచ్చ స్క్రిప్ట్.. ఫాలో అవుతున్న పురంధేశ్వరి!
నమ్మినోళ్లను నట్టేటముంచడం. అధికారులపై అభాండాలు వేయడం. ఈసీకి ఫిర్యాదులు చేయడం.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వర్క్ స్టైల్ ఇది. ఆమె తీరుతో కమలానికి.. ఇమేజ్ కంటే డ్యామేజే ఎక్కువ అవుతోంది. మరిది చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే.. వదిన ఫాలో అవుతున్నారు. గుడ్డిగా అర్ధంపర్థంలేని ఆరోపణలు చేస్తూ పలుచనవుతున్నారు. చిన్నమ్మను ఓడిస్తామంటున్నారు రాజమండ్రివాసులు. ఒకసారి విశాఖ.. మరోసారి బాపట్ల.. ఇప్పుడేమో రాజమండ్రి. ఏ ఒక్కచోటా స్థిరంగా పోటీ చేయకుండా ఎప్పటికప్పుడు నియోజకవర్గాలు మారే నేతల్లో పురందేశ్వరి ముందుంటారు. ఆమెకొక సొంతనియోజకవర్గమే లేదు. స్థిరమైన పార్టీ కూడా లేదు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా అన్ని పార్టీల్లో చక్కర్లుకొట్టారు. ఇక, పురందేశ్వరి మెడకు రోజుకో వివాదం చుట్టుకుంటోంది. ఆమె వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రచారంలోనూ ఆమె పలుచన అవుతున్నారు. రాజమండ్రిలో అభివృద్ధే జరగలేదంటూ పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు మండిపడుతున్నారు. పురందేశ్వరిని పొలిటికల్ టూరిస్టుగా అభివర్ణిస్తున్నారు రాజమండ్రి వాసులు. మడ అడవులే లేని రాజమండ్రి పార్లమెంటరీ ప్రాంతంలో జగనన్న కాలనీలు నిర్మించేందుకు అధిక డబ్బు చెల్లించి భూసేకరణ చేశారంటూ ఆరోపిచడం ఆమె అమాయకత్వానికి నిదర్శనమంటున్నారు. ఎన్టీఆర్ బిడ్డగా తనను అందరూ ఆదరిస్తారని, తాను అందరి మనిషినని చెప్పుకుంటున్నారు పురందేశ్వరి. అయితే అన్నగారి బిడ్డ.. టీడీపీలో ఎందుకు లేరో చెప్పాలన్నది ఎన్డీఆర్ అభిమానుల ప్రశ్న. రాజమండ్రి గురించి పురందేశ్వరికి కనీస అవగాహన కూడా లేదన్నారు ఎంపీ మార్గాని భరత్. టీడీపీ పెద్దలిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ టైమ్ పాస్ చేస్తున్నారని సెటైర్లు సంధించారు. ఆమె బీజేపీలో ఉన్నారా? లేక టీడీపీలో ఉన్నారా? అంటూ ప్రశ్నించారు. నిజానికి పురందేశ్వరి తాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలినన్న సంగతే మర్చిపోయారు. కేవలం బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. సొంతపార్టీ లీడర్లపై కుట్రలు, కుతంత్రాలు పన్నుతూ.. ఏపీ బీజేపీ ప్రయోజనాలను గాలికొదిలేశారు. అంతేకాదు చిన్నమ్మకు మరో రికార్డు కూడా ఉంది. ఆమె పోటీచేసిన ఏ నియోజకవర్గంలోనూ గెలిచినా, ఓడినా అభివృద్ధి మాత్రం అస్సలు పట్టించుకోరు. -
April 10th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates 10:25 AM, April 10th 2024 వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్ వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరిక. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు 10:10 AM, April 10th 2024 జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి చేరికలు.. నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు 9:51 AM, April 10th 2024 టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్ పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్ అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్ మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్ జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్ పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత 9:31 AM, April 10th 2024 మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి.. కేసు బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్ను లాగి తెంచేసిన వైనం అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్లకు ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి 9:20 AM, April 10th 2024 షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు. సీఎం జగన్కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు. షర్మిల, కాంగ్రెస్కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు. జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 9:00 AM, April 10th 2024 కూటమి కార్యకర్తల తన్నులాట.. రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9 — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 8:45 AM, April 10th 2024 సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు.. సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి. ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు. డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్పై చిందులేసిన సీఎం రమేష్. అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం. 8:15 AM, April 10th 2024 మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా.. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -12. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 7:45 AM, April 10th 2024 పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్.. పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ 7:15 AM, April 10th 2024 పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్ పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙ ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ 7:00 AM, April 10th 2024 పవన్కు షాకిస్తున్న జనసైనికులు.. చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు అన్నింటికీ తల ఊపుతున్న పవన్ పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే 6:45 AM, April 10th 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 6:30 AM, April 10th 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత -
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
కూటమిని వీడని గందరగోళం
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమైతే కట్టాయి కానీ, ఆ మూడూ ఒక్కటిగా లేవు. పట్టుమని పది సీట్లు గెలుస్తామన్న నమ్మకం వాటికే లేదు. ఒంటరిగా పోటీ చేసే బలం ఒక్క పారీ్టకీ లేదు. అసలు ప్రజలకి ఆ పార్టీలపై నమ్మకమే లేదు. అయినా లేని బలాన్ని ఊహించుకుని ఎంత హడావుడి చేస్తున్నా ఆ కూటమిలో ఉన్న డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. నానా ప్రయాసలు పడి సీట్ల సర్దుబాటు చేసుకున్నా, అతి కష్టం మీద 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా మూడు పార్టీల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమదే సీటు అని అభ్యర్థులు ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఒక్క చోటా లేదు. అందుకు తగ్గట్టుగానే జాబితాలు ప్రకటించాక పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఇంకా మారుస్తున్నా్నరు. సుమారు 50 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు, అసంతృప్తుల ఆందోళనలతో ఏ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సీట్లు ఖరారైనా అదే తుది నిర్ణయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబే చెప్పారు. మరికొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు కసరత్తు కూడా చేస్తున్నారు. 20కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు చర్చలు జరుపుతుండడంతోపాటు ఆ నియోజకవర్గాల్లోని నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. కీలకమైన రెండు, మూడు ఎంపీ స్థానాలపైనా తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ, జనసేన సీట్లు కూడా ఒకటి, రెండు మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కూటమిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది అభ్యర్థులు అసలు ప్రచారం చేసుకోవాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు. నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు కూటమిలో అయోమయాన్ని సృష్టించాయి. ఈ సీటును బీజేపీకి కేటాయించి, శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆ సీటు తనదేని అంటున్నారు. బీజేపీ శ్రీనివాసవర్మను మార్చి రఘురామకు ఆ సీటు ఇస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది. అయితే, రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడంతో అది జరిగే పని కాదని తేలిపోయింది. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్సింగ్ నర్సాపురంలో తమ అభ్యర్థిని మార్చే అవకాశమే లేదని సోమవారం తేల్చి చెప్పేశారు. అయినా దీనిపై టీడీపీ నాయకులు ఇంకా రగడ సృష్టిస్తూనే ఉన్నారు. నర్సాపురం లోక్సభ స్థానాన్ని బీజేపీ నుంచి వెనక్కి తీసుకొని, ఏలూరు లోక్సభ స్థానం కేటాయిస్తారని, అప్పుడు రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఏలూరు బీజేపీ సీటు ఆశించిన తపన ఫౌండేషన్కు చెందిన గారపాటి చౌదరి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్పై స్థానికంగా వస్తున్న వ్యతిరేకతతో ఆయన్ని మారుస్తారనే ప్రచారమూ దీనికి తోడైంది. మరోవైపు రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వకూడదంటూ అక్కడ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయనకిస్తే తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరించాయి. దీంతో నర్సాపురం, ఏలూరు లోక్సభ స్థానాల్లో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాతపట్నం, శ్రీకాకుళంలో మార్పు తప్పదా? పాతపట్నం, శ్రీకాకుళం సీట్లలో కూడా మార్పు తథ్యమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిన మామిడి గోవిందరావు, గొండు శంకర్పై కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నానని తెలుస్తోంది. పాతపట్నం సీటును మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం సీటుకు గుండా లక్ష్మీదేవి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు వచ్చాయని అన్ని ఏర్పాట్లతో ప్రచారం చేసుకుంటున్న నేతలు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటుపైనా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పొత్తులో బీజేపీకి వెళ్లిన ఈ సీటును తిరిగి టీడీపీకి ఇస్తారనే సమాచారంతో బీజేపీ స్థానిక నేతల్లో అయోమయం ఏర్పడింది. జనసేనకు కేటాయించిన యలమంచిలి, నర్సాపురం స్థానాల్లోనూ అభ్యర్థులు మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని స్థానాలపైనా జరుగుతున్న రకరకాల ప్రచారాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. -
బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీపట్ల తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరు.. ఇందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారశైలితో కమలనాథులు తీవ్రంగా రగిలిపోతున్నారు. చంద్రబాబు తమ పార్టీని ఇష్టానుసారం ఆడిస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల టీడీపీకి వత్తాసు పలికేలా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 2014లోనూ టీడీపీ అధినేత పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ పోటీచేసిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి దొంగదెబ్బ తీశారని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన వదినతో కలిసి ఇలాంటి డ్రామానే ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా వారు అనపర్తి నియోజకవర్గాన్ని ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలు అడుతుంటే, ఆ నియోజకవర్గం ఉన్న రాజమండ్రి లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పోటీచేస్తూ కూడా అక్కడి పరిణామాలపై కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీని వెన్నుపోటు పొడవడమేనని వారు స్పష్టంచేస్తున్నారు. పురందేశ్వరి ప్రేక్షకపాత్ర.. ఇక ఈ సీట్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను బీజేపీ రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఏమాత్రం పట్టించుకోవడంలేదని కమలనాథుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి.. పురందేశ్వరి రాజమండ్రి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి కన్నా చంద్రబాబు తొలుత ప్రకటించిన టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే పురందేశ్వరికి అక్కడ ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి టీడీపీ నాయకత్వం ఆమెను ఒప్పించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీకి, పారీ్టనే నమ్ముకున్న నాయకులకు టీడీపీవల్ల అన్యాయం జరుగుతున్నా ఆమె మౌనంగా ఉంటున్నారని వారంటున్నారు. అవసరమైతే, బీజేపీ ఆ స్థానాన్ని వదులుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్లు ఆ పారీ్టలో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అప్పట్లో మోదీపై బాబు విమర్శలను ఖండించడంవల్లే.. వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని, ప్రధాని మోదీని చంద్రబాబు టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిని అప్పట్లో ప్రస్తుత అనపర్తి బీజేపీ అభ్యర్థి ఎం. శివరామకృష్ణంరాజు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీయన అభ్యర్థిగా కొనసాగితే టీడీపీ ఓట్లు బదలాయించడం కష్టమని కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను వదిలేసి వాటిని ఖండించినందుకు శివరామకృష్ణంరాజును బలిపశువును చేయాలని టీడీపీ ప్రయతి్నస్తోందని.. కానీ, పురందేశ్వరి టీడీపీ కుట్రను ఏమాత్రం అడ్డుకోకపోవడం ద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడాన్ని కమలం శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. 2014లో మాదిరిగానే ఇప్పుడూ వెన్నుపోటు మరోవైపు.. చంద్రబాబు–పురందేశ్వరి తమ రాజకీయ డ్రామాను రక్తికట్టించేందుకు శివరామకృష్ణంరాజు బలమైన అభ్యర్థి కాదని ఇంకో కొత్త ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇలాంటి ప్రచారాలే చేసి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు పురందేశ్వరి ఆయనకు తోడైందని వారంటున్నారు. అప్పట్లో బీజేపీకి ఐదు లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ముందు చెప్పి ఆ తర్వాత నాలుగు లోక్సభ 14 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు. ఆ అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు బలమైన వారు కాదంటూ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు పోటీగా టీడీపీ వారికి సైతం బి–ఫారాలిచ్చారు. ఆ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు కూడా బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో పురందేశ్వరి భాగస్వామ్యం కావడంపట్ల కమల దళంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు–పురందేశ్వరి కలిసి నాటకం బీజేపీతో పొత్తు కుదరక ముందే గత ఫిబ్రవరి 24న చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత మార్చిలో పొత్తులు ఖరారయ్యాక టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎం. శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. రెండ్రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన నాయకుల సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిచారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా అనపర్తి టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీచేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుండడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. పురందేశ్వరి ఈ పరిణామాలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు–పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఈ డ్రామాను ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
మొదటి ఆటే ఆఖరాట.. బాబు అతి తెలివి ఢిల్లీకి అర్థమైందా?
కూటమి సినిమా అట్టర్ ప్లాప్ అయిందా.. మొదటి ఆటతోనే సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేసారా? మొదటి ఆటే ఆఖరాట అయ్యిందా.. చూస్తుంటే అలాగే ఉంది. కాస్త లేటుగా అయినా పాము విషాన్నే కక్కుతుంది తప్ప పాలను కాదు.. తుమ్మ చెట్టుకు ముళ్ళే వస్తాయి తప్ప పూలు రావు.. అలాగే ఎంతగా మారిపోయాను అని చెప్పి.. కాళ్లావేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అవకాశం వచ్చినపుడు మాత్రం చంద్రబాబు తన అసలు రూపాన్ని బయటకు తీస్తూనే ఉంటారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఢిల్లీతో పొత్తు పెట్టుకున్నా ఆయన అంతరంగంలో ఏముందన్నది గుర్తించలేని అమాయకులు బీజేపీలో ఎవరూ లేరు. కానీ, మనిషి మారాడేమో అనుకున్నా లేదు.. ఎందుకు మారతాడు.. ఒరిజినల్ అలాగే ఉంటుంది. అది అవసరం వచ్చినప్పుడల్లా బయటపడుతుంది. దీంతో చంద్రబాబు తత్వాన్ని మరోమారు అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు ఇంకోసారి ఆయనతో వేదిక పంచుకునేది లేదని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. మొన్నామధ్య చిలకలూరిపేటలో జరిగిన ఉమ్మడి వేదిక మీద మోదీ.. చంద్రబాబు.. పవన్ ముగ్గురూ మాట్లాడారు. ఆ తరువాత సీట్ల పంపిణీ జరిగింది. అక్కడే చంద్రబాబు తీరు మరోమారు బీజేపీ పెద్దలకు అర్థమైంది. ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ వాళ్ళను బీజేపీలో చేర్చి తన వదిన అయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా టిక్కెట్లు ఇప్పించుకున్న చంద్రబాబు తీరును చూసి ఢిల్లీ బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాక్ అయ్యిందట. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు టిక్కెట్లు లేకుండా ఎంతసేపూ సీఎం రమేష్, సుజనా చౌదరి.. ఇలాంటి వాళ్ళు తప్ప వేరేవాళ్లు అభ్యర్థులే లేరా?. అంతా తన చంచాలేనా.. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరూ అభ్యర్థులు కాలేక పోయారా? అంటూ రాష్ట్ర పాతకాపులైన బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు చూశాక అర్థమైంది. పీవీఎన్ మాధవ్.. వీర్రాజు వంటి వాళ్లకు ఎక్కడా టిక్కెట్లు లేకుండా చంద్రబాబు తన బంధువు పురంధేశ్వరి ద్వారా చక్రం తిప్పి బీజేపీని తన గుప్పిట్లో పెట్టుకుని ఎలా కథ నడిపింది బీజేపీకి అర్థమైంది. దీంతో, ఇక చాలు ఆయనతో అంటకాగింది చాలు.. కూటమి తరఫున ఇంకో ఉమ్మడి సభ వద్దే వద్దు అని తీర్మానించారని తెలుస్తోంది. దీంతో మోదీ, అమిత్ షా వచ్చినా ఇక చంద్రబాబుతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ వాళ్ళతో సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు సైతం ఉమ్మడిగా కాకుండా ఎవరికీ వారే సభలు.. రోడ్డు షోలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కలిసి వెళ్లడం లేదు. - సిమ్మాదిరప్పన్న. -
April 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 4th Telugu Updates 9:49 PM, April 4th 2024 జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది.. సీఎం జగన్ ట్వీట్ నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 8:30 PM, April 4th 2024 చంద్రబాబుకి ఎన్నికల సంఘం నోటీసులు మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం 6:05 PM, April 4th 2024 ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా? పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి? 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా? జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే 5:16 PM, April 4th 2024 నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు.. సీఎం జగన్ ట్వీట్ జగన్ ఒక టిప్పర్ డ్రైవర్కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు 4:43 PM, April 4th 2024 రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు రైల్వేకోడూరు నుంచి మరో పచ్చ చొక్క నేతకు జనసేన టికెట్ అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించిన జనసేన ఇటీవలే యనమల భాస్కర్ రావును జనసేన అభ్యర్దిగా ప్రకటించిన జనసేన ప్రచారంలోకి దిగకముందే టికెట్ మార్పు ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్ గా కొనసాగుతున్న నూతన అభ్యర్ది అరవ శ్రీధర్ మూడు రోజుల క్రితమే జనసేనలో చేరిన శ్రీధర్ 3:45 PM, April 4th 2024 సీఎం వైఎస్ జగన్ని ప్రజలు దేవుడిగా చూస్తున్నారు: మంత్రి రోజా వడమాలపేట మండలంలోని కల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు అంటున్నారు రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో.. ముసలి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు చంద్రబాబుకి ప్రజలు బుద్దిచెప్పే రోజు దగ్గర్లోనే ఉంది నగరిలో ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సీట్లులో కూడా అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులకే ఇచ్చారు 2:15 PM, April 4th 2024 చంద్రబాబు నిర్వాకం.. వాలంటీర్ల రాజీనామా నంద్యాలలో 29 మంది వాలంటీర్లు రాజీనామా. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తమపై కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు అంటూ వాలంటీర్లు సీరియస్ నంద్యాల పట్టణంలోని ఆరో వార్డులో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా. తమ రాజీనామా పత్రాలను సచివాలయ ఇంచార్జ్కు సమర్పించిన వాలంటీర్లు. 2:00 PM, April 4th 2024 ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి: కొడాలి నాని ఫైర్ దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనల వల్లే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడు కూటమి పార్టీల నేతలకు, పచ్చ మీడియా పెద్దలకే గౌరవ మర్యాదలు ఆత్మగౌరవం ఉంటుందా? పేదలకు ఉండదా? క్యూలైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే రోజులను వృద్ధులు మర్చిపోయి చాలా రోజులైంది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటలకొద్ది నిలబడటమనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వడంతో హక్కుగా లబ్ధిదారులు ఇప్పటివరకు అందుకుంటున్నారు పేదవాళ్లు కోరుకునే ఆత్మగౌరవం దెబ్బతినకుండా మూడో కంటికి తెలియకుండా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందిస్తున్నాం చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రంలోని లక్షలాదిమంది వృద్దులు, వికలాంగులు, వితంతువులు కష్టపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా? నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. 1:30 PM, April 4th 2024 రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. నాడు లోక్సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు 12:40 PM, April 4th 2024 చంద్రబాబుది శవ రాజకీయం: వెల్లంపల్లి శ్రీనివాస్ మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదు. పచ్చి తాగుబోతుకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి. ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారు. ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడు. సెంటర్లో 25వేల మెజార్టీతో వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుంది. ఎవరైనా చనిపోతే చంద్రబాబు ఆనందపడతాడు. వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కొట్టుకుపోతుంది. మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ ఒకసారి వాంబే కాలనీ వచ్చి పేదల పరిస్థితి చూడు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజల ఉసురు పోసుకున్నాడు. ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటికి తరిమికొట్టాలి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ దుర్మార్గంగా మాట్లాడాడు. పవన్ లాంటి వెదవల్ని ప్రజలు నమ్మరు. దివ్యాంగులకు వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు. నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్తో శవరాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా? వెన్నుపోటు, దుర్మార్గ రాజకీయాలు చేసేది చంద్రబాబే. 12:15 PM, April 4th 2024 అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు చెప్పిన వారికే జనసేనలో సీట్లు అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ బుద్ధప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం జనసేనలో చేరిన బుద్ధప్రసాద్ జనసేనలో మొదటి నుంచి కష్టపడిన వారికి హ్యాండిచ్చిన పవన్ సర్వేల పేరుతో ఊరించి ఆశపెట్టి జనసేన పార్టీ శ్రేణులను దారుణంగా మోసం చేసిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు కేవలం దక్కింది రెండు స్థానాలే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇద్దరూ బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే సీటిచ్చిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా జనసేనలో కష్టపడిన వారికి దక్కని అవకాశం పవన్ తీరుపై మండిపడుతున్న జనసేన శ్రేణులు 11:50 AM, April 4th 2024 పేదలను ఇబ్బందిపెడుతున్న వ్యక్తి చంద్రబాబు: కేశినేని నాని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కేడర్ అంతా విజయోత్సాహంతో ఉంది అవినాష్ విజయానికి ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి రిటైనింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయు సీఎం జగన్ను ఒప్పించి వేగవంతంగా రిటైనింగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడు నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతం పెన్షన్దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు పేదలకు, సామాన్యులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడు శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు 11:30 AM, April 4th 2024 వైఎస్సార్సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: దేవినేని అవినాష్ పలు డివిజన్లకి చెందిన జోనల్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాం రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీలతో సీట్లు గెలవబోతున్నాం ఇక్కడ ప్రజలు పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజలు మమ్మలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు 11:00 AM, April 4th 2024 వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన విష్టువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ కామెంట్స్.. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకోయాం అని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్ అని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆరో తేదీన కావలిలో ‘కావలి సిద్ధం’ సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నాను. ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు ధన్యవాదాలు. 10:30 AM, April 4th 2024 అనంత టీడీపీలో అసమ్మతి.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్తత టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అసమ్మతి నేతలు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గోబ్యాక్ అంటూ నినాదాలు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట టీడీపీ రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు 10:00 AM, April 4th 2024 పేదల పక్షపాతి సీఎం జగన్: నల్లగట్ల స్వామిదాస్ సీఎం జగన్ను ఓడించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి కలలన్నీ కల్లలు అయిపోతాయి. రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తు అంధకారమై పోతుంది.. సజావుగా సాగుతున్న పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి కుట్రలు చేసింది. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదనే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. భారతదేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఒక ఆదర్శం. దుర్మార్గమైన చర్యతో సంక్షేమ పాలనను ఆపేందుకే ప్రయత్నం. పేదల పక్షపాతి పార్టీ సీఎం జగన్. అందుకే ఒక టిప్పర్ డ్రైవర్, మరో ఉపాధి హామీ కూలి వంటి పేదలకు స్థానం కల్పించారు. పెట్టుబడుల పార్టీ, పెత్తందారుల పార్టీ, ధనవంతుల పార్టీలు కూటమిలో ఉన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా ఇవ్వలేని బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు. రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ను తిరిగి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో జగనన్నకు కానుకగా ఇస్తాం. 09:25 AM, April 4th 2024 నేడు రఘురామ కీలక మీటింగ్ భీమవరంలో ఈరోజు రఘురామకృష్ణరాజు కీలక మీటింగ్ సన్నిహితులు, అభిమానులతో అంతర్గత ఆత్మీయ సమావేశం రఘురామకృష్ణరాజు రేపు టీడీపీలో చేరతారంటూ ప్రచారం ఇన్ని రోజులు చంద్రబాబు కోసం కష్టపడ్డారు కాబట్టి చంద్రబాబు టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే చంద్రబాబు నుంచి అందిన గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు పాలకొల్లు టూర్లో తెలుగుదేశం గూటికి చేరే ఛాన్స్ ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్న అనుచరులు 09:00 AM, April 4th 2024 వన్స్ మోర్ సీఎం జగన్.. బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట సీఎం జగన్కు నీరాజనం.. రోడ్డుపైకి తరలి వచ్చిన గ్రామాలకు గ్రామాలు మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదీత ఎన్ని జెండాలు జత కట్టినా వారు చిత్తే.. తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం వెంటే.. ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానీకం బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట 08:40 AM, April 4th 2024 పవన్పై ముద్రగడ ఫైర్ పవన్ కల్యాణ్పై మండిపడ్డ ముద్రగడ పద్మనాభం కార్యకర్తలను పవన్ దగ్గరకు కూడా రానివ్వరు రోజుకు మూడు షిఫ్ట్ల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారు చుట్టూ బౌన్సర్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఔ బ్లేడ్ బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం పిరికితనం, చేతకానితనంతోనే పవన్ వ్యాఖ్యలు 08:20 AM, April 4th 2024 నేడు ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం.. నేడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్యసభలో 11కు పెరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ(97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే 08:00 AM, April 4th 2024 ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ అంటే.. ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ!#ChandrababuInsultsDrivers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/H2OMYTdMyM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 07:45 AM, April 4th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. గురవరాజుపల్లె ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం చిన్న సింగమల వద్ద 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ చింతరెడ్డిపాలెం సమీపంలో రాత్రి బస 07:00 AM, April 4th 2024 టీడీపీలో నిరసన జ్వాలలు.. చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు సీట్ల కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన బీసీ సాకుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి అనపర్తి బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి!.. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారంలో వర్గపోరు ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ టీడీపీ ఇన్చార్జ్లకు దక్కని టికెట్లు మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారని నిరసన జ్వాలలు 06:50 AM, April 4th 2024 తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది! మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 06:40 AM, April 4th 2024 జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్ జగన్ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు పవన్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. 06:30 AM, April 4th 2024 కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్ బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్ పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కు వెళ్లే ఆలోచన ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు -
ఎల్లో మీడియా పైత్యం.. అధికారుల బదిలీలపై చెత్త రాతలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న ఫలితం కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆయన తాను కోరుకున్నట్లుగానే ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేయగలుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో తొమ్మిది మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడం వెనుక ఏమి జరిగిందా అన్నదానిపై విశ్లేషణలు వస్తున్నాయి. కచ్చితంగా టీడీపీ కూటమి కేంద్రంలోని బీజేపీ ద్వారా ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి ఇంతమందిని బదిలీ చేయించారన్న భావన ప్రజలలో కలుగుతోంది. ఎందుకంటే వీరిలో కొందరు అధికారులు కొద్ది కాలం క్రితమే బదిలీ అయినా, వారిని అక్కడ ఉండకుండా ఎన్నికల విధులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీములు బాగా అమలు చేసిన అధికారులపైన, ఆయా చోట్ల టీడీపీ చేసిన అరాచకాలను అడ్డుకున్న పోలీసు అధికారులపైన టీడీపీ, ఈనాడు తదితర ఎల్లో మీడియా కక్ష కట్టి వారు బదిలీ అయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఏపీలో వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యం అన్న భావనకు వచ్చిన చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పలురకాలుగా ప్రేమ లేఖలు రాయడం, ఆ తర్వాత ప్రలోభాలకు గురి చేయడం ద్వారా ఆయనను తనదారిలోకి తెచ్చుకున్నారు. అయినా అది జగన్ను ఓడించడానికి సరిపోవడం లేదని అనుకుని బీజేపీవైపు చూశారు. బీజేపీ పొత్తులోకి వస్తే వారివల్ల కలిసి వచ్చే ఓట్ల గురించి కాకుండా, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ద్వారా కేసుల బెడద లేకుండా చూసుకోవడం, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు జరగకుండా జాగ్రత్తపడడం, వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం వంటి ప్రయోజనాలను ఆశించి పొత్తులోకి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. దాని కోసం ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లావేళ్ల పడి, ఆత్మగౌరవాన్ని వదలుకుని ఎలాగైతేనేం బీజేపీ పెద్దల మనసును ఆకట్టుకోగలిగారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా ఏపీలో కూటమి సభలో పాల్గొనేలా చేయగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో తమ మనుషులు, ఇతర పార్టీలలో ఉన్న కోవర్టులతో ఆపరేషన్ ఆరంభించారు. తొలుత ఎన్నికలను నెల రోజుల పాటు ఆలస్యం చేయడంలో సఫలం అయ్యారన్న అభిప్రాయం కలిగింది. 2019లో తొలిదశలో ఏప్రిల్ పదకుండో తేదీకి ఎన్నికలు పూర్తి అయిపోతే, ఈసారి ఎన్నికలు నాలుగోదశకు వెళ్లడం, మే పదమూడు వరకు అంటే నెల రోజులు ఆలస్యం కావడం చూస్తే ఇది కూటమి పనే అన్న సందేహం వస్తోంది. ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీసే విధంగా వారితో ఈ రెండు నెలలు ప్రజలకు సేవలందించకుండా టీడీపీ కూటమి అడ్డుకోగలిగింది. వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తదితర టీడీపీ నేతలకు ఉన్న వ్యతిరేకత అందరికి తెలిసిందే. వారు గతంలో వలంటీర్ల పట్ల ఎంత నీచంగా మాట్లాడింది అందరికి గుర్తు ఉంది. కాకపోతే ఇప్పుడు రివర్స్ అయి తమ మెడకే చుట్టుకోవడంతో మాట మార్చి వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చెబుతున్నప్పటికీ జనం ఎవరూ నమ్మడం లేదు. దానికి తోడు వలంటీర్ల వ్యవహారంలో తమకు సంబంధం లేదని టీడీపీ ఆఫీస్ నుంచి ఒకటికి పదిసార్లు ప్రజలకు మెస్సేజీలు వెళుతున్నాయి. దానిని బట్టే వారు ఎంత కంగారు పడుతున్నది అర్ధం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ కూడా వలంటీర్ల వ్యవస్థపై వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం కూడా తప్పే అని చెప్పాలి. చంద్రబాబుకు వివిధ పార్టీలలో కోవర్టులు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. 2019 ఓటమి పాలయ్యాక చంద్రబాబు వెంటనే ప్లేట్ ఫిరాయించి బీజేపీకి జై కొట్టే పని పెట్టుకున్నారు. ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపిచారు. అయినా ఆ పార్టీ పెద్దలకు చంద్రబాబుపై నమ్మకం కుదరలేదు. ఆ తరుణంలో ఈడీ, ఐటీ దాడులు చేయడం, చంద్రబాబు పీఎస్ వద్ద రెండువేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సిబిటిడి ప్రకటించడం జరిగింది. దాంతో మరింతగా బీజేపీకి లొంగిపోయి ప్రధాని మోదీని పొగడడం ఆరంభించారు. తత్ఫలితంగా తనపై కేసులు ముందుకు వెళ్లకుండా చేసుకోగలిగారు. 2019 ఎన్నికలకు ముందు మోదీని, సీబీఐ, ఐటి, ఈడి వంటి వాటిని చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. ఎన్నికల తర్వాత గప్ చుప్ అవడమే కాకుండా బీజేపీ వారి ప్రాపకం కోసం నానా పాట్లు పడ్డారు. అందుకోసం పవన్ను ప్రయోగించారు. ఆయనను బీజేపీ చివాట్లు పెట్టింది. అయినా వదలకుండా ఎలాగైతే బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత చంద్రబాబు మళ్లీ యధా ప్రకారం తన కుట్రలకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని మూడు పార్టీల కూటమి ఓడించలేదన్న అభిప్రాయానికి వచ్చి, ఎన్నికల కమిషన్ ను కూడా తన ఆయుధంగా వాడుకోవాలని ఆలోచించి ఉండవచ్చని అంటున్నారు. ఇందుకోసం బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారిని ప్రయోగించారు. వారితో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పావుగా మార్చుకుని కధ ఆరంభించారు. ఆయనతో హైకోర్టులో కేసులు వేయించడం, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు పంపించడం, మరోవైపు బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా ఎక్కడ ఎవరికి చెప్పించాలో చెప్పించి ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెస్తున్నట్లు జనం నమ్ముతున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ పైన చంద్రబాబు 2019లో ఎలాంటి విమర్శలు చేసింది అందరూ చూశారు. అప్పటి సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కార్యాలయానికి వెళ్లి ఆయన రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై పలు ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎస్పిలను బదిలీ చేసింది. ఆ చర్యను తీవ్రంగా తప్పు పడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘాన్ని దుయ్యబట్టారు. అంతేకాక ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. అయినా ఫలితం దక్కకపోవడంతో వెంకటేశ్వరరావును బదిలీ చేయక తప్పలేదు. అసలు తొలుత కమిషన్ చెప్పినవారిని బదిలీ చేయడానికే ఆయన ఇష్టపడలేదు. దాంతో కమిషన్ సీరియస్ అయింది. ఇన్ని చేసినప్పుడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఎన్నికల కమిషన్లో నియంత కనిపించారు. మోదీనే కమిషన్ను నడిపిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తే దానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేసేవారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల కమిషన్ బదిలీలు చేస్తే అది గొప్ప విషయంగా ప్రొజెక్టు చేస్తున్నారు. దీనిని బట్టే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత నీచంగా మారాయన్నది తెలిసిపోతుంది. ఈనాడులో అయితే పేజీల కొద్ది కధనాలు ఇచ్చి తన శాడిజాన్ని ప్రదర్శించింది. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను వార్తగా ఇవ్వడం తప్పు కాదు. కానీ, బదిలీ అయినవారిపై విషం కక్కుతూ ఎన్నికలతో సంబంధం లేని అనేక విషయాలను వక్రీకరిస్తూ తన పైత్యాన్ని అంతటిని ఈనాడు మీడియా ప్రదర్శించి వికృతానందం పొందింది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ సభలో మైక్ పనిచేయకపోతే దానికి కొందరు పోలీసు అధికారులను బాధ్యుల్ని చేస్తూ, కేంద్రం వారిపై చర్య తీసుకోబోతోందని ఈనాడు ప్రచారం చేసింది. అది జరగలేదు. ఇప్పుడు తొమ్మిది మందిని బదిలీ చేస్తే శరభ శరభ అంటూ పూనకం వచ్చినట్లు రాస్తూ అధికారులను అవమానించింది. వారంతా ఇంగితం మర్చారని, అధికార వైఎస్సార్సీపీకి బంట్లుగా మారారని, తెలుగుదేశం బాకా పత్రికగా మారిన ఈనాడు ఆరోపించింది. విపక్షాలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే కమిషన్ తన అధికారాలను వినియోగించి ఈ చర్య తీసుకుందని ఆ పత్రిక పేర్కొంది. అంటే దీని అర్ధం ఏమిటి? ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ చేసుకోకుండా, విపక్షాల ఆరోపణలను ఆధారంగా చేసుకుని చర్య తీసుకున్నట్లే కదా!. ఇలా చర్య తీసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే కారణమని ఎవరైనా అంటే కాదనే పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. తిరుపతి కలెక్టర్ గా నియమితులైన లక్ష్మీ షా జనవరి 31 న జాయిన్ అయ్యారు. ఈనాడు దృష్టిలో ఆయన చేసిన తప్పు ఏమిటంటే టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకరరెడ్డిని కలవడమే. అంతకు మించి ఆయన చేసిన తప్పు ఏమీ లేదనే కదా!. విపక్షాలతో పాటు ఈనాడు వారు కోరుకున్నట్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై కేసు పెట్టలేదట. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండానే, రెండు నెలల వ్యవధిలోనే ఆయనను బదిలీ చేశారంటే ఏదో ఒత్తిడి లేదని ఎలా అనుకోగలుగుతాం?. లక్ష్మీ షా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సఫలం చేయడంలో కీలక పాత్ర పోషించినవారిలో ఒకరు. ఆ ద్వేషంతో కూడా టీడీపీ కూటమి ఆరోపణలు చేసి ఉండవచ్చు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై ఈనాడు ఎన్ని అసత్యాలు రాసిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధాని మోదీ సభ విఫలం అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ అయితే, దానినంతటిని ఎస్పీపై నెట్టివేసింది. వైఎస్సార్సీపీవారు అరాచకాలు సృష్టించారట. తెలుగుదేశం వారు అసలు ఏమీ చేయలేదట. ఎంత దారుణంగా రాసిందో చూడండి. ప్రధాని మోదీ సభలో మైక్ లు పనిచేయకపోవడం వల్లే ఎస్పీని బదిలీ చేశామని అదే కారణమని ఎన్నికల కమిషన్ చెప్పనే లేదు కదా!. పోనీ ఫలానా కారణమని కమిషన్ తెలిపిందా?. కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం తమ పైత్యం అంతటిని కలిపి విషం చిమ్మాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు మాజీ మంత్రి పేర్ని నాని చెప్పినట్లు వింటున్నారట. ఇలా ఈనాడు పత్రిక తనకు తోచినవన్నీ రాసేసి అధికార యంత్రంగాన్ని భయపెట్టడానికి యత్నించింది. అధికారులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పరు. కానీ, విపక్షాలు పాలించే రాష్ట్రాలలోనే ఇలా చేస్తుంటే కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనే విమర్శలు వస్తాయి. పశ్చిమబెంగాల్లో డీజీపీని మార్చిన వైనం విమర్శలకు దారి తీసింది. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కొందరు హోం శాఖ కార్యదర్శులను మార్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించినా, వారంతా ముఖ్యమంత్రుల కార్యాలయంతో పాటు మరోచోట పనిచేస్తున్నారని వెల్లడించింది. అంటే వారిపై ఎలాంటి అభియోగాలు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలపలేదు. ఏపీలో కొందరు అధికారులను బదిలీ చేయగానే వారిపై తెలుగుదేశం మీడియా నానా చెత్త అంతా రాశాయంటే ఇదంతా బ్లాక్ మెయిలింగ్ టాక్టీస్ అని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అధికారులు ఎవరైనా నిష్ఫక్షపాతంగా ఉంటే వారిని చెడగొట్టే లక్ష్యంతోనే టీడీపీ మీడియా ఇలా రాస్తోంది. అదే తాము కోరుకున్న అధికారి లేదా తమకు భయపడే అధికారి విశాఖలో ఉండి ఉంటే,తమకు సంబంధించిన మార్గదర్శి చిట్స్ సంస్థ అక్రమంగా రవాణా చేస్తున్న 51 లక్షల నగదును పట్టుకునే వారు కాదు కదా అన్నది ఈనాడు వారి ఉద్దేశం కావచ్చు. రామోజీరావు, రాధాకృష్ణల పిచ్చి కాకపోతే అధికారులే ఓట్లు వేయించే పరిస్థితి ఉంటే చంద్రబాబు ఎప్పటికి ఓడిపోయేవారు కాదు కదా! ముఖ్యమంత్రి జగన్ నమ్ముకుంది జనాన్ని కానీ.. అధికార యంత్రాంగాన్ని కాదన్న సంగతి ఆయన చేస్తున్న బస్ యాత్రలను బట్టే తెలుస్తుంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
April 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 2nd Telugu Updates 8:39 PM, April 2nd 2024 నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా పేదలంతా ఉన్నారు: కనుమూరి రవి చంద్రారెడ్డి చంద్రబాబు 100 తలలు ఉన్న రాక్షసుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా చేసి అవ్వా, తాతల ఉసురుతో పాటు కిడ్నీ బాధితుల ఉసురు కూడా చంద్రబాబు పోసుకుంటున్నాడు రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్ దారుల ఓట్లు పోయాయని చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు భయం పట్టుకుంది పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేస్తే జన్మభూమి కమిటీలను తీసుకొస్తాడు 8:00 PM, April 2nd 2024 పార్వతీపురం మన్యం జిల్లా: సంక్షేమం గ్రామాల్లో ఉండాలంటే మళ్లీ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: వైవీ సుబ్బారెడ్డి పార్వతీపురం లో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మీ ప్రాంతాల్లో ప్రజాదరణ కలిగిన నాయకులను అభ్యర్థలను ఎంపిక చేయడం జరిగింది. నేటి వరకు గడిచిన వైఎస్సార్సీపీ పాలన ప్రతి ప్రాంతంలో ప్రజలు సంక్షేమ పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంతే సంక్షేమం గ్రామంల్లో ఉండాలి అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి వైఎస్సార్సీపీ శ్రేణులు గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయ్యాలి మన ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ నాణ్యత గల విద్యా, వైద్యం అందించడం జరిగింది దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఐదు లక్షల వరకు ఆరోగ్యానికి భరోసా కల్పించారు మరి ఆయన తనయుడు సీఎం జగన్ 25 లక్షల రూపాయలు వరకు ఉచిత వైద్యం కోసం పథకాన్ని నిర్వహించారు. గడిచిన 58 నెలలుగా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1540 కోట్ల రూపాయలను పార్వతీపురం నియోజకవర్గంలో 1 లక్ష 54 వేల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఒక్క పార్వతీపురంలో 45 వేల మంది అవ్వ,తాతలు ఫించన్ లబ్ధిదారులు ఉన్నారు 5:50 PM, April 2nd 2024 పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది: మదనపల్లె మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తాడంట ఇది 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్ సిటీ కనబడుతుందా? ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. ప్రతీ గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం మ్యానిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం. విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో.. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను 5:30 PM, April 2nd 2024 కాకినాడ: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలు చేసే చంద్రబాబును ప్రజలు బహిష్కరించాలి చంద్రబాబువి కుట్ర,కుతంత్ర రాజకీయాలు పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా గతంలో అడ్డంకులు సృష్టించాడు ఇవాళ వాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఫించన్ అందకుండా చేశాడు 5:00 PM, April 2nd 2024 విశాఖ: వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్ వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్ టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్ టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్ 4:40 PM, April 2nd 2024 తాడేపల్లి : వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు టిప్పర్ డ్రైవర్లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష? ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి? ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు? చంద్రబాబు బతుకు చెడ జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు 4:30 PM, April 2nd 2024 కుప్పం(చిత్తూరు జిల్లా): వాలంటీర్లపై నిందలు వేస్తూ, వేధిస్తున్నారు : ఎంపీ రెడ్డప్ప కుప్పం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు వాలంటీర్లు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ కొట్టుకు పోవడం ఖాయం మేము ఉన్నా లేకపోయినా, వాలంటీర్లే రాష్ట్ర భవిష్యత్తు వృద్ధులకు, పేద ప్రజలకు చేదోడు వాదోడుగా వాలంటీర్లు వాలంటీర్ల నుండి పెన్షన్ ఇవ్వకుండా చేసింది చంద్రబాబు చంద్రబాబు ఓడిపోతాడనీ సర్వేల్లో తేలిపోయింది మే 13 న జరిగే ఎన్నికల్లో భరత్ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం కుప్పంలో జరిగే గంగమ్మ జాతరకు చంద్రబాబు ఎప్పుడైనా వచ్చారా? మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మాకు పోటీ కాదు 4:00 PM, April 2nd 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం రోలుపడి గ్రామ వాలంటీర్లు 18 మంది రాజీనామా ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేసిన వాలంటీర్లు 2:55 PM, April 2nd 2024 ఢిల్లీ: ఏపీ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కడప లోక్సభ నుంచి షర్మిల పోటీ కాకినాడ నుంచి పల్లంరాజు రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు బాపట్ల నుంచి జేడీ శీలం కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ వీటితో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 1:50 PM, April 2nd 2024 ఎన్నికల కోసం అబ్జర్వర్ల నియామకం ఏపీలో ఎన్నికల నిర్వహణ కోసం అబ్జర్వర్లను నియమించిన సీఈసీ. జనరల్ స్పెషల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాంమోహన్ మిశ్రా. పోలీసు స్పెషల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా. 1:35 PM, April 2nd 2024 అవనిగడ్డ జనసేనలో కుంపట్లు అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారా? జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు 1:15 PM, April 2nd 2024 అవ్వాతాతల దెబ్బకు బాబు అబ్బా అంటాడు: కొండా రాజీవ్ చంద్రబాబు హాయంలో పెన్షన్ డబ్బుల కోసం ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి కష్టం లేకుండా పెన్షన్ అందించారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక బాబు అండ్ బ్యాచ్ పేదలపై కక్ష తీర్చుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్తో బాబు శిఖండి ఆట ఆడుతున్నాడు. వాలంటీర్లను చూస్తే బాబుకి వెన్నులో వణుకు పుడుతుంది. చంద్రబాబు బుద్ది ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది. పెన్షన్ రాకుండా ఆపిన బాబు.. ఇప్పుడు సకాలంలో పెన్షన్ ఇవ్వాలని దొంగ ఏడుపు నటిస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే ఎన్నికల సంగ్రామంలో తేల్చుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అవ్వా తాతలు కొట్టే దెబ్బ.. చంద్రబాబు అబ్బా అంటాడు. 12:50 PM, April 2nd 2024 చంద్రబాబు షాడో నిమ్మగడ్డ రమేష్: ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు షాడో. చంద్రబాబు పెన్షనర్ల ఉసురు పోసుకుంటున్నాడు. ఒకటో తేదీన పెన్షన్ ఠంచనుగా వస్తుందని వారంతా ఆనందంగా ఉండేవారు. పెన్షన్ అందకుండా చేసినందుకు ప్రజలు చంద్రబాబుని ఛీ కొడుతున్నారు. ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు 67 లక్షల మంది పెన్షనర్ల ఉసురు తగిలి పోతాడు. చంద్రబాబు, పవన్, లోకేష్లకు డిపాజిట్లు కూడా రావు. నేను ఇంకా మాట్లాడితే బూతులు వస్తాయి. 12:30 PM, April 2nd 2024 పోటీకి కాంగ్రెస్ సీనియర్ల వెనకడుగు.. ఏపీ కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్.. ఎన్నికల్లో పోటీకి సీనియర్ల వెనకడుగు ఏపీ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ల విముఖత పోటీ చేయనంటున్న రఘువీరారెడ్డి, కేవీపీ బలవంతంగా పల్లం రాజు, గిడుగు రుద్ర రాజులను బరిలోకి దింపుతున్న అధిష్టానం కనీసం డిపాజిట్ రాకపోతే పార్టీలో పరువు పోతుందని ఆవేదన ఓడిపోయే దానికి మమ్మల్ని ఎందుకు బలి చేస్తారంటున్న సీనియర్లు మమ్మల్ని పోటీ నుంచి తప్పించాలని హై కమాండ్ పెద్దలను వేడుకుంటున్న సీనియర్లు 12:00 PM, April 2nd 2024 జనసేనకు ఫ్రీ సింబల్గా గ్లాసు గుర్తు కేటాయింపు.. ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు గుర్తు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే జనసేన గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపులేని పార్టీల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైఎస్సార్సీపీ, టీడీపీ. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన. వైఎస్సార్సీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తులను ప్రకటించిన ఈసీ. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు. 11:15 AM, April 2nd 2024 పేదల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: వెల్లంపల్లి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సీఎం జగన్ను గెలిపిస్తారు. ఇంటికి వచ్చే పెన్షన్ని దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్ పేద ప్రజల మీద కక్ష కట్టారు. సుమారు 65 లక్షల మంది పెన్షన్లను ఎల్లో టీమ్ నిలిపివేశారు. పెన్షన్దారులు చంద్రబాబు అండ్ టీమ్కి బుద్ధి చెప్పేందుకు సిద్ధం. వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంటి వద్దకు పెన్షన్ ఏ విధంగా పంపిస్తారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టావా?. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లన్నీ ఎత్తివేసి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇస్తారంట. ఇలాంటి దుర్మార్గులకి ఓటు ఎందుకు వేయాలి. జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ సానుభూతిపరులకే పెన్షన్లు ఇస్తారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు. బుద్దా వెంకన్న, పోతిన మహేష్, వర్ల రామయ్యకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం. టీడీపీ అధికారంలోకి రావడం కలగా మిగిలిపోతుంది నారా లోకేష్ ప్రజల పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో నారా లోకేష్తో పనిలేదు. జనసేన కార్యకర్తలను, నాయకులను పవన్ మభ్యపెడుతున్నాడు. పవన్ మాటలకు పొంతనే ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సొంతిల్లు అయినా ఏర్పాటు చేసుకో. పవన్ గతంలో పాచిపోయిన లడ్డులు అని మోదీ కాళ్లు పట్టుకున్నాడు. మీ కన్న తల్లిని తిట్టిన వారితో నువ్వు పొత్తు పెట్టుకుని పల్లకీ మోస్తున్నావ్. వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. పేదల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. 10:40 AM, April 2nd 2024 వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ, టీడీపీ నేతలు చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో చేరికలు. వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ సీరియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి. వైఎస్సార్సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం.గంగాధర్. 10:15 AM, April 2nd 2024 చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారు: అల్లు భానుమతి వాలంటీర్లు ఎవరో బయట వారు కాదు. మన కుటుంబం నుంచి వచ్చిన వారే వాలంటీర్. వాలంటీర్ల సేవలను అడ్డుకుంటున్న చంద్రబాబుకి ప్రజలు బుద్ది చెబుతారు. ఉత్తరాంధ్ర నుంచి కూటమి అభ్యర్థుల్లో చాలా మంది నాన్ లోకల్స్ ఉన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ స్థానిక నేతలకు అవకాశం కల్పించింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 9:30 AM, April 2nd 2024 టీడీపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: దేవినేని అవినాష్ సీఎం జగన్ ఐదేళ్ల పాలనను ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలు అందుకున్నాం అని ప్రతీ ఒక్కరూ అంటున్నారు మళ్లీ మా ఓటు జగన్కే అని ప్రజలు అనటం సంతోషాన్నిచ్చింది టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికీ అవ్వతాతలకు పెన్షన్ అందలేదు టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కనుసన్నలలోనే పథకాలు ఇస్తామని లోకేష్ అనటం బాధాకరం కుల మతాలకు అతీతంగా పథకాలు అమలు చేశాం. టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడూ ప్రజల కష్టాలు తీర్చిన దాఖలా లేదు సీఎం జగన్ సహకారంతో రూ.650కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైఎస్సార్సీపీ నాయకులు, వాలంటీర్లు మాత్రమే 8:30 AM, April 2nd 2024 మనం చెప్పిన వాళ్లకే పథకాలివ్వాలి: నారా లోకేష్ అధికారం లేకున్నా లోకేష్ బెదిరింపులు. వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలని బెదిరింపులు. మనం చెప్పిన వాళ్లకే పథకాలు ఇవ్వాలని కామెంట్స్ .@JaiTDP అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలి. మనం చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలి అంటున్న లోకేష్.#TDPAgainstVolunteers #EndOfTDP pic.twitter.com/kRy3qhftdx — YSR Congress Party (@YSRCParty) April 1, 2024 8:00 AM, April 2nd 2024 పచ్చ బ్యాచ్పై వాలంటీర్ల ఆగ్రహం.. చంద్రబాబు బ్యాచ్ కుట్రలపై వాలంటీర్ల మనోవేదన మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్న వాలంటీర్లు నిన్న మచిలీపట్నం, తాడిపత్రిలో పెద్ద ఎత్తున రాజీనామాలు మచిలీపట్నంలోనే ఏకంగా 1227 మంది రాజీనామా తమను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచటంపై ఆగ్రహం పెన్షన్ల కోసం వృద్దులు, వికలాంగులు ఫోన్లు చేస్తున్నాంటూ ఆవేదన 7:00 AM, April 2nd 2024 21 కాదు.. 11.. పేరు జనసేనది.. పోటీ టీడీపీనే.. పేరే జనసేనది.. పోటీచేసేది టీడీపీనే అంటున్న జనసేన శ్రేణులు ఇవి చంద్రబాబు–పవన్కళ్యాణ్ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు జనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలో.. వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరిక తాజాగా.. అవనిగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టికెట్లు కైవసం గత ఎన్నికల్లో పోటీచేసిన.. లేదా గత ఐదేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలు బీజేపీకి కేటాయించిన పది సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటూ కమలదళంలో చర్చ 6:50 AM, April 2nd 2024 తిరుగుబాటుతో తత్తరపాటు.. అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు.. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు నిమ్మగడ్డ – బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్ సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘ఈనాడు’ రోత కథనాలు గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్ లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు 6:40 AM, April 2nd 2024 టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు 6:30 AM, April 2nd 2024 చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు ఐదారు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా? పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు? వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా? నిమ్మగడ్డ రమేష్కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు ఎన్టీఆర్ను కూలదోసింది ప్రజలకు తెలియదా? చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు -
కూటమిలో వేరు కుంపట్లు
సాక్షి, పుట్టపర్తి: జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి వరదాపురం సూరి? బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్ను వై. సత్యకుమార్కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ‘స్వతంత్రం’గా పరిపూర్ణానందస్వామి.. హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు. ప్రచారానికి శ్రీరామ్ దూరం? ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ప్రచారం చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత గెలుపు కోసం బిజీబిజీగా గడపాల్సి ఉందని.. ఇతర పార్టీ నేతల గెలుపు కోసం తానెందుకు సమయం వృథా చేసుకోవాలని తన అనుచరుల వద్ద శ్రీరామ్ చర్చించినట్లు సమాచారం. అలాగే.. జనసేన నేత చిలకం మధుసూదన్రెడ్డి కూడా సత్యకుమార్కు మద్దతిచ్చే పరిస్థితి కనిపించలేదు. కదిరిలో అంటీముట్టనట్లుగా విష్ణు.. ఇక కూటమి నిర్ణయాలు తనను నిరాశపరిచాయని కదిరి బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయకపోవచ్చని సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి.. అక్కడ బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ.. కలిసి పోటీచేయాలన్న లక్ష్యంతో టీడీపీ–బీజేపీ –జనసేన కూటమిగా ఏర్పడినా.. పుట్టపర్తిలో మాత్రం ఆ దిశగా ఆయా నాయకులు ముందుకెళ్లడంలేదు. అక్కడ జనసేన నాయకుల అడ్రస్లేదు. బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో కనిపించని పరిస్థితి. కేవలం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగం మాదిరిగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నట్లు ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు. -
శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న గొండు శంకర్ను మార్చి, గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం క్యాడర్ ఆల్టిమేటం జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసానికి చేరుకొని వారితో సమావేశమయ్యారు. అనంతరం క్యాడర్తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు గుండ దంపతులను తీసుకొని రమ్మన్నారని ఆ విషయాన్ని వారిద్దరికీ వివరించారు. దీనికి గుండ దంపతులు స్పందిస్తూ చంద్రబాబుతోనే మాట్లాడుతామని, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్తోనైతే మాట్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబునాయుడును కలిసేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. దీనిపై నగర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏది ఏమైనా శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్ లక్ష్మీదేవికి కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన 50 డివిజన్లలో 45 డివిజన్లకు చెందిన ఇన్చార్జులంతా గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. రెండేళ్లుగా క్రమశిక్షణ తప్పిన అసమ్మతి నేతకు టిక్కెట్ కేటాయించడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పరిస్థితిని చంద్రబాబునాయుడుకు వివరించి లక్ష్మీదేవికి టిక్కెట్ వచ్చేలా చూడా లని కోరారు. దీనికి సమాధానంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మీ ఆవేదన తనకు అర్థమైందని చంద్రబాబు వద్దకు గుండ దంపతులను తీసుకెళ్లడం వరకే తన బాధ్యతని వివరించారు. టికెట్ ఇస్తే గుండకే ఇవ్వాలని, యూత్ కోటా అనుకుంటే వారి కుమారుడికి ఇవ్వాలే తప్ప గొండు శంకర్కి కన్ఫర్మ్ చేస్తే తాము ఒప్పుకోబోమని కార్యకర్తలు అన్నారు. -
ఇటు పేదల సైన్యం.. అటు పెత్తందార్ల పటాలం
సాక్షి, అమరావతి: పేదల పక్షాన ఎవరు? పెత్తందారులకు కొమ్ము కాస్తోంది ఎవరనేది ఎన్నికల సాక్షిగా స్పష్టంగా తేలిపోయింది. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షాన నిలిస్తే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పెత్తందార్ల వైపు నిలిచింది. రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ నియోజకవర్గాలు వెరసి 200 స్థానాలకుగానూ సగం అంటే వంద సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ కేటాయించడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన 36 శాసనసభ, ఐదు లోక్సభ వెరసి 41 స్థానాలను మినహాయిస్తే మిగతా 159 శాసనసభ, లోక్సభ జనరల్ స్థానాల్లో 59 చోట్ల (48 శాసనసభ, 11 లోక్సభ) బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులను సీఎం జగన్ బరిలోకి దించారు. అంటే జనరల్ స్థానాల్లో దాదాపు 40 శాతం సీట్లను బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 159 జనరల్ స్థానాలకుగానూ కేవలం 35 స్థానాల్లో(31 శాసనసభ, 4 లోక్సభ) మాత్రమే బీసీలకు అవకాశం కల్పించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను ఖరారు చేసిన జనరల్ స్థానాలను పరిగణనలోకి తీసుకున్నా బీసీలకు కేవలం 37 స్థానాలను (33 శాసనసభ, 4 లోక్సభ) మాత్రమే కేటాయించారు. కూటమి కేవలం 23 శాతం స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. సేవే పరమావధిగా జనబలమే గీటురాయిగా నిజాయితీ, నిబద్ధత, విధేయత కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు సీఎం జగన్ పట్టంగట్టారు. మరోవైపు చంద్రబాబు యథాప్రకారం కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకు పెద్దపీట వేశారు. అదే ఒరవడితో... నామినేటెడ్ పనులు, పదవుల్లో ఆయా వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి మరీ రాజకీయ సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్ అదే ఒరవడిని కొనసాగిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో సగం సీట్లను వారికి కేటాయించారు. రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేని బీసీలకు 48 శాసనసభ, 11 లోక్సభ వెరసి 59 స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని సీఎం జగన్ సంచలనం సృష్టించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. అందులోనూ ఉపాధి కూలీ ఈర లక్కప్ప (మడకశిర), టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు (నెల్లూరు), బంగారు నగల తయారీ కార్మికుడు ఖలీల్ అహ్మద్(నెల్లూరు సిటీ), సర్నాల తిరుపతిరావు (మైలవరం), సాధారణ న్యాయవాది గూడూరు ఉమాబాల (నరసాపురం) లాంటి సామాన్యులను బరిలోకి దించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో ఆవిర్భవించిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, బీసీ నేతలు నాయకత్వం వహిస్తున్న సమాజ్వాది పార్టీ(అఖిలేష్ యాదవ్), ద్రవిడ మున్రేట్ర కజగం (తమిళనాడు సీఎం స్టాలిన్) సైతం ఈ స్థాయిలో బడుగు, బలహీన వర్గాలకు సీట్లను కేటాయించిన దాఖలాలు లేవు. మరోసారి ద్రోహం.. సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికి మార్గనిర్దేశం చేస్తూ ఆదర్శంగా నిలవగా రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి ఓటుకు కోట్లు వెదజల్లిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి మాత్రం యథాప్రకారం సామాజిక ద్రోహానికి పాల్పడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అరకొరగా కేటాయించడంతోపాటు మిగతా చోట్ల రూ.కోట్లకు కోట్లు కుమ్మరించే ఆర్థిక నేరగాళ్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలనే చంద్రబాబు బరిలోకి దించారు. 2014 తరహాలోనే తాజాగా మరోసారి జనసేన–టీడీపీతో జతకట్టిన చంద్రబాబు 144 శాసనసభ, 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ 21 శాసనసభ, రెండు లోక్సభ స్థానాల్లో జనసేన, పది శాసనసభ, 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేలా పొత్తు లెక్కలు తేల్చారు. ఈ కూటమి ఇప్పటిదాకా 156 శాసనసభ, 20 లోక్సభ వెరసి 176 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 78 స్థానాలను మాత్రమే కేటాయించింది. ఇందులో 31 శాసనసభ, నాలుగు లోక్సభ వెరసి 35 స్థానాల్లో మాత్రమే చంద్రబాబు బీసీలకు అవకాశం ఇచ్చారు. మరో మూడు నాలుగు సీట్లకు మించి ఆ వర్గాలకు కేటాయించే అవకాశం లేదని కూటమి నేతలే చెబుతుండటం గమనార్హం. నినాదం కాదు విధానమే.. 58 నెలలుగా సామాజిక న్యాయం అంటే నినాదం కాదు అమలు చేయాల్సిన విధానమని ప్రతి అడుగులో చాటిచెబుతున్న సీఎం జగన్ సార్వత్రిక ఎన్నికల్లో మరో అడుగు ముందుకేశారు. ఈనెల 16వతేదీన ఒకేసారి 175 శాసనసభ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 29 స్థానాల్లో ఎస్సీ, ఏడు స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించారు. అంటే 84 శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు. 25 లోక్సభ స్థానాలకుగానూ 11 చోట్ల బీసీలకు సీట్లు ఇచ్చిన సీఎం జగన్ నాలుగు స్థానాల్లో ఎస్సీలకు, ఒక చోట ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు. సీఎం జగన్ ప్రకటించిన అభ్యర్థుల్లో అత్యధికులు సామాన్యులే ఉన్నారు. పెత్తందార్లకు బాబు పెద్దపీట.. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ ఆ వర్గాల ప్రజల పుట్టుకను అవహేళన చేసిన చంద్రబాబు, హామీలను నిలబెట్టుకోవాలని వేడుకున్న బీసీలను తోకలు కత్తిరిస్తా, తాటతీస్తానంటూ బెదిరించారు. బలహీన వర్గాలకు చెందిన వారు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఆ వర్గాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరిన మైనార్టీ యువకులపై దేశద్రోహం కేసులు బనాయించి కటకటాల పాలుచేసి ఆ వర్గాలను అణగదొక్కారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఆ వర్గాలకు ద్రోహం చేసి పెత్తందార్లకే పెద్దపీట వేశారు. ► టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఇప్పటిదాకా 156 శాసనసభ స్థానాలకు (టీడీపీ 138, జనసేన 18) అభ్యర్థులను ప్రకటించగా బీసీలకు 33 (టీడీపీ 31, జనసేన 2), ఎస్సీలకు 27 (టీడీపీ 24, జనసేన 3), ఎస్టీలకు 6 (టీడీపీ 5, జనసేన 1), మైనార్టీలకు 3 సీట్లను కేటాయించారు. అంటే ఆ వర్గాలకు మొత్తం 69 శాసనసభ స్థానాలను కేటాయించారు. టీడీపీ ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించడం గమనార్హం. ► కూటమి ఇప్పటిదాక 25 లోక్సభ స్థానాలకుగానూ 20 స్థానాల్లో (టీడీపీ 13, బీజేపీ 6, జనసేన 1) అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో బీసీలకు 4 (టీడీపీ), ఎస్సీలకు 4 (టీడీపీ 3, బీజేపీ 1), ఎస్టీలకు ఒకటి (బీజేపీ) కేటాయించారు. ► శాసనసభ, లోక్సభ రెండూ కలిపి బీసీలకు 59 సీట్లను సీఎం జగన్ కేటాయించగా చంద్రబాబు కేవలం 35 స్థానాల్లో మాత్రమే వారికి పోటీకి అవకాశం కల్పించడం గమనార్హం. మైనార్టీలకు సీఎం జగన్ 7 శాసనసభ స్థానాల్లో అవకాశం ఇచ్చి ఆదరిస్తే చంద్రబాబు మూడు స్థానాలకే పరిమితం చేశారు. ► ఎన్నికల్లో కోట్లకు కోట్లు కుమ్మరించే కాంట్రాక్టర్లు అమిలినేని సురేంద్రబాబు (కళ్యాణదుర్గం నియోజకవర్గం), ఎన్నారైలు పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు లోక్సభ), వెనిగండ్ల రాము (గుడివాడ), కాకర్ల సురేష్ (ఉదయగిరి నియోజకవర్గం), వ్యాపారులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ), కేశినేని చిన్ని (విజయవాడ), ఎం.భరత్ (విశాఖ లోక్సభ), చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), వెలగపూడి రామకృష్ణ (విశాఖ ఈస్ట్), జూలకంటి బ్రహ్మారెడ్డి (మాచర్ల) లాంటి నేర చరిత్ర కలిగిన వారిని చంద్రబాబు బరిలోకి దించి తాను పెత్తందార్లకే కొమ్ము కాస్తానని మరోసారి నిరూపించుకున్నారు. సామాజిక ప్రయాణం.. గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాలనలో ప్రతి అడుగులోనూ చాటిచెబుతున్నారు. మంత్రివర్గంలో ఏకంగా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వగా రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల పదవుల్లో సింహభాగం ఆయా వర్గాలకే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఆయా వర్గాలకే రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు, పనులు దక్కేలా చర్యలు తీసుకున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీతో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చగా ఇందులో సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ప్రయోజనం పొందారు. సీఎం జగన్ ఒకవైపు పరిపాలనలో భాగస్వామ్యం మరోవైపు ఆర్థిక చేయూతనిస్తుండటం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలు సామాజిక సాధికారత సాధించేందుకు బాటలు వేసింది. ఇది ఆయా వర్గాల ప్రజల్లో సీఎం జగన్ నాయకత్వం పట్ల విశ్వసనీయత మరింత పెరిగేందుకు దోహదం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలు సీఎం జగన్ వెంటే నడుస్తున్నారని భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు చాటిచెప్పాయి. మరోవైపు సామాజిక ద్రోహం తలపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి నిరాదరణ ఎదురవుతోంది. టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక ఆ రెండు పార్టీలూ ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు, బీజేపీతో జత కలిశాక మూడు పార్టీలు చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలు ప్రజలు లేక పేలవంగా సాగడమే ఇందుకు నిదర్శనం. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం మరోసారి సృష్టించడం ఖాయమని సిద్ధం సభలు తేల్చి చెప్పగా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఘోర పరాజయం తథ్యమని తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట సభలు నిరూపించాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయాన్ని నమోదు చేయడం ఖాయమని టైమ్స్ నౌ–ఏటీజీ, జీన్యూస్–మారిటైజ్ లాంటి డజనుకు పైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది. వీటిని పరిశీలిస్తే వచ్చే ఎన్నికలు ఏక పక్షమేనని, వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఎంపికపై కూటమి మల్లగుల్లాలు కూటమితో జతకట్టిన చంద్రబాబు జనసేనకు 21, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు పోగా మిగతా 144 శాసనసభ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేలా పొత్తు కుదుర్చుకున్నారు. రెండు లోక్సభ స్థానాలను జనసేనకు, ఆరు లోక్సభ స్థానాలను బీజేపీకి కేటాయించగా మిగతా 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకూ 138 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా మరో ఆరు స్థానాలపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. 18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కుస్తీ పడుతున్నారు. 13 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయగా మిగతా నాలుగు చోట్ల చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారు. తనకు కేటాయించిన ఆరు లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు కేటాయించిన రెండు లోక్సభ స్థానాల్లో కాకినాడకు అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎంపీ సీటుపై తర్జన భర్జన పడుతున్నారు. -
టీడీపీలో ట్విస్ట్: అభ్యర్థులకు షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు షాకిచ్చారు. రానున్న 25 రోజుల్లో వారి పని తీరుపై సర్వేలు జరిపి అంచనా వేస్తానని బాబు చెప్పుకొచ్చారు. సర్వేల్లో అనుకూల ఫలితాలు రాకపోతే పార్టీ ఆఫీసు నుంచి ఫోన్లు వస్తాయని.. పరోక్షంగా అభ్యర్థి మార్పు కూడా ఉండొచ్చని సంకేతాలిచ్చారు. కాగా, టీడీపీ అభ్యర్థులకు నేడు విజయవాడలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో సీటు రాని వారంతా కేవలం త్యాగం చేశారు అంతే. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నాం. ఏకైక అభిప్రాయంతో జనసేన ముందుకు వచ్చింది. పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు. జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి పొత్తులో భాగంగా టీడీపీలో 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం. సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు. మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం. రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం. అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది. సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం ఎప్పటకీ ఉంటుంది. నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థులకు షాకిచ్చారు. టిక్కెట్ దక్కిందని సంబురపడకండి. రానున్న 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను. సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక, చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం చోటుచేసుకుంది. మరోవైపు, జనసేన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి. ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం అని అన్నారు. దీంతో, నాందెడ్ల వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. -
పురంధేశ్వరి రాజకీయ క్రీడ.. బీజేపీ సీనియర్కు షాక్!
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పొత్తుల్లో భాగంగా అసలు బీజేపీ నేతలకు బిగ్ షాక్లు తగులుతున్నాయి. తాజాగా సీట్ల కేటాయింపులో బీజేపీ సీనియర్ నేత జీవీఎల్కు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు, పురంధేశ్వరి ఆడుతున్న ‘ఫ్యామిలీ’ రాజకీయ క్రీడలో జీవీఎల్కు నిరాశే ఎదురైంది. కాగా, ఏపీ కూటమిలో సీట్ల కేటాయింపుల్లో భాగంగా చంద్రబాబు, పురంధేశ్వరి ప్లానే వర్క్ అవుట్ అవుతోంది. చంద్రబాబు సూచనలనే పురంధేశ్వరి కూడా అమలు చేస్తున్నారు. చంద్రబాబు మాటను తూచా తప్పకుండా పురంధేశ్వరి అమలు చేస్తున్నారు. స్థానిక ఒరిజినల్ బీజేపీ నేతల మాటలను రాష్ట్ర బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో, వారికి భంగపాటే ఎదురవుతోంది. తాజాగా మరోసారి పురంధేశ్వరి తన పంతం నెగ్గించుకున్నారు. బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహరావును కాదని విశాఖ సీటును టీడీపీ ఇచ్చేందుకే అంగీకరించారు పురంధేశ్వరి. అయితే, ఈరోజు టీడీపీ పార్లమెంట్ స్థానాలకు గాను చంద్రబాబు 13 మంది అభ్యర్థుల బాబితాను విడుదల చేశారు. ఇందులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని బాలకృష్ణ అల్లుడు భరత్కు కేటాయించారు. ముందు నుంచీ విశాఖ సీటు తనకే వస్తుందనే నమ్మకంతో నిన్నటి వరకు జీవీఎల్ ప్రచారం కూడా చేసుకున్నారు. ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగారు. కానీ, ఊహించని విధంగా చంద్రబాబు రాజకీయ క్రీడలో జీవీఎల్కు నిరాశే ఎదురైంది. ఇక, జీవీఎల్కు సీటు ఇవ్వకపోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురంధేశ్వరి వల్లే విశాఖ సీటు టీడీపీ వెళ్లిందని ఆరోపిస్తున్నారు. ఏలూరు స్ధానంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేత గారపాటి చౌదరికి నిరాశే ఎదురైంది. ఏలూరు ఎంపీ స్ధానాన్ని యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్కి ఇచ్చిన చంద్రబాబు. అలాగే, హిందూపూర్ స్ధానం కోసం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఆశలు గల్లంతే అయ్యాయి. హిందూపూర్ పార్లమెంట్ స్ధానాన్ని పరిపూర్ణానందస్వామికి ఇవ్వాలని ఆర్ ఎస్ఎస్, వీహెచ్పీ విజ్ణప్తులని చంద్రబాబు పట్టించుకోలేదు. హిందూపూర్ స్ధానంలో టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారధిని ప్రకటించారు. టీడీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా ఇదే.. -
పొత్తు పార్టీల నేతల మధ్య పోట్లాటలు చెయ్యి దాటిపోయినా ఆ స్థానాలు
-
చంద్రబాబు అత్యుత్సాహం.. పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిచిన హైకమాండ్!
సాక్షి, విజయవాడ: కూటమి ఏర్పాటు నేపథ్యంలో ఏపీ బీజేపీలో రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు పంచాయితీ పెట్టారు. ఇక, తాజాగా సీట్ల పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు ఢిల్లీ పెద్దలను కలవడం హాట్ టాపిక్గా మారింది. కాగా, ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు కోరిన సీట్లను కాకుండా రెండున్నర దశాబ్దాలుగా టీడీపీ ఓడిపోయిన సీట్లను చంద్రబాబు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పారు. బీజేపీ సీట్లపై చంద్రబాబు పెత్తనం ఏంటి? పార్టీ సీనియర్ నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా శివప్రకాష్ జీని కలిసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. ఏపీ బీజేపీ సీనియర్ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. బీజేపీ నేతల ఫిర్యాదు కారణంగానే పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇదే సమయంలో, నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ పెద్దలు పురంధేశ్వరితో ఏపీలో రాజకీయ పరిణామాలు, టికెట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. -
వాడిపోతున్న 'పొత్తు' తిరుగుడు పూలు
సత్యవేడు(తిరుపతి జిల్లా)/మదనపల్లె/ఉప్పలగుప్తం/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/కపిలేశ్వరపురం(మండపేట)/కందుకూరు/సాక్షి,అమలాపురం: మండుతున్న ఎండలకు తోడు ఎన్డీఏ కూటమిలో సీట్ల చిచ్చు ఎగసిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలకు నిరసన సెగ తగులుతోంది. కార్యకర్తలు రోడ్డెక్కి మరీ అధిష్టానాల తీరును ఎండగడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆయా పార్టీలు కిందామీదా పడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీస్థానంలో టీడీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను తమపై రుద్దవద్దని తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సత్యవేడులోని బేరిశెట్టి కల్యాణ వేదికలో సమావేశం పెట్టి మరీ అభ్యర్థిని మార్చాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తమను ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టిన ఆదిమూలంతో కలిసి పనిచేయలేమని తెగేసిచెప్పారు. ► అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఏడాదిక్రితం టీడీపీలో చేరిన వ్యక్తికి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ నాయకత్వంలో అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్లోని ఆయన స్వగృహంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రధాన నాయకులంతా సోమవారం రహస్యంగా సమావేశమయ్యారు. మెజార్టీ వర్గాలను కాదని మైనార్టీకి సీటు ఇవ్వడం తగదని పేర్కొన్నారు. తమలో ఎవరు ఒకరం పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ ఇన్చార్జ్ దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కో–కనీ్వనర్ గంగారపు రాందాస్చౌదరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భగవాన్ పాల్గొన్నారు. ► విశాఖ దక్షిణం జనసేనలో సీటు చిచ్చురేగింది. పార్టీ ప్రకటించకుండా తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్పై 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాధిక్, దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న నాయకులకు పార్టీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంశీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరారని, స్థానికేతరులను ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజు, మత్స్యకార నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్లో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని కోరారు. ► అమలాపురం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గొల్లవిల్లి, ఉప్పలగుప్తం ప్రధాన సెంటర్లలో కంచాలపై గరిటెలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీకి కేటాయిస్తే తాము సహకరించబోమని హెచ్చరించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో 43 గ్రామాలు ఉండగా.. దాదాపు 30 గ్రామాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయని జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేటలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తమకు సరైన ప్రాధాన్యం ఇస్తామని పవన్ నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టీడీపీకి సహకరిస్తామని స్పష్టం చేశారు. లీలాకృష్ణకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ► కందుకూరు టికెట్ను టీడీపీ ఇంటూరి నాగేశ్వరరావుకు కేటాయించడంతో ఆ పార్టీ అసమ్మతి నేత ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆత్మీయ సమావేశం పేరుతో బలప్రదర్శనకు దిగారు. పార్టీ కష్టకాలంలో ఉండగా అండగా నిలిచానని, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఎవరూ ముందుకు రాకపోతే తాను అండదండలు అందించి అభ్యర్థులను నిలబెట్టానని పేర్కొన్నారు. టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి ప్రచారం చేపట్టి తన బలమేమిటో పార్టీ అధిష్టానానికి చూపిస్తానని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, శివరాంల మద్దతూ తనకే ఉందని రాజేష్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. మిత్రపక్షాల్లో అసహనం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఎవరనే విషయాన్ని టీడీపీ తేల్చడం లేదు. ఇది తేలితేనే కానీ అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రానుంది. దీంతో మిత్రపక్షాల్లో అసహనం వ్యక్తమవుతోంది. అమలాపురం ఎంపీ స్థానాన్ని జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ ఆశిస్తున్నారు. ఆయన స్థితిమంతుడు కాదనే నెపంతో అసెంబ్లీకి పంపించాలని బాబు యోచిస్తున్నారు. దీనికి హరీష్ ఒప్పుకోవడం లేదు. ఎంపీగా కొత్తగా పార్టీలో చేరిన పాము సత్యశ్రీ లేదా గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త రమేష్ ప్రసాద్లలో ఒకరిని ఎంపిక చేయాలని పార్టీ తలుస్తోంది. హరీష్ను పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ స్థానాల్లో ఒకదానికి పంపాలని చూస్తోంది. పి.గన్నవరానికి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ను తొలి జాబితాలోనే ప్రకటించినా సర్వత్రా వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ సీటు ఆశిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమాను దాదాపుగా ఎంపిక చేసింది. అమలాపురం సీటు ఆశిస్తున్న జనసేన శెట్టిబతుల రాజబాబు, డీఎంఆర్ శేఖర్లలో ఒకరిని బరిలో దింపాలని భావిస్తోంది. అయితే టీడీపీ అమలాపురం అసెంబ్లీ నుంచి హరీష్ను బరిలో దింపాలని చూస్తుందనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
సభ నిర్వహించుకోలేక పోలీసులపై నిందలా?
సాక్షి, అమరావతి: చిలకలూరిపేట సభను నిర్వహించుకోలేక అభాసుపాలై పోలీసులపై నిందలేస్తే ఎలా అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. కూటమి నేతల తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. సభ అట్టర్ ఫెయిల్ కావడంతో ప్రధాని మోదీ తిట్టి ఉంటారని, దీంతో చంద్రబాబు, పవన్ పోలీసులపై నెపం వేస్తున్నారని అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల క్రితం 2014లో జరిగిన ఎన్నికల్లో వీరు ముగ్గురూ తిరుపతిలో ఒకే వేదికపై కనిపించారు. కొత్త రాష్ట్రం, కొత్త సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి నాయకత్వం కావాలని అప్పట్లో చంద్రబాబు అన్నారు. దీనికి సరైన పరిష్కారం చూపుతామంటూ పవన్ను తోడుగా తీసుకుని తిరుపతి సభలో మోదీ ప్రత్యక్షమయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత అదే నాటకమాడుతున్నారు. ఆనాడు కొత్త పెళ్లి కాబట్టి కాస్తంత ఊపు మీద ఉన్నట్లు కన్పించారు. ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసగిస్తున్న ఛాయలు వారి ముఖాల్లో కనిపించాయి’ అని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. అప్పట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా కేవలం 1 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. నాడు వారు ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా మిగతా హామీలన్నీ ఏమయ్యాయి? మూడేళ్ల తర్వాత విడిపోయి బండ బూతులు తిట్టుకున్నారు. చంద్రబాబు ఏకంగా మోదీ కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడారు. ఈరోజు అదే చంద్రబాబు అవే పార్టీలను కలుపుకొని వేదిక ఎక్కారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చారు? 2014లో రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, ఆడబిడ్డ పుట్టగానే 25 వేలు వేస్తామని, జాబు కావాలంటే బాబు రావాలి – లేదంటే నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి.. ఇలా 600కు పైగా హామీలు ఇచ్చారు. అవన్నీ ఎమయ్యాయో చిలకలూరిపేటలో సంజాయిషీ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడేం చెప్పినా ప్రజలు నమ్మరనే సీఎం జగన్పై దుమ్మెత్తిపోయడమే పనిగా చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. చిన్న సభనూ సక్రమంగా నిర్వహించలేకపోయారు సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభ గందరగోళంగా జరిగింది. వాళ్ల మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే పోలీసులు రాలేదని ఆరోపిస్తున్నారు. లక్షల మంది వచ్చే మా సిద్ధం సభలకు మా ఏర్పాట్లు మేం చేసుకున్నాం. అలానే ఎవరి ఏర్పాట్లు వారు చేసుకోవాలి. పొరపాటున కరెంటు పోయి ఉంటే మాపైనే ఎన్నో అనేవారు. ఒక చిన్న సభ.. అంతా కలిపి 50 – 60 వేలు వచ్చి ఉంటారు. అదీ సక్రమంగా నిర్వహించలేక, వారి చేతకాని తనాన్ని పోలీసు శాఖకు అంటగట్టడం దివాళాకోరుతనం. ప్రధాని మోదీకి సన్మానం అన్నారు.. అవమానించారు. ఇవన్నీ అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలన్న చంద్రబాబు ఆత్రాన్ని సూచిస్తాయి. జగన్ చెల్లెళ్లే ఓట్లేయద్దంటున్నారు అని చంద్రబాబు అంటే.. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ రెండు ఒకటేనని ప్రధాని మోదీ చెబుతున్నారు. మీరు ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నారా? సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధానితో సమావేశమైన ప్రతిసారీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, రైల్వే జోన్, విభజన హామీలతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని కోరుతూ వస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న వేదిక నుంచే ఈ హామీలు అమలు చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట సభలో ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ప్లాంట్పై ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ కనీసం అడగలేకపోయారు. విశ్వసనీయతకు వారంటీ అవసరం లేని గ్యారంటీ జగన్ తాము పెట్టుకున్న నమ్మకానికి డబుల్గా జగన్ చేశారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఆ స్పందన కనిపిస్తోంది. సిద్ధం సభల్లో కనిపించిన స్పందన అక్కడి నుంచి వచ్చిందే. విశ్వసనీయతకు వారంటీ అవసరం లేని గ్యారంటీ సీఎం వైఎస్ జగన్ అనేది ఈ ఐదేళ్లలో కనిపించింది. చంద్రబాబు, పవన్ ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు జగన్ పాలన వల్ల లబ్ధి పొందాయి. ఇది తాత్కాలికం కాదు. వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. అందుకే ప్రజలు జగన్ను వారి మనిషిగా ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు 2014లో వేసిన నాటకం మళ్లీ వేసి ప్రజలను భ్రమల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వాటిని తిప్పికొట్టాలి. -
కూటమి ఆశలు పటాపంచలు
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇష్టపడటంలేదు. నియోజకవర్గాల్లో పార్టీల నేతలు, కార్యకర్తలు ఉప్పు, నిప్పులానే ఘర్షణ పడుతున్నారు. ప్రజా స్పందన అయితే శూన్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుకు ముందు 20 రోజుల క్రితం కాపు సామాజికవర్గం బాగా బలంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతంలో టీడీపీ – జనసేన ‘జెండా’ సభ నిర్వహించాయి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత ఆదివారం కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడిలో సభ పెట్టారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఈ సభపై చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సభకూ ప్రజల నుంచి స్పందన లేక అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మూడు పార్టీల నాయకులు, శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సభకు ప్రజాస్పందన మొదలు సభ జరిగిన తీరు, నాయకుల ప్రసంగాలు అన్నింటిపై మూడు పార్టీల సీనియర్ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. కార్లు అడ్డుపెట్టి.. ట్రాఫిక్ జామ్ చేసి చిలకలూరిపేట సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం టీడీపీ నాయకులు మొదట దాదాపు 2500 బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉందని తెలిసిపోవడంతో ఆఖరి నిమిషంలో 1540 బస్సులను క్యాన్సిల్ చేసి, 960 బస్సులను మాత్రమే తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులనూ తీసుకున్నారు. వీటిలో ఏ బస్సుల్లోనూ సగం కూడా నిండలేదు. ఏ ఒక్క బస్సూ నిండుగా సభకు రాలేదని స్థానికులు చెప్పారు. ఏలూరు లోక్సభ ప్రాంతం మొదలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం మధ్య దాదాపు సగం రాష్ట్రం నుంచి ఈ సభ కోసం మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 10 లక్షలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని భావించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పటికీ, పదో వంతు కూడా జనాలు సభలో కనిపించలేదు. చివరకు సభకు ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించుకోవడానికి టీడీపీ నాయకులే జాతీయ రహదారిపై కార్లు అడ్డంగా పెట్టి రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వాటినే డ్రోన్లతో చిత్రీకరించి చూపించేందుకు ప్రయత్నించారు. వారు కార్లు అడ్డం పెట్టడం సహా పూర్తి వాస్తవ చిత్రం వారి చిత్రాల్లోనే కనిపించేస్తోంది. సభలో వైఫల్యాలను పోలీసులపై రుద్దే యత్నం బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకముందే మార్చి తొలివారంలోనే టీడీపీ జనసేన పార్టీలు చిలకలూరిపేట సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మూడు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోదీని కూడ ఈ సభకు ఆహ్వానించారు. అయితే, ఈ సభకు జనసమీకరణ పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే కొనసాగింది. సభ నిర్వహణను ఆఖరి నిమిషంలో బీజేపీ నాయకులకు అప్పగించారు. సభలో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని అవమానించారు. ప్రధాని వేదికపైకి వచ్చిన తర్వాత బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సభ నిర్వహణ చేపట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి శాలువా కప్పి సన్మానించాలని చంద్రబాబును, పుష్పగుచ్ఛం అందించాలని పవన్ను కోరారు. అయితే, చంద్రబాబు, పవన్ వద్ద కనీసం ఓ పూల బొకే కూడా లేకపోవడంతో ప్రధాని అలానే కొద్దిసేపు నిలబడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన వద్ద ఉన్న వినాయకుని ప్రతిమను ప్రధానికి బహూకరించి, సన్మాన కార్యక్రమం మ మ అనిపించారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగించే సమయంలో మైకులు మూడు సార్లు మూగబోయాయి. అంతకు ముందే సభలో జనం పలుచగా ఉండటంతో ఎక్కువ మంది వచ్చారన్నట్లుగా చూపించడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు పలువురు కార్యకర్తలు సౌండ్ బాక్స్లు, ఫ్లడ్ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా, చంద్రబాబు, ఆ సమయంలో ప్రసంగిస్తున్న పవన్ వారిని వారించలేదు. ఇది గమనించి ప్రధానే స్వయంగా పవన్ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా అన్ని అంశాల్లో సభ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకుల లోపాలు స్పష్టంగా కనపడుతున్నా, ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకున్నారు. కూటమి రాజకీయ నినాదంపైనా అస్పష్టతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారికి ఉమ్మడి రాజకీయ విధానం లేదన్న విషయం వారి ప్రసంగాలే తేల్చేశాయి. రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లూ వారు ఏం చేస్తామన్నది కూడా చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా కేవలం సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిగూడెం సభలో పూర్తిగా సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. చిలకలూరిపేట సభలో ఓ పక్క మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్పై అవే విమర్శలను కొనసాగించారు. ప్రస్తుత పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ ) అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిల సొంత చెల్లెలు అయి ఉండి కూడా సీఎం జగన్ని నమ్మడంలేదని బాబు, పవన్ విమర్శిస్తే.. అదే సభలో ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఇలా రెండు పార్టీల్లో ఉన్నారని విమర్శలు చేయడం గమనార్హం. కీలకమైన రాజకీయ విధానంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి ఇదే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకు విడిపోయారో, మళ్లీ ఎందుకు కలిశారో చెప్పకుండా.. 2014 ఎన్నికలప్పుడు ఈ మూడు పార్టీలే ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వందల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలుచేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను వంచించారు. ఐదేళ్లు తిరగకుండానే మూడు పార్టీలు విడిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొన్నాయి. 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆ మూడు పార్టీలే కూటమి కట్టాయి. అప్పుడు ఎందుకు విడిపోయారు, తిరిగి మళ్లీ ఎందుకు కలిశారో వారే చెప్పలేకపోతున్నారు. దీంతో వారి కార్యకర్తలే వారిని నమ్మడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పేరే ఎత్తని ప్రధాని మోదీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా, రాజకీయంగానూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తే టీడీపీ నాయకులు గో బ్యాక్ నినాదాలతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ప్రధాని పాల్గొనే సభలకు సమీపంలో నల్ల బెలూన్లు సైతం ఎగరవేశారు. ఆదివారం చిలకలూరిపేట సభలో చంద్రబాబు, మోదీ ఇరువురు పక్క పక్కనే కూర్చున్నా, ప్రధాని మోదీ గత ఐదేళ్లనాటి చేదు సంఘటనలు ఇంకా మరిచిపోలేదేమో అన్నట్టుగా ముభావంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కిత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబే ఈ సభలో హిందీలో, తెలుగు భాషలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ పేరును ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదు. కేవలం ఎన్డీఏ పేరుతో ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు పేరును కేవలం ఒక్కసారి మాత్రమే పలికారు. -
చంద్రబాబుతో సావాసం.. బీజేపీ నేత సంచలన కామెంట్స్
చంద్రబాబు నాయుడికి బీజేపీ జాతీయ నాయకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బీజేపీ జాతీయ నాయకుడు సునీల్ దేవ్ధర్ అయితే చంద్రబాబు నాయుడికి వీర ఫ్యాన్. గతంలో చంద్రబాబు టాలెంట్ గురించి సునీల్ దేవ్ధర్ చక్కగా వివరించారు. రాజకీయాలకు సంబంధించి చంద్రబాబును కట్టప్పతో పోల్చారు డియోరా. బీజేపీతో ఎక్కువ సార్లు పొత్తులు పెట్టుకున్నారు కాబట్టే చంద్రబాబు గురించి బీజేపీ నేతలకు బాగా తెలుస్తుందని రాజకీయ పండితులు అంటున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ బాహుబలులు ఉంటారు. వారి వెనకాలే కట్టప్పలూ పుట్టుకు వస్తారు. చంద్రబాబు నాయుడి గురించి ఎల్లో మీడియా ఎన్ని గప్పాలు కొట్టినా.. చంద్రబాబును బాహుబలి అని మాత్రం ములగచెట్టు ఎక్కించే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ చంద్రబాబుకు సరిపోదని వాళ్లకీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనభైలలో రాజకీయాల్లో బాహుబలి అంటే ఎన్టీఆర్ అనేవారు. కాంగ్రెస్ ఏకఛత్రాధి పత్యానికి గండి కొట్టిన బలవంతుడు ఎన్టీఆర్. మరి చంద్రబాబు ఎవరు? ఆయన గురించి మనం చెప్పుకునే కంటే బీజేపీ నేతలను అడిగితే సరిపోతుంది. అమ్మ పుట్టిల్లు మేనమామకు ఎరుక అన్నట్లు చంద్రబాబు గురించి బీజేపీ నేతలకు బాగా తెలుసు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని చాలా దగ్గరుండి అధ్యయనం చేసిన బీజేపీ జాతీయ నాయకుడు, గతంలో ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా వ్యవహరించిన సునీల్ దేవ్ధర్ అయితే గత ఎన్నికల సమయంలోనే చంద్రబాబు గురించి తనకున్న అభిప్రాయాలను మొహమాటం లేకుండా చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారో మరొక్కసారి విందాం. జన్మభూమి కమిటీ సభ్యులు దొంగలయితే చంద్రబాబు నాయుడు గజ దొంగ అని బిరుదు ఇచ్చారు సునీల్ దేవ్ధర్. అక్కడితో ఆగలేదు చంద్రబాబును మించిన కట్టప్ప మరొకరు లేరన్నారు. ఎన్టీఆర్కే కాదు నమ్మి పొత్తులు పెట్టుకున్న నరేంద్ర మోదీనీ.. మోదీతో కలిసి వచ్చినపుడు గెలిపించిన ఏపీ ప్రజలను కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. అంతేకాదు, అమరావతి ప్రాంతాన్నీ అక్కడి రైతుల ఆశలను సర్వనాశనం చేసింది కూడా చంద్రబాబే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దొంగతనాలను ఆయన వెన్నుపోటు కథలను ఆయన మోసకారితనాలను నిశితంగా గమనించారు కాబట్టే సునీల్ ఇంత చక్కగా చెప్పగలిగారు. రెండేళ్ల క్రితం చంద్రబాబు మళ్లీ ఎన్డీయేలోకి వస్తానంటే ఆహ్వానిస్తారా అని మీడియా ప్రశ్నించగా ఇదే దేవ్ధర్ చంద్రబాబుకు ఎన్డీయేలో చోటు లేదన్నారు. అటువంటి మోసగాడిని మరోసారి కూటమిలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే, చంద్రబాబుతో సావాసం వల్ల వచ్చిన సమస్య ఏంటో కానీ బీజేపీ కూడా యూ టర్న్ తీసుకుని చంద్రబాబు పొత్తు కోసం కాళ్లమీద పడగానే సరేలే.. పోనిలే అన్నట్టుగా ఒప్పుకుంది. ఇది బీజేపీకి ఎంత మాత్రం మంచిది కాదని.. సునీల్ దేవ్ధర్ చెప్పినట్లు త్వరలోనే చంద్రబాబు మరోసారి బీజేపీకి వెన్నుపోటు పొడవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -
ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది?.. పురంధేశ్వరి ప్లాన్ అదేనా?
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్టీలోని సాంప్రదాయ వర్గాలను అణచివేస్తున్నారా? తన సామాజికవర్గం మేలు కోసం ఇతర వర్గాలను తొక్కిపెడుతున్నారా? పార్టీని బాగుచేస్తారని నియమిస్తే ఏపీ బీజేపీని కమ్మ రాజ్యంగా తయారు చేస్తున్నారా? పురంధేశ్వరి తీరుపై పార్టీ ఒరిజినల్ నాయకులు, ఆర్ఎస్ఎస్ వాదులు ఏమనుకుంటున్నారు? తనవారి కోసం, చంద్రబాబు వర్గం కోసం ఒరిజినల్ బీజేపీ నేతలను పురంధేశ్వరి అడ్డుకుంటున్నారా? అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది? ఏపీలో కాషాయ సేనకు అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీకి తొలి నుంచీ అండగా ఉన్న సంప్రదాయవర్గాలపై కక్ష సాధిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీకి మొదటి నుంచి బ్రాహ్మణలు, వైశ్యులు, క్షత్రియులుతో పాటు మరికొన్ని వర్గాలు అండగా ఉండేవి. ప్రతి ఎన్నికల్లోను అభ్యర్థులతో సంబంధం లేకుండా బీజేపీకి తన సాంప్రదాయ ఓటు బ్యాంకు కొనసాగుతూ వచ్చేది. పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తరువాత బీజేపీకి అండగా ఉన్న వర్గాలను తొక్కిపెట్టి పార్టీలో తన సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా తన కులం వారినే నియమిస్తున్నారు. మిగతా వర్గాల వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని ఆర్ఎస్ఎస్ వాదులు, తొలి నుంచీ పార్టీలోనే ఉంటున్నవారు విమర్శిస్తున్నారు. విశాఖ బీజేపీ ఎంపీ స్థానాన్ని బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ నరసింహారావు ఆశిస్తున్నారు. విశాఖలోనే నివాసం ఉంటూ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన మేనకోడలు భర్త, బాలకృష్ణ చిన్నల్లుడు గీతం భరత్ కోసం జీవీఎల్కు మొండి చేయి చూపించారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన సోము వీర్రాజును తప్పించి బీజేపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కుట్ర చేసి పురందేశ్వరిని అధ్యక్ష పదవి దక్కేలా చేశారు. రాజమండ్రి ఎంపీ సీటును సోము వీర్రాజు ఆశిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాదిని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీలో కాపులను కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బండ బూతులు తిట్టిన, ఉగ్రవాది అంటూ సంబోధించిన, హోం మంత్రి అమిత్ షా కాన్వాయ్పై చంద్రబాబు రాళ్ల దాడి చేయించినా.. అవన్నీ పక్కన పెట్టి కులాన్ని దృష్టిలో పెట్టుకొనే బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరేలా పురందేశ్వరి చక్రం తిప్పారని మండిపడుతున్నారు. తన సామాజిక వర్గానికే చెందిన లంకా దినకర్ను అధికార ప్రతినిధిగా ఎంపిక చేసి జాతీయ చానల్స్కు ఇంటర్వ్యూలు, చర్చా వేదికల కోసం పంపుతున్నారు. పురందేశ్వరి పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీపతి రాజాను మీడియా రాష్ట్ర కోఆర్డినేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పాతూరి నాగభూషణంను నియమించారు. బీజేపీ తరఫున సోషల్ మీడియా విభాగం చూసే వ్యక్తి తపన్ చౌదరి, మహిళ విభాగం అధ్యక్షురాలు నిర్మల కిషోర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. విజయవాడ పార్లమెంటుకు టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు కాబట్టి పురందేశ్వరి ఊరుకున్నారని, లేదంటే విజయవాడ నుంచి బీజేపీ తరుపున సుజనా చౌదరిని కూడా పోటీ చేయించేవారు అంటున్నారు. రాష్ట్ర కమిటీలో కీలకమైన పదవులన్నీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారితోనే పురందేశ్వరి భర్తీ చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆర్ఎస్ఎస్ వాదులు, బ్రాహ్మణులు ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు గుర్రుగా ఉన్నారు. వారందరూ పార్టీకి విధేయులుగా ఉండడం, క్రమశిక్షణ కలిగిన వారు కావడంతో కమ్మ కులాభిమానంతో పార్టీలో జరుగుతున్న అరాచకాలపై నోరు మెదపలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తరువాత బీజేపీ విలువలను, సిద్ధాంతాలను పక్కనపెట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లో బీజేపీకి మద్దతుగా ఉంటూ వస్తున్న సాంప్రదాయవర్గాలన్నీ దూరం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. -
నాడు కత్తుల కొలిమి– నేడు పొత్తుల చెలిమి
సాక్షి, అమరావతి: చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆదివారం నాడు ఉమ్మడిగా ఒకే వేదిక నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు ఏం మాట్లాడతారోనని రాజకీయ పరిశీలకులతో పాటు రాష్ట్రంలో చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఎందుకటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి నిష్క్రమించాక మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయించారు. ప్రధాని పర్యటన సమయంలో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని ఉద్ధేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే... దానికి బదులు ప్రధాని మోదీ సైతం తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఏమన్నారు.. ఈయన ఏమన్నారంటే... 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని మోదీనుద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి ► ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి’ –మార్చి 29, 2018న రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు. ► ‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. మోదీ జీ, మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు’ – ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్లో చంద్రబాబు ► మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా లేదు. మీకంటే వాళ్లే నయం. కాటన్ దొర ఇచ్చిన నీళ్లయినా తాగుతున్నాం. నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్షా రాజకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోయారు – 2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ► ‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి’. – 2018 జూన్ 9న నెల్లూరు సభలో చంద్రబాబు ► ‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్దార్. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయేమో. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగవు’. – 2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు ► ‘కేంద్రం సహకారం అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి టీడీపీకి లేదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారన్నది మీ అందరికీ తెలుసు.‘ ► ‘ఏపీలో పరిస్థితి బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్ర మాదిరిగా ఉంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి దానిని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ది చెందాలన్నది మా ఆలోచన అయితే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు’ – 2019 ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ. ► దేశం కోసం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెలాంటి బెరుకు లేదు.ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు(చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు.– 2019 మార్చి 2న విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ. ► ‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశా. భయమనేది నా జీవితంలో లేదు’. – 2018లో మార్చి 6 తేదీన విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు. ► ‘విభజన హామీలను నాలుగు బడ్జెట్లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ పెట్టలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఎప్పుడైనా మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా? మీరు ఒక్కరే దేశాన్ని కాపాడతారా? ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా? –2018 మార్చి 7న సమావేశంలో చంద్రబాబు. ► ‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’. – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలివి. ► ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు’. – 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు. ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు ► ‘లోకే శ్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం’ ► ‘ప్రజలారా మీరే చెప్పండి. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన ఆయన కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని హామీ ఇచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్కు గౌరవమిస్తున్నారా? సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. కానీ ఆయనలాంటి సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. ఇదంతా యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు’ ► ‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నాకంటే చాలా సీనియర్నని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటారు. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడు తక్కువ చేయలేదు. అవును మీరు సీనియర్. కూటములు మార్చడంలో. కొత్త కూటములు కట్టడంలో. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో. ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. ►‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం’. – 2019 ఫిబ్రవరి 10న గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. -
బాబు పొత్తులను చిత్తుచేయండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అవకాశవాద పొత్తులపై రాష్ట్రంలోని క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు కత్తులు నూరుతున్నారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీలతో కలిసి పోటిచేసి అధికారం చేపట్టిన ఆయన అప్పట్లో ఇచ్చిన ఏ హామీని అమలుచేయలేదని వారు గుర్తుచేస్తున్నారు. అలాగే, ముస్లిం మైనారిటీ వర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించిన చంద్రబాబు వాటినీ అటకెక్కించేరన్నారు. ఉదా.. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్హౌస్లు నిర్మిస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికన వారికి బడ్జెట్లోను, స్థానిక సంస్థల ఎన్నికల్లోను సీట్లు కేటాయిస్తానని, మైనారిటీలకు చెందిన వక్ఫ్ ఆస్తులు, చర్చిల ఆస్తుల రికార్డులను పక్కాగా తయారుచేసి వాటిని పరిరక్షిస్తామంటూ ఆయన ఇచ్చిన ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోలేదని మైనారిటీలు గుర్తుచేస్తున్నారు.నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం వడ్డీలేని రుణాలు ఇస్తామని, వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేస్తామని చెప్పిన మాట కూడా అమలుకు నోచుకోలేదంటున్నారు. ఇక క్రిస్టియన్ మైనార్టీలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు పరిశీలిస్తే.. కబ్జాదారుల నుంచి పేద క్రిస్టియన్లు, బలహీనవర్గాల భూములు కాపాడతామని, క్రైస్తవ సంస్థల ఆస్తులను పరిరక్షిస్తామని, దళిత క్రైస్తవులను ఎస్సీల్లో చేరుస్తామని, క్రిస్టియన్ శ్మాశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తామన్న హామీలను అధికారం చేపట్టిన అనంతరం పట్టించుకున్న పాపాన పోలేదు. 2014లో ఇచ్చిన హామీలు అమలుచేయని ఇదే చంద్రబాబు.. మళ్లీ అదే బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తుతో మరోసారి దగా చేసేందుకు వస్తున్నాడని, పొత్తులతో కట్టకట్టుకుని వస్తున్న ఆయనకు బుద్ధిచెప్పాలని క్రిస్టియన్, ముస్లిం నేతలు ప్రజలకు పిలుపునిస్తున్నారు. బీజేపీతో కలిసి బాబు పెద్ద తప్పుచేశారు మతతత్వ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకుని చంద్రాబాబు పెద్ద తప్పుచేశారు. 2024 ఎన్నికల్లో గెలుపుకోసం చంద్రబాబు అనేక విష ప్రయోగాలు చేస్తున్నారు. 2014లో ఆయన బీజేపీతో పెట్టుకుని 2019లో ఆ పార్టీని వీడి ప్రధాని మోదీని టెర్రరిస్టుతో పోల్చి మళ్లీ ఇప్పుడు ఆయన కాళ్లబేరానికి వచ్చాడు. బీజేపీ, జనసేనలతో కలిసి వస్తున్న చంద్రబాబును రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చిత్తుచిత్తుగా ఓడిస్తారు. సంక్షేమం, అభివృద్ధి ద్వారా తనదైన ముద్ర వేసుకున్న సీఎం వైఎస్ జగన్ను 2024 ఎన్నికల్లో ప్రజలు మళ్లీ సీఎంను చేస్తారు. – పెరికె వరప్రసాదరావు, నేషనల్ దళిత క్రిస్టియన్ రైట్స్ చైర్మన్ ముస్లింలను అణగదొక్కిన బాబుకు బుద్ధిచెబుతాం చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ముస్లింలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయకుండా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరింత అణగదొక్కారు. మైనారిటీ శాఖను మైనారిటీలకు కాకుండా చేశారు. ఐదేళ్లపాటు ముస్లింలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వని బాబు ఎన్నికల ముందు కంటితుడుపు చర్యగా ఇచ్చామనిపించారు. బీజేపీతో కలిసి అధికారం పంచుకున్న బాబు అదే పోకడలతో ముస్లింలలో నాయకత్వాన్ని ఎదగనీయకుండా చేశారు. ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ను మళ్లీ గెలిపించుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో బాబుకు బుద్ధిచెప్పడం ఖాయం. – షేక్ మునీర్ అహ్మద్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కర్వీనర్ -
సార్.. కొంప మునిగింది.. ఏం పొత్తులో ఏమో సార్.. మన పార్టీ వాళ్లు..
ఇక్కడ పొత్తులో కేటాయించిన అభ్యర్థిని మన వాళ్లు, మరో పొత్తు పార్టీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడేమో మనల్ని ఇంకా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు.. అక్కడేమో.. -
ఏపీ బీజేపీ మౌనమా.. ముభావమా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ జనసేనతో కూడిన కూటమిని కూర్చిన తరువాత ఎందుకనో ఆ సందడి లేదు. పెళ్లి సమయంలో ఉన్నప్పటి కళ కాపురానికి వెళ్లేసరికి లేనట్లుగా మారింది. దీంతో ఇది కొంపదీసి వన్ సైడ్ లవ్వు గట్రా కాదు కదా అనే సందేహాలు వస్తున్నాయి. దానికితోడు కొంపదీసి చంద్రబాబు ఎప్పట్లానే తన నిజరూపాన్ని బయటకు గానీ తీసారా? దాని దెబ్బకే బీజేపీ వాళ్లకు అందులోని ప్రధాన పార్ట్నర్కు బుర్ర తిరిగిపోయి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందా అనే డౌట్స్ తన్నుకొస్తున్నాయి. ఒంటె సాయిబు కథ మాదిరి.. చంద్రబాబు మళ్లీ తన స్మార్ట్ బుర్రను వాడి బీజేపీని తొంగోబెట్టే ఎత్తులు వేసారా? వేస్తున్నారా? అనే అనుమానాలు బీజేపీ పెద్దల్లో ఉన్నాయి అంటున్నారు. అందుకే కూటమిలో ఇటు టీడీపీ.. జనసేన పార్టీలు ఎవరికివారు సీట్లు.. స్థానాలు ఖరారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా బీజేపీ మాత్రం ఎక్కడా చప్పుడు చేయడం లేదు.. అసలు కూటమిలో ఉందా లేదా అన్నట్లుగా గుంభనగా ఉంది. వాస్తవానికి పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగిన చంద్రబాబు మొత్తానికి నానా రికమెండేషన్ల తరువాత ఢిల్లీ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ సంపాదించి వారిని ఎలాగోలా పొత్తుకు ఒప్పించారు. అయితే, ఆయన ఆ చర్చల సందర్భంగా అక్కడ ఇచ్చిన సీట్ల హామీ వేరని, ఢిల్లీ నుంచి వచ్చాక ఇక్కడ ఆయన చేస్తున్న రాజకీయం వేరని అంటున్నారు. ఢిల్లీ పెద్దలతో చర్చల సందర్భంగా బీజేపీకి కనీసం పది లోక్సభ.. అదే సంఖ్యలో అసెంబ్లీ సీట్లు ఇచ్చేనందుకు బాబు ఒప్పుకున్నారని అంటున్నారు. ఇక, ఆంధ్రాకు వచ్చాక మాట మార్చేసి ఆరు లోక్సభ, ఓ పది.. అంతకన్నా తక్కువ శాసనసభ సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని చెబుతూ తన లెక్కలనే ఎల్లోమీడియాలో కథనాలు రాయించారని బీజేపీ గుర్తించింది. అందుకే ఎకాఎకిన కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను ఢిల్లీ పెద్దలు తమ ప్రతినిధిగా ఆంధ్రకు పంపించారు. ఇక్కడ కూడా బాబు తన అతి తెలివి చూపించి ఆయన్ను బురిడీ కొట్టించాలని చూశారని తెలుస్తోంది. ఢిల్లీలో చెప్పిన మాటకు ఇక్కడి మాటకు తేడా రావడంతో ఒక రోజంతా ఇక్కడే ఉండి లెక్కలు తెలుద్దామని భావించిన షెకావత్ మొత్తానికి ఏమీ ఫైనల్ చేయలేక బాబు అతి తెలివికి సమాధానం చెప్పలేక బుర్ర ఖరాబై ఢిల్లీ వెళ్లారు. గంటలకొద్దీ చర్చ జరిగినా ఒక్క ముక్కా అర్థం కానీ షెకావత్కు మాత్రం ఒకటి అవగతమైంది. ‘చంద్రబాబు మళ్ళీ బీజేపీని ముంచేయడం ఖాయం.. ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా బాబులోని మోసపూరిత బుద్ధి మారదు’. ఈ పాయింట్ అర్థం చేసుకున్న షెకావత్ ఢిల్లీ వెళ్లి బాబు ఇలా మాట మారుస్తున్న విషయాన్నీ పార్టీ పెద్దలకు నివేదించారని తెలుస్తోంది ఇక, అప్పట్నుంచి బీజేపీ సైలెంట్ అయిందని అంటున్నారు. ఇటు లెక్క ప్రకారం టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుండగా ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 16 సీట్లను ప్రకటించగా ఇంకో ఐదు స్థానాలకు సరైన అభ్యర్థులు కోసం చూస్తున్నారు. వీళ్ళు ఇలా జోరుమీద ముందుకు పోతున్నా బీజేపీ మాత్రం ఎక్కడా ఒక్క సీట్ కూడా వెల్లడించలేదు. ఎందుకంటే ఇదే కారణం అని చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే సీట్లను అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చించడం అనేదే లేదు. అంతా సింగిల్ హ్యాండెడ్గా ఆయన నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులు.. స్థానాలను ఖరారు చేస్తూ పొతే ఇక మేమెందుకు అనే భావనలో బీజేపీ నాయకులు ఉన్నారని అంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఆంధ్రలోని ఒరిజినల్ బీజేపీ నాయకులకు ఇష్టం లేదని.. దాంతోబాటు బీజేపీ అభ్యర్థులను సైతం చంద్రబాబే ఖరారు చేస్తూ రావడం గతంలో చూశామని.. అలాంటప్పుడు తమకు విలువ ఏముందని రాష్ట్రంలోని ఒరిజినల్ బీజేపీ నాయకులూ కినుక వహించారని అంటున్నారు. అందుకే ఇవన్నీ రిపోర్టులు.. లెక్కలు బేరీజు వేస్తే తప్ప బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. - సిమ్మాదిరప్పన్న -
ఏపీ బీజేపీలో కొత్త ట్విస్ట్.. చిచ్చుపెట్టిన చంద్రబాబు!
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్కు చేరుకుంది. రాష్ట్రంలో పొత్తులపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పురంధేశ్వరి తీరుపై ఫైరవుతున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్ నేతలు హైకమాండ్కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. కాగా, ఏపీలో సీట్ల పంచాయితీ ముదురుతోంది. కూటమిలో సీట్ల విషయంలో చంద్రబాబు తీరు, ఏపీలో రాజకీయ పరిణామాలపై ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఏపీకి చెందిన 16 మంది బీజేపీ సీనియర్లు హైకమాండ్కు లేఖ రాశారు. ఈ లేఖలో టీడీపీతో పొత్తుల అంశంపై ఏపీ బీజేపీ సీనియర్ నేతలు తమ గళం వినిపించారు. ఈ సందర్భంగా బీజేపీ అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారని పేర్కొన్నారు. బీజేపీకి గెలవని సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు. రెండు దశాబ్దాలుగా టీడీపీ గెలవని బద్వేలు, జమ్మలమడుగు, అనపర్తి, విజయవాడ వెస్ట్, ఆధోని వంటి సీట్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు సీట్లు కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బద్వేలు లాంటి అసెంబ్లీలో కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బీజేపీ సీట్లని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని సీరియస్ అయ్యారు. టిక్కెట్ల కేటాయింపులో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. ఇక, టీడీపీ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ ఇన్ఛార్జ్ మధుకర్జీని కూడా కొందరు సీనియర్లు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్లాన్ ఇదే.. శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలు బీజేపీకి కేటాయించినట్లు ప్రచారం చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బీజేపీ.. నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బీజేపీకి కేటాయించిన చంద్రబాబు విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని పట్టుబట్టిన బీజేపీ.. బీజేపీకి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలను ప్రకటించిన చంద్రబాబు హిందూపూర్ లోక్సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు.. లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణు చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు కడప పార్లమెంట్లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బీజేపీకి. బద్వేలులో పోలింగ్ బూత్లకి కార్యకర్తలు కూడా లేరంటున్న బీజేపీ రెండు దశాబ్దాలగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బీజేపీకే ఇచ్చిన చంద్రబాబు. చంద్రబాబు కుటిల రాజకీయాలపై మండిపడుతున్న స్థానిక బీజేపీ నేతలు అనపర్తిలో సోము వీర్రాజుని పోటీచేయాలని బీజేపీ సూచన. ఓడిపోయే సీటులో తాను పోటీ చేయలేనని స్పష్టం చేసిన సోము వీర్రాజు విశాఖ ఎంపీ స్ధానాన్ని జీవీఎల్ కోరితే విజయనగరం లోక్సభకి పంపేలా చంద్రబాబు వ్యూహం నరసాపురం పార్లమెంట్ స్ధానాన్ని ఆశించిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస్ వర్మ. నరసాపురం స్ధానాన్ని బీజేపీకి ఇచ్చి రఘురామకృష్ణంరాజు పేరుని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు -
మూడు విచిత్ర దారుల కలయిక
మంచి పంటలు పండే 30 వేల ఎకరాల భూమిలో అమరావతి నగర నిర్మాణమనే లాభసాటి దారి పట్టాడు చంద్రబాబు. అత్తారింటికి దారి వెతికే నటుడేమో పిల్లలకు యూట్యూబ్లుండగా బడులెందుకు అని ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని బీజేపీ చెబుతున్నది. ఈ మూడు దారులూ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక్కటయ్యాయి. ఇక జగనేమో విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించే బాట పట్టాడు. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇది అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్ను నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు మూడు విచిత్ర దారుల కలయిక జరిగింది. ఒకటి అమరావతికి దారి. ఆ దారి ఏది, ఏది అని 2019 నుండి చంద్రబాబు వెతుకుతున్నాడు. ఈయన దారి తప్పడమనేది 2014లోనే జరి గింది. రాష్ట్రానికి హైదరాబాదును మించిన రాజధాని తను, తన కొడుకు దశాబ్దాలు పాలించి అతి త్వరలోనే సింగపూర్ లాంటి సిటీ కడుతామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కృష్ణానది ఒడ్డున బంగారు పంటలు పండే 30 వేల ఎకరాల భూమిని రైతుల దగ్గరి నుండి తీసు కున్నారు. అప్పుడు కేంద్రాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కూడా ఈ దారి తప్పిన దారిలో ఉంది. ఈ భూముల్లో మంచి పంటలు పండించుకునే రైతుల్ని అతి త్వరలోనే పెట్టుబడిదారులను చేస్తామని ఆశ పెట్టారు. ఇది విచిత్ర ఆశ. ఆ రైతులెలా నమ్మారోగానీ ఒక చిన్న రాష్ట్రం 30 వేల ఎకరాల్లో ఒక నగరాన్ని నిర్మించి, బాగా పంటలు పండే ఖరీదైన ఎకరా భూమికి బదులు 200 గజాల కమర్షియల్ ల్యాండ్ ఇస్తామంటే ఎలా నమ్ము తారు? ఇక ఆ ఐదేండ్లలో సింగపూర్ నగర నిర్మాతలు రాష్ట్ర బడ్జెట్నంతా ఇతర దేశాల కాంట్రాక్ట్ బృందాలకు, మంత్రివర్గ కమిటీలు ప్రపంచ పట్టణాల నమూనాల అధ్యయనానికి ఖర్చు చేశారు. నగర నిర్మాణం జరగకముందే దాని చుట్టూ రింగురోడ్లు, ఉద్యానవనాలు తయారౌతున్నట్టు ప్రకటించారు. వీటి నమూనాలు గీయడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. చివరికి 2019 ఎన్నికలు వచ్చే నాటికి అమరావతికి దారేది? అనే స్థితిలో చంద్రబాబు ఆయన ప్రయివేటు విద్యా, వైద్య మంత్రివర్గ మిత్ర బృందం ఎన్నికలకు పోయింది. ఘోరంగా ఓడారు. ఇప్పుడు అత్తారింటికి దారేది? అని నిరంతరం వెతికే నాయకుడు లేని నాటకదారితో పొత్తు కుదుర్చుకున్నాడు బాబు. ఈ అత్తారింటికి నిరంతరం దారి వెతికే నటుడు పిల్లలకు యూట్యూబ్లుండగా బడులెందుకు, సినిమాలుండగా రైతులకు వ్యవసాయం పనులెందుకు, వెల్ఫేర్ స్కీములెందుకు? అని ప్రజల బతుకుదారులన్నీ మూసెయ్యాలని ఎన్నికల ముందే ప్రశ్నల వర్షం మొదలెట్టాడు. ఈ ఇద్దరు కలిసి తమ విచిత్ర దారుల కలయిక చాలద న్నట్లు మళ్లీ బీజేపీని కూడా తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. దేశ భవిష్యత్తుకు బడిదారి కాదు వెతకాల్సింది, గుడిదారి అని చాలా కాలంగా బీజేపీ చెబుతున్నది. వీళ్లంతా కలిసి పోటీ చేసి గెలిస్తే, రాష్ట్ర బడ్జెట్ను ఏ దారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలనే కొట్లాట మొదలౌతుంది. చంద్రబాబు అమరావతి నిర్మాణం కోసం ఖర్చు పెట్టాలంటాడు. 30 వేల ఎకరాలతో సింగపూర్లు నిర్మించాలి! పవన్ తన కల్యాణం కోసం ఖర్చు చేయాలంటాడు. ఆయనకు అత్తారింటి దారి వెతుకులాట, ఆ దారిలో ఖర్చు చేయడం తప్ప ప్రజల అభివృద్ధి దారి, పిల్లల బడి దారి, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ విద్య, ప్రజల ఆరోగ్యం కోసం హాస్పిటల్స్ వంటివి ఆయన నటనా జీవితంలో ఎరుగనివి. బీజేపీతో పొత్తు కుదిరింది కనుక అది గుడుల నిర్మాణం, పురాతన సంప్రదాయ చరిత్ర పరిరక్షణ, అభివృద్ధి, విశ్వగురుపీఠ ఏర్పాటు అమెరికాలో చేయాలనే ఆశయ సాధనకు డబ్బు ఖర్చు చెయ్యాలనే డిమాండ్ చేయడం మామూలే. జగన్ పరిపాలించిన ఐదేండ్లు ఏక కేంద్ర నిర్ణయాలు, ఖర్చు అభివృద్ధి ప్లాన్లు జరిగాయి. అందులో మొదటిది, అసాధ్యమైన 30 వేల ఎకరాల నగర నిర్మాణం ఆపడం; అది ఆపకుండా ప్రజల కోసం ఏ ఖర్చూ చెయ్యలేమని గుర్తించడం. రెండవది విద్యా, వైద్య రంగాలను గ్రామ వ్యవస్థల్లోకి బలంగా తీసుకెళ్లి సంపూర్ణ గ్రామ అభివృద్ధికి పథకాలు రూపొందించటం; భవన నిర్మాణ ఖర్చును పట్టణ నిర్మాణ రంగం నుండి పల్లె నిర్మాణ రంగంలోకి మార్చడం; గ్రామాల్లో బడుల భవనాలు, హాస్పిటళ్లు, సెక్రటేరియట్లు నిర్మించడం; ఈ నిర్మాణ పనులను పెద్ద కాంట్రాక్టర్ల నుండి గ్రామ కాంట్రాక్టర్లకు మార్చడం; అందులో ముఖ్య గ్రామ ప్రజా కమిటీలకు నిర్మాణ బాధ్యతలు ఒప్ప జెప్పడం. ఈ అభివృద్ధి మార్పులో రిస్క్ ఉన్న మాట నిజం. బలమైన కాంట్రాక్ట్ క్లాస్ ప్రభుత్వానికి అడ్డం తిరిగే అవకాశం చాలా ఉంటుంది. ఇంతకంటే పెద్ద రిస్కుతో కూడిన నిర్ణయం ప్రభుత్వ విద్యా విధానాన్ని ఆంగ్ల ప్లస్ తెలుగుతో జతపర్చి ఆధునిక విద్యా టెక్నాలజీని శ్రమ జీవుల పిల్లల బతుకుల్లోకి తీసుకెళ్లటం. ఇది భారతదేశం వంటి ప్రయివేటు విద్యా పెట్టుబడి–దోపిడీ వ్యవస్థ ఏ దేశంలో లేనంత బలంగా ఉన్న చోట ప్రయోగాత్మకంగానైనా చెయ్యడం ఊహకందనిది. ఇది విద్యా దోపిడీ, ప్రయివేటు పెట్టుబడుల డబ్బు విస్తరించి ఉన్న ఆస్తులు, వాటి చుట్టూ ఉన్న మాఫియాను బాగా బలహీనపర్చే నిర్ణయం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం అంటేనే ఉగ్రరూపం దాల్చే ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం మాఫియాతో నేరుగా తలప డటం. ఈ మాఫియాకు ఇప్పటివరకు అన్ని రాజకీయ పార్టీలు దాసోహం చేసే రోజులివి. కార్మిక వర్గ రక్షకులమనే కమ్యూనిస్టు పార్టీలు సైతం ప్రయివేటు విద్యా మాఫియాను అంటకాగి బతుకుతూ ఉన్న దశ ఇది. ప్రయివేటు విద్యా రంగం ఈ దేశంలో మిగతా అన్ని పెట్టుబడిదారీ రంగాలను మించిన ఆస్తుల్ని, మంది మార్బలం, బస్సులు, కార్లు, వ్యాన్లు కలిగి ఉండి మారుమూల గ్రామాల్లో కూడా విస్తరించి ఉన్నందువల్ల దీని శక్తి ఉత్పత్తి రంగ పెట్టుబడి కంటే బలమైంది. దీన్ని ఎదిరించలేకనే అన్ని రాజకీయ పార్టీలు, చివరికి కమ్యూనిస్టు పార్టీలతో సహా, ఊకదంపుడు ‘మాతృభాష’ సిద్ధాంతం ప్రజలకు నేర్పి తమ పార్టీలను, తమ పిల్లల మెదళ్లను ప్రయివేటు విద్యా వ్యవస్థకు తాకట్టు పెట్టాయి. జగన్ దాన్ని బద్దలు కొట్టారు. ఇది మామూలు విషయం కాదు. భారతదేశ జ్ఞాన సంపద రూపు రేఖల్ని మార్చే పోరాటం ఇది. ప్రజా సంక్షేమ వ్యవస్థను భారతదేశంలో ఏ కేంద్ర ప్రభుత్వంగాని, ఏ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఊహించని స్థాయిలో ‘మనీ ట్రాన్స్ఫర్’ పద్ధతిలో ప్రజా బ్యాంకు ఎకౌంటుల్లోకి ట్రాన్స్ఫర్ చేసింది జగన్ ప్రభుత్వం. ఇటువంటి స్కీములను ఈ మూడు పార్టీల కూటమి కూడా చేస్తామనొచ్చు. కానీ అన్ని సమస్యలకు, ముఖ్యంగా విశాల ప్రజల బీదరికానికి మందు జగన్ ప్రారంభించిన క్వాలిటీ ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వం ఇవ్వడంలో ఉన్నది. దానికి బద్ధ శత్రువు చంద్రబాబు, పచ్చి వ్యతిరేకి బీజేపీ, పిచ్చి వ్యతిరేకి పవన్. వీళ్లంతా ప్రయివేటు ఇంగ్లిష్ మీడియం విద్యా పెట్టుబడిదారీ వర్గాన్ని తమ భుజాల మీద మోస్తారు. వీళ్ళు అధికారంలోకి వస్తే మొదట ఆగి పోయేది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, కొత్త పాఠ శాలల నిర్మాణం. ఇప్పటికే నిర్మించబడ్డ బడులకు మెయింటనెన్స్ డబ్బు ఆపివేత, మిర్రర్ ఇమేజ్ బుక్స్ ప్రింటింగ్ ఆపివేత. సంక్షేమాలు ఎన్ని చేస్తామని చెప్పినా 30 వేల ఎకరాల్లో సింగపూర్ నిర్మాణం కార్యక్రమం అన్నింటినీ ఆపేస్తుంది. అమరావతి భారీ నగర నిర్మాణ సమస్య ఈ మూడు పార్టీల మెడకు చుట్టుకున్న పెద్ద నాగు పాము. బాబు నిర్మించే పట్టణ పాముకు సరిపోయేన్ని పాలు వీరు పొయ్యకపోతే అది వీరిని కాటేసి చంపేస్తుంది. దానికి గ్రామాలను మాడ్చాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఒకే ఒక పరిష్కారముంది. అది ఈ ఎన్నికల్లో జగన్ని గెలిపించుడు. కనీసం ఇంకో ఐదేండ్లు విద్యా రంగం మార్పులతో ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగించు కుంటే క్రమంగా ఇటువంటి పథకాలు అవసరం లేని దేశంలోనే అభి వృద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఈ మూడు దారుల కూటమే వస్తే మళ్లీ అగాథంలో ఆంధ్రప్రదేశ్ పడుతుంది. బాబు భయ మంతా గ్రామాల్లోని కూలీ నాలీ చేసుకొని బతికే వారి పిల్లలు మేధా వులు, నాయకులు అయితే తన కొడుకు, మనవడు ఏమౌతారనే. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని కులాల్లోని బీదవారి భవిష్యత్ను నిర్ణయిస్తాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
పాడేరు అసెంబ్లీలో టీడీపీకి చుక్కెదురు!
పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో 20 ఏళ్లుగా ఎమ్మెల్యే లేని టీడీపీ ఈసారి ఎన్నికల్లో కూడా కనుమరుగు కానుంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి పాడేరు అసెంబ్లీ స్థానం కేటాయిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు స్థానికంగా టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, కిల్లు రమేష్నాయుడు, కొట్టగుళ్లి సుబ్బారావు, జనసేనకు చెందిన వంపూరు గంగులయ్య అమరావతిలో మకాం వేశారు. టికెట్ బీజేపీకి కేటాయించినట్టు వారికి టీడీపీ, జనసేన అధిష్టానాలు చెప్పడంతో నిరాశకు గురైనట్టు తెలిసింది. 20 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ జెండాలు మోస్తున్నామని ఈసారి ఎలాగైనా టికెట్ కేటాయించాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పడంతో అమరావతి వెళ్లిన నాయకులంతా నిరాశతో వెనుదిరిగినట్టు ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్లుగా దక్కని అధికారం.. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో చివరిసారిగా 1999 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలిచి 2004 వరకు కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాడేరు నియోజకవర్గంలో ఏకధాటిగా 20 ఏళ్లుగా టీడీపీకి అధికారం దక్కలేదు. 2004 ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినప్పటికి అప్పట్లో బీఎస్పీ అభ్యర్థి లకే రాజారావు గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలతో జతకట్టడంతో టీడీపీ తరఫున ఎవ్వరు పోటీ చేయలేదు. సీపీఐ తరఫున దివంగత గొడ్డేటి దేముడు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పసుపులేటి బాలరాజు చేతిలో ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో కూడా పొత్తులో భాగంగా సీపీఐకి నియోజకవర్గ టికెట్ కేటాయించగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఒంటరిగా పోటీ చేసినప్పటికి వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఓటమి పాలైంది. ఈసారి ఎన్నికల్లో కూడా టీడీపీ బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంది. పొత్తుల్లో భాగంగా ఈసారి పాడేరు అసెంబ్లీ స్థానంతో పాటు అరకు పార్లమెంట్ స్థానం కోసం బీజేపీ తీవ్రంగా పట్టుబడుతోంది. అరకు పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థికి ఇచ్చేందుకు దాదాపుగా ఖరారైంది. పాడేరు అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ ఇచ్చేందుకు టీడీపీ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రెబల్గా గిడ్డి ఈశ్వరి? 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి కొన్నాళ్ళ తర్వాత 2018లో పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆమె పోటీ చేసినప్పటికి వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఆమెకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలను అప్పగించడంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. చాలా సందర్భాల్లో పార్టీ పెద్దలు పాడేరు వచ్చినప్పుడు ఆమెకే టీడీపీ టికెట్ కేటాయిస్తామని బహిరంగంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు పొత్తుల్లో భాగంగా బీజేపీ కేటాయిస్తున్నారని తెలియడంతో ఆమె టీడీపీ తరఫున రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధపడినట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని అనుచర వర్గంతో ఈనెల 14న పాడేరులోని తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని తప్పకుండా హాజరు కావాలని ఆహ్వానాలు పంపించారు. చక్రం తిప్పుతున్న కొత్తపల్లి గీత గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కేంద్ర నాయకత్వం వద్ద గట్టి పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే అరకు ఎంపీ స్థానం బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక కొత్తపల్లి గీత, గిడ్డి ఈశ్వరి మధ్య గతంలో వైఎస్సార్సీపీలో ఉన్నప్పటి నుంచి విబేధాలు ఉన్నాయి. ఈ కారణంతోనే ఆమె పట్టుబట్టి మరి పాడేరు అసెంబ్లీ స్థానం కూడా బీజేపీ కేటాయించాలని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తోందని వినికిడి. మాజీ ఎమ్మెల్యే దివంగత ఎంవీఎస్ సత్యనారాయణ కుమారుడు, మాజీ జీసీసీ చైర్మన్, టీడీపీ నేత ఎంవీఎస్ ప్రసాద్ను పాడేరు అసెంబ్లీ నుంచి బరిలోకి దింపాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎంవీఎస్ ప్రసాద్ను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొద్దిరోజుల నుంచి కొత్తపల్లి గీత, ఎంవీఎస్ ప్రసాద్ టచ్లో ఉన్నారని కొంతమంది బీజేపీ, టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. టికెట్ రేసులో ఉన్నామని ‘కురుసా’ ఫ్యామిలీ లీకులు అరకు పార్లమెంట్ స్థానంతో పాటు పాడేరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని తమకు పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సమాచారం ఉందని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర కాఫీ బోర్డు సభ్యుడు కురుసా ఉమామహేశ్వరావు బహిరంగంగానే చెబుతున్నారు. తమ కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి ఏజెన్సీ ప్రాంతంలో బీజేపీ బలోపేతానికి కృషి చేసిందని వారంటున్నారు. పార్టీకి ఎన్నో సేవలు అందించామని, ఈ సారి తమ పార్టీ తరఫున అరకు పార్లమెంట్ లేదా పాడేరు అసెంబ్లీ స్థానానికి తాను లేదా తన సోదరి మాజీ జీసీసీ డీఎం కురుసా పార్వతమ్మ పోటీ చేస్తారని చెబుతున్నారు. జనసేన ఉనికి కరువైంది. కొసమెరుపు ఏంటంటే ఇతర పార్టీలతో టీడీపీ జత కట్టిన ప్రతీసారి పాడేరు అసెంబ్లీ స్థానాన్ని మిత్రపక్షాలకు కేటాయించి, పోటీ నుంచి తప్పుకుంటోంది. -
March 13th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu 8:47 PM, Mar 13th, 2024 సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం తాడేపల్లి: వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం నగరి, నరసరావుపేట, సత్తెనపల్లి సమన్వయకర్తలు, స్థానిక నేతలతో సమావేశం పార్టీ గెలుపునకు ఉమ్మడిగా కృషి చేయాలన్న సీఎం జగన్ గతం కంటే ఎక్కువ మెజారిటీలు వచ్చేలా చూడాలన్న సీఎం సీఎం సూచనలతో ఆ దిశగా పని చేస్తామన్న నేతలు 8:38 PM, Mar 13th, 2024 ఏలూరు జిల్లా: వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి వెయ్యి మంది కార్యకర్తలు చేరిక పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి డ్వాక్రా, రైతుల రుణాలు, మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశాడు: ఎంపీ మిథున్ రెడ్డి నిరుద్యోగ భృతి అంటూ వారిని మోసం చేశాడు జన్మభూమి కమిటీల పేరుతో పేదలను దోచుకున్నారు గతంలోనూ చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ సీఎం జగన్ లేకపోతే రానున్న రోజుల్లో పథకాలు ఆగిపోతాయి సచివాలయాలు, జన్మభూమి కమిటీలకు అడ్డాగా మారిపోతాయి వాలంటీర్లు వ్యవస్థను తొలగిస్తారు టీడీపీ, జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో 11మంది టీడీపీ అభ్యర్థులే బీజేపీ పేరుతో పోటీ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్థులే కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీకి కోవర్ట్గా పనిచేస్తుంది చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల్లో ఉంటారని గమనించాలి అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్పై కుట్రలు చేస్తున్నాయి సీఎం జగన్ పొత్తు ప్రజలతోనే.. ఏ పార్టీని నమ్ముకో లేదు 7:42 PM, Mar 13th, 2024 సంక్షేమ సారధి.. అభివృద్ధి వారధి మన జగనన్న: పోలవరం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా 58 నెలల పాలన సాగించారు వివక్షత.. అవినీతికి తావు లేకుండా పాలన సాగించారు రాష్ట్రంలో అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదు మొద్దు నిద్రలో ఉన్న ప్రతిపక్షానికి అభివృద్ధి కళ్లకు కనపడదు జగనన్న మీద బురద జల్లుతూ ఎత్తులు, పొత్తులు.. జిత్తులతో గుంటనక్కల్లా వస్తున్నారు జగనన్న ఎదుర్కోలేక నాలుగైదు జండాలు కట్టుకొని వస్తున్నారు పోలవరం గడ్డ జగనన్న అడ్డా పోలవరం నియోజకవర్గాన్ని గెలిచి జగనన్నకు గిఫ్ట్గా ఇస్తాం 7:03 PM, Mar 13th, 2024 పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుమతి లేకుండా ర్యాలీగా ఒక్కసారిగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వైపు దూసుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం పోలీసులను నెట్టేసి వారి చేతిలో ఉన్న లాఠీలను లాక్కోడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు పోలీసులపైన దౌర్జన్యం 5:16 PM, Mar 13th, 2024 టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే టీడీపీ నుండి నేతలను పంపిస్తున్న చంద్రబాబు వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్న పవన్ కల్యాణ్ నిన్న భీమవరం, నేడు తిరుపతి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన పవన్ కల్యాణ్ ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరి తిరుపతి అసెంబ్లీ సీటు గంట నరహరి కి ఖరారు చేసిన పవన్ కల్యాణ్ నరసాపురంలోనూ ఇదే పంథా టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు ఇదేం పొత్తు అంటూ పవన్పై జనసేన నాయకుల ఆగ్రహం 4:48 PM, Mar 13th, 2024 ఈ నెల 18 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం తొలిరోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో సీఎం జగన్ ప్రచారం రోడ్ షో కూడా ఉండే అవకాశం రోజూ రెండు మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ 4:35 PM, Mar 13th, 2024 బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి పరాభవం చంద్రబాబు నివాసానికి వచ్చిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుని కలిసేందుకు అనుమతి లేదంటూ గేటు వద్ద నిలిపేసిన పోలీసులు బీజేపీ నుంచి జమ్మలమడుగు టికెట్ ఆశిస్తున్నా ఆదినారాయణరెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని చెపుతున్న బీజేపీ సీనియర్ నేతలు ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ఇదే అంశంపై భేటీ అయినా బీజేపీ పెద్దలు చంద్రబాబు ద్వారా టిక్కెట్ కోసం మంతనాలు చేయాలని వచ్చిన ఆదినారాయణరెడ్డి 3:59 PM, Mar 13th, 2024 ఏపీ బీజేపీలో ముసలం పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తి అరకుకి కొత్తపల్లి గీత,రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపాటు జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై చర్చిస్తున్న సీనియర్లు చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై చర్చ పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటున్న సీనియర్లు 3:55 PM, Mar 13th, 2024 పశ్చిమగోదావరి: ఉండి టీడీపీలో ముసలం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం టీడీపీకి గుడ్బై చెప్పే యోచనలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు 20 ఏళ్ల నుంచి టీడీపీకి నిబద్ధతతో పనిచేశా: శివరామరాజు నా అభిప్రాయం తీసుకోకుండా అభ్యర్థిని ప్రకటించారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా 3:22 PM, Mar 13th, 2024 వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత గండి రవికుమార్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్ రవికుమార్తో పాటు వైఎస్సార్సీపీలోకి చేరిన స్ధానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్, వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్. 2:55 PM, Mar 13th, 2024 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?: ఎంపీ మార్గాని భరత్ యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారు అంటే.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా? మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి? పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా? బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుక్కి మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారు ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పుకున్నారు మరి ప్రత్యేకహీదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదు? చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి? టీటీడీ డబ్బులతో ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు? పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముకం పెట్టుకుని బీజేపీ తో కలిశారో కూడా చెప్పాలి అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది? రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేశారు చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదు 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు? నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా? జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి జగన్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా? జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా? 2:42 PM, Mar 13th, 2024 జరిగిన మేలు చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా: కమ్యూనిస్ట్ నేత కత్తి పద్మ కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేద ప్రజల మేలుకోసమే.. ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుంది.. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. ఇల్లు లేని వారికి జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది.. ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరు.. ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయి.. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవాలి ట్రోల్ చేయమని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయి అందుకే ఇంతటి ఘోరం జరిగింది గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంది. 2:25 PM, Mar 13th, 2024 టీడీపీలో గుర్తింపు లేదు: మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు ఆవేదన టీడీపీ కోసం కష్టపడి పని చేసినా పార్టీలో తగిన గుర్తింపు లేదు 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆశించాను. టికెట్ అడిగినా కనీసం చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేదు. టీడీపీ కోసం నిబద్ధతతో పనిచేసినా కనీసం గౌరవ ఇవ్వలేదు. గతంలో దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యేగా నాకు అవార్డు వచ్చింది. సర్వేల్లో సైతం భారీ మెజారిటీతో గెలుస్తానని అధిష్టానానికి తెలుసు ఈ 15 రోజుల్లో అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఉండి నియోజకవర్గంలో ప్రజాఅభీష్టం మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను ఏ ప్లాట్ఫామ్ మీద పోటీ చేయనున్నానో రెండు రోజుల్లో ప్రకటిస్తాను. 2:10 PM, Mar 13th, 2024 టీడీపీ, జనసేన ఆత్మగౌవరం లేని పార్టీలు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మోదీకి రాష్ట్రాన్ని దారాదత్తం చేయడానికి చంద్రబాబు, పవన్ సిద్ధమయ్యారు. మోదీని పల్లకిలో ఇద్దరు నేతలు మోస్తున్నారు. పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమిటో చెప్పాలి. రాష్ట్రానికి అన్యాయం చేశారని బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబుకు నీతి నిజాయితీ లేవు. టీడీపీ-జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కలుస్తున్నారు. టీడీపీ-జనసేన కార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఎందుకు చంద్రబాబు, పవన్ మాట్లాడడం లేదు. రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు. టీడీపీ-బీజేపీ-జనసేనది విద్రోహ కూటమి. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో చంద్రబాబు ఎలా కలిశారు. వీరి పొత్తు రాష్ట్రాన్ని ముంచేస్తుంది. 21 సీట్లు తీసుకోవడాన్ని చూసి జనసేన నేతలు సిగ్గు పడుతున్నారు. ఆత్మ గౌరవంలేని పార్టీలు టీడీపీ-జనసేన. ఆత్మ గౌరవంలేని పార్టీలు ఉంటే ఎంత? లేకుంటే ఎంత?. 1:50 PM, Mar 13th, 2024 లోక్సభ బరిలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ లోక్సభ ఎన్నికల్లో పోటీ విశాఖ నుంచి బరిలో కేఏ పాల్ కేఏ పాల్ పోటీపై స్పష్టతనిచ్చిన బాబూ మోహన్ కేఏ పాల్కు మద్దతుగా ప్రచారం చేయనున్న బాబూ మోహన్ 1:20 PM, Mar 13th, 2024 టీడీపీ మహిళా నేతల ఆందోళన.. కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ మహిళా నేతల ఆందోళన. కడప టీడీపీ ఇంచార్జ్ మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు. మాధవికి కడప టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ కార్యకర్తలు. తమను పట్టించుకోని నాయకులు తమకు వద్దంటూ ఒంటి కాలిపై నిలబడి, కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన. నాన్ లోకల్ లీడర్లు వద్దని, లోకల్ లీడర్ల నాయకత్వం కావాలని మహిళల నిరసనలు. 1:00 PM, Mar 13th, 2024 పవన్కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ పవన్ రాజకీయ అజ్ఞాని పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రిని అవుతానన్నాడు పొత్తన్నాడు 60 సీట్ల మనవే అన్నాడు 60 నుంచి 24 సీట్లకు వచ్చాడు ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు వచ్చాడు ఆ 21 సీట్లలోనైనా పోటీచేయడానికి అభ్యర్ధులున్నారా?. రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం మంచితనానికి దుర్మార్గులైన చంద్రబాబు, పవన్, బీజేపీకి మధ్య జరిగే యుద్ధం ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయం 2014లో ముగ్గురూ కలిసొచ్చారు.. విడిపోయారు మళ్లీ ఇప్పుడు ముగ్గురూ కలిసి వస్తున్నారు చంద్రబాబు, పవన్, బీజేపీలకు విలువలు, విశ్వసనీయత లేవు లెక్కాలేదు .. తిక్కా లేదు చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడు చంద్రబాబు, పవన్ పనికిరాని వ్యక్తులు. యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్ 175 చోట్లా పోటీచేయమంటే చంద్రబాబు పారిపోయాడు కనీసం 50 చోట్లైనా అభ్యర్థులను పెట్టమంటే పవన్ పారిపోయాడు టీడీపీ, జనసేన, బీజేపీలకు అడ్రస్ లేకుండా చేస్తాం ఇది రాసిపెట్టుకోండి 175 స్థానాల్లో 175 వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతారు బీజేపీ ఢిల్లీ పారిపోతుంది ఏపీలో ఉండే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ.. ఏకైక నాయకుడు సీఎం జగన్. 12:45 PM, Mar 13th, 2024 అభిమానులకు ముద్రగడ మరో లేఖ తన అభిమానులకు ముద్రగడ లేఖ ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో చేరిక వాయిదా ఈనెల 15, లేదా 16 వ తేదిన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరిక. సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తనతో ఎవరూ రావొద్దని అభిమానులకు మనవి చేసిన ముద్రగడ 12:30 PM, Mar 13th, 2024 వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఇప్పటికే అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారు ఒకటి, రెండు మార్పులతో ఫైనల్ లిస్టు వైఎస్సార్ ఘాట్ వద్ద అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధినేత జగన్ అనంతరం ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న వైఎస్ జగన్ 12:10 PM, Mar 13th, 2024 జేసీ ప్రభాకర్కు భయం పట్టుకుంది: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రిలోనే ఉంటా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టిపోతాడు మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు జేసీ మద్దతు ఇస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జునను మంద లించలేదు తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలిపై జేసీ దురుసుగా ప్రవర్తించారు మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు కౌన్సిలర్ పోతే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు 11:55 AM, Mar 13th, 2024 అందరూ ప్రజా సేవకులే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి దగ్గర్నుంచి వలంటీర్ల దాకా అంతా ప్రజా సేవకులే అవినీతి రహిత పాలనే ధ్యేయంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు మా ప్రభుత్వంలో ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప రికార్డ్ సచివాలయాల వద్దనే ఎరువులు, విత్తనాల దుకాణం ఏర్పాటు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేశాం 11:40 AM, Mar 13th, 2024 పవన్కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ సీఎం జగన్ ఆదేశం మేరకు గాజువాకలో పోటీ చేస్తా గాజువాక నేను పుట్టి, పెరిగిన సొంత నియోజకవర్గం మా తాత, తండ్రి అక్కడ గెలిచారు నేను కూడా సీఎం జగన్ ప్రజాదరణతో గెలుస్తాను. పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారా లేదో తెలియదు ప్రత్యర్థి ఎవరైనా మాకు నష్టం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దొంగలు ఎవరో తేలింది టీడీపీ, జనసేన స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి ఇప్పుడు స్టీల్ప్లాంట్ కార్మికులు, విశాఖ ప్రజలు మూడు పార్టీలకు బుద్ధి చెప్తారు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశాడు పొత్తులో చంద్రబాబు తగ్గించుకోవాల్సిన సీట్లు పవన్ తగ్గించుకున్నారు జనసేన నాయకులు, కార్యకర్తల జీవితాలను పవన్ నాశనం చేశారు సీఎం జగన్ను ఓడించడం అన్నది పవన్ కాదు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు 11:20 AM, Mar 13th, 2024 ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్న జేసీ ప్రభాకర్ నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రి లోనే ఉంటా జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టి పోతాడు మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున కు జేసీ మద్దతు ఇస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జున ను మందలించలేదు తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలితోనూ జేసీ దురుసుగా ప్రవర్తించారు మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు.. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు కౌన్సిలర్ పోతే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు జేసీ ప్రభాకర్పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి మండిపాటు 11:05 AM, Mar 13th, 2024 పొమ్మనలేక పొగపెడుతున్న చంద్రబాబు.. వివాదాల మయంగా మారిన విశాఖ సౌత్ టీడీపీ పరిస్థితి. గండి బాబ్జికి పొమ్మనలేక పొగ పెడుతున్న చంద్రబాబు. సౌత్ నియోజకవర్గం నుంచి మారాలని బాబ్జిపై ఒత్తిడి. మాడుగుల వెళ్లాలని బాబ్జికి ఆదేశం. పొత్తులో భాగంగా సౌత్ సీటు జనసేనకు అంటున్న టీడీపీ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న గండి బాబ్జి. మాడుగుల వెళ్ళేది లేదంటున్న బాబ్జి. సౌత్లో జనసేనకు బలమే లేదంటున్న బాబ్జి అనుచరులు. బాబ్జికి మద్దతుగా అనుచరులు మీడియా సమావేశం. సౌత్ నుంచి జనసేన సీటు ఆశిస్తున్న సీతంరాజు సుధాకర్, వంశీ, సాధిక్. 10:54 AM, Mar 13th, 2024 ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం ఎంపీ సీటు పై బిజెపిలో రగులుతున్న అసంతృప్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయం ఏలూరు పార్లమెంట్లో గత పదేళ్లుగా బిజెపిని బలోపేతం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఈనెల 15న పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశం కు పిలుపునిచ్చిన గారపాటి చౌదరి నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ ఈ నెల 15 న ఏలూరులో ఆత్మీయ సమావేశం లో కీలక ప్రకటన చేయనున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి 10:20 AM, Mar 13th, 2024 భీమవరం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం టీడీపీ అధిష్టానం తనను గుర్తించలేని శివరామరాజు ఆవేదన శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు 9:40 AM, Mar 13th, 2024 పవన్కు గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ పవన్ కల్యాణ్ను మానసిక వైద్యులకు చూపించాలి పవన్ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేపించాలి వ్యాధిని.. రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పవన్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు. ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు. పవన్ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?. చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 24 సీట్లు తీసుకున్నావ్. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు. జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే భాష ఏంటి?. నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను. మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు. మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు. ఇప్పటికే 24 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో. పవన్ కల్యాణ్కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలి. 8:50AM, Mar 13th, 2024 కూటమిలో కొత్త చిచ్చు..! సీట్ల సర్దుబాటుపై అసలు బీజేపీ నేతలలో తీవ్ర అసంతృప్తి అధికారంలో లేనప్పుడు 2014 పొత్తులలోనే నాలుగు ఎంపీ, 13 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశామని గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడంపై మండిపాటు ఎనిమిది ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు తీసుకోవాల్సిదంటున్న అసలు నేతలు అరకు, నరసాపురం స్ధానాలు కోరకపోయినా ఇచ్చినట్లుగా పచ్చ మీడియా ద్వారా టీడీపీ లీకులపై బీజేపీలో ఆందోళన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి పేర్లే జాబితాలో లేకుండా టీడీపీ కుట్రలు చంద్రబాబు కోసం పనిచేసే సీఎం రమేష్, సుజనాచౌదరి, కొత్తపల్లి గీత, పురందేశ్వరి పేర్లపై అసంతృప్తి మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే టిక్కెట్లు కేటాయించాలంటున్న బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిపి ఫిర్యాదు చేసే యోచనలో అసలు బీజేపీ అగ్రనేతలు 8:15AM, Mar 13th, 2024 పయ్యావుల కేశవ్ ప్రలోభాలు.. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓటర్లకు ప్రలోభాలు ఉరవకొండ నియోజకవర్గంలో చీరల పంపిణీ చేపట్టిన టీడీపీ నేతలు ఇంటింటికీ చీరలు, కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు చీరలు తీసుకోండి.. పయ్యావుల కేశవ్కు ఓటేయండి అంటున్న ఉరవకొండ టీడీపీ నేతలు 7:50 AM, Mar 13th, 2024 మోదీకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: లక్ష్మీపార్వతి ప్రధాని మోదీకి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి గుజరాత్ నుంచి మోదీని అరెస్ట్ చేసి, బహిష్కరించాలని అప్పటి ప్రధాని వాజ్పాయ్కు బాబు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. రాజకీయ స్వలాభం కోసం పొత్తులు, ఎంతటి నీచానికైన దిగజరుతాడు అనటానికి బీజేపీ పంచన చేరడమే నిదర్శనం సిద్దం సభలకు వచ్చే ప్రజల్ని చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది ప్రజలకు డీబీటీ ద్వారా 2.50 లక్షలు కోట్లు పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించారు రాష్ట్రంలో టీడీపీ అండ్ కో పార్టీలను పాతాళానికి తొక్కే రోజులు ఆసన్నమయ్యాయి. 7:20 AM, Mar 13th, 2024 వైఎస్సార్సీపీ 12వ జాబితా విడుదల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితా విడుదల చిలకలూరిపేట సమన్వయకర్తగా కావటి మనోహర్నాయుడు గాజువాక సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్. 7:00 AM, Mar 13th, 2024 చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్ కోరిన ఏపి బీజేపీ సీనియర్లు బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30 మంది బీజేపి అగ్ర నేతలు వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని కోరుతున్న బీజేపీ నేతలు ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు 6:50 AM, Mar 13th, 2024 పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం పవన్ స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు. పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది 6:40 AM, Mar 13th, 2024 చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్ నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా? ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా? పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా? నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు సీఎం జగన్ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్ చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్కు ఏం సంబంధం తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా? పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా? రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా? బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా? బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు? తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది ఆ పార్టీని హుస్సేన్ సాగర్లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్ని సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా.. 6:30 AM, Mar 13th, 2024 నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య రాజుకున్న చిచ్చు పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్కు టికెట్ కేటాయింపు సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం టికెట్ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్ ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ -
AP: కూటమిలో తేలని సీట్ల పంచాయితీ
సాక్షి, విజయవాడ: ఏపీలో పొత్తుల తక్కెడ తప్పుడు ప్రయోగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ - జనసేన - టీడీపీ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోగా విభేదాలు పొడసూపుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా పలు స్థానాల్లో కొత్త ముఖాలు తెరపైకి రావడం అగ్గి రాజేస్తోంది. ఇప్పటివరకు జరిగిన చర్చలు, దాని తర్వాత బీజేపీ, టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడిన దాని ప్రకారం.. ఏపీలో వివిధ పార్లమెంటు సీట్లకు బీజేపీ పోటీ చేసే పేర్లు ఇలా ఉన్నాయి. అనకాపల్లి : సీఎం రమేష్ అరకు: కొత్తపల్లి గీత రాజమండ్రి : పురందేశ్వరి ఏలూరు : సుజనా చౌదరీ హిందూపూర్ : పరిపూర్ణానంద రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి జనసేన మచిలీపట్నం: బాలశౌరి కాకినాడ : పవన్ కళ్యాణ్ అలాగే అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నేతల పేర్లు ఇలా ఉన్నాయి. విశాఖ నార్త్ : విష్ణుకుమార్ రాజు జమ్మలమడుగు: ఆదినారాయణ రెడ్డి కదిరి : విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడ సెంట్రల్ : యామిని చోడవరం/మాడుగుల : మాధవ్ కైకలూరు: కామినేని శ్రీనివాస్ ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్నది, స్థానిక బీజేపీ నేతలను ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే.. పైన ప్రచారంలోకి వచ్చిన పేర్లలో ఒరిజినల్ బిజెపి నేతలే లేరని క్షేత్ర స్థాయిలో గగ్గోలు మొదలైంది. బిజెపికి ఇచ్చిన ఆరు ఎంపీ సీట్లలో పోటీ చేసేది నలుగురు టిడిపి వాళ్లేనని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం నుంచి వచ్చింది : సీఎం రమేష్, సుజనా చౌదరి కాంగ్రెస్ నుంచి వచ్చింది : పురందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి ఇతర పార్టీ నుంచి వచ్చింది : కొత్తపల్లి గీత, పరిపూర్ణానంద ఇన్నాళ్లు విశాఖను నమ్ముకుని పార్టీ కోసం తిరిగిన జీవీఎల్, రాజమండ్రిలో ప్రతీ చిన్న కార్యక్రమంలో కనిపించే సోము వీర్రాజుకు టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడం సగటు బీజేపీ కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తోంది. విశాఖ నుంచి పోటీ చేసేందుకు జీవీఎల్ ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో విశాఖలోనే ఇల్లు కొనుక్కొని గత రెండేళ్లుగా అక్కడే ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. రాజమండ్రి లోక్సభ స్థానం ఆశించిన స్థానిక సీనియర్ నేత సోము వీర్రాజుది ఇదే పరిస్థితి. హిందూపూర్ లోక్సభ స్ధానం కోరిన విష్ణువర్దన్ రెడ్డికి కూడా హ్యాండిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీ కీలక నేతలకి టిక్కెట్ లేకుండా చేశారని పురంధేశ్వరిపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. బీజేపీ గతంలో పోటీ చేసి గెలిచిన విశాఖ ఎంపీ సీటును పురందేశ్వరీ అడగకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ అగ్రనేతలతో నేడు పవన్ కల్యాణ్, చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్లో మరోసారి భేటీ కానున్నారు. నిన్న జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేడు మరోసారి భేటీ అవుతున్నారు. -
జిత్తుల మారి చంద్రబాబు.. ఈ చిలుక పలుకులు గుర్తున్నాయా?
ఏపీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పొత్తుల రాజకీయం నడుస్తోంది. నీకు ఇన్నీ.. నాకు ఇన్నీ.. అని సీట్లను పంచుకుంటున్నారు. ఒంటరిగా వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి భయంతో వణికిపోతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఇక, తాజాగా బీజేపీతో చంద్రబాబు జతకట్టారు. ఇన్ని రోజులు ప్రధాని మోదీని తిట్టిన బాబుకు.. ఇప్పుడెందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందో తెలుసా..? టీడీపీ హయంలో చంద్రబాబు చేసిన అవినీతిని సీఎం జగన్ బయటకు తీశారు. దీంతో, చంద్రబాబు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇన్ని రోజులు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే బాబుకే గట్టి షాక్ తగలడంతో వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఈ కేసుల నుంచి బయటపడేందుకే చంద్రబాబు కొత్త రాజకీయం చేశారు. ఎన్డీయేలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్ను గాలికి వదిలేసి, సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. గతంలో ఎన్డీయే నుంచి ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చానని బాబు ప్రగల్బాలు పలికాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి హామీ లేకుండానే చంద్రబాబు ఎన్డీయే కూటమిలో చేరిపోయాడు. తనను వెంటాడుతున్న కేసుల భయంతో అమిత్ షా ఇంటి వద్ద పడిగాపులు పడి మరీ పొత్తులు పెట్టుకున్నారు. ఇటీవల బయటపడిన ఐఎంజీ భూమలు కుంభకోణం, రాజధాని భూముల స్కాం, స్కిల్ డెవలప్మెంట్ స్కాం నేపథ్యంలోనే చంద్రబాబు ఎన్డీయే పంచన చేరినట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆరోజుల్లో చంద్రబాబు కూతలు.. పచ్చ మీడియా రాతలు ఇలా.. 1) ‘మోసాల మోదీ’ అంటూ చంద్రబాబు మోదీపై ఫైర్. 2) ఎంత అణగదొక్కితే నేను అంత రెచ్చిపోతా.. మోదీ దేశాన్ని భ్రస్టు పట్టించాడు. 3) ‘మోదీ హటావో’ 4) మోదీ జిత్తులు, కోడి కత్తులకు భయపడను. 5) బీజేపీకి సహకరించేవాళ్ళు దేశద్రోహులు. 6) దేశం కోసం స్నేహం.. అంటూ భగవద్గీతతో పోల్చిన ఈనాడు పత్రికలో తాటికాయంత అక్షరాలతో.. చంద్రబాబు, కాంగ్రెస్ల కలయికను.. పొగుడుతూ రాశారు. 7) ఈ దేశంలో అవినీతిని పెంచి పోషించింది నరేంద్రమోదీనే.. నాకొక కొడుకున్నాడు.. నీకు పిల్లలు లేరు.. కుటుంబమే లేదు.. నువ్వు నన్ను విమర్శిస్తున్నావా? అంటూ ఆరోజుల్లో మోదీని చంద్రబాబు దుయ్యబట్టారు ! 8) ఇదిగో మోదీ.. గో బ్యాక్ అంటే మళ్లీ నిన్ను ప్రధాని కుర్చీలో కూర్చోమంటున్నామనుకున్నావేమో.. గో బ్యాక్ అంటే.. నువ్వు గుజరాత్కి పోయి.. నీ సొంత ఊర్లో ఉండిపొమ్మంటున్నాం.. నీకు ప్రధానిగా ఉండే అర్హత లేదని గుర్తుంచుకో అంటూ మోదీని చంద్రబాబు హెచ్చరించారు. కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో 23 సీట్లొచ్చి ఇత్తడైపోవడంతో, పాత కేసులు.. 18 స్టేలు గుర్తుకువచ్చి బీజేపీతో విభేదించి నేను చాలా నష్టపోయానంటూ.. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ , గరికపాటి , టీజీ వెంకటేష్లను బీజేపీలోకి పంపిన చంద్రబాబు. ఇలా గత ఐదేళ్లుగా ఒకవైపు బీజేపీకి ప్రేమ లేఖలు రాస్తూ.. మరొకవైపు దత్తపుత్రుడుతో రాయబారాలు నడిపి.. ఇప్పుడు మళ్లీ బీజేపీ పంచన చేరాడు. దీన్నే అందితే జుట్టు పట్టుకోవడం.. అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అంటారు. ఇక.. వీరి పొత్తుల రాజకీయాలపై ఎల్లో మీడియా రెచ్చిపోయి మరీ ప్రచారం మొదలెట్టింది. ఇలాంటి చెత్త రాజకీయాలకు..‘అనుభవం- గోంగూర, విజన్- విస్తరాకుల కట్ట’ అంటూ బాబును, టీడీపీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, ఇవన్నింటినీ ప్రజలకు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోతే ఎలా చంద్రబాబు. మరోసారి తప్పదు భారీ మూల్యం. -
జనసేన సీట్లకు బాబు ఎసరు!
సాక్షి, అమరావతి: జనసేనకు ఇచ్చిన ఆ కొన్ని సీట్లకు కూడా చంద్రబాబు ఎసరు పెట్టేశారు. పొత్తులో జనసేనకు చాలా తక్కువ సీట్లు కేటాయించారని రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్కళ్యాణ్ మాత్రం ఈ పొత్తు కోసం అవసరమైతే ఆ ఇచ్చిన సీట్లలోనూ కొన్నింటిని వదులుకోవడానికి సిద్దపడినట్టు టీడీపీ ప్రచారం చేస్తోంది. ఫిబ్రవరి 24న పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై పవన్కళ్యాణ్, చంద్రబాబు ఉమ్మడిగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలు కేటాయించినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా బీజేపీతో పొత్తు కుదిరిన తరుణంలో ఆ పార్టీకి కేటాయించాల్సిన సీట్ల కోసం చంద్రబాబు చూపు జనసేన సీట్లపై పడింది. చంద్రబాబు తొలుత బీజేపీకి కేటాయించాలనుకున్న స్థానాల కంటే ఆ పార్టీ పెద్దలు ఎక్కువ స్థానాలు కోరుతుండడంతో ఇప్పుడు బీజేపీకి అదనంగా ఇవ్వాల్సి వచ్చే సీట్ల కోసం జనసేన సీట్లలో కోత పెట్టనున్నట్లు శనివారం టీడీపీ విస్త్రత స్థాయిలో ప్రచారం చేయించింది. టీడీపీ–జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరినప్పటికీ.. బీజేపీకి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అన్నది పూర్తి స్పష్టత రాలేదు. దీనిపై త్వరలో మూడు పార్టీల నేతలు భేటీ కానున్నారు. ఈ తరుణంలో బీజేపీ కోరిక మేరకు అదనంగా సీట్లు ఇవ్వాల్సి వస్తే.. ఆ మేరకు జనసేన సీట్లను సర్దుబాటు చేసేలా మైండ్గేమ్ మొదలెట్టారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా ప్రచారం ఇదివరకు జనసేనతో పొత్తు కుదుర్చుకునే ముందు కూడా బాబు ఇలానే గేమ్ ప్లే చేశారని జనసేన నేతలు ఉదహరిస్తున్నారు. అప్పట్లో జనసేన 60 అసెంబ్లీ సీట్లు, ఐదు పార్లమెంట్ సీట్లు ఆశిస్తుండగా.. 24 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలను కేటాయించబోతున్నట్టు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారని చెబుతున్నారు. ఆ ముందస్తు ప్రచారానికి తగ్గట్లుగానే సరిగ్గా అన్నే సీట్లను జనసేనకు కేటాయించారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో జనసేనపై దెబ్బ వేసేలా వ్యూహం పన్నారని జనసేన నేతల మధ్య చర్చ నడుస్తోంది. జనసేనకిచ్చే మూడు లోక్సభ స్థానాలలో ఒక స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని, అలాగే అసెంబ్లీ స్థానాల్లో కూడా ఐదారు స్థానాలు తగ్గించే అవకాశం ఉందని ఓ వర్గం మీడియా చెబుతోంది. ఇలా సీట్ల తగ్గింపునకు పవన్కళ్యాణ్ ఒప్పుకున్నారని కూడా ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ సైతం అధికారికంగా ఈ ప్రచారాన్ని ఖండించక పోవడం జనసేన శ్రేణులు, పవన్కళ్యాణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వెంట తిరిగే వాళ్లకు కనీసం భోజనాలు కూడా పెట్టించలేని స్థితిలో ఉన్న జనసేనకు ఈ మాత్రం సీట్లు ఇవ్వడమే గొప్ప అని తాడేపల్లిగూడెం సభ సాక్షిగా పవన్ కళ్యాణే సర్దిచెప్పుకున్నప్పుడు చంద్రబాబు ఇలా వెన్నుపోటు పొడవకుండా ఉంటారా.. అని పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కాళ్లబేరం ఓకే.. నిస్సిగ్గుగా మళ్లీ బీజేపీతో చంద్రబాబు పొత్తు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు పడిన అనంతరం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో టీడీపీ – జనసేన పొత్తు కుదిరింది. ఈ మేరకు శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంపూర్ణ మద్దతు తమకు ఉంటుందని ఆశిస్తున్నట్లు వారు ఆకాంక్షించారు. పొత్తుల వ్యవహారంలో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు మూడు రోజుల పాటు హస్తినలో మకాం వేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు శనివారం మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తుల అంశంపై అసంపూర్తిగా ఆగిపోయిన అంశాలపై, బీజేపీ డిమాండ్లపై చర్చించారు. రాష్ట్రంలోని 25 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన పార్టీలకు కలిపి 8 స్థానాలను, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు ముగ్గురి మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని టీడీపీ వర్గాల సమాచారం. కాగా, లోక్సభ, అసెంబ్లీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన విధివిధానాలపై చర్చించేందుకు ఒకటి రెండు రోజుల్లో మరోసారి మూడు పార్టీల నాయకులు భేటీ అవుతారని ఆయా పార్టీలు ప్రకటించాయి. కాగా, ఎన్డీఏలో చేరాలన్న టీడీపీ, జనసేనల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు జేపీ నడ్డా తెలిపారు. చకోర పక్షుల్లా ఎదురు చూపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు బీజేపీతో పొత్తు విషయంలో ఎదురుచూపులు తప్పలేదు. వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కొనేందుకు ధైర్యం లేని టీడీపీ.. జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయినా వైఎస్ జగన్పై పోటీకి బలం సరిపోదని కొద్ది రోజులుగా బీజేపీ సాయం కోరుతూ వస్తోంది. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలని ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు గురువారం మొదటి దఫా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. అయితే బీజేపీ, జనసేనలకు కలిపి కేటాయించే సీట్ల విషయంలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ డిమాండ్లకు తగ్గట్లుగా 8 నుంచి 10 లోక్సభ స్థానాలను కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతేగాక పార్టీలో అంతర్గతంగా తాము చర్చించుకున్న తర్వాత మరోసారి కలుద్దామని బాబు ద్వయానికి స్పష్టం చేసింది. శుక్రవారం మొత్తం బీజేపీ పెద్దల నుంచి కబురు వస్తుందని చంద్రబాబు, పవన్కళ్యాణ్లు చకోర పక్షుల్లా ఎదురు చూశారు. అయితే శనివారం ఉదయం పొత్తుల వ్యవహారంపై చర్చించేందుకు అమిత్ షా, నడ్డాలను కలవాలని అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు రాగానే ఉదయం 11:10 గంటలకు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు షా నివాసానికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు జరిగిన చర్చల అనంతరం బాబు ద్వయం అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కలిసి పోటీ చేసే విషయంపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదరిందని సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. నీతిలేని బాబు.. అనైతిక పొత్తు రాష్ట్ర ప్రయోజనాల పేరు చెప్పి సొంత వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో నేర్పరి అయిన చంద్రబాబు మరోసారి అదే బాట ఎంచుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. తద్వారా తాను నీతి లేని రాజకీయ నాయకుడినని, తనకు రాజకీయ అవసరాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో పని ఉండదని నిరూపించారు. పైకి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని బిల్డప్ ఇచ్చుకుంటున్నా, అవినీతి కేసుల నుంచి తనను రక్షించుకోవడమే లక్ష్యంగా ఆయన బీజేపీ పెద్దల ఎదుట సాగిలపడినట్లు స్పష్టమవుతోంది. మూడు రోజులపాటు ఢిల్లీలోనే తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్తో కలిసి మకాం వేసి.. అమిత్ షా కరుణ కోసం పాకులాడటం స్పష్టంగా కనిపించింది. తనను కేసుల నుంచి బయట పడేయాలని, అందుకోసం తాను దేనికైనా సిద్ధమని కాళ్లావేళ్లాపడి పొత్తుకు ఒప్పించారని తెలుస్తోంది. దీంతో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు బీజేపీ కేంద్ర కార్యాలయం శనివారం సాయంత్రం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. సీట్ల సర్దుబాటు మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. త్వరలో ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తారో తేలుతుందని బీజేపీ ప్రకటించినా, చంద్రబాబు మాత్రం బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినట్లు ఎల్లో మీడియాకు లీకులిచ్చారు. జనసేన, బీజేపీకి కలిపి 30 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాలు కేటాయించినట్లు ఎల్లో మీడియాలో అదేపనిగా ప్రచారం చేయిస్తుండడం గమనార్హం. మోడీని తిట్టి.. ఎన్డీఏపై అవిశ్వాసం పెట్టి.. ఇదే చంద్రబాబు 2018లో ఏన్డీఏ నుంచి నిష్క్రమించాక బీజేపీ పెద్దలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. 2014లో తన ప్రయోజనం కోసం ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు. గెలిచాక కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో అధికారాన్ని పంచుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారు. దానిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేయడంతో భయపడి 2018లో యూటర్న్ తీసుకుని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్తో కలిశారు. ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏను టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఎన్టీఏ ప్రభుత్వం రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిందని, హోదా ఇవ్వకుండా మోసం చేసిందని, ప్రధాని మోడీది విఫల ప్రభుత్వమని, ఆయన దేశాన్ని ముంచేశాడని, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రకరకాల ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోడీ తనకంటే జూనియర్ అని, అదృష్టం బాగుండి ప్రధాని అయ్యారని, ఆయన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారంటూ లెక్కలేనన్ని విమర్శలు చేశారు. చివరికి ప్రధానిని ఉగ్రవాది అని కూడా దూషించారు. ఆయన తల్లిని, భార్య పేర్లను ప్రస్తావించి మరీ దిగజారుడు ఆరోపణలకు దిగారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే నల్ల చొక్కాలు, నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా తిరుపతి పర్యటనకు వస్తే టీడీపీ నేతలతో రాళ్ల దాడి చేయించారు. అంతటితో ఆగకుండా లోక్సభలో ఏన్డీఏకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మోడీని అధికారం నుంచి దించేయాలనేంత వరకూ వెళ్లారు. ధర్మపోరాట దీక్షల పేరుతో నానా హడావుడి చేశారు. కానీ ఆయన వ్యూహాలు, రాజకీయాలు తల్లకిందులై ప్రజలు చంద్రబాబును వదిలించుకున్నారు. చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనంత ఘోర వైఫల్యాన్ని కట్టబెట్టారు. పైకి బీజేపీ, జనసేన.. లోపల కాంగ్రెస్తో.. గతంలో నోటికొచ్చినట్లు తిట్టిపోసి, విడిపోయిన ఎన్డీఏతో మళ్లీ కలిసి ప్రయాణించేందుకు చంద్రబాబు సిగ్గు విడిచి చేతులు కలపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని వ్యక్తిగతంగా దూషించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అనరాని మాటలు అని.. ఇప్పుడు ఆ విషయాన్నే మరచిపోయినట్లు నటిస్తూ రాజకీయ లబ్ధే పరమావధిగా ఇప్పుడు మళ్లీ పొత్తు కుదుర్చుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒకవైపు అధికారికంగా బీజేపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకుని.. తెరవెనుక లోపాయికారిగా కాంగ్రెస్తోనూ అవగాహనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడుతుండడం, ఆమెకు బాబు మద్దతుగా నిలిచి మాట్లాడుతుండడం తెలిసిందే. ఇలా అపవిత్ర పొత్తులు, అవగాహనల ద్వారా తనకంటూ ఒక విధానం, ఒక పద్ధతి లేదనే విషయాన్ని చంద్రబాబు నిస్సిగ్గుగా చాటి చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేకే.. సీఎం వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు ఇప్పటికే జనసేనతో బంధాన్ని కొనసాగిస్తున్నారు. జగన్కు పోటీ ఇవ్వడానికి అది సరిపోదనే భావనతో కేంద్రంలో బీజేపీ మద్దతు కోసం చాలా కాలంగా ప్రాధేయ పడుతున్నారు. సరికొత్త గిమ్మిక్కులతో ఎట్టకేలకు ఆ కూటమితో జట్టుకట్టారు. మూడు రోజులు అమిత్షా ఇంటి వద్దే పడిగాపులు పడి, చివరికి బీజేపీ ఏం చెప్పినా చేసేందుకు సిద్ధపడి ఎన్డీఏలో చేరుతున్నారు. బీజేపీ, జనసేనతో కలిసి నడిస్తేనే ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కనీస పోటీ అయినా ఇవ్వగలనని మొదటి నుంచి చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీని బతికించుకోవడంతోపాటు తన కొడుకు రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే బీజేపీతో సయోధ్య తప్పదనే ఆలోచనతోనే సిగ్గు విడిచి ఆ పార్టీతో జట్టు కట్టారని స్పష్టమైంది. మళ్లీ ఎన్డీఏలో చేరాం బీజేపీతో పొత్తు కుదిరిందని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్లీ ఎన్డీఏలో చేరుతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. శనివారం ఢిల్లీ నుంచి ఆయన టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. బీజేపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో కొన్ని సీట్లను వదులుకోక తప్పదన్నారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు. సీట్ల పంపకం చివరి దశకు చేరుకుందని, మరో సమావేశం తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. పొత్తులో భాగంగా ప్రస్తుతానికి 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను బీజేపీ, జనసేనలకు ఇస్తున్నట్లు నేతలకు తెలిపారు. టీడీపీ–బీజేపీ–జనసేన మధ్య పొత్తుపై ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు. టీడీపీకి కేంద్రం సహకారం చాలా అవసరమని, పొత్తుకు ఇదే కారణమని చెప్పారు. ఈ నెల 17న టీడీపీ–జనసేన నిర్వహించే ఉమ్మడి భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించామని తెలిపారు. మూడు పార్టీలు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తామని చెప్పారు. మోడీ పాల్గొనే అవకాశం ఉందని, ఇందుకు అనువైన ప్రదేశం ఎంపిక చేయాలని నేతలకు సూచించారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇదిలా ఉండగా ‘తిరిగి ఎన్డీఏలో చేరినందుకు సంతోషిస్తున్నా. పవన్ కళ్యాణ్తో కలిసి, ఏపీలో ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికేందుకు, మోడీతో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఎక్స్లో చంద్రబాబు పోస్ట్ చేశారు. ఇది మూడు పార్టీల మధ్య పొత్తు మాత్రమే కాదని, దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్న ముగ్గురి భాగస్వామ్యమని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో పదేళ్లగా కొనసాగుతున్న గందరగోళంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వ కారణంగా ఐదేళ్లుగా తలెత్తిన సమస్యలు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయిక ద్వారా తీరబోతున్నాయని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ తెలిపారు. ఎన్డీయేలో భాగస్వామిని చేసినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలుపుతూ శనివారం ఎక్స్లో పోస్ట్ చేశారు. మూడు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని జనసేన పార్టీ శనివారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. కోవర్టుల సాయంతో బీజేపీ చెంతకు 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాక కాంగ్రెస్ను వదిలేసిన చంద్రబాబు.. వెంటనే నిస్సిగ్గుగా బీజేపీని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే బీజేపీ ప్రాపకం కోసం పరితపిస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు గుంట నక్క రాజకీయాలు గ్రహించిన ప్రధాని మోడీ ఆయన్ను ఇన్నాళ్లూ దరి చేరనీయలేదు. అయినా చంద్రబాబు పట్టు విడవకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం తన బినామీలైన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారిని అధికారం పోగానే బీజేపీలోకి పంపారు. వారు బీజేపీలో ఉంటూనే చంద్రబాబు కోవర్టులుగా పనిచేస్తూ ప్రస్తుతం పొత్తు కుదర్చడంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర బీజేపీలోని ముఖ్య నాయకులను తన గుప్పిట్లో పెట్టుకుని వారి ద్వారా బీజేపీతో కలిసేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీతో పొత్తు కలిపేలా చేసి ఆయన్ను కూడా తన కోసం పని చేయించుకున్నారు. జనసేన బీజేపీతో పొత్తులో ఉండగానే, తాను జనసేనతో పొత్తు పెట్టుకుని మూడు పార్టీలు కలిసి పని చేయాలనే దిక్కుమాలిన వ్యూహాన్ని అమలు చేశారు. అందులో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దల కాళ్లావేళ్లా పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల స్వయంగా బయటపెట్టారు. పొత్తు కుదిర్చే క్రమంలో బీజేపీ పెద్దలతో తాను ఛీవాట్లు తిన్నట్లు కూడా చెప్పారు. దీన్నిబట్టి చంద్రబాబు బీజేపీతో కలిసేందుకు తెర వెనుక ఎందరిని ప్రయోగించారో, ఎన్ని కుయుక్తులు పన్నారో అర్థమవుతోంది. మొత్తంగా చంద్రబాబు కాళ్ల బేరానికి రావడంతో బీజేపీ పెద్దలు పొత్తుకు అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు రెండవసారి బీజేపీతో కలవడంపై రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. -
టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులు కుదిరాయా..?
-
Delhi: చంద్రబాబు, పవన్ గప్చుప్.. అసలేం జరిగింది?
సాక్షి, ఢిల్లీ: ఎట్టకేలకు చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరు ముగ్గురు దాదాపు గంటపాటు పొత్తులపై చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ, చివరకు ఎలాంటి ప్రకటనా వెల్లడించకపోవడం గమనార్హం. కాగా, అమిత్షాతో చంద్రబాబు, పవన్ భేటీ ముగిసిన అనంతరం ఎలాంటి సంయుక్త పొత్తు ప్రకటన వెలువడలేదు. వీరి భేటీపై ప్రకటన చేయకుండా ఎవరికి వారే విడివిడిగా వెళ్లిపోయారు. అయితే, వీరి భేటీ గురించి మాత్రం టీడీపీ కొన్ని లీకులు ఇస్తోంది. మూడు పార్టీల పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి కలిపి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్టు టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జనసేనకు కేటాయించిన సీట్లలోనే చంద్రబాబు కోత పెట్టినట్టు తెలుస్తోంది. ఇక, టీడీపీ మాత్రం 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. ఇదే సమయంలో అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కాగా, పొత్తులపై వీరు ఎప్పుడు స్పందిస్తారో వేచిచూడాలి. త్యాగానికి జనసేన రెడీ.. కూటమి పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ మరో త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. జనసేనకు ఇచ్చిన మూడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్క స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన కేవలం అనకాపల్లి, మచిలీపట్నం నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, ఈ రెండు స్థానాల్లో కాకినాడలో పవన్ కల్యాణ్, మచిలీపట్నం నుంచి బాలశౌరీ పోటీ నిలిచే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ పెద్దల సూచనల మేరకు పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రఘురామకు చేదు అనుభవం.. ఇదిలా ఉండగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చేదు అనుభం ఎదురైంది. చంద్రబాబు, పవన్ తమ వెంట రఘురామను అమిత్ షా వద్దకు తీసుకువెళ్లలేదు. దీంతో, సిబ్బంది కూడా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనను లోపలికి అనుమతించాలని కాల్స్ మీద కాల్స్ చేశారు. అయినా కూడా రఘురామను లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేమీ లేక వారు బయటకు వచ్చేంత వరకు రఘురామ గేటు బయలే నిలబడ్డాడు. -
ఢిల్లీలో పొలిటికల్ ట్విస్ట్లు.. చంద్రబాబుతో పొత్తు డౌటే!
సాక్షి, ఢిల్లీ: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై ఢిల్లీ వేదికగా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షాతో పొత్తుల విషయం చర్చించేందుకు చంద్రబాబు, పవన్ పడిగాపులు కాస్తున్నారు. అయితే, అమిత్ షా మాత్రం చంద్రబాబును పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడంలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా, అమిత్ షా ప్రస్తుతం ఒడిషా, మహారాష్ట్ర పొత్తులకు సంబంధించిన చర్చలతో బిజీగా ఉన్నారు. మరోవైపు.. ఈరోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా బీహార్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. పాట్నాలో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆలోపు చంద్రబాబుతో అమిత్ షా భేటీ అవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఇక.. చంద్రబాబు, పవన్ అమిత్ షా ఇంటి ముందే ఉన్నట్టు సమాచారం. ఈరోజు కూడా చర్చలు జరగకపోతే వీరిద్దరూ రేపటి వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఉదయం అమిత్ షా భేటీ కాకపోతే మళ్లీ రాత్రి వరకు చంద్రబాబు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. బీజేపీ-టీడీపీతో పొత్తు చర్చలు తేలకపోవడంతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోమువీర్రాజును రాష్ట్రానికి వెళ్లిపోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశంపై బీజేపీ హైకమాండ్ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో తాము కోరుకుంటున్న సీట్లు ఇవ్వకపోతే పొత్తు ప్రసక్తేలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక, ప్రవాస్ యోజన కింద కేంద్ర బీజేపీ ఏపీలో 11 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా 11 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎంపీ స్థానాల విషయంలో తగ్గేదేలేదని కాషాయ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కన్నింగ్ మైండ్ సెట్తో ఏపీలో బీజేపీని కొన్ని స్థానాలకే పరిమితం చేసే చూస్తూ ఊరుకునేదిలేదని గట్టిగానే వారు చెప్తున్నారు. ఎన్నడూ గెలవని జనసేనకి 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. గతంలో ఆరు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. దీంతో, టీడీపీ-జనసేన కూటమి తటపటాయిస్తోంది. -
చంద్రబాబు ‘రాజీ’కీయం.. కమలనాథులు మర్చిపోయారా?
ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబును చూసిన వాళ్లెవరిని అడిగినా.. అడక్కపోయినా చెబుతున్నారు. పెరుగుతున్న వయస్సుకు అదనంగా చంద్రబాబు కళ్లలో ఓటమి భయం, తాను ఓడిపోతే తన పుత్ర రత్నం భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన.. వీటన్నింటికి మించి గతంలో చేసిన పాపాలు, వెంటాడుతున్న తప్పులు. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేని ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీపై నమ్మకం లేక, తనపై తనకే బోలెడు భ్రమల మధ్య.. కనీసం హస్తినకు వెళ్లి బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు చంద్రబాబు. వెంట పవన్ కళ్యాణ్. విలువలు లేని రాజకీయాలకు అంబాసిడర్లా ఇద్దరు నాయకులు మారారంటూ వైఎస్సార్సిపి చేస్తోన్న విమర్శలకు సమాధానం చెప్పలేని దుస్థితి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఢిల్లీ గల్లీల్లో పొత్తుల కోసం కాలుగాలిన పిల్లిలా చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ నేతలను ఎలా ప్రసన్నం చేసుకోవాలా అని దత్తపుత్రుడితో కలిసి బేరసారాలాడుతున్నాడు. దీంతో, బీజేపీ ఎన్ని కండీషన్స్ పెట్టినా ఓకే అనేందుకు సిద్ధమయ్యారు. పొత్తులు లేనిదే రాజకీయం చేయలేనని హస్తినలో ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. పథకాల అమలులో అవినీతి, పక్షపాతం లేకపోవడంతో ప్రతీ ఒక్కరూ సీఎం జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని బహిరంగంగానే చెబుతున్నారు. అటు సర్వేలు కూడా మరోసారి వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని నంబర్లతో సహా వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి జగన్ ఎప్పటిలాగే ప్రజలతో మమేకమవుతూ ఎన్నికలకు ‘సిద్ధం’ అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వెన్నులో భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే టీడీపీ హయంలో చేసిన అవినీతిని ప్రభుత్వం బయటకు తీసి మళ్లీ జైలుకు పంపిస్తారని వణికిపోతున్నారు. ఈ క్రమంలో తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్తో కలిసి బీజేపీతో పొత్తుల కోసం ఢిల్లీ బాట పట్టారు. బీజేపీ పెద్దలను ఒప్పించడం కోసం పచ్చ బ్యాచ్ అంతా చంద్రబాబుకు అండగా నిలుస్తోంది. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా బీజేపీలో చేరిన టీడీపీ నేతలు, పవన్.. బీజేపీతో పొత్తు కోసం చాలానే కష్టపడుతున్నారు. ఛీ.. మాకేమీ టీడీపీతో పొత్తు వద్దని స్థానిక బీజేపీ నేతలు చెబుతున్నా చంద్రబాబు మాత్రం సిగ్గులేకుండా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. అయితే, గతంలో చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకుంటే సగటు కాషాయనేత, కార్యకర్తలకు కోపం రాకుండా ఉండకపోవచ్చు. టీడీపీ, చంద్రబాబుకు వారు ఎలా మద్దతిస్తారు. అందితే తల.. లేకపోతే కాళ్లు అన్నట్టుగా చంద్రబాబు ప్రతీసారి తన ప్రయోజనాల కోసం రాజకీయం చేశారే తప్ప ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదు అనేది అసలైన నిజం. చంద్రబాబు పదవి, ప్రయోజనం కోసమే స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేశాడు. 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీయే నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికాడు. ఇప్పుడు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీయేలో చేరడంలో మతలబు ఏంటి?. ఇది రాష్ట్ర ప్రయోజనమా? సొంత పార్టీ ప్రయోజనమా?. ఈ విషయం బాబే చెప్పాలి. మొన్నటి వరకు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు.. ఇప్పుడేమంటారు?. గతంలో ప్రధాని మోదీని టార్గెట్ చేసి మోసాల మోదీ.. మోదీ జిత్తులకు భయపడును.. మోదీపై రాజీలేదు. మోదీ హటావో.. బీజేపీకి సహకరించేవాళ్లు దేశద్రోహులు. మోదీని ఓడించాలనేదే తన లక్ష్యం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు బాబోరు ఇప్పుడేం సమాధానం చెబుతారో?. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనకుంటుంది. అలాగే, చంద్రబాబు కూడా తాను ఏం చేసినా చెల్లుతుంది.. ప్రజలకు ఏమీ తెలియదనుకుంటున్నాడు. తనకు ఎల్లో మీడియా సపోర్టు ఉందని ప్రజలను ఎలాగైనా బుట్టలో వేసుకోవచ్చనే ప్లాన్లో ఉన్నాడు. కానీ, బాబు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే.. సింహంలా సింగిల్గా వస్తున్నది ముఖ్యమంత్రి జగన్ అని. పచ్చ నేతలకు, ఎల్లో మీడియాను ఎదుర్కొనేందుకు సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’గా ఉన్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్పై కేశినేని నాని హాట్ కామెంట్స్.. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారు 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడు కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడు అప్పట్లో నాతో మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది. కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ, అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు ఎన్డీయే నుంచి ఎందుకు బయటికి వచ్చాడో.. తిరిగి ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా?. రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా?. అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా?. చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. తను, తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనేది చంద్రబాబు భయం టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం పగటి కలే. ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు చంద్రబాబు వెళ్లిపోతాడు. -
బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్లాన్.. బాబు ఇస్తామన్న లోక్సభ స్థానాలివే!
సాక్షి, అమరావతి: ఏపీలో జెండాలు కలవడమే ఎజెండాగా మారుతోంది ప్రతిపక్షాల రాజకీయం. ఎన్నికలకు ఒంటరిగా వెళ్తే నెగ్గలేమని అర్థమైన విపక్షాలు పొత్తుల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు కోసం కళ్లుకాయలు కాసేలా చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. కాగా, బీజేపీ అండగా ఉంటే కానీ.. ముందుకెళ్లలేమని అర్థమైన చంద్రబాబు, పవన్ ఇప్పుడు హస్తిన వైపు చూస్తున్నారు. ఈ పొత్తులో బీజేపీ పెద్దలు ఎన్ని షరతులు పెట్టినా ఒకే అనేందకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 9 లేదా 10 లోక్సభ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రాథమికంగా బీజేపీకి టీడీపీ ఇస్తామన్న స్థానాలు ఇవే.. 1. వైజాగ్: జీవీఎల్ 2. అరకు: కొత్తపల్లి గీత 3. ఏలూరు: సీఎం రమేష్ 4. రాజమండ్రి: పురంధేశ్వరి/సోము వీర్రాజు 5. నర్సాపురం: అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. 6. రాజంపేట: కిరణ్ కుమార్ రెడ్డి 7. హిందూపురం: విష్ణువర్ధన్ రెడ్డి/సత్యకుమార్/పరిపూర్ణనంద 8. విజయవాడ: సుజనాచౌదరి 9. తిరుపతి: మాజీ ఐఏఎస్ రత్న ప్రభ లేదా ఆమె కూతురు -
కండీషన్లతోనే ఖతం.. చంద్రబాబుకు కొత్త టెన్షన్!
అవసరం మనది అయినప్పుడు అవతలివాళ్లు పెట్టే షరతులు చాలా కఠినంగా ఉంటాయి. పగటిపూట పిలిచిమరీ ఎక్కించుకుని రూ.ఇరవైకి డ్రాప్ చేసే షేర్ ఆటోవాడు అవసరం మనది అయినప్పుడు.. సమయం కాని సమయం అయినప్పుడు నూట యాభై అడుగుతాడు. లేదా నడిచి వెళ్ళండి అంటారు. అర్థరాత్రి నడిచి వెళ్ళాలంటే కుక్కల భయం.. పోనీ వాడిని తోడు రమ్మంటే వాడి రేటు చూస్తేనే ప్రాణం పోయేలా ఉంది. మన అవసరానికి అప్పు అడిగితే నూటికి నెలకు పది రూపాయల వడ్డీ అడుగుతాడు. పోనీ డబ్బులు వద్దంటే ఇటు అవసరం తీరదు. ఇదీ ఒక్కోసారి మనకు ఎదురయ్యే పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే. చూస్తూ చూస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సింగిల్గా ఎదుర్కోలేడు. అలాగని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంటే వాళ్లు పెడుతున్న కండీషన్లు భయంకరంగా ఉన్నాయి. చంద్రబాబు బలహీనతను వాళ్లు ఎంత అలుసుగా తీసుకున్నారో చూస్తుంటే బాబుకు కోపం కట్టలు తెంచుకుంటోంది. అలాగని బీజేపీ వాళ్లను ఏమీ అనలేదు. ఏమన్నా అందాం అంటే.. ఒంటరిగా పోటీచేసుకో.. ఎవరొద్దన్నారు అంటూ అటునుంచి గదమాయింపులు. దీంతో బాబుకు దెయ్యంతో చుట్టరికం చేస్తున్నట్లు ఉంది. ఇవీ షరతులు.. పొత్తుల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఓవైపు గౌరవించుతున్నట్లుగానే నటిస్తున్న బీజేపీ మాత్రం పెద్ద షరతులే విధించింది. ఇందులో భాగంగా చంద్రబాబు.. పవన్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కాకుండా కేవలం ఎంపీలుగా చేయాలని చెప్పింది. అంటే వాళ్ళిద్దరూ లోక్సభకు వెళ్లాలని.. అసెంబ్లీ బాధ్యత బీజేపీ చూసుకుంటుందని చెప్పేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెద్దరికం సంగతి తాము చూసుకుంటామని, ఒకవేళ కూటమికి మెజారిటీ వస్తే బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని, అటు పవన్, చంద్రబాబు ఇద్దరూ ఎంపీలుగా పోటీ చేయాలని, గెలిస్తే వాళ్లను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటాం అని చెప్పింది. ఈ కండీషన్లు చూస్తుంటే చంద్రబాబు రక్తం మరిగిపోతోంది. కానీ, బీజేపీ సపోర్ట్ లేకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము లేదు. అందుకే తోడు కోసం బీజేపీని రమ్మని పిలిస్తే వాళ్ళేమో మొత్తం పార్టీని మింగేస్తున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా చంద్రబాబు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా వెళ్ళడమా.. ప్రధానులను తయారు చేసిన తాను తనకన్నా జూనియర్ అయిన మోడీ దగ్గర మంత్రిగా చేయడమా?. ఈ ఊహలే చాలా అవమానకరంగా ఉన్నాయి. కానీ కాదంటే అసలు ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. - సిమ్మాదిరప్పన్న -
Babu : కరకట్టపై పొత్తులు.. బాబు ఏమన్నాడంటే.?
కరకట్ట నివాసం వేడేక్కింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్వగృహానికే పరిమితమయిన చంద్రబాబు.. ఇవ్వాళ ఉండవల్లిలోని కరకట్ట నివాసానికి వచ్చాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులపై ఆధారపడి అత్యధికంగా ప్రయోజనం పొందిన చంద్రబాబులో.. ఈ సారి మాత్రం ఆ వెలుగు కనిపించడం లేదు. రాజ్యసభలో సైకిల్ మాయం రాజ్యసభ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. గత పది రోజులుగా తెలుగుదేశం వర్గాలు పోటీ చేస్తామంటూ రంకెలేస్తున్నాయి. మా బాబు మామూలోడు కాదని నేతలు పకడ్భందీగా ప్రకటనలిచ్చేశారు. చంద్రబాబు మీద పార్టీ సీనియర్లకు ఎంత నమ్మకం అంటే.. తమ పార్టీ తరపున గెలిచింది 23 మందే అయినా.. తమకు బలం లేదని తెలిసినా.. తమకు అవకాశమిస్తే.. గెలుస్తామని చెప్పుకున్నారు. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిక ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా.. ఎంత డబ్బైనా ముట్టజెప్పి.. తమవైపుకు తీసుకురాగల శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అయితే ఇవ్వాల్టి కరకట్ట మీటింగ్లో ఈ విషయం తేలిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు ప్రకటించారు. YSRCPకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల కోసం తెరవెనక టిడిపి బృందం ఆహర్నిశలు కృషి చేసినా.. ఫలితం దక్కలేదన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించింది. పొత్తులుంటాయి.. కానీ..! కరకట్ట మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగిన రెండో అంశం పొత్తులు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయంటున్నారు, మరి మనతో ఎవరున్నారని చంద్రబాబును పార్టీ సీనియర్లు అడిగారు. దీనిపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులు ఉంటాయని, ఆయా పార్టీల వాళ్లకు సీట్లు కేటాయించాలన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కొత్త వాళ్లు పోటీ చేయడం వల్ల ఇప్పటివరకున్న కొందరికి సీట్లు దొరకవని, అయితే వారికి నష్టం కలగకుండా ఉండేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. (వాలంటైన్స్ డే సందర్భంగా చంద్రబాబు పొత్తుల గురించి సోషల్ మీడియాలో చురకలు) ఇంకా మారని తీరు చంద్రబాబు అంటేనే ఫిరాయింపులు. ఫిరాయింపులు అంటేనే చంద్రబాబు. ఎంత సేపు పక్కపార్టీ నేతలపై కన్నేసి పెట్టే చంద్రబాబు.. తాజాగా కరకట్ట మీటింగ్లో YSRCP నేతలెవరయినా వస్తారా అంటూ ఆరా తీసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పు నిర్ణయం తర్వాత YSRCP నుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని భావించామని నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొందరు నేతలకు అక్కడ టికెట్ లేదనడంతో తమ దగ్గరకు వస్తున్నారని, అక్కడ గెలవలేని వాళ్లు.. ఇక్కడ కూడా గెలుస్తారని అనుకోలేమని, అయినా అవకాశం ఉన్నచోట వారే పార్టీకి పెద్ద దిక్కని చెప్పినట్టు తెలిసింది. లోకేష్తో లాభమా? నష్టమా? ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయని, ఇప్పటివరకు అభ్యర్థులు సరికదా.. పొత్తులు కూడా ఖరారు కాలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే పార్టీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క సభ కూడా పెట్టలేదని చెప్పినట్టు తెలిసింది. త్వరలో ‘‘రా....కదలి రా’’ పేరిట తాను సభలు పెట్టబోతున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అలాగే లోకేష్ శంఖారావం మీటింగ్ గురించి నేతలతో ప్రస్తావించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలిసింది. తరచుగా లోకేష్ చేస్తున్న ప్రకటనలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయంటూ కొందరు బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు కేవలం 56 రోజులే ఉన్నాయని, ఇంకా పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్ లోకి రాకపోతే ఎలా అని చంద్రబాబు అడిగినట్టు సమాచారం. పొత్తులపై క్లారిటీ ఎప్పుడు.? బీజేపీతో పొత్తు పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈనెల 16 సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీకి రావొద్దని పవన్, బాబులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం వారం రోజుల నుంచి వేచి చూస్తున్నా పవన్ను పట్టించుకోవడం లేదు. బీజేపీ సమావేశాలు ముగిశాక ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఈలోగా 17న పర్చూరులో రా కదలిరా సభకు భారీగా జనాన్ని తీసుకురావాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చాడు. పార్టీలో ఎవరైనా చేరేవాళ్లుంటే.. తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. -
ఏపీ Alliance: బాబు పాలిట అశనిపాతంలా..
ఇన్నాళ్లూ ఒకలెక్క... ఇకనుంచి ఇంకోలెక్క ... వాళ్లొచ్చాక.. ప్రతి లెక్కా పక్కా.. అప్పట్లా ఇప్పుడూ నడిపిస్తాం అంటే కుదరదు... టర్మ్స్ మీరు డిసైడ్ చేసే కాలం పోయింది.. మేము రూల్స్ రాస్తాం.. మీరు పాటించాలి అనే పరిస్థితి వచ్చింది.. ఇది కాస్త చంద్రబాబు పాలిట ఆశనిపాతంలా మారింది. దీంతో ఏమి చేయాలో తెలీక చంద్రబాబు గుడ్లనీళ్ళు మింగుకుంటూ దిగులుగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు కోవిడ్ అనే వైరస్ ఫార్ములాను చైనా కనిపెట్టి ప్రపంచాన్ని వణికించడంలో ఎంత నిజం ఉందో లేదో తెలీదు కానీ బీజేపీ కనిపెట్టిన ఈ కొత్త ఫార్ములా మాత్రం చంద్రబాబును వణికిస్తోంది. అద్వానీ.. వాజ్పేయి కాలంలో బీజేపీకి ఉన్న ఆదరణ ఓటు బ్యాంకును వాడుకుని ఒకసారి.. మోదీ క్రేజును వాడుకుని ఇంకోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తరువాత మోదీ, అమిత్ షా వంటివారిని ఎంతలా అవమానించారో టీడీపీ వాళ్ళు మర్చిపోయినా ఢిల్లీవాళ్ళు మాత్రం గుర్తుంచుకున్నారు. ఈసారి కూడా అలాగే బీజేపీ భుజాలమీద నుంచి అధికారం వైపు నడుచుకుంటూ పోదాం అనే చంద్రబాబు ఆశలకు ఢిల్లీ పెద్దలు అడ్డుకట్ట వేశారు. పొత్తు పెట్టుకుందాం.. మీకు అధికారం వచ్చేలా మేము సాయం చేస్తాం.. కానీ ... కానీ అంటూ షరతులు వర్తిస్తాయి అనే మాట వాడారు. ఈసారి బీజేపీ అధిష్టానం మాత్రం షరతులు చాలా పక్కాగా రూపొందించడంతో.. ఎండు చేప ముక్క కోసం వెళ్లి బోనులో ఇరుక్కున్న మాదిరి అయింది చంద్రబాబు పరిస్థితి. ఇంతకూ ఏమిటా షరతులు ? ఇన్నాళ్ల మాదిరి అక్కడా ఇక్కడా ఓ పదిహేను ఎమ్మెల్యే.. ఓ మూడు నాలుగు ఎంపీసీట్లు పడేసి రాష్ట్రం మొత్తం బిజెపికి ఉన్న ఓటు బ్యాంకుకు... ఆదరణను వాడుకోవడం ఈసారి కుదరదు. ప్రతి ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఏడు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు సీట్లు టీడీపీకి పోగా రెండు జనసేనకు, ఇంకోటి బీజేపీకి ఇవ్వాల్సిందే! లేదా రెండు బీజేపీకి.. ఒకటి జనసేనకు ఇవ్వాలి.. అంటే ఫైనల్ గా పాతిక ఎంపీ స్థానాల పరిధిలో 75 సీట్లు ఈ ఇద్దరికీ ఇవ్వాల్సిందే. .. అలా ఇస్తే టీడీపీకి మిగిలేది వంద సీట్లే.. ఇలా ఇస్తే ఆ 75 చోట్లా టీడీపీ నాయకులను నచ్చజెప్పడం అసాధ్యం. నియోజకవర్గాల్లో నాయకులూ కొట్టుకుని చస్తారు. పార్టీ అల్లకల్లోలం అవుతుంది. పోనీ అలా కాదని.. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళితే మొన్న 2019 లో ఏమి జరిగిందో బాబుకు తెలుసు.. ఒంటరిగా జగన్ను అడ్డుకోవడం బాబుకు కలలో కూడా సాధ్యం కాదు. పోల్ మేనేజ్మెంట్.. ఇతరత్రా వ్యవహారాల్లో చాలా పడగబ్బందీగా ఉండే సీఎం వైఎస్ జగన్ను ఎన్నికల్లో నిలువరించడం బాబుకు కుదరని పని. అలాగని బీజేపీ చెప్పినట్లు వింటే పార్టీలో తుపాను వస్తుంది. దీంతో ఏమి చేయాలో అర్థం కాక ఇటు అభ్యర్థులను ఖరారు చేయలేక సైలెంట్ అయ్యారు.. ఇటు వైయస్ జగన్ మాత్రం తమ అభ్యర్థులను ఒక్కొక్కరినీ ప్రకటించుకుంటూ .. సామాజిక సమీకరణాలు.. ఇతరత్రా వ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతుంటే.. టీడీపీ జనసేన కూటమి మాత్రం జాతరలో తప్పిపోయిన పిల్లల్లా బిత్తర చూపులు చూస్తూ తమను ఎవరైనా సేఫ్ ప్రాంతానికి తీసుకుపోలేకపోతారా? అనే ఆశతో అక్కడే ఉండిపోయారు. ✍️సిమ్మాదిరప్పన్న -
టీడీపీ చంద్రబాబు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
తన నలభయ్యేళ్ళ కెరీర్లో చంద్రబాబు గతంలో ఎన్నడూ ఎదుర్కొని సందిగ్ధావస్థను ఎదుర్కొంటున్నారు. ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యి అనేలా ఉంది చంద్రబాబు పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి నష్టం.. పొత్తు లేకపోతె ఎన్నికలకు పోవడం కష్టం.. అనేది ఆయనకు సమజయింది. ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవడం తనకు సింగిల్గా అసాధ్యం కాబట్టి ఢిల్లీ పెద్దల పొత్తు, సపోర్ట్ అవసరం అని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు. దానికితోడు కాపుల మద్దతుకోసం ఇటు పవన్ సైతం కావాల్సి వచ్చింది. దీంతో పవన్, బీజేపీ మధ్యలో టీడీపీ ఇలా ముగ్గురూ పొత్తులో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఇప్పుడున్న బీజేపీ గతంలో అద్వానీ.. వాజ్పేయ్ కాలం నాటి బీజేపీ కాదు. ఇది మోదీ, అమిత్ షాల సారధ్యంలో ఉన్న టర్బో ఇంజిన్ ఉన్న ఫైటర్ జెట్ లాంటి బీజేపీ. దానికి ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే తప్ప కలుపుకుని పోవడం అలవాటులేదు. దానికితోడు జాతీయ స్థాయిలో అవకాశవాదానికి బ్రాండ్ నేమ్ అని ముద్రపడిన చంద్రబాబును నమ్మడం ఇప్పుడు బీజేపీకి అవసరం లేదు. గతంలో అంటే 1999, 2014లో బీజేపీ సపోర్ట్తో గెలిచిన చంద్రబాబు ఆ తరువాత ఆ పార్టీని దాని నాయకులను ఎలా అవమానించింది అందరికీ తెలిసిందే. కేవలం పదిహేను సీట్లు పడేసి.. బీజేపీ మద్దతు పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది పవర్ అనుభవిద్దాం అనుకుంటే అప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు నడవదు. అవ్వాకావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. కాబట్టి ఈసారి పొత్తులకు వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ వాళ్ళు సవాలక్ష కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు నలభైకి పైగా సీట్లు అడుగుతున్నట్లు తెలిసిందే. అంటే బీజేపీకి నలభై.. జనసేనకు కనీసం ఓ పాతిక సీట్లు ఇవ్వకతప్పదు. అంటే మొత్తం అరవై సీట్లు వదిలేసి ఎన్నికలకు వెళ్ళాలి. ఇలా అరవై వదిలేస్తే అక్కడ టీడీపీ ఆశావహులు ఊరుకుంటారా?. వాళ్ళు చేసే గొడవ అంతా ఇంతా కాదు.. పోనీ ఈ అరవై సీట్లలో జనసేన, బీజేపీ గెలిచేందుకు టీడీపీ వాళ్ళు సహకరిస్తారా అంటే అనుమానమే. దీంతోపాటుగా టిక్కెట్ దక్కని టీడీపీ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేస్తారు. అలాగని పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ములేదు. దీంతో చంద్రబాబు ఎటు వెళ్ళాలి.. ఎలా వెళ్లాలని తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీతో వెళితే మాత్రం వాళ్ళ కండీషన్స్ను ఒప్పుకోవాలి. లేకుండా వెళ్తే.. ఎన్నికలలోపే గేమ్ ముగిసిపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్ వేసే ఎత్తులు.. వ్యూహాల ముందు చంద్రబాబు ఎదురు నిలవలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ ఎన్నికల మ్యానేజ్మెంట్లో విశ్వరూపం చూపించారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నాక ఎందుకు ఊరుకుంటారు. ఆ భయం కూడా చంద్రబాబును నిద్రకు దూరం చేస్తోంది. మరోవైపు పవన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ఇంకో పదిరోజులు గడిస్తే తప్ప కూటమికి ఏదీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇక, ముఖ్యమంత్రి జగన్ మాత్రం అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. -సిమ్మాదిరప్పన్న -
నాణేనికి అటు.. ఢిల్లీలో చంద్రబాబు డ్రామా!
సాక్షి, అమరావతి: పార్టీ భవిష్యత్పై ఆశలు ఆవిరవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో పెద్ద డ్రామానే నడిపారు! ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని ఇందుకు వినియోగించుకున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత రెండో రోజు ఢిల్లీలో ఎంపిక చేసుకున్న విలేకరుల సమక్షంలో బీజేపీపై చంద్రబాబు ప్రేమ బాణాలు విసరడం చర్చనీయాంశమైంది. తాను మొదటి నుంచి కేంద్రంలో పొత్తులోనే ఉన్నానంటూ బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ప్రత్యేక హోదా కోసమే గతంలో తాను ఎన్డీయే నుంచి బయటకు వచ్చానంటూ తాజాగా చంద్రబాబు మరోసారి నాలుక మడతేశారు. ‘హోదా ఏమైనా సంజీవనా..? ప్యాకేజీ అంతకంటే మెరుగైనదంటూ అధికారంలో ఉండగా అర్థరాత్రి తాను ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పిన విషయం ప్రజలకు గుర్తుండదనే భ్రమతో తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టిన విషయం జనం మది నుంచి చెదిరిపోలేదు. రామోజీరావు, యనమల రామకృష్ణుడు వియ్యంకులను కాంట్రాక్టర్లుగా ప్రవేశపెట్టి ప్రాజెక్టు సొమ్ముని ఏటీఎంలా వాడుకుని డబ్బులు దండుకున్న విషయాన్ని ప్రజలెవరూ ఎప్పటికీ మరువలేరు! ఇవన్నీ ఎవరికీ గుర్తుండవనే ఉద్దేశంతో బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడారు! ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు ఎన్డీఏ నుంచి బయటకు చంద్రబాబు అధికారంలో ఉండగా రాజధాని అమరావతి పేరుతో భారీ అంతర్జాతీయ స్కామ్కు తెరతీయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాజధాని ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటపడడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లి విరిసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వంపై మళ్లించడం కోసం తన పాలన చివరి సంవత్సరంలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లుగా ఎన్నికల్లో ఆయన అంచనాలు బెడిసికొట్టి చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబు వెంటనే బీజేపీలోకి తన కోవర్టులను ప్రవేశపెట్టారు. తన మిత్రుడైన పవన్ కళ్యాణ్ను సైతం కాషాయ ఫ్రంట్లో చేర్చారు. ఘోర ఓటమి తర్వాత మళ్లీ ఎలాగైనా బీజేపీ పంచన చేరడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నాలకు తోడు తాజాగా పురందేశ్వరితో రాజీ చేసుకుని బీజేపీతో పొత్తు అవసరాలకు వాడుకున్నారు. ఇటీవలే బీజేపీ అధ్యక్షురాలైన పురందేశ్వరి కుటుంబంతో చంద్రబాబుకు రాజీ కుదిరింది. బీజేపీలో ఉంటూ చంద్రబాబుకు సహకరించేందుకు పురందేశ్వరి అంగీకరించారు. అందులో భాగంగానే ఎనీ్టఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమం సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చంద్రబాబును దగ్గర చేసేందుకు ఆమె తాపత్రయపడ్డారు. నాణెం విడుదల కార్యక్రమానికి సతీమణిని పిలవరా? పురందేశ్వరి చంద్రబాబు ఏజెంటులా పనిచేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమాన్ని ఆయన సతీమణిని పిలవకుండా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ను చివరి దశలో వంచించి వేధించిన కుటుంబ సభ్యులంతా ఇప్పుడు మరోసారి ఆయన భార్యను అవమానించారు. వేలాది మంది సమక్షంలో లక్ష్మీ పార్వతిని తన భార్యగా ఎన్టీఆర్ బహిరంగంగానే ప్రకటించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. ఆమెను కార్యక్రమానికి రానివ్వకుండా గూడుపు ఠాణి చేసి కేవలం చంద్రబాబుకు సన్నిహితులైన కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కార్యక్రమానికి హాజరయ్యేలా చేశారు. ఇందులో ఎలాంటి గూడుపుఠాణి లేకపోతే లక్ష్మీపార్వతిని పిలవవచ్చు కదా? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఆ వంకతో నడ్డాతో చంద్రబాబు భేటీ ఇక ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమం వంకతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు వంగి వంగి మంతనాలాడారు. ఈ భేటీలో టీడీపీ కోవర్టులు తప్ప మిగిలిన పాత బీజేపీ నేతలు ఎవరూ లేకపోవడం కొసమెరుపు. అక్కడ చంద్రబాబు తన పొత్తు ప్రతిపాదనలను నడ్డా ఎదుట పెట్టి ఎలాగైనా పొత్తు కుదిరేలా చూడాలని కోరారు. నడ్డా నుంచి ఆశించిన స్పందన వచ్చిందో లేదో తెలియదు గానీ రెండో రోజు చంద్రబాబు ఎంపిక చేసిన విలేకరుల కోసం లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ సర్కార్పై తన ప్రేమను చాటుకున్నారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా మంచి సంబంధాలు అవసరమని తాజాగా చంద్రబాబు ప్రవచించారు. చంద్రబాబు తాను సీఎంగా ఉండగా ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు నల్లజెండాలు ఎగరేయడం, నిరసన తెలియచేస్తూ హోర్డింగ్లు పెట్టడం, బీజేపీ అగ్రనేత అమిత్షా కారు మీద తిరుపతిలో రాళ్లతో దాడి చేయించిన విషయాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించటాన్ని నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మరోసారి ఎన్టీఆర్ పేరును ఉపయోగించుకున్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం కార్యక్రమాన్ని తన పొత్తు చర్చల కోసం వినియోగించుకుని మరోసారి ఆయనకు వెన్నుపోటు పొడిచారు. -
చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, ప్రకాశం: బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా? చేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఈ క్రమంలో.. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. ప్రత్యేక హోదా వద్దన్నది చంద్రబాబే. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలన్నది చంద్రబాబే. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడిని.. కేంద్రంలో చక్రం తిప్పానంటాడుగా. మరి అప్పుడు రైల్వేజోన్ ఎందుకు తేలేకపోయాడు. నోటాతో పోటీపడే పార్టీ బీజేపీ అన్నారుగా.. ఇప్పుడు మాతో ఎలా పొత్తు పెట్టుకుంటారని బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు నిలదీశారు. ఆ అర్హత లేదు సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయా?. తిరుపతిలో హోంమంత్రి అమిత్ షాపై దాడి చేస్తే.. వాళ్ల మీద చర్యలు తీసుకున్నావా?. చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి.. లేకుంటే పద్ధతిగా ఉండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారాయన. ఇదీ చదవండి: బాబూ.. శవాల మీద పేలాలు ఏరుకోకు! -
టీడీపీతో పొత్తు ఉంటుందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పార్టీ నాయకత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో టీడీపీ–బీజేపీ పొత్తు అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోందని వారు జాతీయ నేతల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిసింది. శామీర్పేటలోని ఓ రిస్టార్లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో విజయశాంతి, అర్వింద్లు ఈ విషయం ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో ఇటీవల బల ప్రదర్శన చేయడం ద్వారా తన ఉనికిని చాటుకునేందుకు టీడీపీ ప్రయత్నించిన నేపథ్యంలో ఈ అంశం హాట్ టాపిగ్గా మారిందని వారు చెప్పినట్లు తెలిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్, సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ సమక్షంలో.. విజయశాంతి ఈ విషయం లేవనెత్తారని, అర్వింద్ కూడా పొత్తులపై స్పష్టత ఇవ్వాలని కోరారని తెలిసింది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయిన విషయం తనకు ప్రత్యక్షంగా తెలుసునని విజయశాంతి పేర్కొన్నట్టు సమాచారం. స్పందించని జాతీయ నాయకత్వం ఆకస్మికంగా పొత్తుల అంశం చర్చకు రావడంతో సమావేశంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని బండి సంజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కార్యకర్తలకు కూడా తెలియజేయాలని ఆయన సూచించారు. వేదికపై జాతీయ నాయకులున్నా, పొత్తులపై వారు ఎలాంటి వ్యాఖ్యలూ చేయకపోయినా.. సంజయ్ మాత్రం కల్పించుకుని పొత్తు ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని గతంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ కూడా ప్రకటించిన సంగతి విదితమే. కాగా తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇదివరకే నాయకత్వం స్పష్టం చేసిన విషయాన్ని సంజయ్ గుర్తు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
దారిలో యాక్సిడెంట్ అవుతుంది.. అంతమాత్రాన!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు బీజేపీతో తమ పార్టీ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ప్రయాణం ఒక యాక్సిడెంట్ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాజమండ్రి వెళ్లాలని కారులో వెళతాం. దారిలో యాక్సిడెంట్ అవుతుంది. అంతమాత్రాన ప్రయాణం తప్పు అసలేం కదా. బీజేపీతో పొత్తు కూడా అలాంటిదే’ అని ఆయన సమర్థించుకున్నారు. టీడీపీ-బీజేపీ నాలుగేళ్లు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం పంచుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ.. ఆ తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కమలానికి కటీఫ్ చెప్పేసింది. మొదట కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఓకే అంటూ ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు.. నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు.. ప్రజల్లో వ్యతిరేకత నేపథ్యంతో బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. హోదా నినాదాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. -
రాష్ట్రానిది ఓ మాట .. కేంద్రానికి మరో మాట..
-
ఎన్డీయే పై అవిశ్వాసం టీడీపీ-బీజేపీ డ్రామా
-
చంద్రబాబు నక్కజిత్తుల మారినతనం మరోసారి బయటపడింది
-
టీడీపీ, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారు
-
‘రాజ్నాథ్ వ్యాఖ్యలు.. బయటపడిన టీడీపీ డ్రామా’
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా టీడీపీ-బీజేపీల బంధం మరోసారి బట్టబయలైంది. ఇన్ని రోజులు విడిపోయినట్లు సంకేతాలు ఇచ్చి.. లోపల మాత్రం బలమైన బంధాలు అలానే ఉన్నాయనే విషయం అర్థమౌతుంది. పార్లమెంట్ సమావేశంలో శుక్రవారం కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగినప్పటికీ.. చంద్రబాబు మాకు మిత్రుడేనని వెల్లడించారు. లోక్సభలో రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యలతో తెలుగుదేశం డ్రామా బయటపడింది. దీనిపై హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అంతేకాక రాజ్నాథ్ స్టేట్మెంట్పై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన కూడా తెలపలేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు రాజ్నాథ్ చేసిన స్టేట్మెంట్ను వింటూ కుర్చున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో టీడీపీ-బీజేపీ బంధంపై మేం చెప్పిందే నిజమైందని వైఎస్సార్సీపీ నేత అన్నారు. బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదు. అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిధులపై రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే ఎన్డీఏతో తెగదెంపులు.. టీడీపీ ఆడిన డ్రామా అని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. -
‘టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్కు నిదర్శనం’
సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల కోసమే టీడీపీ-బీజేపీలు డ్రామాలాడుతన్నాయని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. అవిశ్వాసానికి అనుమతివ్వడం టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్కు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మేం 13 సార్లు అవిశ్వాస నోటీసు ఇచ్చిన ఆనాడు అనుమతించలేదన్నారు. మేం రాజీనామా చేసిన వెంటనే టీడీపీ అవిశ్వాసం అనుమతించారని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. 50మందికి పైగా సభ్యుల మద్దతున్నా అవిశ్వాసానికి అవకాశం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ-బీజేపీ లోపాయికారి ఒప్పందంతోనే ఇది జరిగిందని వైవీ ఆరోపించారు. ‘హోదాపై పీఎం మోదీని చంద్రబాబు ఎందుకు నిలదీయడం లేదు? నాలుగేళ్ల పాటు కేంద్ర కేజినెట్లో పాల్గొని.. ఏనాడు హోదా గురించి టీడీపీ నేతలు మాట్లాడలేదు. విభజన హామీలు నెరవేర్చకుండా 5కోట్ల ఆంధ్రులను మోసం చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ డ్రామాలో భాగంగానే ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఐదుగురు ఎంపీలు చిత్తశుద్ధితో హోదాకోసం పొరాడాం. ఆమరణ దీక్ష చేశాం, రాజీనామాలు కూడా చేశాం. మేం చేసిన పోరాటాల వల్లే హోదా అంశం దేశ వ్యాప్తంగా చర్చకు వచ్చింది’ అని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
టీడీపీ బీజేపీ దొంగాట!
-
పొత్తు పెట్టుకోకూడదని ఉందా?
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు విషయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా ‘‘ఆ పార్టీకి కొన్ని చోట్ల ఓటు బ్యాంకు ఉంది. అయినా ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని ఉందా? అలా పెట్టుకుంటే నేరం అవుతుందా?’’అని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పొత్తుల పరిస్థితి ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో క్లీన్స్వీప్ చేస్తామని, ఉత్తర తెలంగాణలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. అక్కడ బస్సుయాత్రకు వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్పై తమకు ప్రత్యేక వ్యూహం ఉందంటూ.. సెటిలర్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామని, వారంతా ఈసారి తమ వైపే ఉంటారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో సీమాంధ్రకు చెందిన కొందరు నేతలకు ఇక్కడ సీట్లు ఇస్తామని చెప్పారు. ఎంఐఎంకు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, ఈసారి ఎంఐఎం పోటీచేసే స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్లో నేతల మధ్య అభిప్రాయ భేదాలు సహజమని, ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన చాలా మంది తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి గురించి పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతున్నామని, త్వరలోనే చేరికలుంటాయని తెలిపారు. భట్టి, రేవంత్, పొన్నం తదితర నేతల పాదయాత్రల ఎలా ఉంటాయనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వివరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు మాత్రం ఈసారి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాహుల్గాంధీనే చెప్పారని, టికెట్ కావాలనుకునే డీసీసీ అధ్యక్షులు ఆ పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుంది: మల్లు రవి టీడీపీతో పొత్తు విషయంలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లురవి సై అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. బీసీలకు కాంగ్రెస్లోనే న్యాయం: ఉత్తమ్ బీసీలకు కాంగ్రెస్లోనే న్యాయం జరుగుతుం దని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత అచ్చ విద్యాసాగర్కు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఉద్యమకారులకు కాకుండా బీటీ బ్యాచ్కే పదవులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. గొడవలు కట్టడి చేయండి పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ సీనియర్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాకు సూచించారు. బుధవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో మాజీ ఎంపీలు రేణుకాచౌదరి, వి.హనుమంతరావు, సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్రెడ్డిలు దాదాపు గంటపాటు కుంతియాతో సమావేశమై పార్టీ అంతర్గత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్ను సమన్వయం చేసుకునే విషయంలో చొరవ తీసుకోవాలని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలని వారు కోరారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే సమయం కూడా ఆసన్నమైందన్నారు. -
ఏపీ అసెంబ్లీలో రక్తికట్టిన మిత్రపక్షాల చర్చ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అనేక విశేషాలు, వింత పరిణామాలు చోటుచేసుకున్నాయి. కట్టే విరుగదు..! పాము చావదు..!! అన్న చందంగా అధికార టీడీపీ సమావేశాలను రక్తికట్టించింది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఆసాంతం అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీ నేతలు పరస్పరం నేను గిల్లినట్టు చేస్తా...! నువ్ ఏడ్చినట్టు చేయి...!! అన్నట్టు సాగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ ఎంపీలు ఒకవైపు మంత్రులుగా కొనసాగుతూనే మరోవైపు ప్రత్యేక హోదా కోసమంటూ ఢిల్లీలో పార్లమెంట్ బయట ప్లకార్డు ఆందోళన చేస్తున్న తరహాలోనే.. ఏపీ అసెంబ్లీలోనూ అలాంటి దృశ్యాలే ఆవిష్కరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ కోసం ఆందోళన చేస్తుండటంతో పాటు పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేసేవరకు అసెంబ్లీకి హాజరుకాబోమని ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలో ఏకైక ప్రతిపక్షం లేకుండానే శాసనసభ సమావేశాలు సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రసంగం చేశారు. గడిచిన నాలుగేళ్లుగా చెబుతున్న విషయాలకు పూర్తి భిన్నంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్యాకేజీ వస్తున్నప్పుడు హోదా ఎందుకని అనేక సందర్భాల్లో మాట్లాడిన చంద్రబాబు ఈరోజు సభలో అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీలపై 52 పేజీలతో 19 అంశాలపై రూపొందించిన వివరాలను ఆయన తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంలోని మిత్రపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని సుతిమెత్తగా కోరారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో ఈ అంశాలపై వివరిస్తున్న సందర్భంలో ప్రతిసారీ ఆయన బీజేపీ సభ్యుల వైపు చూస్తూ మాట్లాడారు. గడిచిన నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లినట్టుగా చంద్రబాబు చెప్పుకున్నారు. అయితే వెళ్లిన ప్రతిసారీ ప్రత్యేక హోదా కోసమే వెళ్లినట్టుగా చెప్పుకోవడం గమనార్హం. జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును ప్రకటించిన తర్వాత దాన్ని నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని అప్పట్లో పట్టుబట్టిన చంద్రబాబు అసెంబ్లీలో మాత్రం అందుకు భిన్నంగా నీతి ఆయోగ్ సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను రాష్ట్రం తీసుకుందని చెప్పుడం విశేషం. 2014 ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ స్వీకార ప్రమాణం చేయడానికి ముందు జరిగినట్టుగా ఒక కొత్త విషయాన్ని అసెంబ్లీ వేదికగా చంద్రబాబు వెల్లడించారు. పోలవరం నిర్మాణం కోసం తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు భీష్మించినట్టు చంద్రబాబు సభలో చెప్పుకున్నారు. నాలుగేళ్ల కిందట సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడుగానీ ఆ తర్వాత గానీ ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు వెళ్లడించలేకపోయారే చంద్రబాబు వివరించలేదు. తాను అలా హెచ్చరిక చేసినందుకే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ సమావేశంలోనే ప్రధాని మోదీ ఆ మండలాలను కలిపారని చెప్పారు. నాలుగేళ్లు గడిచినా అడుగు ముందుకు పడని పోలవరం గురించి అంత గట్టిగా హెచ్చరిక జారీ చేసిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏడు మండలాల కోసం ఆనాడు ఏకంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోనని తేల్చిచెప్పిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంగానీ పార్లమెంట్ ద్వారా చేసిన విభజన చట్టంలో ఇచ్చిన హామీల విషయంలో మాత్రం అలాంటి గట్టి హెచ్చరిక ఎందుకు ఇవ్వలేకపోయారో శాసనసభలో చెప్పలేకపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు డిమాండ్ చేసింది. తాము తప్పుకుంటే వాళ్లు దగ్గరవ్వాలని చూస్తున్నారంటూ ప్రతివిమర్శ చేశారే తప్ప ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క గట్టి నిర్ణయం తీసుకోలేకపోయారన్నది వాస్తవం. ఏడు మండలాల కోసం ప్రమాణ స్వీకారం చేయనని హెచ్చరించిన చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా కోసం మిత్రపక్షంగా ఉండటం పక్కన పెడితే కేంద్రంలో కనీసం మంత్రిపదవులను వదులుకోవడానికి కూడా సిద్ధపడకపోవడం గమనార్హం. అలాగే, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి చెందిన మంత్రులను నాలుగేళ్లుగా కొనసాగుతుండగా, 29 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏరోజూ ఆ మంత్రులను వెంటబెట్టుకుని వెళ్లలేదు. కానీ బుధవారం అసెంబ్లీ చర్చ సందర్భంగా మాత్రం బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అక్కడ కూర్చొని ప్రత్యేక హోదా సాధన కోసం పనిచేయాలని సూచించడం విశేషం. దాదాపు రెండున్నర గంటలకుపైగా ప్రసంగించిన చంద్రబాబు అనేక పరస్పర విభిన్నమైన రీతిలో మాట్లాడారు. కేంద్రం నుంచి రావలసిన నిధులకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికేట్లు (యూసీ) ఇవ్వని కారణంగా నిధులు విడుదల కాలేదని కేంద్రం చెబుతోందని అంటూ ఆ సర్టిఫికేట్లు ఎప్పుడు పంపిందీ చెప్పే ప్రయత్నం చేశారు. తన చేతిలో ఉన్న పత్రాలను చూస్తూ గత నెల ఫిబ్రవరిలో యూసీ సర్టిఫికేట్ పంపినట్టు చదివిన చంద్రబాబు (నెల రోజులు కూడా కాకపోవడం) ఆ తర్వాత ఎందుకనో మిగతా వివరాలు చెప్పకుండా దాటవేశారు. గడిచిన నాలుగేళ్లుగా అనేకసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ఎప్పుడూ ప్రస్తావించని చంద్రబాబు బుధవారంనాడు మాత్రం ఏకంగా ఒక పుస్తకాన్ని తెచ్చి చదవడం గమనార్హం. హైదరాబాద్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లను అభివృద్ధి చేసింది తానేనని చెబుతూ వాటి నిర్మాణాలకు కేంద్రం నుంచి డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. (ఈ రెండూ చంద్రబాబు హయాంలో వచ్చినవి కాదు) నిధులు విడుదల చేయలేదంటూ కేంద్రంపై ఒకవైపు సుతిమెత్త విమర్శ చేస్తూనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ లాంటి వాటికి నిధులు అడక్కుండానే పూర్తి చేశానని చెప్పడం విడ్డూరంగా కనిపించింది. రాహుల్ గాంధీ సంతకం చేస్తారట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా కల్పనపై గడిచిన నాలుగేళ్ల పాటు ఎందుకు సైలెంట్ గా ఉన్నారన్న విషయం కూడా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం. సభలో బీజేపీ సభ్యులవైపు చూస్తూ "మీరు తప్పుంచుకోలేరు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు" అని బీజేపీపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. "ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తాం" అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుపైన చేస్తామని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నారని చెబుతూ, ఆ విషయాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఆ పార్టీ నేతలకు చంద్రబాబు కర్తవ్యబోధ చేశారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని విద్యా సంస్థలు వాటి కేటాయింపులను చంద్రబాబు ప్రస్తావించారు. తిరుపతిలో తలపెట్టిన ఐఐటీ కోసం ఇప్పటివరకు వంద కోట్లిచ్చారు. మూడువేలకుపైగా కోట్లు అవసరమైన ఐఐటీకి వంద కోట్లు ఇస్తే ఇక అది పూర్తికావడానికి 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే గడిచిన నాలుగేళ్లుగా ఈ సంస్థలకు జరుగుతున్న కేటాయింపులపై ఎందుకు మాట్లాడలేకపోయారో మాత్రం సభలో ఉన్న బీజేపీ సభ్యులకు చంద్రబాబు వివరించలేదు. ఆ విషయాలను బీజేపీ నేతలు కూడా చంద్రబాబును అడగలేదు. రోజూ హాయిగా నిద్రపోతున్నా...! ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈరోజు అన్ని పార్టీలు అడుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ఎందుకు కనికరించడం లేదు అంటూ ప్రశ్నించారు. దేశంలో తానే సీనియర్ మోస్ట్ నాయకుడినని, కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లు ఏర్పాటు చేశామని పేర్కొంటూనే తాను ఎవరికీ భయపడటం లేదని, భయపడే ప్రసక్తే లేదన్నారు. అందుకే ప్రతి రోజూ హాయిగా నిద్రపోతున్నా... అంటూ చెప్పుకొచ్చారు. (నేను పడుకోను.. మిమ్మల్ని పడుకోనివ్వను అంటూ గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు చెబుతుండేవారు) నాలుగేళ్ల తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని, ఆ కారణంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని అంటున్నారంటూ ఈ రకమైన వివక్ష ఎందుకు చూపిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇస్తారని, విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తారని నాలుగేళ్లు ఎదురుచూశానని, ఇప్పుడు మళ్లీ అన్యాయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఎదురుచూసిన చంద్రబాబు ఉన్నఫళంగా ఎందుకు అసెంబ్లీ ఈ చర్చకు తావిచ్చారో సెలవివ్వకపోవడం అధికార పార్టీ సభ్యులకు సైతం అంతుచిక్కలేదు. ప్రత్యేక హోదా కోసం ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలు, ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం... మాట్లాడకపోతే ఇరకాటంలో పడతామన్న ఆందోళనతోనే ఈ అంశానికి అసెంబ్లీ వేదిక చేసుకున్నట్టు కనబడుతోంది. 220 మందిలో నేనొకడిని గవర్నర్ ప్రసంగంపై చంద్రబాబు సమాధానం చెప్పడానికి ముందు మాట్లాడిన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. చంద్రబాబు సీఎం కావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అంటూ ఆకాశానికెత్తారు. చంద్రబాబు సమాధానం చెబుతున్నప్పుడు మధ్యలో కల్పించుకుని... తామింకా (బీజేపీ) ప్రెండ్లీ పార్టీయేననీ, అదేదో ప్రతిపక్షమైనట్టు మాట్లాడుతున్నారని (టీడీపీ సభ్యులవైపు చూస్తూ) అది సరైంది కాదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి 14 వ ఆర్థిక సంఘం నిబంధనలు, హోదాకు బదులుగా ప్యాకేజీ ఇస్తామని చెప్పడం వంటి వివరాలు చెబుతూ మీకేం కావాలో... రావలసిన నిధుల గురించి వివరాలిస్తే ఢిల్లీకి వెళ్లి వచ్చేట్టుగా తనవంతు కృషి చేస్తానని విష్ణుకుమార్ రాజు చెప్పారు. దేశంలో 220 మందితో ఏర్పడిన బీజేపీ జాతీయ కార్యవర్గం తాను ఒకడినని చెప్పుకొచ్చారు. -
పోలవరం మేము కడతామనలేదు : సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి : జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటమార్చారు. ‘‘అసలు మేము పోలవరం కడతామని అననేలేదు. జాతీయ ప్రాజెక్టు కాబట్టి దానికి కేంద్రమే కట్టాలి. కానీ.. ఢిల్లీ నుంచి పనుల నిర్వహణ సాధ్యం కాదు కనుక, అందునా అది ఆంధ్రప్రదేశ్కు వరదాయిని కాబట్టి.. రాష్ట్ర ప్రభుత్వమైతేనే ప్రత్యేక శ్రద్ధతో నిర్మించగలదని సాక్షాత్తూ నీతి ఆయోగ్ సూచించింది. ఆ సూచనను కేంద్రం కూడా ఆమోదించింది కాబట్టే పోలవరం నిర్మాణ బాధ్యతలను మేము తీసకున్నాం’ అని చెప్పారు. పోలవరం తలకెత్తుకున్న తర్వాత కూడా తాను గట్టిగా పట్లు పట్టానని, తెలంగాణలోని 7 మండలాలను కలిపేదాకా సీఎంగా ప్రమాణం చెయ్యబోనని తెగేసి చెప్పానని, దాంతో కేంద్రం అప్పటికప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి మండలాలను ఏపీకి ఇచ్చింని సీఎం గుర్తుచేశారు. ‘‘ఎట్టిపరిస్థితుల్లోనూ 2019లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తాను. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉండాలి’’ అని ఉద్ఘాటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం టీడీపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. భేటీకి ముందే సీఎం మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. రాజధాని భూముల అమ్మకం? : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాల్లో కొంత భూమిని అమ్ముకోవాలనే యోచనలో టీడీపీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘ఒక్కపైసా తీసుకుకోకుండా ప్రజలు భూములిచ్చారు. ఇప్పుడా ల్యాండ్స్కు సంబంధించి ఎలాంటి లిటిగేషన్లులేవు. ప్రభుత్వ అవసరాలకు, రైతులకు హామీ ఇచ్చినట్లు ఫ్లాట్లు, ఇతరత్రా భూములు పోగా, ఇంకొంత మిగలుతుంది. దాన్ని మార్కెట్ చేసుకోగలిగితే.. లాభాలు వస్తాయి. తద్వారా మనం వనరులను పెంచుకున్నట్లవుతుంది’ అని ముఖ్యమంత్రి తెలిపారు. బీజేపీ మోసం చేసింది : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అమలు విషయంలో ఏపీని బీజేపీ మోసం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ‘‘ నాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. విభజన చట్టంలో లోపాలున్నాయి. కనీసం బీజేపీ అయినా న్యాయం చేస్తుందని నమ్మి పొత్తుపెట్టుకున్నాం. మిత్రపక్షంగా కాబట్టి వాళ్లకూ బాధ్యత ఉందనుకున్నా. కానీ మోసపోయాం. నాలుగేళ్ల తర్వాత పోరాటం చేసే పరిస్థితి వచ్చింది’’ అని సీఎం వ్యాఖ్యానించారు. హోదా పోరు-అభివృద్ధి మా రెండుకళ్లు : ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఇవి రెండూ తనకు రెండు కళ్లన్న చంద్రబాబు చెప్పారు. ‘‘ఢిల్లీ నుంచి ఫైట్ చెయ్యాలని కొందరు సూచిస్తున్నారు. నేనేమంటానంటే.. ముందు సబ్జెక్ట్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. క్లారిటీ కల్పించాలి. రాష్ట్రానికి లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోకుండా, అదే సమయంలో ప్రజల మనోభావాలను కాపాడుకుంటూ, వారిని సంసిద్ధులను చేస్తూ, శాంతిభద్రతలు కపాడుతూ, అభివృద్ధి దిశలో పయనించాలి’’ అని చంద్రబాబు తెలిపారు. -
‘2019లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే ఉంటాయి’
సాక్షి, గుంటూరు : టీడీపీ-బీజేపీల అవినాభావ అనుబంధం వల్లే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు వచ్చాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధించిందని బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. అందుకే 2019 ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే పోటీచేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీవి అబద్ధాలే అయినా : ‘‘ప్రత్యేక ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నెన్ని నిధులు ఇచ్చామో ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పిన లెక్కలు మాత్రమే నూరుశాతం వాస్తవాలు. లెక్కల సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా టీడీపీ-బీజేపీలు ఎప్పటికీ కలిసే ఉంటాయి. వైఎస్సార్సీపీతో బీజేపీ ఎన్నటికీ దోస్తీ కట్టబోదు’’ అని మంత్రి కామినేని చెప్పారు.