Kamala Harris
-
కమలా హారిస్కు ఘోర అవమానం
వాషింగ్టన్ : అమెరికా సెనేటర్ల ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఈ ప్రమాణ స్వీకారంలో డెమోక్రటిక్ పార్టీ నేత, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు ఘోర అవమానం ఎదురైంది. ఇంతకి ఏం జరిగిందంటే? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ సెనేటర్లతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) ప్రమాణం స్వీకారం చేయించారు. వారిలో రిపబ్లికన్ సెనేటర్ డెబ్ ఫిషర్ (Deb Fischer) సైతం ఉన్నారు. డెబ్ ఫిషర్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత డెబ్ పిషర్ కమలా హారిస్కు కరచాలనం చేశారు. అనంతరం, తన భర్త బ్రూస్ ఫిషర్ను కమలా హారిస్కు పరిచయం చేయించారు. ముందుకు వెళ్లి హారిస్కు షేక్ హ్యాండ్ ఇవ్వమని కోరారు.అయితే, అందుకు బ్రూస్ ఫిషర్ అంగీకరించలేదు. కమలా హారిస్ ముఖం చూసేందుకు ఇష్టపడలేదు. దీంతో సెనేట్లరతో పాటు కమలా హారిస్ సైతం కొంచెం ఇబ్బంది పడ్డారు. వెంటనే .. ‘ఫర్వాలేదు బ్రూస్ ఫిషర్ నేను తిట్టను.. కంగారుపడకు’ అంటూ సరదాగా అన్నారు.GOP Senator Deb Fischer’s husband, Bruce, refuses to shake Vice President Kamala Harris’s hand after her swearing-in. Truly classless. pic.twitter.com/a0ZQuDV0t0— Republicans against Trump (@RpsAgainstTrump) January 6, 2025 ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. కానీ పలువురు ఉదారవాదులు బ్రూస్ ఫిషర్పై సోషల్ మీడియా (social media) వేదికగా మండిపడుతున్నారు. పాడ్కాస్టర్ బ్రియాన్ టైలర్ కోహెన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘రిపబ్లికన్ సెనేటర్ భర్త బ్రూస్ ఫిషర్ కరచాలనం చేసేందుకు, వైస్ ప్రెసిడెంట్ హారిస్ను చూసేందుకు సైతం ఇష్టపడలేదు. ఆయన తీరు రిపబ్లికన్ పార్టీ లక్షణాల్ని ప్రతిబింబించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రచయిత డాన్ విన్స్లో మరో అడుగు ముందుకు వేసి బ్రూస్ను పందితో పోల్చారు. బ్రూస్ తీరు అవమానకరంగా ఉంది. హారిస్తో కరచాలం చేసేందుకు ఇష్టపడలేదు. ‘ బ్రూస్ వ్యవహరించిన తీరు చూస్తుంటే.. పందులు పొలాల్లోనే ఉండవు. అతను ఒక పంది’అంటూ సంభోదించారు. ఈ అంశంపై డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. -
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు. అమెరికా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా సెనేట్లో చేసిన ప్రతిజ్ఞలో జెండా అనే పదాన్ని వదిలేసి చదివారు. హారిస్ తడబడ్డ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో 119వ కాంగ్రెస్ తాజాగా సమావేశమైంది. ఈ సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో ‘నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాకు విధేయత చూపుతాను’ అని చదవాలి అయితే హారిస్ ‘జెండా’ పదాన్ని వదిలేసి చదివారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు కామెంట్ చేయగా సెనెట్లో ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ దేశాన్ని అవమానించారని మరొకరు విమర్శించారు. చరిత్రలో అతి తక్కువ ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ అని మరో నెటిజన్ విమర్శించారు. FLAG FLUB: Vice President Kamala Harris appears to flub the Pledge of Allegiance during the opening moments of the 119th Congress. pic.twitter.com/NlyMB6iUoz— Fox News (@FoxNews) January 3, 2025 మరో వీడియోలో హారిస్ కొత్తగా ఎన్నికైన సెనేటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తుండగా అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన కమలాహారిస్ ట్రంప్ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.JD Vance laughing as Kamala Harris swears in new U.S. Senators 🤣pic.twitter.com/LRot5mia2Z— Benny Johnson (@bennyjohnson) January 3, 2025 ఇదీ చదవండి: ప్రధానిపై విమర్శలు..మస్క్కు బ్రిటన్ కౌంటర్ -
దాతలకు బైడెన్, హారిస్ కృతజ్ఞతలు
వాషింగ్టన్: ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్ తొలిసారిగా ఒకే చోట కలిసి కనిపించారు. డెమొ క్రటిక్ నేషనల్ కమిటీ ఆదివారం నిర్వహించిన హాలిడే పార్టిలో వారిద్దరూ వేదికను పంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం 200 కోట్ల డాలర్లకు పైగా విరాళాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘డెమొక్రాట్లు విలువల కోసం పోరాటం సాగించాలి. మన స్ఫూర్తి ఓడలేదు. మనం ఓడిపోలేదు. బలంగా ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నామో మనకు స్పష్టత ఉంది’’అని అతిథులుతో బైడెన్, హారిస్ అన్నా రు. ‘‘కింద పడితే కచ్చితంగా లేవాల్సిందే.. ఎంత వేగంగా లేస్తారనేదే వ్యక్తికైనా, పార్టికైనా కొలమానమని మా నాన్న చెప్పేవారు’’అని బైడెన్ అన్నారు. నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చారని భావించిన హారిస్ చివరికి ఆయన చేతిలో భారీ తేడాతో ఓడటం తెలిసిందే. హారిస్ భవితవ్యం ఏమిటి? హారిస్ తన సొంత రాష్ట్రమైన కాలిఫోరి్నయా గవర్నర్ పదవికి పోటీ చేయాలని కొందరు డెమొక్రాట్లు కోరుతున్నారు. ఆమె మాత్రం తన భవిష్యత్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బైడెన్ జనవరి 20న అధ్యక్ష పదవి నుంచి వైదొలగనుండటం తెలిసిందే. అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అమెరికా సమాజంలో నెలకొన్న లోతైన విభేదాలను చక్కదిద్దేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకందరికీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నా’’అని నవ్వుతూ అన్నారు. -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. లింక్డిన్ కో-ఫౌండర్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థ లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ విజయంతో రీడ్ హాఫ్మన్ అమెరికా వదిలేందుకు సిద్ధమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. BREAKING: Democratic Mega-Donor, Reid Hoffman tells friends he is considering leaving the United States following President Trump’s Election Win. Bye! ✌🏻 pic.twitter.com/g2olDLGVR8— Ian Jaeger (@IanJaeger29) December 2, 2024అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుతో డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థుల్లో భయం మొదలైందని అమెరికా స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్ కో-ఫౌండర్ హాఫ్మన్ దేశాన్ని వదిలి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాఫ్మన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతు పలికారు. ఆమె ఎన్నికల ప్రచారానికి 10 మిలియన్ డాలర్లు విరాళం అందించారు.దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ మరణాన్ని కోరుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.అయితే,వీటన్నింటికి కంటే ట్రంప్పై మాజీ న్యూయార్క్ మ్యాగజైన్ రచయిత ఇ.జీన్ కారోల్ పరువు నష్టం దావా వేశారు. అందుకు హాఫ్మన్ సహకరించారు. ఈ భయాలతో హామ్మన్ అమెరికాను వదిలేయాని నిర్ణయానికి వచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
బైడెన్ తప్పుడు నిర్ణయం
అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల్లో ఓటమిపాలై ప్రత్యర్థికి అధికారం అప్పగించటం మినహా మరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలోపడిన నేతను అమెరికా జనం ‘లేమ్ డక్ ప్రెసిడెంట్’ అంటారు. అధ్యక్షుడు జో బైడెన్ అంతకన్నా తక్కువ. ఎందుకంటే ఆయన కనీసం పోటీలో కూడా లేరు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతుండగా అందరూ బలవంతంగా ఆయన్ను తప్పించి కమలా హారిస్ను బరిలో నిలిపారు. ఆ పార్టీ ఓటమి పాలైంది. ఇక అధికారం బదలాయింపు లాంఛనాలు తప్ప బైడెన్ చేయగలిగేదీ, చేసేదీ ఏమీ ఉండదు. కానీ ఆయన తగుదనమ్మా అంటూ ఉక్రెయిన్కు ఏడాదిన్నర క్రితం ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణుల్ని వినియోగించటానికి అనుమతినిచ్చారు. దాంతోపాటు తాము సరఫరా చేసిన ప్రమాదకరమైన మందుపాతరలను కూడా వాడుకోవచ్చని ఉక్రెయిన్కు తెలిపారు. యుద్ధం మొదలై వేయిరోజులైన సందర్భంగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ప్రయోగించి రష్యా భూభాగంలోని బ్రిన్స్క్ ప్రాంతంలోని కరచెవ్ భారీ ఆయుధ గిడ్డంగిని ఉక్రెయిన్ సైన్యం ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా అణ్వాయుధ వినియోగం ముసాయిదాను సవరించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. పర్యవసానంగా ప్రపంచం అణ్వస్త్ర యుద్ధం అంచులకు చేరింది. యుద్ధం మొదలయ్యాక కేవలం కొన్ని రోజుల్లో... మహా అయితే కొన్ని నెలల్లో రష్యా పాదాక్రాంతం కావటం ఖాయమన్న తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్ను యుద్ధరంగంలోకి నెట్టింది అమెరికాయే. 2014లో పుతిన్ క్రిమియాను స్వాధీనం చేసుకున్నాక వరసగా ఎనిమిదేళ్లపాటు జరిగిన ఘర్షణలు నివారించటానికి 2022లో వాటి మధ్య శాంతి ఒప్పందం ముసాయిదాను అమెరికా, బ్రిటన్లే రూపొందించాయి. చిత్రమేమంటే, ఆ ఒప్పందాన్ని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కూడా ఆమోదించాయి. ప్రాథమిక అవగాహన పత్రంపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ ఆఖరి నిమిషంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మనసు మార్చు కున్నారు. ఆ రెండు దేశాల సాయంతో అక్రమంగా అధికారంలోకొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వారి ఒత్తిడికి లొంగి ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలగారు. ఆ తర్వాతే రష్యా దురాక్రమణ యుద్ధా నికి దిగింది. అసలు రెండు నెలల క్రితం నాటి స్థితికీ, ఇప్పటికీ వచ్చిన మార్పేమిటో, ఎందుకు మూడో ప్రపంచయుద్ధం ముప్పు తీసుకొచ్చారో బైడెన్ చెప్పాలి. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులు స్టార్మ్ షాడోలను రష్యాపై ప్రయోగించటానికి బ్రిటన్ నిరుడు అనుమతించినప్పుడు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ బైడెన్ను తీవ్రంగా హెచ్చరించింది. దీన్ని ఆపనట్టయితే ఇది నాటో–రష్యా యుద్ధంగా పరిణమిస్తుందని వివరించింది. దాంతో బైడెన్కు తత్వం బోధపడి బ్రిటన్ను వారించారు. అంతక్రితం 2022 మార్చిలో రష్యా గగనతలంపై ‘నో ఫ్లైజోన్’ విధించటానికి తమ మిగ్–29 యుద్ధ విమానాలను వాడుకోవచ్చని విదేశాంగమంత్రి బ్లింకెన్ పోలెండ్ను అనుమతించినప్పుడు అమెరికా ప్రతినిధుల సభంతా ఏకమై పెంటగాన్ అభిప్రాయం తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారించారు. దాంతో బైడెన్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. ‘నో ఫ్లైజోన్’ విధించటమంటే మూడో ప్రపంచయుద్ధానికి అంకురార్పణ చేసినట్టేనని ఒప్పుకున్నారు. మరి ఇప్పుడేమైంది? తన పార్టీ చిత్తుగా ఓడి, కీలక నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో పడినప్పుడు అనుమతినీయటం అనైతికం, బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు... నేరం కూడా. ఒకపక్క జనవరిలో అధ్యక్షుడిగా రానున్న డోనాల్డ్ ట్రంప్ తన మొదటి కర్తవ్యం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఆపటమేనని ఇప్పటికే ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి పనే రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ 1992లో చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఇక 11 నెలల్లో దిగిపోతాననగా సోమాలియా దురాక్రమణకు ఆయన ఆదేశాలిచ్చారు. దాంతో కొత్తగా అధికారంలోకొచ్చిన క్లింటన్ అన్నీ వదిలిపెట్టి దానిపైనే చాన్నాళ్లు దృష్టి సారించాల్సి వచ్చింది. బైడెన్కు సైతం కేవలం 11 వారాలే గడువుంది. కనీసం నిర్ణయం తీసుకునేముందు సెనేట్ను సమావేశపరిచి సలహా తీసుకోవాలన్న ఇంగితం కూడా లేకపోయింది. ఈ నిర్ణయాన్ని పెంటగాన్ సీనియర్ అధికారులు వ్యతిరేకించారంటున్నారు.నిజానికి క్షిపణుల్ని వినియోగించే సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యం ఉక్రెయిన్కు లేవు. అమెరికా నిఘా ఉపగ్రహాలు నిర్దిష్ట సమాచారం ఇస్తేనే, దాని ఆధారంగా అమెరికా సైనికాధికారులు రష్యా ఆయుధ గిడ్డంగిని ధ్వంసం చేశారని సాధారణ పరిశీలకులకు సైతం సులభంగా తెలుస్తుంది. రష్యా గ్రహించదనుకోవటం, పాపభారమంతా ఉక్రెయిన్పైనే పడుతుందనుకోవటం తెలివితక్కువతనం. మందుపాతరల వినియోగాన్ని పూర్తిగా ఆపేస్తామని ఐక్యరాజ్యసమితిలోని 161 దేశాలు కుదుర్చుకున్న ఓస్లో ఒడంబడికను అమెరికా, రష్యాలు కాదన్నాయి. ఆ ఒడంబడికకు కారణమైన మందు పాతరల నిరోధ ప్రచార సంస్థకూ, దాని అధ్యక్షుడు జోడీ విలియమ్స్కూ 1997లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. మందుపాతరలివ్వాలన్న బైడెన్ తాజా నిర్వాకంవల్ల ఆ ఒడంబడికపై సంతకం చేసిన ఉక్రెయిన్ అపరాధిగా మారినట్టయింది. మందుపాతరల వల్ల కీయూవ్లోకి చొచ్చుకొస్తున్న రష్యా బలగాల వేగాన్ని కొంతవరకూ నిరోధించవచ్చు. కానీ ఆపటం అసాధ్యం. యుద్ధం పూర్త య్యాక సాధారణ పౌరులు వందలమంది ఏదో ఒక ప్రాంతంలో నిత్యం మందుపాతరలకు బలయ్యే ప్రమాదం ఉంటుంది. బైడెన్ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే సరిదిద్దకపోతే ప్రపంచ ప్రజలముందు అమెరికా దోషిగా నిలబడాల్సివస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరాదని అక్కడి ప్రజానీకం తెలుసు కోవాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. -
చివరి వారాల్లో అధ్యక్ష పీఠంపై కమల?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్ స్థానికత సెంటిమెంట్ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్ తెరమీదకొచ్చింది. చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు. ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి. చివరి రోజుల్లో బైడెన్ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్ కమ్యూనికేషన్స్ విభాగ మాజీ డైరెక్టర్ జమాల్ సైమన్స్ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్ దిగిపోయి హారిస్కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు. ట్రంప్తో ముఖాముఖి డిబేట్కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్ అభ్యర్థి. డిబేట్లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్ను రేస్ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్ డెమొక్రాట్ల లాబీయింగ్ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు. 25వ సవరణ ఏం చెప్తోంది?అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ పాపులర్ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
డెమొక్రాట్లను ఆదుకోండి
వాషింగ్టన్: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్ క్యాంపెయిన్ ప్రధాన ఫండ్రైజర్ అజయ్ జైన్ భూటోరియా చెప్పారు. BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024ట్రంప్కు బైడెన్ ఆతిథ్యం ట్రంప్తో దేశాధ్యక్షుడు బైడెన్ సమావేశమవుతారని వైట్హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ కరీన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్హౌస్కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ కొత్త స్టాఫ్ చీఫ్ సూజీ వైల్స్తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్హౌస్ ఆనవాయితీగా వస్తోంది. చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్ -
అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు.. ఖాతాలో 312 ఎలక్టోరల్ ఓట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్ రిజలల్ట్స్ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్ 2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్ జరిగిన నవంబర్ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మార్కు కనిపించేనా.. -
రాజకీయాలకు కమలా హారిస్ గుడ్బై?!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఏం చేయబోతున్నారు?. అమెరికా కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని.. కొనసాగిస్తానని చెప్పిన మాట మీద ఆమె నిలబడతారా?. లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నారా?.ట్రంప్ చేతిలో ఓటమి తర్వాత హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హారిస్ గంభీరంగానే ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం మొదలుపెట్టిన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. అయితే.. మరో 72 రోజుల్లో ఆమె ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ తర్వాత ఆమె ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.సాధారణంగా.. అమెరికా అధ్యక్షఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు.. మళ్లీ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు దక్కుతుంటాయి. లేదంటే ఏదో ఒక కీలక పదవుల్లో వాళ్లకు అవకాశాలు దక్కవచ్చు. 2004లో జార్జి బుష్ చేతిలో ఓటమిపాలైన జాన్ కెర్రీ.. బరాక్ ఒబామా రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అంటే.. ఓడిపోతే రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట.అయితే జాన్ కెర్రీలా తిరిగి రాజకీయాల్లో రాణించేందుకు ఛాన్స్ కమలకు ఉంది . 2017 నుంచి 2021 మధ్య కాలిఫోర్నియా నుంచి సెనేట్కు ఆమె ప్రాతినిధ్యం వహించారు. అయితే మళ్లీ సెనేట్కు వెళ్లేందుకు ‘ఇంటిపోరు’ ఆమెకు ఆటంకంగా మారే అవకాశం లేకపోలేదు. సొంత రాష్ట్రంలో.. డెమోక్రటిక్ మద్దతుదారుల నుంచే ఆమెకు వ్యతిరేక గళం వినిపిస్తోంది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల కోసం విరాళాలిచ్చినవాళ్లూ ఆమె పట్ల అసంతృప్తితోనే ఉన్నారనే సంకేతాలు అందుతున్నాయి. పోటీ డెమోక్రటిక్ ప్రతినిధిగా కొనసాగుదామన్నా.. అందుకు అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. ఈ లెక్కన.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి అభ్యర్థిత్వం కోసం ఆమె తీవ్రంగానే శ్రమించాల్సి ఉంటుంది. అలాకాకుంటే..రాజకీయాలకు దూరం జరిగి హిల్లరీ క్లింటన్, ఏఐ గోర్ మాదిరి సాహిత్య రచన, ఇతర వ్యాపకాల్లో మునిగిపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. తన పోరాటం కొనసాగుతుందని కమలా హారిస్ ప్రకటించినప్పటికీ.. అందుకు అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవేవీకాకుండా ఆమె తన వ్యక్తిగత జీవితంపై దృష్టిసారించవచ్చనే అభిప్రాయమూ ఒకటి వినిపిస్తోంది. కమలా హారిస్ వయసు 60 ఏళ్లు. కాబట్టి, అధ్యక్ష ఎన్నికల రేసులో ఆమెకు బోలెడు అవకాశం ఉందని ఆమెకు దగ్గరి వ్యక్తులు చెబుతున్నారు. ఆమె నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది 2025 జనవరి 20 తర్వాత తేలిపోనుంది. -
US Election Results 2024: ముంచింది బైడెనే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు. కానీ ట్రంప్తో తొలి డిబేట్లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.బైడెన్ నీడలోనే... అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు. అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్లో వాపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US Election Results 2024: ట్రంప్కు 50.8 శాతం, హారిస్కు 47.5 శాతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది. అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు. కాంగ్రెస్లో... అధ్యక్షునితో పాటు కాంగ్రెస్కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. -
Kamala Harris: పోరులో వెనకబడ్డా.. పోరాటం ఆపబోను
వాషింగ్టన్: విజయతీరాలకు కాస్తంత దూరంలో నిలిచిపోయినా పోరాటం మాత్రం ఆపేదిలేదని డెమొక్రటిక్ నాయకురాలు కమలా హారిస్ వ్యాఖ్యానించారు. హోరాహోరీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ చేతిలో పరాజయం పాలైన హారిస్ ఫలితాల తర్వాత తొలిసారిగా స్పందించారు. గురువారం వాషింగ్టన్లోని హొవార్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వేలాది మంది పార్టీ మద్దతుదారుల సమక్షంలో ఆమె భావోద్వేగ ప్రసంగం చేశారు. 60 ఏళ్ల హారిస్ గతంలో ఇదే వర్సిటీలో రాజనీతి, ఆర్థికశాస్త్రం చదువుకున్నారు.నా హృదయం నిండిపోయింది‘‘దేశంపై ప్రేమతో, దేశం కోసం పాటుపడుతూ మీరంతా నాపై ఉంచిన నమ్మకం, ప్రేమతో ఈ రోజు నా హృదయం నిండిపోయింది. ఈ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితం దక్కలేదు. నిజానికి ఇలాంటి ఫలితం కోసం మనం పోరాడలేదు. మీరంతా ఓటేసింది కూడా ఇలాంటి ఫలితం కోసం కాదు. అయితే ఒక్కటి మాత్రం నిజం. అమెరికా అభ్యున్నతి కోసం మనందరం చేసిన ప్రతిజ్ఞా జ్వాల ఎప్పటికీ మండుతూనే ఉంటుంది. ఓడిపోయాక పార్టీ అశేష అభిమానుల్లో పెల్లుబికి వస్తున్న భావోద్వేగాలను అర్థంచేసుకోగలను. అయినాసరే ఈ ఫలితాలను అంగీకరించక తప్పదు. ఫలితం ఎలా ఉన్నా ఆమోదించడం ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. నేను ఈ ఫలితాలను, ఓటమిని అంగీకరిస్తున్నా. అయితే పోరాటాన్ని మాత్రం ఆపబోను’’ అని అన్నారు. ట్రంప్ను విష్ చేశాగత ఎన్నికల్లో ఓడినాసరే ఓటమిని అంగీకరించకుండా ట్రంప్ ప్రభుత్వం సాఫీగా అధికార మార్పిడి జరక్కుండా అడ్డుకున్న అంశాన్ని హారిస్ ప్రస్తావించారు. ‘‘ అధ్యక్ష్య ఎన్నికల్లో రెండోసారి గెలిచిన ట్రంప్కు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. కాలపరిమితి ముగిశాక శాంతియుతంగా అధికార మార్పిడికి మా ప్రభుత్వం సాయపడుతుందని హామీ ఇచ్చా. మన దేశంలో ఒక అధ్యక్షుడికో, రాజకీయ పార్టీకో నిబద్దులై ఉండాల్సిన పనిలేదు. కానీ దేశ రాజ్యాంగానికి ఖచ్చితంగా మనం బద్ధులమై ఉండాలి. ఎన్నికలు ముగియడంతో మన పోరాటం ముగిసిపోలేదు. మన పోరాటం కొనసాగుతుంది. అగ్రరాజ్య ఆవిర్భావానికి పునాదులైన సూత్రాలకు కట్టుబడి ఉందాం. కొన్నిసార్లు పోరాటం అనేది సుదీర్ఘకాలం కొనసాగొచ్చు. అంతమాత్రాన మనం గెలవబోమని కాదు. గెలిచేదాకా పోరాటం ఆపకపోవడమే ఇక్కడ ముఖ్యం. స్వేచ్ఛా, అవకాశాలు, పారదర్శకత, ప్రజలకు మెరుగైన జీవితం అందించేదాకా మన పోరాటం కొనసాగుతుంది. ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం, న్యాయం కోసం నా పోరు ఆగదు. స్వేచ్ఛ కోసం జరిపే సమరం చాలా శ్రమతో కూడుకొని ఉంటుంది. ఇలాంటి కష్టాన్ని మనం ఇష్టపడతాం. మన దేశం కోసం ఆమాత్రం కష్టపడటం సబబే. ఫలితాల తర్వాత మనం ఓటమి చీకట్లోకి జారుకుంటున్నామని చాలా మంది భావించి ఉండొచ్చు. కానీ ఈ కష్టకాలం పెద్ద విషయమే కాదు’’ అని అన్నారు.సభలో గంభీర వాతావరణంపార్టీ ఓటమితో డెమొక్రాట్లలో ఒకింత నైరాశ్యం నిండింది. సభకు వేలాది మంది వచ్చినా సరే కొన్ని నిమిషాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. మధ్యమధ్యలో హారిస్ తన ఉత్సాహభరితమైన ప్రసంగంతో వాళ్లలో హుషారు నింపే ప్రయత్నంచేశారు. పార్టీ సీనియర్ నేతలు కొందరు ప్రసంగించారు. దిగువసభ మాజీ మహిళా స్పీకర్ నాన్సీ పెలోసీ, డీసీ మేయర్ మురేల్ బౌసర్ తదితరులు మాట్లాడారు. పార్టీ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న కొందరు యువ ఓటర్లు, మద్దతుదారులు సభలోనే కన్నీటిపర్యంతమయ్యారు. -
అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి తర్వాత, ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు కొందరు వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు.ఎన్నికల్లో కమలా హారిస్ను గెలిపించేందుకు ఆమె మద్దతుదారులు ఎంతో కృషి చేశారు.కొన్ని సందర్భాలలో కమలా మద్దతుదారులు ఎంతో దూకుడుగా కనిపించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక సీన్ మారిపోయింది.కమలా హారిస్ కోసం సోషల్ మీడియా మొదలుకొని వీధులలో ప్రచారం సాగించిన ఆమె అభిమానులు ఫలితాలు వెలువడ్డాక తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు.అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమలా హారిస్ వాషింగ్టన్లో ప్రసంగించారు. మీరు నాపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.ఎన్నికల్లో ఓడిపోయినా మన లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగుతుందని కూడా కమలా హారిస్ అన్నారు.ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ను ఓడించారు. నాలుగేళ్ల క్రితం డెమొక్రాట్ల చేతిలో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.వాషింగ్టన్లో కమలా హారిస్ ప్రసంగిస్తున్నప్పుడు, ఆమె మద్దతుదారులు విచార వదనాలతో కనిపించారు.తమ నేత దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని కమలా హారిస్ మద్దతుదారులు భావించారు. అయితే వారి ఆశలు అడియాసలుగా మిగిలాయి. ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ -
మహిళలకు మళ్లీ మొండిచెయ్యే
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారన్న అంచనాలు తారుమారయ్యాయి. 2016 తర్వాత మరోసారి ఓ మహిళకు అత్యున్నత పీఠం త్రుటిలో చేజారింది. హారిస్ మాదిరిగానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కూడా హోరీహోరీ తలపడ్డారు. అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన తొలి మహిళగా నిలిచారు. హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేయడం విశేషం. అప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే. ఆయనతో డిబేట్లలో హిల్లరీ తడబడ్డా ఆద్యంతం గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. అంతేగాక ఆ ఎన్నికల్లో పాపులర్ ఓట్ కూడా సాధించారు. అంటే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఆమెకే ఎక్కువ పడ్డాయి. ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 28 లక్షల పై చిలుకు అధిక ఓట్లు సాధించారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ విధానం వల్ల ట్రంప్ చేతిలో 76 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో డెమొక్రాట్ల రాష్ట్రాలుగా పేరుబడ్డ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటమి కూడా హిల్లరీ కొంప ముంచింది. హిల్లరీ 2008లో కూడా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం విఫలయత్నం చేశారు. భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 1993–2001 మధ్య కాలంలో ఆమె ఫస్ట్ లేడీగా వ్యవహరించారు. ఆమెకు ముందు 1968లోనే చార్లెన్ మిషెల్ అనే మహిళ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచిపోయారు. మిషెల్ పేరు కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలపై చోటుచేసుకుంది. 150 ఏళ్ల క్రితమే తొలి పోటీ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఉదంతం 150 ఏళ్ల క్రితమే చోటుచేసుకుంది. ఆమె పేరు విక్టోరియా వుడ్హల్. 1872లో ఈక్వల్ రైట్స్ పార్టీ తరఫున ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళలకు పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించిన నేతగా వుడ్హల్కు పేరుంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కే ఉండని రోజుల్లో ఆమె ఏకంగా అధ్యక్ష పదవికే పోటీపడటం సంచలనంగా నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. కానీ పోటీ చేసేనాటికి వుడ్హల్కు 33 ఏళ్లు మాత్రమే. ఎన్నికల్లో ఆమె ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు. తర్వాత 1884, 1888ల్లో బెల్వా ఆన్ లాక్వుడ్ అనే మహిళను ఈక్వల్ రైట్స్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దింపింది. తర్వాత చాలాకాలానికి 1964లో మార్గరెట్ చేజ్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీ పడ్డారు. తద్వారా ఒక ప్రధాన పార్టీ అభ్యరి్థత్వ రేసులో దిగిన తొలి మహిళగా నిలిచారు. 1972లో షిర్లీ చిషోమ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం ప్రయత్నించారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలిచిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఇక ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ తొలి మహిళగా గెరాల్డిన్ ఫెరారో. ఆమె 1984లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాల్టర్ మాండలేకు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. 2004లో సారా పాలిన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఆమె జాన్ మెక్కెయిన్కు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. గత 30 ఏళ్లుగా పలు చిన్న పార్టీల తరఫున కూడా ఎందరో మహిళలు అధ్యక్ష రేసులో నిలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హారిస్.. ఐదు వైఫల్యాలు
1. ప్రభుత్వ వ్యతిరేకత–బైడెన్ అసమర్థతజో బైడెన్ నాలుగేళ్ల పాలనలో డెమొక్రాట్లపై అమెరికా అంతటా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత నెలకొంది. ఆర్థిక వ్యవస్థను అదుపు పెట్టడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న అపప్రథను మూటగట్టుకున్నారు. అన్ని అంశాలపైనా ఆయన విధానాలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక బైడెన్ విదేశీ విధానం కూడా విమర్శలపాలైంది. ముఖ్యంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలను నివారించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఇవన్నీ హారిస్కు ప్రతికూలంగానే మారాయి. విదేశీ విధానంపై ఆమె వాదన అమెరికన్లను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో ట్రంప్తో పోలిస్తే బాగా మెతక అన్న అభిప్రాయం ఆమెకు బాగా చేటు చేసింది. పలు కీలకాంశాలపై తన వైఖరి చెప్పకుండా దాటవేయడం కూడా ప్రతికూలంగా మారింది. నిజానికి హారిస్ ఆలస్యంగా బరిలో దిగినా శాయశక్తులా పోరాడి ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ అడుగడుగునా బైడెన్ వైఫల్యాల తాలూకు భారాన్ని మోయాల్సి రావడం హారిస్కు అతి పెద్ద ప్రతికూలాంశంగా పరిణమించింది. మెజారిటీ అమెరికన్లకు జీవన్మరణ సమస్యగా మారిన ఆర్థిక అవ్యవస్థను గాడిన పెట్టడానికి ఏం చేస్తానన్నది ఆమె సమర్థంగా వివరించలేకపోయారు. ఈ విషయంలో ఆమెకు మొదటినుంచీ పెద్దగా మార్కులు పడలేదు. దీనిపై ప్రతి సర్వేలోనూ ట్రంప్దే పైచేయిగా నిలిచింది. ఏకంగా మూడొంతుల మందికి పైగా ప్రభుత్వ విధానాలన్నీ అట్టర్ ఫ్లాప్ అని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలిగా ప్రభుత్వ విధానాల్లో నాలుగేళ్లుగా భాగస్వామి అయిన హారిస్ వాటితో గట్టిగా విభేదించలేకపోయారు. ఇది అంతిమంగా ఆమె కొంప ముంచింది.2. దన్నుగా నిలవని లాటిన్లు, ఇండియన్లులాటిన్, ఇండియన్ అమెరికన్లు సాంప్రదాయికంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా పేరుబడ్డారు. వారిపై హారిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిలో ఎక్కువమంది ఈసారి ట్రంప్కే ఓటేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. 2020లో ట్రంప్తో పోలిస్తే బైడెన్కు ఓటేసిన లాటిన్ అమెరికన్ల సంఖ్య 23 శాతం ఎక్కువని తేలింది. ఈసారి సీన్ రివర్సయింది. లాటిన్ అమెరికన్ల ఓట్లు హారిస్ కంటే ట్రంప్కు కనీసం 8 శాతం ఎక్కువగా పడ్డట్టు పోల్ పండితులు అంచనా వేస్తున్నారు! ఇండియన్ అమెరికన్లలో కూడా హారిస్కు నిరాశే ఎదురైంది. వారు కొన్నాళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా యువతలో ట్రంప్ను సమర్థించే వారి సంఖ్య బాగా పెరిగింది. పురుషుల్లోనూ ఈ ధోరణి పెరిగినట్టు పలు సర్వేల్లో తేలింది. భారతీయ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్ను సమర్థించగా 47 శాతం ట్రంప్వైపు మొగ్గారు. కానీ మిగతా అమెరికన్ల మాదిరిగా ధరాభారం, ఉపాధి తదితరాలు భారత సంతతి వారిని కూడా ప్రభావితం చేసినట్టు కన్పిస్తోంది.3. యువ, స్వతంత్ర, తటస్థ ఓటర్ల మొండిచేయి2020లో బైడెన్కు ఓటేసిన వారితో పోలిస్తే అన్ని రకాల ఓటర్లలోనూ హారిస్కు మద్దతు తగ్గింది. కేవలం విద్యాధికులైన యువతుల్లో మాత్రమే ఆమె బైడెన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. యువకులు మాత్రం ట్రంప్కే జైకొట్టారు. దాంతో మొత్తంగా 2020లో బైడెన్తో పోలిస్తే హారిస్కు యువత ఓట్లు తగ్గాయి. తటస్థులు, ఉదారవాదుల ఓట్లను కూడా ఆమె అనుకున్నంతగా సాధించలేకపోయారు. హారిస్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న అబార్షన్ హక్కుల అంశం కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ట్రంప్ నియంతృత్వ ధోరణులపై ఆందోళన వెలిబుచ్చడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణను ప్రధానాంశంగా పేర్కొన్న ఓటర్లు హారిస్కే భారీగా మద్దతిచ్చారు. కానీ అడ్వాంటేజీని పూర్వపక్షం చేస్తూ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఆందోళనగా ఉన్నవారంతా ట్రంప్కే గుండుగుత్తగా ఓటేశారు.4. ఆదుకోని పట్టణ ప్రాంతాలుడెమొక్రాట్లకు దన్నుగా నిలుస్తూ వస్తున్న పట్టణ, శివారు ప్రాంతాల్లో కూడా ఈసారి ట్రెండ్ రివర్సయింది. వాటిలోనూ ట్రంప్ గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించినట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా స్పష్టత వచ్చిన పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ చోట్ల 2020లో బైడెన్ సాధించిన ఓట్లతో పోలిస్తే హారిస్ వెనకబడ్డారు. పైగా ఆ తేడా కనీసం ఒకట్రెండు పాయింట్లు, అంతకుమించి నమోదైంది. మిషిగన్ వంటి కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనైతే పట్టణ ప్రాంతాల్లో బైడెన్ సాధించిన 14 శాతం ఆధిక్యాన్ని హారిస్ నిలుపుకోలేకపోయారు. ఇది కూడా అంతిమ ఫలితాలపై గట్టి ప్రభావమే చూపింది.5. సోషల్ మీడియాఈసారి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తేల్చడంలో సోషల్ మీడియా కూడా కీలకంగా వ్యవహరించింది. అమెరికా మెయిన్స్ట్రీమ్ మీడియా దాదాపుగా హారిస్కే దన్నుగా నిలిచింది. కానీ దానికి అమెరికా ప్రజల్లో విశ్వసనీయత అడుగంటి చాలాకాలమైంది. వారు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాకు మళ్లుతున్నారు. ఈ మార్పును ఒడిసిపట్టుకున్న ట్రంప్ సోషల్ మీడియా ప్రచారంలో దూకుడు కనబరిచారు. ముఖ్యంగా ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ బాహాట మద్దతు ఆయనకు బాగా కలిసొచ్చింది. జో రోగన్ వంటి పాడ్కాస్టర్లు కూడా ట్రంప్కు విస్తృతమైన ప్రచారం కల్పించారు.అమెరికా జనాభాలో ఎవరెంత మంది?అమెరికా జనాభా 33 కోట్ల పైచిలుకుశ్వేతజాతీయులు 58.9 శాతంహిస్పానియన్లు 19.1 శాతంఆఫ్రో అమెరికన్లు 12.6 శాతంఆసియన్లు 6.1 శాతంమిగతా వారు 2.4 శాతంమూలవాసులు 0.7 శాతంఇతరులు 0.2 శాతంఓటేసేవారిలోశ్వేత జాతీయులు 73 శాతంఆఫ్రో 11 శాతంహిస్పానియన్లు 9 శాతంఆసియన్లు 2 శాతం -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. గ్రోవర్ క్లీవ్లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. విజయం ఖాయం కాగానే ట్రంప్ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్పామ్ బీచ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్మేట్ జేడీ వాన్స్తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మరోసారి తనపై విశ్వాసముంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అపూర్వమైన, అత్యంత శక్తిమంతమైన ఫలితమిది. అమెరికా చరిత్రలో స్వర్ణయుగానికి నా విజయం నాంది’’ అని ప్రకటించారు. ‘‘భగవంతుడు ఏదో పెద్ద కారణంతోనే నాకు ప్రాణదానం చేశాడని చాలామంది చెప్పింది నిజమేనని ఈ ఫలితాలు రుజువు చేశాయి’’ అని ప్రచార పర్వంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది అమెరికా ప్రజల విజయం. అంతేగాక దేశ చరిత్రలోనే అతి గొప్పదైన, కనీవిని ఎరగని రాజకీయ ఉద్యమమిది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా చివరి శ్వాస దాకా ప్రతి రోజూ మీ కోసం, మీ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాడతా. మీ జీవితాల్లో వెలుగులు పంచుతా. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలతో సహా అన్ని సమస్యలకూ సమర్థ పరిష్కారం చూపుతా’’ అని వాగ్దానం చేశారు. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. ముందునుంచీ... అమెరికావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వాటిలో ఒకటైన విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన 270 ఓట్ల మెజారిటీ మార్కును దాటగానే రిపబ్లికన్ నేతలు, అభిమానులు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్ 223 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కడం తెలిసిందే. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్ వర్సిటీలో బుధవారం రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కొద్ది నెలలుగా ఎన్నికల సర్వేలన్నీ పేర్కొంటూ రావడం తెలిసందే. స్వింగ్ స్టేట్లలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పడంతో ఫలితాలపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. -
విజయానికి ఐదు మెట్లు
పోరు హోరాహోరీ అంటూ విశ్లేషణలు. హారిస్దే పైచేయి అంటూ అమెరికా మీడియాలో కథనాల వెల్లువ. అందుకు తగ్గట్టు ట్రంప్తో ఏౖకైక డిబేట్లోనూ హారిస్ స్పష్టమైన ఆధిపత్యం. వీటికి తోడు ఆమె ఆఫ్రికన్, భారత మూలాలు. మహిళల దన్నుపై ధీమా. అబార్షన్ వంటి కీలకాంశాలు కలిసొస్తా యన్న అంచనాలు. సెలబ్రిటీల బహిరంగ మద్దతు. రిపబ్లికన్లతో పోలిస్తే ప్రచారానికి వరదలా వచ్చి పడ్డ నిధులు. కానీ తీరా చూస్తే ట్రంప్ హవా ముందు అన్నీ కొట్టుకుపో యాయి. హోరాహోరీ అనుకున్న పోటీ కాస్తా ఫలితాలొచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. ట్రంప్ విజయానికి, హారిస్ పరాజయానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే...1. అమెరికా ఫస్ట్2016లో ట్రంప్ను విజయతీరాలకు చేర్చిన ఈ నినాదం ఈసారి కూడా గట్టిగా పని చేసింది. ఉక్రెయిన్కు మద్దుతుగా బైడెన్ సర్కారు వందలాది కోట్ల డాలర్లను గుమ్మరించడం సగటు అమెరికన్లకు మింగుడు పడలేదు. దానికి తోడు చైనా తదితర దేశాల నుంచి కారుచౌకగా వచ్చిపడుతున్న వస్తూత్పత్తులు వారి పొట్టకొట్టడమే గాక ఉపాధికి కూడా ఎసరు పెడుతున్నాయి. అసలే ధరాభారంతో కుంగిపోతున్న అమెరికన్లకు ఈ పరిణామం కొన్నేళ్లుగా రోకటిపోటుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను ప్రాభవం కొడిగడుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణించడాన్ని వారు సమర్థించారు. సుంకాలను భారీగా పెంచడం ద్వారా కారుచౌక దిగుమతులకు అడ్డుకట్ట వేస్తానన్న ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్థిక అవ్యవస్థ సహా అన్ని సమస్యలనూ చక్కదిద్దడానికి హారిస్తో పోలిస్తే ట్రంపే సరైన నేత అని మెజారిటీ ప్రజలు భావించారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి విపరీతమైన స్పందన దక్కింది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ అమెరికా ప్రాధాన్యాన్ని పునరుద్ధరిస్తానన్న వాగ్దానం శ్వేతజాతీయుల మనసు గెలుచుకుంది.2. అక్రమ వలసలువలసదారులు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారన్న ఆక్రోశం స్థానికుల్లో చాలా ఏళ్లుగా నెలకొని ఉంది. వారిలోని ఈ వ్యతిరేకతను ట్రంప్ పూర్తిస్థాయిలో సొమ్ముచేసుకోగలిగారు. బైడెన్ నాలుగేళ్ల పాలనలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో అక్రమ వలసలు జరిగాయి. వలసదారులు అమెరికన్ల పొట్టకొడుతు న్నారన్న ట్రంప్ వాదనతో వారు ఏకీభవించారు. వాటికి అడ్డుకట్ట వేయడమే గాక అక్రమంగా వచ్చిన 10 లక్షల పై చిలుకు మందిని స్వదేశాలకు పంపేస్తానని ప్రకటించడం ట్రంప్కు భారీగా లాభించింది.3.ఎకానమీఈసారి ట్రంప్ను గద్దెనెక్కించిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది. బైడెన్ పాలనలో గత నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం చుక్కలను తాకింది. నిత్యావసరాల ధరలు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రెట్లకు పైగా పెరిగిపోయాయి. కరోనా తదితర సమస్యలూ దానికి కారణమైనా ఓటర్లు మాత్రం బైడెన్ను, ఆయన డెమొక్రటిక్ పార్టీనే దోషులుగా చూశారు. ట్రంప్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదన్నది అమెరికన్లలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దే సామర్థ్యం విషయంలో ట్రంప్తో పోలిస్తే హారిస్ తేలిపోయారని అన్ని సర్వేల్లోనూ తేలింది.4. గ్రామీణ ఓటర్ల బ్రహ్మరథంతొలినుంచీ ట్రంప్కు గట్టి ఓటు బ్యాంకుగా నిలిచిన గ్రామీణ ఓటర్లు ఆయనకు ఈసారి మరింత దన్నుగా నిలిచారు. గత కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినట్టు ఫలితాల సరళి చెబుతోంది. ఈ ట్రెండు దేశవ్యాప్తంగా కొనసాగడం ట్రంప్కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే గ్రామీణ ఓట్లను ఆయన దాదాపుగా స్వీప్ చేశారు.మైనారిటీ ఓటర్లలోనూ పాగామెక్సికో తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తరాల కిందట వలస వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. ఫలితాల్లో వీరి ఓట్లూ కీలకమే. డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలో 12 శాతం దాకా ఉండే హిస్పానియన్లు కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ఆ ట్రెండ్ కూడా ఈసారి కూడా కొనసాగినట్టు కన్పిస్తోంది. దీనికి తోడు హిస్పానియన్లకు, ఇండియన్ అమెరికన్లకు దగ్గరయ్యేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలింగ్ సమీపించిన తరుణంలో బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై దాడులను ఖండిస్తూ చేసిన ప్రకటన ఇండియన్ అమెరికన్లపై ప్రభావం చూపింది. 2020తో పోలిస్తే ట్రంప్కు ఈసారి లాటిన్, ఇండియన్ అమెరికన్ ఓట్లు గణనీయంగా పెరిగినట్టు దేశవ్యాప్తంగా 1.15 లక్షల ఓటర్లతో జరిపిన ఏపీ వోట్కాస్ట్ ప్రాథమిక సర్వే తేల్చింది. 2020లో బైడెన్కు ప్రతి 10 మంది లాటిన్ ఓటర్లలో 9 మంది ఓటేయగా ఈసారి హారిస్కు 8 మందే వేసినట్టు పేర్కొంది. 2020లో 60 శాతం పడ్డ హిస్పానియన్ ఓట్లు ఈసారి 50 శాతానికి తగ్గాయి. 30 ఏళ్ల లోపు ఓటర్లలో 2020లో బైడెన్కు 60 శాతం మంది ఓటేయగా ఈసారి అది 50 శాతానికి పరిమితమైంది. వారిలో 2020లో ట్రంప్కు మూడో వంతే ఓటేయగా ఈసారి అది 40 శాతానికి పెరిగింది. ఈ చిన్న మార్జిన్లే తుది ఫలితాలను గట్టిగా ప్రభావితం చేశాయి.5. భావజాలాలుపైకి కన్పించకపోయినా అమెరికా సమాజంలో జాత్యహంకారం, పురుషాధిక్య భావజాలం బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. ట్రంప్కు శ్వేతజాతీయులు మొదటినుంచీ గట్టి మద్దతుదారులుగా ఉండటానికి ఇది కూడా కారణమేనని చెబుతారు. అందుకే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వంటి ట్రంప్ నినాదాల్లో అంతర్లీనంగా దాగున్న ఆ భావనలు ఓటర్లపై గట్టి ప్రభావమే చూపాయని భావిస్తున్నారు. వీటికి తోడు ట్రంప్పై కోర్టు కేసులు, క్రిమినల్ అభియోగాలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. పైగా ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఆ దూకుడేనని వారు భావించారు. దీన్ని ట్రంప్ కూడా అంగీకరించడం విశేషం. తనపై ఉన్న కేసులు, అభియోగాలు జనాదరణను మరింతగా పెంచాయని చెప్పుకొచ్చారాయన. -
ట్రంప్కే అమెరికా పట్టం
అంచనాలను మించిన విజయం ఇది. హోరాహోరీ పోరన్న సర్వేల జోస్యాన్ని తలకిందులు చేసిన ఫలితం ఇది. నవంబర్ 5 జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటు పాపులర్ ఓటులోనూ, అటు ఎలక్టోరల్ ఓటులోనూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తిరుగులేని ఆధిక్యం సంపాదించారు. ప్రత్యర్థి, డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్కు అందనంత దూరంలో నిలిచి, అమెరికా 47వ అధ్యక్షుడిగా పీఠం ఖరారు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి మరింత సమయం పట్టనున్నప్పటికీ, ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజ్లో కావాల్సిన 270 సీట్ల మెజారిటీని ఆయన దాటేశారు. పన్ను తగ్గింపు సహా ప్రజాకర్షక వాగ్దానాలు, కట్టుదిట్టమెన వాణిజ్య షరతుల విధానం, వలసదారులకు అడ్డుకట్ట లాంటి వాటితో అమెరికాను మళ్ళీ అగ్రస్థానానికి తీసుకువెళతానన్న ట్రంప్ మాటలను అమెరికన్లు విశ్వసించారు. అందుకే, గడచిన రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫలితాన్ని హైజాక్ చేశారంటూ గెలిచిన పార్టీపై ఓడిన పార్టీ చేస్తూ వచ్చిన ఆరోపణలకు ఈసారి తావివ్వకుండా అఖండ విజయం అందించారు. ఇక, తమిళనాడుతో బంధమున్న కమల గెలవకున్నా, తెలుగు మూలాలున్న మనమ్మాయి ఉష భర్త జె.డి. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం భారతీయులకు ఊరట నిచ్చింది. రెండుసార్లు అభిశంసనకు గురై, అనేక క్రిమినల్ కేసులను ఎదుర్కొంటూ, ఒక దశలో అధ్యక్ష పదవికి పోటీ చేయడానికీ అనర్హులవుతారనే ప్రచారం నుంచి పైకి లేచి, 900 పైగా ర్యాలీలతో తమ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టడం ట్రంప్ సృష్టించిన చరిత్ర. అలాగే, ఎప్పుడూ డెమోక్రాటిక్ పార్టీకే మద్దతుగా నిలిచే మైనారిటీ ఓటర్లను పెద్ద సంఖ్యలో ఆకర్షించి, అమెరికా దేశీయ రాజకీ యాల్లో కొత్త రాజకీయ పునరేకీకరణకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ డెమోక్రాట్లకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన భారతీయ అమెరికన్లు సైతం ఈసారి ఎక్కువగా రిపబ్లికన్ల వైపే మొగ్గడం విశేషం. పీడిస్తున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం నుంచి ట్రంప్ బయట పడేస్తారనే ప్రజా భావన కలిసొచ్చింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన హత్యాయత్నాల సానుభూతి సరే సరి. ఇలాంటివన్నీ ట్రంప్కు అనుకూలించి, కమల అధ్యక్ష పదవి ఆశలను తలకిందులు చేశాయి. ఉదారవాదులు ఎంత వ్యతిరేకించినా విజయం ట్రంప్నే వరించింది. మహిళల అబార్షన్ హక్కుకు అనుకూలంగా కమల నిలబడడంతో స్త్రీలు ఆమెకు బ్రహ్మరథం పడతారని భావించారు. అది కొంతమేర జరిగింది కానీ, అధ్యక్ష పదవి అందుకోవడానికి అదొక్కటే సరిపోలేదు. శ్వేత మహిళల్లో గతంతో పోలిస్తే కమలకు కొంత మద్దతు పెరిగింది. అయితే, ఆఖరికి ఆ వర్గంలోనూ ట్రంప్కే అధికశాతం ఓట్లు పడ్డాయి. మొత్తం మీద పురుషుల్లో అధికంగా ట్రంప్కూ, మహిళల్లో ఎక్కువగా కమలకూ ఓటు చేశారని తొలి లెక్క. మహిళా నేత ఏలుబడికి అమెరికా సమాజం ఇప్పటికీ సిద్ధంగా లేదనీ, గతంలో హిల్లరీ క్లింటన్కైనా, ఇప్పుడు కమలకైనా ఎన్నికల ఫలితాల్లో ఈ లింగ దుర్విచక్షణ తప్పలేదనీ వినిపిస్తున్నది అందుకే. ఇక, గతంలో పెద్దగా ఓటింగ్లో పాల్గొనరని పేరున్న యువ, పురుష ఓటర్ల వర్గం ఈసారి పెద్దయెత్తున వచ్చి ఓటేయడం,ముఖ్యంగా శ్వేత జాతీయుల్లో అత్యధికులు ట్రంప్కే పట్టం కట్టడం గమనార్హం. ఒక్క నల్ల జాతీ యుల్లో మాత్రమే 78 శాతం మంది పురుషులు, 92 శాతం మంది స్త్రీలు కమలకు ఓటేశారు. అమె రికన్ సమాజంలోని కనిపించని నిట్టనిలువు చీలిక, వర్ణవిచక్షణకు ఇది ప్రతిబింబమని ఓ వాదన. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడం, సెనేట్లో రిపబ్లికన్ పార్టీ పూర్తి నియంత్రణ సాధించడం అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద మలుపు. 2016లో తెలియకున్నా ఇప్పుడు మళ్ళీ పట్టం కడుతున్నప్పుడు ఆయన వ్యవహారశైలి సహా అన్నీ తెలిసే అమెరికన్లు ఆ నిర్ణయం తీసు కున్నారు. ఇప్పుడిక సెనేట్పై పట్టుతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ప్రపంచానికి కట్టుబడిన అగ్రరాజ్య విధానం నుంచి పూర్తి భిన్నంగా అమెరికాను ట్రంప్ కొత్త మార్గం పట్టిస్తారని ఒక విశ్లేషణ. అమెరికా జాతీయ ప్రయోజనాల దృక్కోణం నుంచే ప్రపంచాన్ని చూడడం ట్రంప్ పద్ధతి. వాణిజ్య ప్రయోజనాలే గీటురాయిగా ఆయన ముందుకు సాగవచ్చు. అలాగే, ఉక్రెయిన్కు సైనిక సాయం ఆపి, ఆక్రమణ జరిపిన రష్యాతో శాంతి చర్చలు జరపాలన్న ట్రంప్ వైఖరి పర్యవసానం యూరప్ అంతటా ఉంటుందని అక్కడి దేశాలు బెంగపడుతున్నాయి.భారత్కు సంబంధించినంత వరకు ట్రంప్ ఎన్నిక శుభవార్తే. నిజానికి, ప్రస్తుత డెమోక్రాట్ల హయాంలోనూ అమెరికా – భారత సంబంధాలు బాగున్నాయి. అయితే, భారత ప్రధాని మోదీతో ట్రంప్ చిరకాల మైత్రి వల్ల రానున్న రిపబ్లికన్ ప్రభుత్వ ఏలుబడి మనకు మరింత సానుకూలంగా ఉంటుందని ఆశ, అంచనా. ఇతర దేశాల సంగతికొస్తే... ట్రంప్ ఎన్నిక ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి వాటికి కష్టాలు తెస్తే, ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ లాంటి వారికి ఆనందదాయకం. కమల గద్దెనెక్కితే బాగుండనుకున్న చైనా, ఉక్రెయిన్ల ఆశ నెరవేర లేదు. అమెరికాలోని దాదాపు 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతానంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ రానున్న జనవరిలో అధికారం చేపడుతూనే ఆ ఆపరేషన్ను ప్రారంభించనున్నట్టు ఆయన అధికార ప్రతినిధులు బుధవారమే తేల్చేశారు. అంటే, ఆది నుంచి ట్రంప్ దూకుడు చూపనున్నారన్న మాట. అంతర్జాతీయ సంబంధాలు, ప్రపంచ అధికార క్రమాన్నే మార్చేయాలని చూస్తున్న ఆయన ధోరణి అమెరికానూ, మిగతా ప్రపంచాన్నీ ఎటు తీసుకువెళుతుందో వేచి చూడాలి. సమస్యల్ని పరిష్కరి స్తానంటూ ఎన్నికల నినాదం చేసిన ట్రంప్ కొత్తవి సృష్టిస్తే మాత్రం కష్టమే! -
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన -
అమ్మా.. నీకు మాటిస్తున్నా..!
-
US Election Results: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు నిరాశ ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ మార్క్ను దాటారు.విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన ఈ మ్యాజిక్ ఫిగర్ దాటారు. ఇక.. ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో ఆయన అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్-280కమలా హారిస్-224ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా 3 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.ట్రంప్ నెగ్గిన రాష్ట్రాలుఅలబామా 9, ఆర్కాన్సాస్ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్ కరోలినా 16, నార్త్ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్ 40, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4,వయోమింగ్ 3, విస్కాన్సిన్ 10కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలివే..కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్ 7, డీసీ 3, డెలవేర్ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, మైన్ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్షైర్ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్ 28, ఓరెగాన్ 8, రోడ్ ఐల్యాండ్ 4, వర్జినియా 13, వెర్మాంట్ 3, వాషింగ్టన్ 12ట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్హౌజ్ వైపు అడుగులేశారు.చదవండి: Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి.. -
రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ!
హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక గెలుపు సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే. దీంతో భారత్ సహా ప్రపంచదేశాలు ట్రంప్ను అభినందిస్తున్నాయి. మరోవైపు 78ఏళ్ల వయసులో అమెరికా అద్యక్షుడు కాబోతున్న ట్రంప్కిష్టమైన పదార్థాలేంటి, మద్యం తాగతాడా? టీ కాఫీలుతాగుతాడా అనేది నెట్టించ చర్చ మొదలంది. ఈ నేపథ్యంలో ట్రంప్కు ఇష్టమైన ఫుడ్, వంటకాలేంటో ఒకసారి చూద్దాం.ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం ట్రంప్కు ఫాస్ట్ ఫుడ్ అభిమాని. అలాగే మీట్ లోఫ్ చాలా ఇష్టం. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. ఇంకా బర్గర్ కింగ్, కెఎఫ్సీ సహా తో సహా ఫాస్ట్ ఫుడ్కి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని దేశ విదేశాల పర్యటనల్లో ఆయన ఫాస్ట్ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన రోజువారీ ఆహారంలోసాధారణంగా బ్రేక్ఫాస్ట్, లంచ్ కంటే కూడా డిన్నర్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.బ్రేక్ఫాస్ట్, లంచ్ , డిన్నర్ బేకన్ , గుడ్లు, తృణధాన్యాలు లేదా మెక్డొనాల్డ్స్ మెక్మఫిన్ తింటాడు. కాఫీ లేదా టీ అస్సలు తాగడు. గతంలో మాజీ ప్రచార నిర్వాహకుడు కోరీ లెవాండోస్కీ రాసిన లెట్ ట్రంప్ బి ట్రంప్ అనే పుస్తకం ప్రకారం ట్రంప్ పగటిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. సాధారణంగా 14 నుండి 16 గంటలు తినకుండానే ఉంటాడు. ఎగ్ మెఫిన్స్ ఫిష్ శాండ్విచ్ చాక్లెట్ షాక్ అన్నా కూడా ఇష్టం.వ నిల్లా-ఫ్లేవర్ ఉన్న కీబ్లర్ వియన్నా ఫింగర్స్ను తింటారు.డైట్ కోక్ అంటే పిచ్చిమద్యానికి దూరంగాఉండే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. రోజుకు సుమారు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడని చెబుతారు.. ఇక వెజ్ విషయానికి వస్తే ఆటూ చిప స్, లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటారు. చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం , చాక్లెట్ కేక్ ఆయనకు నచ్చిన ఆహారాల్లో భాగమే. -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ఆయన రెండోసారిఅ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అమెరికన్ ఓటర్లు.. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించి.. డొనాల్డ్ ట్రంప్, రన్నింగ్మేట్( ఉపాధ్యక్షుడు) జేడీ వాన్స్కి అభినందనలు తెలిపారు.‘‘ మేం అమెరికాను రక్షించాం. రిపబ్లిక్ పార్టీ ఘన విజయంతో..యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా సెనేటర్ జేడీ వాన్స్ వైట్ హౌస్కు వెళ్తున్నారు. వారితో కలిసి అమెరికన్ ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.We have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024చదవండి: రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ! -
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా
-
కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!
యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్గా పిలుస్తున్నారు.ఈ డైట్ విధానం..కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు. ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..నిపుణల అభిప్రాయం ప్రకారం..పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడంనాన్వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను చేర్చడంసౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్వెజ్ తీసుకోవడంప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటంస్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.ఆమె ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్వెజ్కి ప్రాధాన్యత ఇస్తారు.ఈ డైట్లో ఉండే ఆహారాలు..ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలుకార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంపపండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రోనట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్లు, కొబ్బరిమొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలుపానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీప్రయోజనాలు:ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయిగుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిమధుమేహం నియంత్రణలో ఉంటుంది.కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?) -
డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలినుంచి హావా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండు కీలక స్వింగ్ స్టేట్స్ నార్త్ కరోలినా, జార్జియాలో విజయం సాధించి మరో నాలుగింటిలో లీడ్లో ఉన్నారు. దీంతో ట్రంప్ గెలుపు ఖాయమన్న భావన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇటు రిపబ్లికన్లలో జోష్ నెలకొనగా అటు డెమోక్రాట్లు నిరాశలో మునిగిపోయారు. ట్రంప్ బుధవారం ఫ్లోరిడాలో తన అభిమానులనుద్దేశించి ప్రసంగించనుండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ మాత్రం బుధవారం తన షెడ్యూల్ను రద్దు చేసుకున్నారు. నిజానికి బుధవారం ఉదయం ఆమె హవర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాల్సి ఉంది. ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఆమె తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. -
ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?
యూఎస్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ నేత కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిలో ఎవరిది పైచేయి అనేది కొద్ది క్షణాల్లో తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇరువురి అభ్యర్థుల ప్రచార వ్యూహం ఎలా ఉన్నా..వారి ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్ ఎంతవరకు ఓటర్లను ఆకర్షించింది?. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఈ ఇరువురు ఎలాంటి స్టైల్ని ఎంచుకున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా..!ఫ్యాషన్ రాజకీయాలు వేర్వేరు అనుకుంటే పొరబాటే. ఈ రోజుల్లో నాయకుల ఫ్యాషన్ శైలి కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న అంశంగా మారింది. అమెరికాలో ఉత్కంఠభరితమైన అధ్యక్ష పోలింగ్ వేళ..ఇరువురు తమ ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్తో ఓటర్లను తమదైన పంథాలో ప్రభావితం చేసేలా యత్నించారు. ఆ నాయకులిద్దరూ తాము ధరించే దుస్తులతో తాము ప్రజల మనిషి అని పరోక్షంగా తెలియజేశారు. వారి భావజాలంతో కంటే తమ ఫ్యాషన్శైలితోనే ఓటర్లకు కనెక్ట్ అయ్యారు. అదెలాగో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ క్లాసిక్ అండ్ టైలర్డ్ స్టైల్..డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ చాలా కాలంగా సిగ్నేచర్ సిల్హౌట్ ఫ్యాషన్కి కట్టుబడి ఉన్నారు. తన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసేలా శక్తిమంతమైన సూట్లు, ఫ్యాంట్లు ఎంపిక చేసుకుంది. టైలర్డ్ ప్యాంట్సూట్లతో ప్రజలకు మరింత చేరవయ్యింది. అంతేగాదు ఆమె ధరించి షోల్డర్ ప్యాడ్లు ఓటర్లకు భరోసా ఇచ్చేలా ఉంటుంది. స్థిరత్వమైన నిర్ణయాలకు ప్రతీక అని చాటి చెప్పేలా కమలా ఆహార్యం ఉంటుంది. అలాగే కమలా ధరించే సూట్కి పిన్ చేసి ఉన్న ఫ్లాగ్ ఆమె దేశభక్తిని చాటి చెబుతోంది. ముఖ్యంగా ఆమె ధరించే ముత్యాలకు సంబంధించిన టూ-స్ట్రాండ్ ఐరీన్ న్యూవిర్త్ నెక్లెస్ ప్రశాంతతకు పెద్దపీట వేసే మనిషి అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Kamala Harris (@kamalaharris)డొనాల్డ్ ట్రంప్ బోల్డ్ అండ్ బ్రష్ ఎంపికలు..డొనాల్డ్ ట్రంప్ ధైర్యసాహసాలను చూపించేలా డార్క్ కలర్ బ్లూ సూట్లను, ఎరుపు టైని ధరిస్తారు. ఆ ఆహార్యంతో డొనాల్డ్ తరుచుగా నెట్టింట వైరల్ అవుతుంటారు కూడా. పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీలో బూడిదరంగు మెక్డొనాల్డ్ ఆప్రాన్తో ఆకట్టుకున్నారు. విస్కాన్సిన్లో అతని ఫ్లోరోసెంట్-నారింజ ట్రాష్ ప్రజల సమస్యకు సత్వరమే స్పందించే వ్యక్తిగా ప్రతిబింబించింది. View this post on Instagram A post shared by President Donald J. Trump (@realdonaldtrump)ఈ ఇద్దరు నాయకుల వార్డ్రోబ్లు మాటలతో పనిలేకుండా వారేంటి అనేది ప్రజలకు పరోక్షంగా తెలియజేశాయి. తమదైన భావజాలం, ఆహార్యంతో ఓటర్లకు కనెక్ట్ అయ్యేలా ప్రయత్నం చేశారు ఇరువురు. మరి ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే..!(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!) -
‘ఉత్తరప్రదేశ్’లో గెలిస్తేనే అమెరికా అధ్యక్ష పదవి?
న్యూఢిల్లీ: భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడల్లా అందరి దృష్టి ఉత్తరప్రదేశ్వైపు మళ్లుతుంది. దీనికి కారణం మన దేశంలో అత్యధికంగా లోక్సభ సీట్లు(80) ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రంలో మెరుగైన పరితీరు కనబరిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సులభమవుతుంది.మన ఉత్తరప్రదేశ్ మాదిరిగానే అమెరికాలోనూ అలాంటి ఒక రాష్ట్రం ఉంది. అక్కడున్న సీట్ల సంఖ్య ఆధారంగా దీనిని మన ఉత్తర ప్రదేశ్తో పోల్చవచ్చు. అదే కాలిఫోర్నియా రాష్ట్రం. ఇక్కడ గరిష్టంగా 54 ఎలక్ట్రోరల్ కాలేజీలున్నాయి. ఇక్కడే ట్రంప్ పార్టీ గెలుస్తుందా? లేదా కమలా హారిస్ గెలుస్తారా అనేది తేలిపోతుంది. అమెరికాలోని ఈ ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ సత్తా చాటుతుందో ఆ పార్టీకి చెందిన అభ్యర్థి అధ్యక్షుడయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.అమెరికాలో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది స్పష్టంగా ఎవరూ అంచనా వేయలేరు. ఈ జాబితాలో పెన్సెల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కరోలినా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో తాజా సమాచారం ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. ఇది కూడా చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ లీడ్..నార్త్ కరోలినాలో గెలుపు -
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. రెండు స్టేట్స్లో గెలుపు
వాషింగ్టన్:అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ లీడ్లో ఉన్నారు. అయితే తుది ఫలితాన్ని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్,కమల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ స్టేట్లలో కీలకమైన నార్త్ కరోలినాతో పాటు జార్జియాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఇది కాకుండా విస్కాన్సిన్, అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్లలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. కీలక పెన్సిల్వేనియాలో మాత్రం కమల లీడ్లో ఉన్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. స్వింగ్ స్టేట్స్ కాకుండా ఎలక్టోరల్ ఓట్లు అధికంగా ఉన్న కాలిఫోర్నియా(54)ను కమల తన ఖాతాలో వేసుకోగా టెక్సాస్(40) ఓట్లను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.ఇదీ చదవండి: హారిస్, ట్రంప్ హోరాహోరీ -
పెన్సిలేనియాలో గెలిస్తేనే అసలైన విజయం
-
అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై లిచ్ట్మన్ జోస్యం వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలిచిన అభ్యర్థి తదుపరి నాలుగేళ్ల పాటు అమెరికాను పరిపాలించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్, హారిస్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీ కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఎన్నికల ఫలితాలపై అమెరికాకు చెందిన నోస్ట్రాడమస్ అలాన్ లిచ్ట్మన్ జోస్యం ఇప్పుడు వైరల్గా మారింది.లిచ్ట్మన్ అమెరికన్ రచయిత. అలాగే భవిష్యత్ రాజకీయాలు గురించి కూడా ఊహించి చెబుతుంటారు. ఇప్పడు ఆయన అమెరికాకు కాబోయే అధ్యక్షులెవరనే దానిపై తన అంచనాలు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను కమలా హారిస్ ఓడిస్తారని అలాన్ లిచ్ట్మన్ జోస్యం చెప్పారు. ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ జోస్యం చెప్పారు. అలాగే ఒపీనియన్ పోల్ డేటాను తప్పుబట్టారు.కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు కానున్నారని లిచ్ట్మన్ అన్నారు. ఆఫ్రికన్-ఆసియన్ సంతతికి చెందిన మహిళ అధ్యక్షురాలు కాబోతున్నదని ఆయన తెలిపారు. గత 40 సంవత్సరాలుగా అమెరికా అధ్యక్షుల ఎన్నికపై లిచ్ట్మన్ చెప్పిన అంచనాలు నిజమవుతూ వచ్చాయని పలువురు అంటారు. 2016లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని తాను ముందే అంచనా వేశానని, అలాగే హిల్లరీ క్లింటన్ విజయాన్ని కూడా అంచనా వేయగలిగానని లిచ్ట్మన్ తెలిపారు. అయితే ఒక్కోసారి తన అంచనాలు తప్పు కావచ్చని, తాను కూడా మనిషినేని, అందుకే తప్పులు జరగవచ్చని అన్నారు. అయితే ఇప్పుటి వరకూ తన అంచనాలు ఏనాడూ తప్పలేదన్నారు. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
కమలా హారిస్ స్వగ్రామంలో ఉత్సవ వాతావరణం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. హారిస్ స్వగ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి కమలా హారిస్ విజయం సాధించాలని గ్రామస్తులు శ్రీ ధర్మ సంస్థ ఆలయంలో ప్రార్థనలు చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని కమలా హారిస్ స్వగ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.తిరువారూరు జిల్లా తులసేంద్రపురం గ్రామంలో ఎక్కడ చూసినా జనంలో ఉత్సాహం కనిపిస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.గ్రామస్తులు కమలా మారిస్ చిత్రంతో కూడిన భారీ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్పై కమలకు అభినందనలు తెలియజేశారు.తులసేంద్రపురం కమల తాత, భారత మాజీ దౌత్యవేత్త పివి గోపాలన్ పూర్వీకుల గ్రామంకమల తల్లి శ్యామల మాజీ భారత దౌత్యవేత్త గోపాలన్ కుమార్తె.ఆగస్టు 2020లో కమల డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేట్ అయినప్పుడు ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది.ఆ ఏడాది ఆమె సాధించిన విజయానికి గ్రామంలో సంబరాలు జరుపుకున్నారుశ్రీ ధర్మ సంస్థ ఆలయంలోని మూలదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఆలయంలోని మూల దేవతలు కమల పూర్వీకుల కుల దేవతలు.మదురైలోనూ కమల విజయం కోరుతూ ప్రార్థనలు జరిగాయి. ఆధ్యాత్మిక సంస్థ అనుషానతిన్ నవంబర్ 4న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది.కమల ఎన్నికల్లో గెలిస్తే జిల్లాలోని పంగనాడు గ్రామ నేతు పేదలకు ‘అన్నదానం’ ఏర్పాటు చేయనున్నారు.కమల తాత గోపాలన్ ఈ గ్రామంలోనే జన్మించారు. ఆయన శ్రీ ధర్మ సంస్థ మందిరానికి సుమారు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.అమెరికా వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు ప్రీ-పోల్ ఓటింగ్ కింద ఇప్పటికే ఓటు వేశారు.యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్స్ ల్యాబ్ డేటా ప్రకారం, సోమవారం రాత్రి నాటికి 82 మిలియన్లకు పైగా ఓటర్లు ఓట్లు వేశారు.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బుధవారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం), మంగళవారం పోలింగ్ ముగిసిన కొద్ది గంటలకే రావచ్చు లేదా దీనికి రోజులు, వారాలు లేదా నెల రోజులు పట్టే అవకాశాలున్నాయి.2000లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ఫలితాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. తదుపరి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ ఎన్నిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నవంబర్ 7న ఓటింగ్ ముగిసి, డిసెంబర్ 12న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.2020లో ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టింది. ఓటింగ్ నవంబర్ 3 సాయంత్రం ముగిసింది, అయితే పెన్సిల్వేనియాలోని 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించేందుకు నవంబర్ 7 వరకు వేచి ఉండాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
అమెరికా పోలింగ్.. మస్క్కు గూగుల్ క్లారిటీ
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల పోలింగ్ సందర్భంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజు టెక్ దిగ్గజం గూగుల్పై టెస్లా అధినేత, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ గట్టి మద్దతుదారు ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఫిర్యాదు చేశారు. ట్రంప్కు ఎక్కడ ఓటేయ్యాలి(వేర్ టు ఓట్ ట్రంప్) అని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తే హారిస్ అని చూపిస్తోందని రిపబ్లికన్ మద్దతుదారులు చేసిన పోస్టును మస్క్ రీపోస్టు చేశారు.Are others seeing this too? https://t.co/mlwRY08hgo— Elon Musk (@elonmusk) November 5, 2024గూగుల్ కమలాహారిస్కు కావాలనే మద్దతిస్తోందని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆరోపించారు. ఈ విషయమై సోషల్మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. గూగుల్పై దుమ్మెత్తిపోశారు. దీంతో గూగుల్ కంపెనీ స్పందించింది.టెక్సాస్లో ఒక కౌంటీ పేరు హారిస్ అవడం వల్లే సెర్చ్ ఇంజిన్ అలా చూపిస్తోందని,హారిస్ కౌంటీలోనూ ఒక పోలింగ్ కేంద్రం ఉందని క్లారిటీ ఇచ్చింది.ఈ లొకేషన్లో ఓటు వేయాలని సెర్చ్ ఇంజిన్ చూపిస్తోందని గూగుల్ తెలిపింది. క్లారిటీ ఇచ్చినందుకుగాను గూగుల్కు మస్క్ థ్యాంక్స్ చెప్పారు.Thanks for the clarification https://t.co/JReZUGiWF8— Elon Musk (@elonmusk) November 5, 2024 ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్పోల్స్లో ట్విస్ట్ -
Watch Live: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. ప్రత్యక్ష ప్రసారం
-
కమల పూర్వీకుల గ్రామంలో సందడి
కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని మన్నార్గుడి జిల్లా తులసేంద్రపురంలో సందడి నెలకొంది. మంగళవారం స్థానిక ధర్మ శాస్త శ్రీ కేశవ పెరుమాళ్ ఆలయంలో జరిగిన అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో అమెరికా, యూకేల నుంచి వచి్చన ముగ్గురు మహిళా అభిమానులు పాల్గొనడం విశేషం. వీరిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో ఒకరు అమెరికాలోని లాస్వెగాస్ నుంచి వచ్చినట్లు తెలిపారు. కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఆలయ దేవత కమల తాత గోపాలన్ కుటుంబం కుల దైవమని ఆలయ పూజారి సెంథిల్ కుమార్ తెలిపారు. గోపాలన్ కుటుంబ సభ్యులు గతంలో ఆలయానికి రూ.లక్ష విరాళమిచ్చారంటూ అక్కడి శిలా ఫలకంపైన పేర్లను చూపించారు. 2014లో కమలా హారిస్ పేరిట జరిగిన కుంభాభిషేకం కోసం రూ.5 వేలు ఇచ్చారన్నారు. గోపాలన్ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదన్నారు. గోపాలన్ బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆయన కుమార్తె శ్యామలే కమల తల్లి. 2021లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ సమయంలో కమల కోసం ఆమె పిన్ని, శ్యామల చెల్లెలు చిట్టి ఇదే ఆలయంలో పూజలు చేశారని పూజారి సెంథిల్ కుమార్ చెప్పారు. అమెరికా అధ్యక్షురాలిగా కమల గెలిస్తే ఊళ్లో అన్నదానం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కౌన్సిలర్ అరుల్ మోళి తెలిపారు. -
అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్పోల్స్లో ట్విస్ట్!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారీస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్పోల్స్ ఇంకా ఆసక్తికరంగా మారాయి.👉కాగా, అమెరికా దేశ పరిస్థితులపై 70 శాతం మంది ఓటర్లు తాము నిరాశాజనకంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఇద్దరు అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడం విశేషం. దీంతో, గెలుపు ఎవరిది అనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు.👉ఇక, ఎన్నికలపై ఫస్ట్ వేవ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అమెరికన్ ప్రజలు దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సర్వే సంస్థలు వెల్లడించాయి.👉ఎన్నికలపై సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన పోల్స్ ప్రకారం అమెరికాలో 10 మందిలో దాదాపు ఆరుగురు ప్రజాస్వామ్య స్థితిని తమ మొదటి సమస్యగా పేర్కొన్నారు. అలాగే, ఐదు శాతం మంది ఓటర్లు అబార్షన్ చట్టంపై ఫోకస్ ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 10 మందిలో ఒకరు ఆర్థిక వ్యవస్థను ప్రాధాన్యతా అంశంగా ఎంచుకున్నారు.👉అలాగే, సీఎన్ఎన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. దాదాపు మూడు వంతుల ఓటర్లు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఓటు వేసినట్టు చెప్పారు. ఇద్దరు అభ్యర్థులపై ప్రతికూల అభిప్రాయాన్ని చూపించారు. ఇదిలా ఉండగా..ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పనితీరుపై పది మందిలో నలుగురు ఓటర్లు మెచ్చుకున్నారు. మిగిలిన ఆరుగురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 👉ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరో తొమ్మిదో రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు.. కమలా హారీస్ ఒక్క చోట విజయం సాధించగా, మరో ఐదు రాష్ట్రాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. -
అమెరికా పబ్లిక్ వాయిస్.. గెలిచేది వారే..
-
US Election Results : మిస్టర్ ప్రెసిడెంట్.. డొనాల్డ్ ట్రంప్
US Election Results 2024 LIVE Updates : వాషింగ్టన్ డీసీ: దేశ ప్రజలకు సువర్ణయుగం రాబోతుందంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంగించారు. స్వింగ్ స్టేట్స్లో విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. 05: 30 PMఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు గెలుపుకమలా హారిస్ 224 ఓట్లు విజయం ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోందిట్రాంప్ మ్యాజిక్ ఫిగర్ ( 270) ఎలక్టోరల్ ఓట్లు దాటారు05: 10 PMట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్హౌజ్ వైపు అడుగులేశారు. 04: 19 PMట్రంప్ బిగ్ విక్టరీఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంవిస్కాన్సిన్లో విజయంతో మేజిక్ ఫిగర్ దాటిన ట్రంప్రెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్లో నెగ్గిన రిపబ్లికన్ కేండిడేట్గా ట్రంప్ రికార్డు277కి చేరిన ట్రంప్ బలం.. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్.. మరో 30 స్థానాలు ట్రంప్ ఖాతాలోకే! 04: 10 PMడొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించిన చైనాట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనాఅధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం: చైనాఅమెరికాతో శాంతియుత సంబంధాలు కొనసాగిస్తాంపరస్పర గౌరవం, సహకారంతో ముందుకెళ్తామని చైనా ప్రకటన04: 05 PMట్రంప్ గెలుపు ఇక లాంఛనమేదాదాపు ఖరారైన డొనాల్ట్ ట్రంప్ విజయంమేజిక్ ఫిగర్కు అతిచేరువలో ట్రంప్ఇప్పటికే 267 సీట్లు.. మరో మూడు ఎలక్టోరల్ సాధిస్తే విజయంఇంకా ఐదు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ట్రంప్మరో 44 ఎలక్టోరల్లు దక్కే అవకాశంమరో నాలుగు స్వింగ్ స్టేట్స్లోనూ ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలీనా, పెన్సిల్వేనియాలో రిపబ్లిక్ పార్టీ గెలుపుఓటమి దిశగా కమలా హారిస్డెమోక్రటిక్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ03: 30 PMరన్నింగ్మేట్ జేడీ వాన్స్ జంటపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలుఅద్భుతమైన, అందమైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ జంటకు అభినందనలుఇక నుంచి మిమ్మల్ని( జేడీ వాన్స్) ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలవచ్చు: ట్రంప్ 2: 34 PMఅమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికనూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారని పేర్కొన్న అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు నిరాశWe have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024 2:17pmడొనాల్ట్ ట్రంప్కు శుభాకాంక్షలు తెలియజేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు భారత్, అమెరికా ప్రజల కోసం కలిసి పనిచేద్దాం ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదామని పిలుపునిచ్చిన భారత ప్రధాని Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY— Narendra Modi (@narendramodi) November 6, 2024 02:02pmట్రంప్నకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు శుభాకాంక్షలు మీరు వైట్హౌస్లోకి తిరిగిరావడం అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి నాంది అమెరికా, ఇజ్రాయెల్ల బంధం మరింత బలోపేతమవుతుంది Dear Donald and Melania Trump,Congratulations on history’s greatest comeback!Your historic return to the White House offers a new beginning for America and a powerful recommitment to the great alliance between Israel and America.This is a huge victory!In true friendship,… pic.twitter.com/B54NSo2BMA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 6, 20241:20pm రిపబ్లికన్లకు 315 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది - ట్రంప్సరిహద్దు మూసివేతల్ని పరిశీలించాలిఎవరైనా చట్టబద్ధంగా దేశంలోకి రావాల్సిందేసరిహద్దులు నిర్ణయిస్తాంఅమెరికన్లు పవర్ఫుల్ తీర్పు ఇచ్చారు1:00pmఅమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు. వారి కోసం పని చేస్తాను.అమెరికన్లకు సువర్ణయుగం రాబోతుందినా గెలుపు అమెరికాకు ఉపయోగంఈ ఫలితాలను ఎవరూ ఊహించలేదుఅమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు 11:50amఆ రాష్ట్రంలో 19 ఎలక్టోరల్ ఓట్లు267కి పెరిగిన రిపబ్లికన్ల బలంమూడు సీట్ల దూరంలో అధ్యక్ష పీఠం11:43amడొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడేందుకు పామ్ బీచ్కు వెళుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కాగా, అమెరికా అధ్యక్షుడిని ఖరారు చేసే ఏడు స్వింగ్ స్టేట్స్లలో ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా.. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో గెలుపొందారు.11:35am అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం.. మద్దతు దారుల గురించి చేసే ప్రసంగానికి హారిస్ గైర్హాజరు కానున్నారు. 11:20amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ సంఖ్యల విషయానికొస్తే ట్రంప్ 230 ఓట్లతో, హారిస్ 209 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్ 23 రాష్ట్రాల్లో కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొందినట్లు అంచనా. 270 ఎలక్టోరల్ సీట్లు వచ్చిన అభ్యర్థే అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపడతారు 11:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా ట్రంప్230 ఎలక్టోరల్ సీట్లు సాధించిన ట్రంప్210 ఎలక్టోరల్ సీట్లతో వెనుక బడ్డ కమలా హారిస్ మార్ ఆ లాగో రిసార్ట్కు బయలు దేరిన ట్రంప్.ముఖ్య నేతలు,ట్రంప్తో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్న ట్రంప్ తన మద్దతు దారుల గురించి ప్రసంగం 3 స్వింగ్స్ స్టేట్స్లో విజయం సాధిస్తే ట్రంపే అధ్యక్షుడు 10:50amనాలుగు గంటలుగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చే స్వింగ్ స్టేట్స్లో సైతం ట్రంప్ హవా కొనసాగుతుంది. ఏడు స్వింగ్ స్టేట్లలో ట్రంప్ ఆరుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా(విజయం), ఆరిజోనా రిపబ్లికన్ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. 10:10amఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తే తన విజయం ఖాయమైనట్లేనని అన్నారు. కానీ కౌంటింగ్లో తన విజయాన్ని అడ్డుకునేలా కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు.9:55amకొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఉత్కంఠ పోరులో తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ హారిస్ క్రమంగా పుంజుకుంటున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్కు 230 ఎలక్టోరల్ సీట్లు సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 179 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు.9:40am2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్ పెన్సిల్వేనియాలో నిరాశజనకమైన ఫలితాలు రాబట్టిన ట్రంప్.. ఈ సారి మాత్రం ఊహించని ఫలితాల్ని సాధిస్తున్నారు. ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైట్ హౌస్పై దాడి చేసి అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ట్రంప్ పెన్సిల్వేనియా ఓటర్ల తిరస్కరణకు గురి కావాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేశారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ లీడింగ్లో కొనసాగుతున్నారు.9:20amబ్యాలెట్ పేపర్లోని అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఎదురుగా టిక్ చేస్తారు. ఎన్నికల అధికారులు వాటిని చేతితో కాకుండా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (డీఆర్ఈ) సిస్టమ్తో కౌంట్ చేస్తారు. పెన్సిల్వేనియాలో ఈ డీఆర్ఈ డివైజ్లలో సాఫ్ట్వేర్లో లోపాలు తలెత్తాయి. దీంతో డీఆర్ఈ డివైజ్లు మొరాయించడంతో అధికారులు ఓట్లను చేతితో కౌంట్ చేస్తున్నారు9:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిని గెలుపును ఖాయం చేసే పెన్సిల్వేనియాలో సైతం డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ పెన్సిల్వేనియాలో 55 శాతం ఓట్లు లెక్కించగా, కమలా హారిస్ కంటే డోనాల్డ్ ట్రంప్ 3 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో ట్రంప్కు 51.1 శాతం ఓట్లు రాగా, హారిస్కు 48 శాతం ఓట్లు వచ్చాయి.9:05amఅమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన పరిస్థితి తప్పనిసరి. స్వింగ్ స్టేట్స్లో ఒకటైన ఈ పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లే అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చేస్తాయిని అంచనా. అంతటి ముఖ్యమైన పెన్సిల్వేనియాలో భారీ మోసం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. దీనిని ఎన్నికల అధికారులు ఖండించారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరుగుతున్నట్లు చెప్పారు. 8:27am9 రాష్ట్రాల్లో కమలా హారిస్.. 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. టెక్సాస్లో ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లిక్ పార్టీ ఖాతాలో 41 ఎలక్టోరల్ ఓట్లు సాధించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. కమలా హారిస్ 9 రాష్ట్రాల్లో గెలిచారు. 8:15amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ చివరి అంకానికి చేరినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ పూర్తయిన కౌంటింగ్ ప్రారంభమైన అన్నీ ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ అనుకూల ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ సాధించారు. అధ్యక్ష పదవిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 270 ఎలక్టోర్లో ఓట్లను గెలుచుకోవాల్సి ఉంది. ఈ ఎలక్టోరల్ ఓట్లలో సైతం ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ 154 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. హారిస్ 81 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు.7:41amబాంబు బెదిరింపు తర్వాత పెన్సిల్వేనియా కౌంటీలో ఓటింగ్ సమయాన్ని మరింత పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు 7:36amటెక్సాస్, వ్యోమింగ్లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా ట్రంప్ దక్షిణ, ఉత్తర డకోటాలలో విజయం సాధించారు7:33amట్రంప్, కమల ఒక్కొక్కరు 2 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:24 amట్రంప్ 10 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:20amచెస్టర్ కౌంటీ ప్రభుత్వ సేవల కేంద్రానికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన అధికారులు 7:13amబాంబు బెదిరింపుల కలకలంఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల విడుదలలో ఓ వైపు ఉత్కంఠత కొనసాగుతుండగా.. మరోవైపు బాంబుల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పెన్సిల్వేనియాలోని ఓటింగ్ సర్వీస్ బిల్డింగ్కు బాంబు బెదిరింపులొచ్చాయి. బాంబు బెదిరింపులపై సమాచారం అందుకున్న ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. 7:10amస్వింగ్ స్టేట్స్లో హారిస్ వెనుకంజఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించే ఏడు స్వింగ్ స్టేట్స్లో ట్రంప్, కమలా హారిస్లలో ఎవరిది పైచేయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వింగ్ స్టేట్స్లో ఆధిక్యం సాధించే అభ్యర్థికి అమెరికా అధ్యక్ష పీఠం దక్కనుండటమే అందుకు కారణం. అయితే పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ ఈ ఏడు స్వింగ్ స్టేట్స్లో సైతం హారిస్ వెనుకంజలో ఉన్నారు. స్వింగ్స్ స్టేట్స్లో ట్రంప్కు 58.2 శాతం ఓట్లు పోలవగా, హారిస్కు 41.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 6:50amఅమెరికా అధ్యక్ష ఎంపికలో ప్రముఖ పాత్ర పోషించే ఎలక్టోరల్ ఓట్ల ఫలితాల్లో ట్రంప్ దూసుకెళ్తున్నారు. ట్రంప్ 101 ఎలక్టోరల్లో ఓట్లు సాధించగా.. హారిస్ 49 మాత్రమే సాధించారు. అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9మంది భారతీయులు అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. సుహాస్ సుబ్రమణియన్ (వర్జీనియా), అమీ బెరా (కాలిఫోర్నియా), ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్), రాజా కృష్ణమూర్తి (ఇల్లినోయీ), రో ఖన్నా (కాలిఫోర్నియా), శ్రీ థనేదార్ (మిషిగన్), అమీశ్ షా (ఆరిజోనా), ప్రశాంత్ రెడ్డి (కాన్సాస్), రాకేశ్ మోహన్ (న్యూజెర్సీ) పోటీ చేశారు. వీరితోపాటు మొత్తం 36 మంది భారతీయ అమెరికన్లు రాష్ట్ర సెనెట్లు, స్థానిక సంస్థల బరిలో ఉన్నారు.6:40amఅమెరికాలో ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇండియా, కెంటికీ,వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కమలా హారిస్ వెర్మాట్లో మాత్రమే గెలుపొందారు. 👉: అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు) -
US election 2024: ఫలితం తేలేదెప్పుడు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈసారి ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పష్టమైన చిత్రం ఆవిష్కృతమవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనదేశంలో లాగా అమెరికాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉండదు. ఓట్ల లెక్కింపు బాధ్యత రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలదే. 50 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు సాగిన నేపథ్యంలో ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లో అమెరికా మీడియా సంస్థలు ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తాయి.అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫలితాల కోసం వీటిపైనే ఆధారపడతారు. అమెరికాలో ఆరు కాలమానాలున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం 11:30 గంటలకు అమెరికావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అంటే బుధవారం రాత్రికల్లా ఫలితాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో అవి ఎటువైపు మొగ్గుతాయనేది ముందు నుంచే తెలిసి ఉంటుంది. సులభంగా అంచనా వేయవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు తొందరగానే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది ఏడు స్వింగ్ రాష్ట్రాలు.వీటిలో ఫలితాలు వెల్లడైతే గాని ఉత్కంఠకు తెరపడదు. హోరాహోరీ పోరు దృష్ట్యా స్వింగ్ రాష్ట్రాలు.. ముఖ్యంగా పెన్సిల్వేనియా తదుపరి అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నాయి. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీలు ఉన్నాయి. ఈ స్వింగ్ రాష్ట్రాలు స్వల్ప ఆధిక్యంతో ఏదైనా పార్టీ ఖాతాలో పడొచ్చు. అప్పుడు రీకౌంటింగ్ అవసరమవుతుంది. అప్పుడు ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమవుతుంది. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తే.. అక్కడున్న ఎలక్టోరల్ ఓట్లన్నీ సదరు పార్టీ ఖాతాలో పడతాయి. ప్రతి రాష్ట్రానికి జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజి ఓట్లుంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాలి. దేశవ్యాప్తంగా మెజారిటీ ఓట్లు సాధించినా అధ్యక్షపదవి వరిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఎలక్టోరల్ ఓట్లే అధ్యక్షుడెవరనేది నిర్ణయిస్తాయి. 2020లో నవంబరు 3న ఎన్నికలు జరగగ్గా... ఫలితం తేలడానికి నాలుగు రోజులు పట్టింది. పెన్సిల్వేనియాలో ఫలితం స్పష్టమయ్యాక.. జో బైడెన్ నెగ్గారని మీడియా ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక ట్రంప్ తొలుత 11 శాతం ఓట్ల ఆధిక్యం కనబర్చారు. తర్వాత రెండురోజుల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమయ్యాక.. బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. వార్త సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’ తొలుత విజేతను ప్రకటిస్తూ వస్తోంది. 1848 నుంచి కచ్చితంగా విజేత ఎవరో తొలుత చెబుతోంది. 2016 ఎన్నికలు జరిగిన రోజు రాత్రే డొనాల్డ్ ట్రంప్ను అసోసియేటెడ్ ప్రెస్ విజేతగా ప్రకటించింది. అధికారిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. డిసెంబరు 11 కల్లా రాష్ట్రాలు ఫలితాలను ప్రకటించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US Elections 2024: అంతులేని ఉత్కంఠ
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత హోరాహోరీగా సాగిన ప్రచార ఘట్టానికి తెర పడింది. అధ్యక్ష ఎన్నికల్లో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంల్లో నిక్షిప్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30) నుంచే పోలింగ్ బూత్ల ముందు జనం భారీగా బారులు తీరారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయానికి పోలింగ్ మొదలవుతుంది.కనెక్టికట్, వ్యోమింగ్, ఇండియానా, కెంటకీ, మైన్ వంటి రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి; అరిజోనా, అయోవా, లూసియానా, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్, ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నట్టు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. దాంతో ఎవరు గెలుస్తార్నది రాజకీయ పండితుల అంచనాలకు కూడా అందడం లేదు. ఈసారి స్వింగ్ స్టేట్స్తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా గెలుపోటముల మధ్య తేడా అతి స్వల్పంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులిద్దరిలో ఎవరు గెలిచినా రికార్డే కానుండటం విశేషం. హారిస్ నెగ్గితే అమెరికాలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టిస్తారు. నల్లజాతి, ఆసియా, భారత మూలాలున్న తొలి అధ్యక్షురాలు కూడా అవుతారు. అదే ట్రంప్ గెలిస్తే గత 132 ఏళ్లలో ఒకసారి అధ్యక్షునిగా చేశాక కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. ప్రచారం పొడవునా వారి మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు సాగడం తెలిసిందే. 16 కోట్ల పై చిలుకు ఓటర్లలో సగానికి సగం, అంటే దాదాపు 8 కోట్ల మంది ఈసారి ముందస్తు, పోస్టల్ తదితర పద్ధతుల్లో ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. మంగళవారం సాయంత్రం ఆరింటికి (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30కు) పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టినా తుది ఫలితం తేలడానికి కొద్ది రోజులు పట్టవచ్చు. అయితే విజేత ఎవరన్న దానిపై ఓటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. దాంతో ఇక అందరి కళ్లూ ఫలితాలను తేల్చడంలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి. మహిళల ఓటు కూడా ఈసారి కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.అమెరికా చరిత్రలోనే కీలకమైన రోజు: ట్రంప్ మంగళవారాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజుగా ట్రంప్ అభివరి్ణంచారు. ‘‘పోలింగ్ రోజు వచ్చేసింది! భారీ సంఖ్యలో వచ్చి ఓటేయండి’’ అంటూ లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులకు మంగళవారం ఆయన ఈ మెయిళ్లు పంపారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మలచుకుందాం. మీరు ఓటేయకుండానే వెనుదిరగాలని రాడికల్ కమ్యూనిస్టు డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. మనమంతా కలిసి వారి ఆశలను వమ్ము చేద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. జీవనవ్యయం తగ్గిస్తా: హారిస్ ప్రెసిడెంట్గా తన విజయం ఇప్పటికే ఖాయమైపోయిందని హారిస్ పేర్కొన్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం, వెన్ను విరిగిన వలసల విధానాన్ని సరిచేయడం తన తొలి ప్రాథమ్యాలని ప్రకటించారు. మంగళవారం ఆమె పిట్స్బర్గ్లో న్యూస్రేడియో మారి్నంగ్ షోలో పాల్గొన్నారు. ధరాభారానికి ముకుతాడు వేసేందుకు తనవద్ద ఇప్పటికే ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.ఫ్లోరిడాలో ఓటేసిన ట్రంప్ ట్రంప్ ఫ్లోరిడాలో ఓటేశారు. మంగళవారం ఉదయం భార్య మెలానియాతో కలిసి తన నివాసం సమీపంలోని పామ్బీచ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హారిస్ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన స్వస్థలం డెలావెర్లో కొద్ది రోజుల ముందే ఓటేశారు. డిక్స్విల్ నాచ్లో తొలి ఫలితంఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ బుల్లి కౌంటీలో ‘తొలి ఫలితం’ వచ్చేసింది. పోలింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే అక్కడ కౌంటింగ్ కూడా పూర్తవమే ఇందుకు కారణం. న్యూహాంప్షైర్ రాష్ట్రంలోని డిక్స్విల్ నాచ్లో కేవలం ఆరుగురు ఓటర్లే ఉన్నారు. అక్కడ 60 ఏళ్లుగా అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయముంది. దాని ప్రకారం మంగళవారం మొదలవుతూనే (సోమవారం అర్ధరాత్రి దాటగానే) పోలింగ్ మొదలైంది. ఆరుగురు ఓటర్లే ఉండటంతో కాసేపటికే పోలింగ్, ఆ వెంటనే కౌంటింగ్ కూడా ముగిశాయి. హోరాహోరీ పోరుకు అద్దం పట్టేలా హారిస్, ట్రంప్కు చెరో మూడు ఓట్లు పడటం విశేషం. కెనడా సరిహద్దు సమీపంలో ఉండే డిక్స్విల్కు అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చే ప్రదేశంగా పేరుంది. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి, మరికొన్నింట్లో 7, 8, 9 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. -
కమలా.. విజయాన్ని కాంక్షిస్తూ పూజలు
సాక్షి, చైన్నె: అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా గతంలో ఎన్నికై , ప్రస్తుతం అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ గెలుపు కోసం ఆమె పూర్వీకుల గ్రామంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. బ్రిటన్, అమెరికాల నుంచి ఆమె మద్దతుదారులు పలువురు ఇక్కడకు వచ్చి పూజలలో లీనమయ్యారు. అమెరికా అధ్యక్షురాలుగా ఆమె తన పూర్వీకుల గ్రామానికి వస్తారన్న ఆశాభావాన్ని ఆ గ్రామస్తులు వ్యక్తం చేశారు. వివరాలు.. కమలా హారిస్ పూర్వీకులది తమిళనాడు అన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి తరపు తాత, ముత్తాతలు తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామానికి చెందిన వారు.దీంతో తమ ఇంటి బిడ్డగా కమలా హ్యారిస్ను ఆ గ్రామస్తులు భావిస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఆమె పేరును గతంలో ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఎదురు చూపులు పెరిగాయి. గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో రోజూ పూజలు నిర్వహించారు. అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ విజయకేతనం ఎగుర వేయడంతో ఆ గ్రామంలో ఆనందోత్సాహాలు అప్పట్లో మిన్నంటాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికలలో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో అధ్యక్ష బరిలో కమల హరిస్ నిలబడ్డారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఢీకొట్టే విధంగా కమలా దూసుకెళ్లారు. హోరాహోరీగా ఈ ఇద్దరి మధ్య సమరం నెలకొంది. మంగళవారం పోలింగ్ పూర్తి కావడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా 47వ ప్రిసిడెంట్ కమల హరిస్ లేదా ట్రంప్..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితులలో గతంలో వలే కమలా గెలుపు కోసం పూర్వీక గ్రామస్తులు పూజలపై దృష్టి పెట్టారు. తమ గ్రామానికే కాకుండా, కమలా హారీస్ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కుల దైవంగా ఉన్న ధర్మ శాస్త ఆలయంలో కమలా గెలుపు కాంక్షిస్తూ నిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు. మంగళవారం అయితే, ఉదయం నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం పూర్తి ఫలితాలు వెలువడనున్నడంతో కమలా హరిస్పేరిట ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ల నుంచి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె పేరు కలిగిన టీ షర్టులను ధరించి ఆలయంలో పూజలు చేస్తున్నారు. కమలా తప్పకుండా ఈ ఎన్నికలలో గెలుస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షురాలుగా తమ గ్రామానికి కమల వస్తారన్న నమ్మకం ఉందని, ఆమె తప్పకుండా గెలుస్తారని తులసేంద్ర పురం వాసులు పేర్కొంటున్నారు. కులదైవం ఆలయం ధర్మ శాస్తలో అందరం మొక్కుకున్నామని, తమ కులదైవం ఆమెను ఆశీర్వదిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. గతంలో కూడా ఇక్కడ పూజలు జరిగాయని, ఆమె గెలిచారని గుర్తుచేశారు. కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచినానంతరం భారత్ , అమెరికా మధ్య బంధం మరింత బలోపేతం కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఆలయ పరిసరాలు గ్రామంలో కమలా హరిస్ గెలుపును కాంక్షిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. -
భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటువైపు?
నవంబర్ 5వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలు స్తారనే ఉత్కంఠతో ప్రపంచ రాజకీయ విశ్లేషకులు తర్జన భర్జనలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు. భారతీయ అమెరికన్ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారనే విషయంపైననే జయాపజయాలు ఉంటాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవంగా ఎన్నికల సర్వేలన్నీ కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్లు అక్టోబర్ చివరి వరకు తెలియ జేశాయి. విశ్లేష ణాత్మకంగా చూస్తే– ఓటు హక్కును వినియోగించుకోవడంలో రిపబ్లికన్ ఓటర్లు ముందు ఉంటా రని, డెమోక్రాటిక్ పార్టీ ఓటర్లు వెనుకంచెలో ఉంటారని ఒక అపవాదు ఉంది. ఈ అపవాదు నిజమైతే, ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు సులభమే.అరబ్ అమెరికన్ ఓటర్లు సహజంగా డెమో క్రటిక్ పార్టీ వైపు ఉంటారు. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, పాలస్తీ నాలో జరుగుతున్న ముస్లింల నరమేధాన్ని డెమోక్రాట్లు ఆపలేకపోయారనీ, పైగా దీనికి కారణమైన ఇజ్రా యెల్ను బహిరంగంగా బైడెన్ ప్రభుత్వం సమర్థించిందనీ, ఆర్థిక సైనిక సహకారం అందించిందనీ, అరబ్ అమెరికన్ ఓటర్లు ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాము డెమోక్రాట్లను నమ్ముకున్నందుకు నట్టేట మునిగి పోయామని అరబ్ అమెరికన్ హక్కుల లీగ్ చైర్మన్ నహబ్ అయద్ పత్రికల ముందు వాపోవడం ఇక్కడ గమనార్హం. డెమో క్రటిక్ పార్టీ తరపున ఎన్నికైన కొందరు ముస్లిం మేయర్లు ట్రంప్కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం కూడా ఇక్కడ గమనార్హం. పైగా కమలా హ్యారిస్ భారతీయ (హిందూ) మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెకు ముస్లింలు ఓట్లు వేయరాదని కొన్ని ముస్లిం మతోన్మాద సంస్థలు పిలుపునివ్వడం డెమోక్రాట్లకు కొంత నష్టమే. వాస్తవంగా కమలా హ్యారిస్కు, ఆమె తల్లి శ్యామలా గోపాలన్కు భారతీయ ఆధ్యాత్మిక విషయాలపై, భారతీయ సంస్కృతిపై, భారతీయ మేథో సంపత్తిపై సదభి ప్రాయం లేదంటారు. ఈ విషయం భారతీయ అమెరికన్ ఓటర్లకు బాగా తెలుసు. ఇక రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్లో హిందువులపై జరిపిన అమానుష దాడులను బహిరంగంగా ఖండించడం, భారతీ యులు తనకు అత్యంత ప్రియ మిత్రులని గతంలో అనేకమార్లు ఆయన ప్రకటించడం, అమె రికాలోని హిందూ ఓటర్ల మనోభావాలను ప్రభా వితం చేస్తుందని చెప్పవచ్చు. అక్రమ వలసలను కట్టడి చేసి, అమెరికా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కమలా హ్యారిస్ కంటే ట్రంప్ ముందు ఉంటాడని మెజారిటీ అమెరికన్ల అభిప్రాయం. ఇదే సందర్భంలో హెచ్ వన్ వీసాల విడుదలలో నియమాలు కఠినతరం చేస్తే, కొంత మంది భారతీయులు ఇబ్బంది పడతారనీ, ఈ విషయంలో కమలా హ్యారిస్ ఆలోచన ధోరణి తమకు ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఓటర్లను గోడమీద పిల్లులు అని అంటారు. చివరి నిమిషంలో వీరి ఆలోచన మారితే జయాపజ యాలు తారుమారయ్యే పరిస్థితి కూడా ఉంది.ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య ఉష తెలుగింటి ఆడపడుచు కావడం, అమెరికాలోని ముఖ్యమైన అధికా రులతో ఆమె సత్సంబంధాలు కలిగి ఉండడం, భారతీయ అమెరికన్ ఓటర్లతో ఆమె అనేక సమా వేశాలు నిర్వహించడం, ట్రంప్ విజయానికి కొంత కలిసి వచ్చే విషయమే. ఇక ఆఫ్రికన్ యూరోపి యన్ ఓటర్లు ఇరుపార్టీలకూ సమంగా ఉన్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి.ఉల్లి బాలరంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
US Elections 2024: మరి ఓట్ల లెక్కింపు ఎలా?
యూఎస్ స్టేట్స్లో పోలింగ్ నడుస్తోంది. మొదటి దశ, చివరి దశల పోలింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఓటింగ్ మెషీన్లపై అక్కడి ఓటర్లలో నమ్మకం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అయితే అక్కడి ఎన్నిక విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది కదా. కానీ, అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం..కాన్వాసింగ్(canvassing) ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి? అనేది పోలుస్తూ.. అర్హత గల ప్రతిఓటూను లెక్కించేలా చూడటమే వీరి పని.బ్యాలెట్పై ఏమైనా మరకలు ఉన్నాయా?.. బ్యాలెట్ పాడైపోయిందా?.. ఇలా కక్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరంగా అనిపిస్తే.. డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే.. కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జతచేస్తారు. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్గానూ లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో రెండుసార్లు కౌంటింగ్ జరుపుతారు. అయితే.. కాన్వాస్లో ఎవరు పాల్గొనాలనేదానిపై కఠిన నిబంధనలుంటాయి. -
సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు: ఎన్నికల్లో ఎవరు గెలిచినా..
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ఫలితాలు వెలువడక ముందే ఓ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. కంపెనీ మాత్రం విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరుగా ఉండాలని, తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందుకు పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.గూగుల్పై ట్రంప్ ఆరోపణలుఈ ఏడాది సెప్టెంబర్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజంపై విచారణ జరుపుతామని వెల్లడించారు. గూగుల్ తన గురించి చెడు కథనాలను, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ గురించి మంచి కథనాలను మాత్రమే వెల్లడిస్తోంది ఆరోపించారు.అధ్యక్ష పీఠమెవరికో..ఇప్పటికే ఒక సారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన.. ట్రంప్ మళ్ళీ అధ్యక్ష పదివి చేపడతారా?.. లేక 'కమలా హారిస్'ను ఆ పదవి వరిస్తుందా? అని ప్రపంచ దేశాలు ఉత్కఠతో ఎదురు చూస్తున్నాయి. కాగా ఇప్పటికే అమెరికాలో పోలింగ్ మొదలైపోయింది. ఫలితాలు త్వరలోనే వెల్లడవుతాయి. అమెరికా అధ్యక్ష పీఠమెవరిదనేది తెలిసిపోతుంది. -
హారిస్-ట్రంప్ హోరాహోరీ.. అదే జరిగితే..
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు. 2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అమెరికా ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు. ఇక.. పోలింగ్ పాల్గొని ఓటు వేయాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ ద్వారా కొందరు, బ్యాలెట్ మార్కింగ్ డివైజ్(BMD)లతో కూడిన పేపర్బ్యాలెట్తో మరికొందరు ఓటేసే ఛాన్స్ ఇచ్చారు. బీఎండీ డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్ ఉంది. హ్యాకింగ్ ఆరోపణలు, ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్ఈలకు అమెరికా ఓటర్లు దూరంగా ఉన్నారు.ఇక.. గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ట్రంప్-హారిస్ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్, న్యూయార్క్ వర్జీనీయాలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ అయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది.ఇక.. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై స్పష్టత రానుంది. -
అమెరికా ఎన్నికలు.. తొలి ఫలితం వచ్చేసింది!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాకముందే తొలి ఫలితం వచ్చేసింది!. తాజాగా న్యూహ్యాంప్షైర్ రాష్ట్రంలోని డిక్స్విల్లే నాచ్లో తొలి ఫలితం వెల్లడైంది. డిక్స్విల్లే నాచ్లో ఆరుగురు ఓటర్లు ఉన్నారు. అందులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు మూడు చొప్పున ఓట్లు వచ్చాయి. న్యూహ్యాంప్షైర్ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇక్కడ అర్థరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటాపోటీ నెలకొంది. న్యూ హాంప్షైర్లోని డిక్స్విల్లే నాచ్లో ఇద్దరూ మూడు బ్యాలెట్లను పొందారు. ఇది దశాబ్దాలుగా దేశంలోని మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఇక్కడ ప్రారంభం కావటం గమనార్హం.ఇక.. 2020లో డిక్స్విల్లే నాచ్ ఓటర్లు జో బైడెన్ వైపు మొగ్గుచూపారు.This village in New Hampshire was the first to vote at 12 am on November 5th. There are only 6 voters here. All the 6 cast their votes and the votes were immediately counted. The results - Kamala Harris got 3 votes, and Donald Trump got 3 votes. So, it was a tie. pic.twitter.com/QlzBv8oaKd— Sam (@suddensam55) November 5, 2024 -
మళ్లీ ట్రంప్ గెలుస్తాడా?
-
US Elections: కొనసాగుతున్న పోలింగ్.. రిజల్ట్ ఎప్పుడంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చరిత్ర సృష్టించేందుకు సర్వశక్తులొడ్డుతుండగా.. దేశాన్ని మరోసారి గొప్పగా మార్చుదామన్న నినాదంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి దేశాధ్యక్షుడిగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?.. చాట్జీపీటీ ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడే ఇదే అంశం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది వారేనని కృత్రిమ మేథ(ఏఐ) చాట్జీపీటీ తేల్చి చెప్పింది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారా? లేదంటే కమలా హారిస్ గెలుస్తారా?మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అమెరికా ఫలితాల అంచానాల్ని తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ చాట్జీపీటీకి ప్రశ్నలు సంధిస్తున్నారు.అంచనాలకు భిన్నంగా చాట్జీపీటీ సైతం ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ గెలుస్తారా? అని అడిగితే.. ఆ ఇద్దరి పేర్లు చెప్పలేదు. బదులుగా ట్రంప్, హారిస్లు ఇద్దరూ విజయం సాధించలేరని చాట్జీపీటీ తెలిపింది. వీరిద్దరికి బదులు ప్రత్యమ్నాయంగా, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి గంటలో ఊహించని మలుపు తిరగనున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని అభ్యర్థులే గెలుస్తారు. ట్రంప్, హారిస్లు పోటా పోటీగా గెలుపుకోసం ప్రయత్నం చేసినప్పటికీ మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజే స్పష్టమైన ఫలితాలు వెల్లడవుతాయి’’ అని చాట్జీపీటీ చెప్పినట్లు పేర్కొన్నాయి. .కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్వాల్ట్స్, రిపబ్లికన్ పార్టీ తరుఫున ఉపాధ్యక్షుడు రామస్వామిలు పోటీ పడుతున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు గెలిచి అమెరికా అధ్యక్షులవుతారా? లేదంటే ట్రంప్,హారిస్లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఎదురు చూడాల్సి ఉంది.చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ‘హిప్పో’ జోస్యం నిజమయ్యేనా? -
హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు
-
అగ్రరాజ్యంలో ఎన్నికలపై మనోళ్ల ఉత్కంఠ
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాకు మనదేశం నుంచి ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వేలాది మంది వెళ్తుంటారు. ఇప్పటికే చాలామంది అక్కడి వెళ్లి స్థిరపడ్డారు.ఆ దేశంలో ఈనెల 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్ బరిలో నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికాలో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు వారి మాటల్లో..కమలా హారిస్కే విజయావకాశాలు ఎక్కువ కోదాడ: మాది కోదాడ. మేము ఉద్యోగ రీత్యా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కే ఎక్కువ విజయావకాలున్నాయి. ఇతర దేశాల నుంచి ఇక్కడ స్థిరపడిన వారిలో 80 శాతం మంది కమలకే మద్దతుగా నిలుస్తున్నారు. భారతీయులు దాదాపు కమలాహారిస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వారి అంచనాల ప్రకారం 2శాతం మెజార్టీతో కమల గెలుపొంది అమెరికా అధ్యక్షురాలు అవుతుంది. – కందిబండ ప్రియాంక, నార్త్ కరోలినాట్రంప్ గెలవకూడదని కోరుకుంటున్నారుకోదాడ: మా స్వస్థలం కోదాడ పట్టణం. అమెరికాలోని నార్త్ కరోలినాలో స్థిరపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతుంది. అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ట్రంప్కు మద్దతిచ్చేవారు తగ్గిపోయారు. ట్రంప్ గెలవకూడదని ఎక్కువ శాతం ప్రజలు కోరుతున్నారు. నార్త్ కరోలినాలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కమలా హారిస్కే మద్దతు ఎక్కువగా ఉంది. – శరాబు కృష్ణకాంత్, నార్త్ కరోలినాడెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గుకోదాడ: మాది కోదాడ పట్టణం. అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడ్డాం. అధ్యక్ష్య ఎన్నికల్లో ఈ సారి ఇండియన్స్ డెమోక్రాట్స్ అభ్యర్థి కమలాహారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. స్వల్ప మెజార్టీతోనైనా కమల గెలుస్తుందనే చర్చ జరుగుతుంది. వలస చట్టాలపై ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారు భయపడుతున్నారు. ట్రంప్ కూడా తన ప్రసంగాలలో ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నారని ప్రచారం చేసూ్తన్నారు. – బొగ్గారపు మణిదీప్, గుడుగుంట్ల నాగలక్ష్మి, చికాగోబలమైన నాయకత్వం అవసరంఆత్మకూర్ (ఎస్): మాది ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. అమెరికాలోని నార్త్ కేరోలినాలో కెమికల్ ఎనావిుస్ట్గా స్థిరపడ్డాను. అమెరికా దేశం ముందు ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కొంటోంది. ధరలు పెరగడం, పెరుగుతున్న నేరాలు, సరిహద్దు భద్రత సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి బలమైన నాయకత్వం అవసరం. వైఫల్యంతో నిండిన బైడెన్ ఆర్థిక, వలస, విదేశీ విధానాల నుంచి పునరుద్ధరించడానికి ట్రంప్ గెలుపు చాలా అవసరం. – దండ నీరజ, కెమికల్ ఎనావిుస్ట్, నార్త్ కేరోలినాడోనాల్డ్ ట్రంపే గెలుస్తారు సూర్యాపేట: మాది సూర్యాపేట పట్టణం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సిన్సినాటి, ఒహాయో రాష్ట్రంలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కే విజయావకాశాలు ఉన్నాయి. నేను కూడా అదే పార్టీకి ఓటేయాలనుకుంటున్నా. ఈ సారి ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్, ఇజ్రాయిల్ యుద్ధాలు ఆగిపోతాయని భావిస్తున్నాం. ట్రంప్ గెలిస్తే వ్యాపార వర్గాలకు పన్నుల్లో రాయితీ ఇస్తారని, దీంతో ద్రవ్యోల్భణం నియంత్రణ అవుతుంది. – విజయశంకర్ కోణం, సిన్సినాటి, ఒహాయోట్రంప్ గెలిస్తేనే బాగుంటుందిఆత్మకూర్(ఎం) : మాది ఆత్మకూర్(ఎం) మండలం సిద్ధాపురం. మేము 27 సంవత్సరాల నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్నాం. మంగళవారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఉంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమోక్రటికన్ పార్టీ నుంచి కమల హారిష్ పోటీ పడుతున్నారు. హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఉంది. ట్రంప్ ముక్కుసూటి మనిషి అయినా ఆయన గెలిస్తేనే భద్రత అనే ఉంటుందని నా అభిప్రాయం. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షులుగా ఉన్నా పాలన పరంగా పెద్దగా అనుభవం లేదు. ఆమె విధి విధానాలు ట్రంప్కు లాభం కలిగేలా ఉన్నాయి. – ఏనుగు లక్ష్మణ్రెడ్డి, న్యూయార్క్హోరాహోరీగా ఎన్నికల ప్రచారంఅర్వపల్లి: మాస్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అమెరికాలోని టెన్నెసి రాష్ట్రంలో ఉంటున్నాం. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈసారి అక్కడి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయబోతున్నాను. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. కమలాహారిస్, ట్రంప్ మధ్య పోటీ నువ్వా...నేనా అన్నట్లుగా ఉంది. భారతదేశ అభివృద్ధికి కృషిచేసే వారికే ఓటేయాలి. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. – జన్నపు శ్రీదేవి, టెన్నెసిట్రంప్ గెలిస్తేనే భారతీయులకు భద్రతతిరుమలగిరి(నాగార్జునసాగర్): మాది నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం కొంపల్లి గ్రామం. నేను, నా భర్త బొలిగోర్ల శ్రీనివాస్, ఆలియాస్ కొంపల్లి శ్రీనివాస్ 2010లోనే ఆమెరికాలోని కొలంబస్కు వచ్చాం. అప్పటి నుంచి కొలంబస్లో ఉంటున్నాం. భారతీయుల భద్రత విషయంలో ట్రంప్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రంప్ గెలుస్తేనే భారతదేశానికి గానీ, అమెరికాలో ఉంటున్న భారతీయులకు గానీ లాభం చేకూరుతుంది. కమలాహారిస్భారత సంతతికి చెందినప్పటికీ ఎక్కువ మంది భారతీయులు ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారు. – దివ్య, కొలంబస్ట్రంప్ గెలిచే అవకాశం ఉందిభువనగిరి: మాది భువనగిరి పట్టణం. అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డాం. ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలో ఉన్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది. గతంలో దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ట్రంప్ మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకురాగలరు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే అమెరికా–ఇండియా మధ్య సత్సంబంధా లు మెరుగుపడతాయి. రిపబ్లిక్ పార్టీకి చెందిన అభ్యర్థి కమలాహ్యారీస్ భారత సంతితికి చెందిన వారు అయినప్పుటికీ ఇండియాకు చెందిన వారు ఆమెకు మద్దతు తెలపడం లేదు. – జి.సంతోష్, కాలిఫోరి్నయాప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ గెలవాలి భువనగిరి: మాది వలిగొండ మండలం టేకులసోమారం గ్రామం. అమెరికాలోని నార్త్ కరోలినాలో 23 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఆరు నుంచి 7 వరకు స్వింగ్ స్టేట్స్ వీరి గెలుపును నిర్థారిస్తాయి. ఎవరు గెలిచిన స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. ఇండియన్స్ ఎక్కువ శాతం ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. నేడు మాత్రం ట్రంప్కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. – పడమటి శ్యాంసుందర్రెడ్డి, నార్త్ కరోలినాభారతదేశ అభివృద్ధికి సహకరించే వారికే ఓటేయాలిఅర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామం. అమెరికాలోని అట్లాంటా ఉంటున్నాం. ఇప్పటికే రెండు సార్లు అమెరికా ఎన్నికల్లో ఓటు వేశాను. భారతదేశ అభివృద్ధికి సహకరించే వారికి అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఓటేయాలి. సాఫ్ట్వేర్ పరిశ్రమకు, భారత విదేశాంగ విధానం, ఎగుమతి, దిగుమతికి మద్దతు తెలిపే వాళ్లకే మా ఓటు. కులాలను చూసి ఓటు వేయవద్దు. – జూలకంటి లక్ష్మారెడ్డి, అట్లాంటాభారతీయులు ట్రంప్ వైపే.. అర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం. అమెరికాలోని హూస్టన్లో స్థిరపడ్డాం. 30 ఏళ్ల పైనుంచి అక్కడే ఉంటున్నాం. ఇప్పటికే 20 సార్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నాను. అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ట్రంప్వైపే ఉన్నారు. నాది రిపబ్లికన్ పార్టీ. నేను ఎన్నికల్లో ట్రంప్కే ఓటేస్తాను. – ఆలూరి బంగార్రెడ్డి, హూస్టన్ట్రంప్ గెలవాలనుకుంటున్నారునల్లగొండ: మాది నల్లగొండ. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కమలా హ్యారిస్కు అంతగా అనుభవం లేదని ప్రజల్లో ప్రచారం సాగుతోంది. గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ట్రంప్ వైపే అమెరికన్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్, కమలాహారిస్ మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నా అమెరికా ప్రజలు ట్రంప్ గెలవాలనుకుంటున్నారు. – కంచరకుంట్ల వెంకటరాంరెడ్డి, లాస్ ఏంజెల్స్ట్రంప్తోనే ఉద్యోగావకాశాలునేరేడుచర్ల: మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. నేడు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రంఫ్ గెలిస్తే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు సురక్షితంగా ఉంటాయి. మేము ఉన్న ప్రాంతంలో మాతో పాటుగా చాలా మంది ట్రంప్కు ఓటు వేసే అవకాశాలున్నాయి. – దొంతిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, బేబికాన్ నా మద్దతు కమలాహారిస్కే..శాలిగౌరారం: మాది శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామం. అమెరికాలోని మిజోరి స్టేట్లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ కుటుంబంలో ముగ్గురం ఓటు హక్కును వినియోగించుకోనున్నాం. నేను ఓటు వేయడం ఇది మూడవసారి. నా మద్ధతు కమలాహారిస్కే. – పాదూరి రామమోహన్రెడ్డి, మిజోరి స్టేట్ -
అమెరికా ఎన్నికలు: తులసేంద్రపురంలో పూజలు
చెన్నై:అమెరికా ఎన్నికల పోలింగ్ వేళ తమిళనాడు తులసేంద్రపురం గ్రామంలో సందడి నెలకొంది. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలాహారిస్ పూర్వీకులది ఇదే గ్రామం. తమ ఊరి బిడ్డ ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని తులసేంద్రపురం వాసులు గ్రామంలోని ఆలయంలో మంగళవారం(నవంబర్ 5) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ తులసేంద్రపురంలో పెద్ద బ్యానర్నే ఏర్పాటు చేశారు. గతంలో కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించినపుడు కూడా తులసేంద్రపురం వాసులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.ప్రస్తుతం కమల ఏకంగా అధ్యక్ష పోరులోనే బరిలో ఉండడంతో ఆమె గెలుపుపై గ్రామ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. కమల ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టక ముందు కాలిఫోర్నియా అటార్నీగా పనిచేస్తున్నపుడు తులసేంద్రపురంలోని గ్రామ ఆలయానికి 60 డాలర్లు విరాళమివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం వీడియో వైరల్ -
అమెరికా ఎన్నికలపై ‘హిప్పో’ జోస్యం.. వీడియో వైరల్
బ్యాంకాక్:ప్రపంచమంతా అమెరికా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ట్రంప్, కమలాహారిస్లలో ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికపై థాయ్లాండ్లోని మూ డెంగ్ అనే పొట్టి నీటిగుర్రం(హిప్పో) ఆసక్తికర జోస్యం చెప్పింది.కాబోయే అమెరికా అధ్యక్షుడెవరన్నదానిపై పొట్టి నీటి గుర్రం జోస్యం చెప్పిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్గా మారింది. థాయ్లాండ్లోని కావోక్యూ ఓపెన్ జూలో ఉన్న పొట్టి హిప్పోకు రెండు పుచ్చకాయ కేకులను ఆఫర్ చేశారు. వీటిలో ఒకదానిపై థాయ్భాషలో ట్రంప్ అని మరొకదానిపై కమల అని పేర్లు రాశారు. పొట్టిహిప్పో ట్రంప్ పుచ్చకాయ కేకును తినేసింది. అంటే ట్రంప్ గెలవనున్నారని జోస్యం చెప్పింది. అదే నీటి కొలనులో ఉన్న పెద్ద హిప్పో మాత్రం కమల పేరు ఉన్న పుచ్చకాయను తీసుకుంది. దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. Im not saying this is good omen but i would take anything... 😆 Moo Deng, the famous baby hippo, predicts Donald Trump will win the #Election2024 . The hippo must be a true #patriot pic.twitter.com/nrw4Q28G7v— motivate 4 life 🇺🇲 (@imotivate4life) November 4, 2024 ఇదీ చదవండి: రిపబ్లికన్లకు ఉడత సాయం -
USA Presidential Elections 2024: అత్యంత అవినీతిపరురాలు
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను వైట్హౌస్ను వీడకుండా ఉండాల్సిందని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డెమొక్రాట్లు తనను మోసగించి గెలిచారని ఆరోపించారు. హోరాహోరీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆయన కీలక స్వింగ్ రాష్ట్రాల్లో పర్యటించారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో పలు ర్యాలీల్లో మాట్లాడారు. ‘2020 ఎన్నికల్లో మనమేంటో చూపించాం. విజయం అంచుకు చేరాం. ఆ తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సింది. వైట్హౌస్ను వీడి ఉండాల్సింది కాదు’’ అన్నారు. ‘‘డెమొక్రాటిక్ పార్టీ ఓ రాక్షస పార్టీ. అతి పెద్ద అవినీతి యంత్రం. ఇక హారిస్ అత్యంత అవినీతిపరురాలు’’ అంటూ దుయ్యబట్టారు. -
USA Presidential Elections 2024: స్వేచ్ఛకే అమెరికన్ల ఓటు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నమ్ముకున్న విద్వేషాన్ని, విభజనవాదాన్ని అమెరికన్లు ఓడించడం ఖాయమని కమలా హారిస్ ధీమా వెలిబుచ్చారు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిరక్షణకే ఓటేయాలని దేశమంతా పట్టుదలగా ఉంది. నెలల తరబడి దేశవ్యాప్తంగా జరిపిన ప్రచారం భాగంగా నాకిది కొట్టొచ్చినట్టు కన్పించింది’’ అని చెప్పారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్లోని డెట్రాయిట్లో ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘ఈసారి రెడ్ (రిపబ్లికన్లకు ఓటేసేవి) స్టేట్స్, బ్లూ (డెమొక్రాట్లకు ఓటేసేవి) స్టేట్స్ అంటూ విడిగా లేవు. అన్ని రాష్ట్రాలూ కలిసి చరిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నాయి. మార్పు కోసం అమెరికా యువత ఈసారి భారీ సంఖ్యలో కదం తొక్కుతున్నారు. దేశ మౌలిక విలువల పరిరక్షణకు ముందుకొస్తున్నారు’’ అని స్పష్టం చేశారు. -
రిపబ్లికన్లకు ‘ఉడుత సాయం’!
న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు. న్యూయార్క్లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు. దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమెరికాలో పోలింగ్ నేడే.. కమల వికాసమా! ట్రంప్కే పట్టమా!
భారత మూలాలున్న కమలా హారిస్ కొత్త చరిత్ర లిఖిస్తారా? అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారా? లేక ఆమెతో హోరాహోరి పోరులో పైచేయి సాధించి డొనాల్డ్ ట్రంపే రెండోసారి గద్దెనెక్కుతారా? ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికల పోరు అతి కీలక ఘట్టానికి చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అమెరికాకు 47వ ప్రెసిడెంట్ ఎవరన్నది రాత్రికల్లా తేలిపోయే అవకాశముంది. 60 ఏళ్ల హారిస్, 78 ఏళ్ల ట్రంప్ కొద్ది నెలలుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. దాంతో ఇవి గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత పోటాపోటీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుగా ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటిదాకా వెలువడ్డ అన్ని ముందస్తు పోల్స్లోనూ వారిద్దరూ సమవుజ్జీలుగా ఉంటూ వచ్చారు. అయితే పోలింగ్కు ఒక్క రోజు ముందు సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫలితాలను నిర్దేశించే కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అభ్యర్థులిద్దరి మధ్యా హోరాహోరీ ఉండగా తాజాగా వాటన్నింట్లోనూ ట్రంపే ముందంజ వేసినట్టు పలు పోల్స్ తేల్చాయి. అదే సమయంలో రిపబ్లికన్ల కంచుకోటైన అయోవాలో హారిస్ పైచేయి సాధించినట్టు మరో పోల్లో వెల్లడవడం విశేషం. అంశాలవారీగా చూస్తే అమెరికన్లను ప్రధాన సమస్యలుగా భావిస్తున్న ఎనాకమీతో పాటు అక్రమ వలసలు తదితరాల్లో తొలినుంచీ ట్రంప్కే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయనైతేనే దేశానికి గట్టి నాయ కత్వం అందించగలరన్న అభిప్రాయమూ అమెరికన్లలో నెలకొంది. మరోవైపు హారిస్కేమో భార త, నల్లజాతి మూలాలు బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యమున్న ఓటర్లంతా ఆమెకే ఓటేయడం ఖాయ మంటున్నారు. దీనికి తోడు ఈసారి స్వింగ్ స్టేట్లను తోసిరాజని అధ్యక్షున్ని తేల్చడంలో నిర్ణాయకంగా మారగలదని భావిస్తున్న మహిళా ఓటర్ల మద్దతూ హారిస్కే ఉండటం అతి పెద్ద సానుకూలాంశం. అబార్షన్ల వంటి పలు కీలకాంశాల్లో కూడా హారిస్దే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తటస్థ ఓటర్లే ఫలితాన్ని నిర్దేశించేలా ఉన్నారు...ఓటేసిన కమల అధ్యక్షుడు జో బైడెన్ బాటలో హారిస్ కూడా ఈసారి ముందస్తుగా ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం డెట్రాయిట్లో ఈ మేరకు విలేకరులకు వెల్లడించారు. ‘‘నేనిప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశాను. అది త్వరలో కాలిఫోరి్నయా చేరనుంది. పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది’’ అని తెలిపారు. మెయిల్ ఓటింగ్ వ్యవస్థను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ ఇటీవలే తన స్వస్థలం డెలావెర్లో ముందస్తు ఓటు వేయడం తెలిసిందే. స్వింగ్ స్టేట్లలో చివరి ప్రయత్నాలు హారిస్, ట్రంప్ ఇద్దరూ కొద్ది రోజులుగా స్వింగ్ స్టేట్లపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఆది, సోమవారాల్లో ట్రంప్ పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆదివారం మిషిగన్లో కలియదిరిగిన హారిస్ సోమవారం పెన్సిల్వేనియాలో ర్యాలీల్లో ప్రసంగించారు.2020లో పోలింగ్ 66 శాతమే అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. అంటే కేవలం 66 శాతం ఓటింగ్ నమోదైంది.అమెరికా జనాభా - 34.6 కోట్లు అర్హులైన ఓటర్లు - 23.5 కోట్ల పై చిలుకు నమోదైన ఓటర్లు - 16,14,22,000 ఇప్పటికే ఓటేసింది - 7.7 కోట్ల పై చిలుకు తొలిసారి ఓటేస్తున్నది - 1.9 కోట్ల పై చిలుకు ప్రచార నినాదాలు హారిస్ → అమెరికన్ల స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ → రాజ్యాంగ విలువలు, మహిళల హక్కులకు రక్షణ ట్రంప్ → దేశ ఆర్థిక పునరి్నర్మాణం → అక్రమ వలసలకు పూర్తి అడ్డుకట్ట పోలింగ్ వేళలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7–9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా (భారత కాలమానం ప్రకారం రాష్ట్రాలవారీగా మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 9.30 మధ్య పోలింగ్ మొదలవుతుంది. బుధవారం ఉదయం దాకాకొనసాగుతుంది) అసలు ఎన్నిక డిసెంబర్ 16న!విజేతను తేల్చేది ఎలక్టోరల్ ఓట్లేఅమెరికాలో అధ్యక్షున్ని ఎన్నుకునేది ఆ దేశ ఓట ర్లు కాదు. ఎలక్టోరల్ కాలేజీ. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటర్లు మంగళవారం నేరుగా ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు. పోలింగ్ ముగిశాక నెల పాటు వారి ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు. జనవరి 6న ఫలితంజనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమా వేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరో తేలేస్తారు. సెనేట్ అధ్యక్షుని హోదాలో ఉపాధ్యక్షుడు వారి పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20న (ఆ రోజు ఆదివారమైతే మర్నాడు) ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఇలా ఓటింగ్ తర్వాతా ఎన్నిక ప్రక్రియ మరో రెండు నెలలు సాగుతుంది!టై అయితే?ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ, అంటే కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. అందుకు ఆస్కారం అతి తక్కువగా కనిపిస్తున్నా, ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు. ఉపాధ్యక్ష ఎన్నికలో ఫలితం తేలని పక్షంలో ఎగువ సభ అయిన సెనేట్ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటుంది. 100 సెనేట్ ఓట్లలో కనీసం 51 లేదా అంతకంటే ఎక్కువ సాధించేవారు విజేత అవుతారు. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్లో జెఫర్సన్ విజేతగా నిలిచారు.అత్యధిక ఓట్లొచ్చినా గ్యారెంటీ లేదుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ప్రత్యర్థి ట్రంప్ కంటే 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓడారు. 2000లో అల్ గోర్ (డెమొక్రాట్) కూడా జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించినా ఓడారు. మెయిన్, నెబ్రాస్కా మినహా 48 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విన్నర్ టేక్స్ ఆల్ విధానమే ఇందుకు కారణం. దాని ప్రకారం మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ దక్కుతాయి.న్యూయార్క్లో బెంగాలీ బ్యాలెట్లుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో న్యూయార్క్లో బ్యాలెట్ పేపర్లపై బెంగాలీ భాష చోటుచేసుకోవడం విశేషం. అధికారక భాషగా ఇంగ్లిష్ కాకుండా బెంగాలీతో పాటు చైనీస్, స్పానిష్, కొరియన్ భాషలకు బ్యాలెట్ పేపర్లపై చోటుదక్కింది. న్యూయార్క్లో బెంగాలీలతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి సంఖ్య అధికం. న్యూయార్క్లో ఏకంగా 200కు పైగా భాషలు మాట్లాడేవాళ్లు నివసిస్తుండటం విశేషం. హారిస్ సానుకూలతలు1. ట్రంప్ పట్ల భయాందోళనలుఅమెరికన్లలో జాతి తదితర ప్రాతిపదికలపై విభజన తెచ్చిన అధ్యక్షునిగా ట్రంప్ అప్రతిష్టపాలయ్యారు. అందరినీ కలుపుకుపోయే నేతగా పేరుండటం హారిస్కు కలిసొచ్చే అంశం. అందుకే ట్రంప్ను ఫాసిస్టుగా, ప్రజస్వామ్యానికే ప్రమాదకారిగా హారిస్ తన ప్రచారంలో పదేపదే అభివర్ణించారు. ఆయన గెలిస్తే అమెరికన్లను మరోసారి విడదీస్తారని హెచ్చరించారు.2. బైడెన్కు సమర్థ ప్రత్యామ్నాయండెమొక్రాట్ల అభ్యర్థిగా ఒక దశలో అధ్యక్షుడు బైడెన్ పేరు దాదాపుగా ఖరారైంది. వయోభారం, మతి మరుపు తదితర సమస్యలతో సతమతమవుతున్న ఆయన పట్ల ఓటర్లంతా పెదవి విరుస్తున్నట్టు అన్ని పోల్స్లోనూ స్పష్టమైంది. దాంతో ఒక దశలో డెమొక్రాట్లు గెలుపుపైనే ఆశలు వదిలేసుకున్నారు. అయితే సమయం మించిపోకుండా ఆయన్ను తప్పించి హారిస్ను తెరపైకి తీసుకురావడంతో పోరు ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.3. మహిళల హక్కుల యోధురాలుమహిళల హక్కుల పరిరక్షణ విషయంలో ట్రంప్తో పోలిస్తే హారిస్ ఎంతో ఎత్తున నిలిచారు. ముఖ్యంగా కీలకమైన అబార్షన్ అంశంపై హారిస్కు మహిళల్లో ఆదరణ నానాటికీ విపరీతంగా పెరుగుతోంది. దాంతో ట్రంప్ కూడా అబార్షన్ల హక్కును వ్యతిరేకించే విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 10 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికతో పాటే అబార్షన్ హక్కులపైనా ఓటింగ్ జరుగుతోంది. ఇది హారిస్కు మరింత కలిసొస్తుందని చెబుతున్నారు.4. ఓటింగ్ శాతంట్రంప్ అభిమానులు ఎక్కువగా గ్రామీణులు, పట్టణ శివారు ప్రాంతాల ప్రజలే. హారిస్ మద్దతుదారుల్లో జాబితాలో వృద్ధులు, విద్యాధికుల సంఖ్య ఎక్కువ. గ్రామీణులు, శివారు ప్రజలతో పోలిస్తే ప్రతి ఎన్నికలోనూ వారే అధిక సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు హారిస్కు బాగా సానుకూలంగా మారేలా కనిపిస్తోంది.5. ముమ్మర ప్రచారం, వ్యయంఅమెరికా ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం. ట్రంప్తో పోలిస్తే హారిస్ భారీగా ఎన్నికల విరాళాలు సేకరించడమే గాక ప్రచారంపై ఎక్కువ వ్యయం చేశారు. ఆలస్యంగా జూలైలో రేసులోకి వచ్చిన ఆమె, జనవరి నుంచి 11 నెలల వ్యవధిలో ట్రంప్ సేకరించిన దానికన్నా ఎక్కువ మొత్తం సేకరించడం విశేషం. ముఖ్యంగా కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో విరాళాల సేకరణలో హారిసే ముందున్నారు. ట్రంప్ సానుకూలతలు1. ప్రభుత్వ వ్యతిరేకతఅమెరికా ఓటర్లలో అత్యధికులకు ఈసారి ఎకానమీయే అతి పెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం కూడా వారిని బాగా కలవరపెడుతున్న మరో అంశం. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో బైడెన్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత ట్రంప్కు బాగా కలిసి రానుంది. ఉపాధ్యక్షురాలు హారిస్కు ఇది బాగా ప్రతికూలంగా మారవచ్చు. తమ ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా మారాయని ఏకంగా 62 శాతం మంది అమెరికన్లు చెబుతుండటం విశేషం. 79 శాతం మంది దేశం తిరోగమన బాటలో ఉందని భావిస్తున్నారు.2. తగ్గని ప్రజాదరణ2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా క్యాపిటల్ హిల్పైకి దాడులకు మద్దతుదారులను ఉసిగొల్పినా, క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడన్న చెత్త రికార్డును మూటగట్టుకున్నా ట్రంప్కు జనాదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది పొడవునా కనీసం 40 శాతం, అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లు ఆయనకు మద్దతు పలకడం విశేషం.3. అక్రమ వలసలురెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానన్న ట్రంప్ ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా 10 లక్షల మందిని స్వదేశాలకు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అబార్షన్లపై హారిస్ వైఖరిపైనే డెమొక్రాట్లు ఆశలు పెట్టుకోగా ట్రంప్ ప్రధానంగా అక్రమ వలసల అంశమే తనను గట్టెక్కిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.4. సామాన్యుల దన్నుగ్రామీణులు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్న వారు ట్రంప్ను మొదట్నుంచీ అభిమానిస్తూ వస్తున్నారు. వారిలో ఆయనకు ఆదరణ ఈసారి మరింత పెరిగింది. దీనికి తోడు డెమొక్రాట్ల మద్దతిచ్చే కార్మిక సంఘాలు కూడా ఈసారి ట్రంప్కు జై కొడుతున్నాయి. గ్రామీణ ఓటర్లు, స్వింగ్ స్టేట్లలోని పట్టణ శివారు ప్రాంత ఓటర్లు భారీగా ఓటేసేలా చూడగలిగితే ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరుగుతాయి.5. గట్టి నేతగా పేరుఅంతర్జాతీయంగా నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఆధిప త్యాన్ని పరిరక్షించగల సామర్థ్యం ట్రంప్కే ఉందని మెజా రిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆయన అధ్యక్షు నిగా ఉండగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జర గని విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: ఎవరిపైన అనుగ్రహం
ఎన్నికలంటే ఉపన్యాసాలు, వాదనలు, పందేలు, ప్రగల్భాలు... ఇవి కాకుండా సర్వేలు, జోస్యాలు కూడా ఉంటాయి. మన దేశంలో ఇవి షరా మామూలే అయినా అమెరికాలో కూడా ఉన్నాయంటే కాసింత ఆశ్చర్యమే. చరిత్రలో ఇంతకు మునుపు లేని విధంగా ఒక స్త్రీగా కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుంటే గ్రహాలన్నీ ఆమెను చల్లగా చూడనున్నాయని అక్కడి జ్యోతిష్యులు అంటున్నారు. అలాగని ట్రంప్ కోసం తారాతీరాన్ని చూస్తున్నవారు తక్కువగా లేరు. ఇంతకీ అక్కడ ఏం చెబుతున్నారు?ఎన్నికల కాలంలో జ్యోతిషులకు గిరాకీ మన ‘సనాతన’ దేశంలోనే కాదు, అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఉంది. త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి జ్యోతిషులు రకరకాలుగా జోస్యాలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఇదివరకు ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. అయినా ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికన్ జ్యోతిషురాలు ‘లారీ రివర్స్’ గత ఏడాది జూన్లోనే జోస్యం చెప్పారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీకి దిగుతారని లారీ 2020 ఆగస్టులో చెప్పిన జోస్యం ఫలించడంతో ఈ ఎన్నికల్లో ఆమె జోస్యంపై జనాలు నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం తథ్యమని మరో జ్యోతిషురాలు ‘అమీ ట్రిప్’ జోస్యం ప్రకటించారు. ‘స్టార్హీల్’ అనే యూజర్ పేరుతో ‘టిక్టాక్’లో నిత్యం జోస్యాలు చెప్పే అమీ ట్రిప్కు 7.40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో కొత్తగా ‘టిక్ టాక్’లోకి ప్రవేశించిన జ్యోతిషుడు జో థియోడర్ కూడా కమలా హ్యారిస్కు అనుకూలంగా జోస్యాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోస్యాలు చెబుతున్న వారిలో ఎక్కువ మంది కమలా హ్యారిస్కు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు.డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న పుట్టారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న పుట్టారు. వీరిద్దరూ నిండు పున్నమి తిథిలోనే పుట్టారు. అయితే ట్రంప్ పుట్టిన రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. ‘చాలామంది జ్యోతిషులు ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవాలని భావిస్తున్నారు. అందుకే ఆమెకు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు. అయితే, సంపూర్ణ చంద్రగ్రహణం రోజున పుట్టిన వారి శక్తిని తక్కువగా అంచనా వేయలేం. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’ అని బ్రిటన్కు చెందిన జ్యోతిషురాలు ఫ్రాన్సెస్కా ఆడీ చెబుతుండటం విశేషం.మరోవైపు భారతీయ జ్యోతిష్యులలో ఒకడైన కార్తిక్ గోర్ ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న రాహువు కమలా హ్యారిస్కు మాత్రం వరాలు కురిపించనున్నాడని చెప్పారు. మరో జ్యోతిష్యుడు విజయేంద్ర ట్రంప్ జాతకం ప్రకారం ఆయన విషయంలో చంద్రుడు వేదనలో ఉన్నాడని అందువల్ల అతనికి ప్రతికూలత ఎదురుకానుందని అన్నారు. అయితే చాట్జిపిటి ద్వారా కొందరు 16 శతాబ్దపు మహా జ్యోతిష్యుడైన నోస్ట్రాడామస్ ఇప్పుడు ఉంటే అతను అమెరికా ఎన్నికల విషయంలో ఏం జోస్యం చెబుతాడని ఏ.ఐ.ని అడిగితే అది అనూహ్యమైన జవాబు చెప్పింది. ‘కమలా హ్యారిస్గానీ ట్రంప్గానీ ఊహించే అంచనాకు చేరలేకపోవచ్చు’ అంది. ‘చివరి నిమిషంలో మలుపు తిరిగి రంగంలో లేని వారు పదవిని ఆశించవచ్చు’ కూడా అన్యాపదేశంగా సూచించింది. దాంతో ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ బరిలో ఉన్న టిమ్ వాల్జ్, జెడి వాన్స్ వైపు కొంతమంది చూస్తున్నారు. అలాగే ఏ.ఐ ఈ ఎలక్షన్ల తర్వాత అమెరికాలో అల్లర్లు రేగుతాయని, వీధులు మండుతాయని కూడా జోస్యం చెప్పింది.గతంలో బైడన్ అధ్యక్షుడు అయ్యే ముందు అలాగే జరిగింది కదా.ఏమైనా ఈ ఎన్నికలు అందరినీ ఉత్కంఠగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. గ్రహాలు ఇదంతా లైవ్లో చూస్తూ ఫలితాలను ఏమని టెలికాస్ట్ చేస్తాయో త్వరలో తెలియనుంది. -
ఈ ఐదు అంశాలే.. అధ్యక్ష పీఠానికి ఆయుధాలు
-
కొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు.. విశేషాలివే..
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమైంది. నవంబర్ 5 (మంగళవారం)పోలింగ్ జరగనుంది. బరిలో ఇతర అభ్యర్థులు కూడా ఉన్నా ప్రధాన పోరు మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్యే జరగనుంది. పోలింగ్కు మరికొద్ది గంటలే ఉండడంతో ట్రంప్,హారిస్లు తమ ప్రచారాన్ని స్వింగ్ స్టేట్స్లో హోరెత్తించి ముగించారు. అమెరికాలో మొత్తం 17 కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్, ఫలితాలు, ఎలక్టోరల్ కాలేజీ తతంగం, కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం తదితర విషయాలను ఒకసారి చూద్దాం. పోలింగ్ నవంబర్లోనే ఎందుకు..?ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ నెలలోని తొలి మంగళవారమే నిర్వహిస్తారు. ఈ మేరకు 1845లో చట్టం చేశారు. ఈసారి నవంబర్ తొలి మంగళవారం అయిదో తేదీ వచ్చినందున అధ్యక్ష ఎన్నికలు 5వ తేదీన జరుగుతున్నాయి. అప్పట్లో వ్యవసాయం ప్రధానంగా ఉన్న అమెరికాలో పంటల కోత పూర్తవడంతో పాటు ప్రయాణాలకు అనుకూల వాతావరణం ఉండడంతో నవంబర్ను ఎన్నికల కోసం ఎంచుకున్నారు. కాగా,1845కు ముందు అధ్యక్ష ఎన్నికలు అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సారి జరిగేవి.పోలింగ్ సమయాలు..అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం(నవంబర్ 5)వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఇదే ఇండియా టైమింగ్స్ ప్రకారం చూస్తే మనకు మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది.ఫలితాలు ఎప్పుడు..?అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వెలువడతాయి. ట్రంప్,హారిస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడేసరికి ఒకటి రెండు రోజులు పడుతుంది. ఇక ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక తతంగం పూర్తై అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగాలంటే 2025 జనవరి 20 దాకా ఆగాల్సిందే. ఒకవేళ జనవరి 20 ఆదివారం అయితే జనవరి 21న ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న ఒపీనియన్ పోల్స్ అంచనాల ప్రకారమైతే ట్రంప్ కంటే కమలా హారిస్ కొద్దిగా ముందంజలో ఉన్నారు.ప్రజల ఓటు నేరుగా అధ్యక్షుడికి వెళుతుందా..?అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో పాపులర్ ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారు. ఇవి కాకుండా ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి దీనినే ఎలక్టోరల్ కాలేజీ అంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. అయితే ఓటింగ్ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్ పేపర్పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు. ఈ ఓట్లన్నీ ఎలక్టర్లకు వెళతాయి. ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54,టెక్సాస్లో 40 ఎలక్టోరల్ ఓట్లుండగా తక్కువ జనాభాగల వ్యోమింగ్కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను 270 ఓట్లు లభించినవారు అధ్యక్షులవుతారు.స్వింగ్ రాష్ట్రాలు ఏంటి.. ఎందుకు కీలకం..?అమెరికా ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ అని అంటారు. వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉంటుంది. పార్టీలు ఈ స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తాయి. 2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్- రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పుతాయన్నది సుస్పష్టం. అందుకే వీటిపై పట్టుకోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నించారు. ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైన ప్రతినిధులు (ఎలక్టర్లు ) డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ రిజల్ట్ టై అయితే అధ్యక్ష ఎన్నిక ఎలా..ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా ఇద్దరూ 269 ఓట్ల దగ్గరే ఆగిపోతే ఫలితం టై అవుతుంది. ఈ పరిస్థితుల్లో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భంలో హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే సెనేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తారు.ఇందుకోసం 1800 అధ్యక్ష ఎన్నిక తర్వాత రాజ్యాంగానికి 12వ సవరణ తీసుకువచ్చారు.ఇండియన్ అమెరికన్ ఓటర్ల ప్రభావం ఎంత..?అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటర్ల ప్రభావం చాలా వరకు ఉంటుందని ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్మెన్ రాజాకృష్ణమూర్తి చెప్పారు. స్వింగ్ స్టేట్స్తో పాటు దేశవ్యాప్తంగా భారతీయ అమెరికన్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తమ సమస్యలను పరిష్కరించే అధ్యక్షుడి కోసం భారతీయ అమెరికన్లు చూస్తున్నారని చెప్పారు. -- సాక్షి వెబ్డెస్క్ -
నిజమే సార్! మీరొస్తే మీ కంపెనీలన్నీ ఆర్థికంగా అద్భుతాలు సృష్టిస్తాయ్!
-
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మొదలైన కౌంట్ డౌన్
-
అది ఫేక్ సర్వే: తాజా పోల్పై మండిపడ్డ ట్రంప్
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు ఒకే రోజు సమయముందనగా తనకు వ్యతిరేకంగా వెల్లడైన ఒక పోల్ సర్వేను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. అయోవా డెమోక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ తనకంటే లీడింగ్లో ఉందని తెలిపిన సర్వేను ట్రంప్ మండిపడ్డారు. ఆ సర్వే ఫేక్ అని కొట్టిపారేశారు.అయోవా రాష్ట్రంలో కమలాహారిస్కు 47 శాతం, ట్రంప్నకు 44 శాతం మంది మద్దతిస్తున్నారంటూ తాజా పోల్ ఒకటి వెల్లడైంది. దీనిపై ట్రంప్ స్పందించారు. ప్రత్యర్థులు కావాలనే ఇలాంటి ఫేక్ సర్వేను సృష్టించారని మండిపడ్డారు.‘ఐయామ్ నాట్ డౌన్’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే సెప్టెంబర్లో అయోవాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నట్లు అదే సర్వే సంస్థ అంచనాలు వెల్లడించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి కమల లీడ్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్నకు అయోవాలో 9 పాయింట్ల ఆధిక్యం లభించడం గమనార్హం.మంగళవారం(నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి: అబార్షన్ మా హక్కు -
ఆమే నాకు స్ఫూర్తి.. తల్లిపై కమలాహారిస్ భావోద్వేగ ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర పోస్టు చేశారు. ఆదివారం(నవంబర్ 3) చేసిన ఈ పోస్టులో కమల తన తల్లి శ్యామలా గోపాలన్ను గుర్తు చేసుకున్నారు. తన తల్లి ధైర్యం, ధృడ నిశ్చయాలే తనను ఇక్కడిదాకా తీసుకువచ్చాయని, ఆమె స్ఫూర్తితోనే తాను జీవితంలో చాలా సాధించగలిగానని తెలిపారు.తన తల్లి శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో ఒంటరిగా భారత్ నుంచి అమెరికా వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హారిస్ చేసిన చాలా ప్రసంగాల్లో తన తల్లి గురించి ప్రస్తావించడం గమనార్హం. 19 ఏళ్ల వయసులో అమెరికా వచ్చిన కమల తల్లి శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్పై పరిశోధనలు చేశారు. My mother, Dr. Shyamala Gopalan Harris, came to the United States from India alone at the age of 19. Her courage and determination made me who I am today. pic.twitter.com/nGZtvz2Php— Vice President Kamala Harris (@VP) November 2, 2024కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీలో చదువుకుంటుండగా జమైకా నుంచి వలస వచ్చిన డొనాల్డ్ హారిస్తో శ్యామలకు పరిచయమైంది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 1960లో వీరికి కమల జన్మించారు. కమల ఐదో ఏట తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కమల, ఆమె చెల్లి మాయలు తల్లి శ్యామల సంరక్షణలోనే పెరిగారు.ఇదీ చదవండి: అమెరికాను హారిస్ నాశనం చేశారు..నేనొస్తే ఆర్థికంగా అద్భుతాలే -
అమెరికాను హారిస్ నాశనం చేశారు.. నేనొస్తే ఆర్థికంగా అద్భుతాలే: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ అనుసరించిన ఆర్థిక విధానాలు అత్యంత అసమర్థమైనవంటూ రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుయ్యబట్టారు. ‘‘నేను గెలిస్తే వాటికి ముగింపు పలుకుతా. ‘బిల్డ్ అమెరికన్, బై అమెరికన్, హైర్ అమెరికన్’వంటి సరికొత్త విధానాలతో ఆర్థిక రంగంలో అద్భుతాలు చేసి చూపిస్తా’’అన్నారు. స్వింగ్ రాష్ట్రమైన మిషిగన్లోని డెట్రాయిట్లో శుక్రవారం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ‘‘అమెరికాను హారిస్ సర్వనాశనం చేశారు. ఆమె ఆర్థిక విధానాల వల్ల గత కొద్ది రోజుల్లోనే ప్రైవేట్ రంగంలో ఏకంగా 30 వేలు, నిర్మాణ రంగంలో ఏకంగా 50 వేల ఉద్యోగాలకు కోత పడింది. కార్మిక లోకాన్ని ఆమె నిండా ముంచుతున్నారు’’అని ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి, పశి్చమాసియాలో అనిశి్చతికి నేను ముగింపు పలుకుతా. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా. సైన్యాన్ని ఆధునీకరిస్తా. మత స్వేచ్ఛను, ఆయుధాలు కలిగి ఉండే హక్కును పరిరక్షిస్తా. అక్రమ వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తా’’అని పేర్కొన్నారు. -
USA Presidential Elections 2024: వైషమ్యాలను పెంచుతారు
వాషింగ్టన్: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తులను పరస్పరం ఎగదోసి వారిమధ్య వైషమ్యాలు పెంచే రకమంటూ డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ దుయ్యబట్టారు. ట్రంప్ కంటే చాలా మెరుగైన వ్యక్తి మాత్రమే అమెరికాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రమైన విస్కాన్సిన్లో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.రాజకీయ ప్రత్యర్థులను, తనకు ఓట్లేయని వారని శత్రువులుగా భావించే ప్రమాదకరమైన మనస్తత్వం ట్రంప్ సొంతమని ఆక్షేపించారు. ఆయన జేబులో రాసిపెట్టుకున్న శత్రువుల జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉందన్నారు. ‘‘మరోవైపు రిపబ్లికన్ల నుంచి కూడా ఒకరికి నా మంత్రివర్గంలో చోటివ్వాలన్న మనస్తత్వం నాది. మా ఇద్దరి మధ్య ఇదే తేడా’’అని చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తుందన్నారు. -
USA Presidential Elections 2024: వైట్హౌస్కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్కు 51, హారిస్కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్ను క్లీన్స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్ను పలుమార్లు క్లీన్స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: చపలచిత్తుడు
ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ల అధ్య ర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ఆయన డెమొక్రాటిక్ పార్టీ ప్రత్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఘాటైన విమ ర్శలు చేశారు. ‘‘ట్రంప్ అ త్యంత చపలచిత్తుడు. ఆపాద మస్తకమూ ప్రతీకారేచ్ఛతో నిండిపోయిన బాపతు. దానికోసమే అపరిమితమైన అధికారానికై అర్రులు చాస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అతి సమీపంలోకి నేపథ్యంలో ఆమె శుక్రవారం లాస్వెగాస్లో ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటేనే విద్వేషానికి ప్రతినిధి అంటూ తూర్పారబట్టారు. ‘‘పొరపాటున ట్రంప్ను గెలిపిస్తే ‘శత్రువుల జాబితా’ను జేబులో పెట్టుకుని మరీ శ్వేతసౌధంలోకి అడుగు పెడతారు. నేనైతే అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు ఏమేం చేయాలన్న జాబితాతో కాలు పెడతా. అందులో మొదటిది మీ జీవనవ్యయాన్ని తగ్గించడమే’’ అని ప్రకటించారు. హారిస్కు మద్దతుగా ప్రఖ్యాత గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికన్లంతా, ప్రత్యేకించి లాటినో అమెరికన్లు హారిస్కు మద్దతివ్వాలని పిలుపు నిచ్చారు. ట్రంప్ మాదిరిగా కొందరినే కాకుండా అమెరికన్లందరి సంక్షేమాన్నీ హారిస్ పట్టించుకుంటారని లోపెజ్ అభిప్రా యపడ్డారు. అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కూడా గురువారం హారిస్కు తన మద్దతు ప్రక టించారు. ఆమెకు ఓటేస్తేనే తన పిల్లల భవిష్యత్తు క్షే మంగా ఉంటుందన్నారు. ‘కమలా హారి స్కే ఓటే యండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. -
కమలా హారిస్ కోసం పాల్వంచలో 11 రోజుల పాటు మహాయజ్ఞం
పాల్వంచ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ శ్రీరాజ శ్యామలాంబ సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ పేరుతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ మహాయజ్ఞం నిర్వహించారు. 11 రోజుల కిందట ప్రారంభమైన ఈ యజ్ఞం బుధవారం పూర్ణాహుతితో ముగిసింది.అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎలాగైనా కమలా హారిస్ గెలవాలనే ఆకాంక్షతో ఈ యజ్ఞం నిర్వహించినట్లు సొసైటీ చైర్మన్ నల్లా సురేశ్రెడ్డి తెలిపారు. తాను కొంతకాలం అమెరికాలో పని చేశానని, ఆ సమయంలో సెనేటర్గా ఉన్న కమలా హారిస్ను కలిశానని చెప్పారు. భారతీయ మూలాలు కలిగిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ గురించి తెలుసుకుని ఆమె పేరుతో పాల్వంచలో ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించామని ఆయన వెల్లడించారు.కాగా, యజ్ఞం ముగింపు సందర్భంగా 40 మంది వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణాహుతి వేడుకను ఘనంగా నిర్వహించామని, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. త్వరలో కమలా హారిస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.తిరునక్షత్ర మహోత్సవానికి రండి: సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో సమతాస్ఫూర్తి కేంద్రంలో నవంబర్ 1 నుంచి జరగనున్న శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. హైదరాబాద్లోని శ్రీ అహోబిల జీయర్ స్వామి బుధవారం వీరద్దరిని కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.చదవండి: ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ -
అధ్యక్ష ఎన్నికల వేళ.. ఇజ్రాయెల్కు ట్రంప్ మాస్ వార్నింగ్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో మారణహోమం జరుగుతోంది. వందల, వేల సంఖ్యలో ప్రజల బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్హౌస్లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్హౌస్లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇక, గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఇటీవల కూడా ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నవంబర్ ఐదో తేదీన అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. ఇక, ఇజ్రాయెల్ విషయంలో కమలా హారీస్ కూడా సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. -
‘చెత్త ట్రక్’ నడిపిన ట్రంప్.. బైడెన్, కమలకు కౌంటర్
న్యూయార్క్: ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘చెత్త’ చూట్టూ రాజకీయం నడుస్తోంది!. తాజాగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కౌంటర్ ఇస్తూ బుధవారం ఓ చెత్త ట్రక్ను నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.‘నా చెత్త ట్రక్ మీకు నచ్చిందా?. కమలా, జో బిడెన్ల గౌరవార్థంతో ట్రక్ నడుపుతున్నా’ అని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘హాస్యనటుడు టోనీ హించ్క్లిఫ్ ప్యూర్టోరీకోపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నాకు ఆ హాస్యనటుడి గురించి ఏమీ తెలియదు. నేను ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక హాస్యనటుడు.. ఆయన గురించి చెప్పడానికి ఏం ఉంటుంది’ అని మీడియా ప్రశ్నలను ట్రంప్ దాటవేశారు.TRUMP ARRIVES FOR CAMPAIGN RALLY IN A GARBAGE TRUCK!“How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden.”“For Joe Biden to make that statement — it’s really a disgrace” pic.twitter.com/jA9nEQKvCg— J Stewart (@triffic_stuff_) October 30, 2024ఇటీవల రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించారు. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో అధ్యక్షుడు జోబైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అని అన్నారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. -
అధ్యక్షుడిగా పనికిరారు.. ట్రంప్ను ఓడించండి..
-
USA Presidential Elections 2024: పరిధులు దాటుతున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు. రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్థిరత్వం లేని ట్రంప్ను ఓడించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలువాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. -
USA Presidential Elections 2024: హారిస్కు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మరోసారి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే ఆమెకు ఒక శాతం మొగ్గున్నట్టు మంగళవారం వెలువడ్డ రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో తేలింది. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జరిపిన ఈ మూడు రోజులు హారిస్కు 44 శాతం, ట్రంప్కు 43 శాతం మంది మద్దతిచ్చారు. 975 మంది నమోదైన ఓటర్లతో కలిపి మొత్తం 1,150 మంది అమెరికా పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఎకానమీ, నిరుద్యోగం, ఉపాధి వంటి అతి కీలకమైన అంశాల్లో ఏకంగా 47 శాతం మంది ట్రంప్కే ఓటేశారు. హారిస్కు మద్దతిచ్చిన వారు కేవలం 37 శాతం మాత్రమే. మరో కీలకాంశమైన వలసల విషయంలో కూడా ట్రంప్ 48 శాతం మంది వైఖరిని సమర్థిస్తే హారిస్ను 33 శాతం మందే సమర్థించారు. కచ్చితంగా ఓటేస్తామన్న వారిలో 47 శాతం హారిస్ను, 46 శాతం ట్రంప్ను బలపరిచారు. హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి సర్వేలన్నీ ఆమెకే మొగ్గున్నట్టు తేల్చడం విశేషం. -
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్లో ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్హౌజ్లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
US Presidential Election 2024: వాషింగ్టన్ పోస్ట్కు హారిస్ దెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతు పలకాలని గత వారం ‘వాషింగ్టన్ పోస్ట్’వార్తాసంస్థ తీసుకున్న నిర్ణయం తాజాగా ఆ సంస్థ సర్కులేషన్కు ఎసరుపెట్టింది. హారిస్కు మద్దతు పలుకుతున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ‘తటస్థ’వైఖరిని అవలంభించాలని సంస్థను ఇటీవల కొనుగోలుచేసిన ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాజాగా ఆదేశించడమే ఇందుకు అసలు కారణం. అసలేం జరిగింది? కమలా హారిస్కు మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పత్రిక ఎడిటోరియల్ సిబ్బంది గత వారం ప్రకటించారు. ఇది నచ్చని యజమాని, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వెంటనే రంగంలోకి దిగారు. ‘అధ్యక్ష అభ్యర్థికి మద్దతు పలకడం అనేది పక్షపాత భావనను సృష్టిస్తుంది. ఇది పాఠకుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని పోగొట్టడమే అవుతుంది. అందుకే అధ్యక్ష అభ్యర్థులకు మద్దతు పలికే సంప్రదాయాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నా. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, నాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ సీఈఓ డేవ్ లింప్ మధ్య అక్టోబర్ 25న భేటీ జరిగింది. అయితే ఈ భేటీకి వాషింగ్టన్పోస్ట్ హారిస్కు మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి సంబంధం లేదు. ఇది ఉద్దేశపూర్వక వ్యూహం కాదు. ఇక్కడ ఏ విధమైన క్విడ్ ప్రోకో జరగలేదని స్పష్టం చేయదల్చుకున్నా’’అని వ్యాఖ్యానించారు. దీంతో బెజోస్ ఆదేశాలను శిరసావహిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణకర్త విల్ లూయిస్ తాజాగా ఒక ప్రకటన విడుదలచేశారు. ‘ఏ అభ్యర్థికి ఓటేయాలనే విచక్షణా సామర్థ్యం అమెరికా ఓటర్లయిన మా పాఠకులకు ఉంది’ అని అందులో పేర్కొన్నారు. దీంతో సోమవారం 2 లక్షల మంది చందాదారులు వాషింగ్టన్పోస్ట్ సభ్యత్వాన్నిరద్దుచేసుకున్నారు. ఇది సంస్థ ప్రింట్, డిజిటల్ సర్కులేషన్ల 8 శాతానికి సమానం. ఈ సంఖ్య మరింతపెరిగే వీలుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కమలా హారిస్కు మద్దతుపలికే చందాదారులే తమ సబ్స్క్రిప్షన్ను వదులుకున్నట్లు వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్ టైమ్స్ సైతం ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించకూడదని నిర్ణయించింది. అభ్యర్థికి పత్రిక ఆమోదం ఎందుకు? అధ్యక్ష అభ్యర్థులను సమర్థించే వార్తాపత్రిక ఎడిటోరియల్ పేజీల సంప్రదాయం అమెరికాలో శతాబ్దానికి పైగా ఉంది. వార్తా పత్రికలు తాము విశ్వసించే అభ్యర్థిని సమర్థించడం ద్వారా సమాచారంతో కూడిన ఓటింగ్ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాయి. మద్దతు పలకడం అనగానే ఆ వార్తాసంస్థ ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తోందని కాదు. పత్రిక పాత్రికేయ విలువలకు కట్టుబడి పనిచేస్తూనే నిష్పాక్షిక కవరేజీని అందిస్తాయి.ఆ అభ్యర్థి ఏరకంగా అధ్యక్ష పదవికి అర్హుడో వాస్తవకోణంలో తెలియజేయస్తాయి. ఓటేసేటపుడు ఏది ఉత్తమ నిర్ణయమో పాఠకులకు తెలియజేయడం ఈ మద్దతు అంతిమ లక్ష్యం. అనేక వార్తాపత్రికలకు అభిప్రాయాలు, మద్దతును ప్రకటించేందుకు ప్రత్యేకంగా ఎడిటోరియల్ బోర్డ్లు ఉన్నాయి. భారత్లో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ అనధికారికంగా కొన్ని వార్తాపత్రికలు, టీవీ చానళ్లు తాము మెచ్చిన అభ్యర్థి/రాజకీయ పార్టీకి అనుకూలంగా అత్యధిక కవరేజీ ఇచ్చే ధోరణి మాత్రం భారత్లో బాగా పెరిగింది. ఏ ప్రాతిపదికన సమరి్థస్తారు? అభ్యర్థి గెలిచి అధ్యక్షుడయ్యాక పరిపాలన ఎలా ఉండొచ్చు? హామీలను నెరవేర్చడానికి అమలుకు పక్కా ప్రణాళిక ఉందా?. మన వార్తాసంస్థ విలువలకు అనుగుణంగా ఏ అభ్యర్థి ఉన్నారు? అసలు అధ్యక్షుడయ్యే అర్హత ఆ అభ్యర్థికి ఉందా? అంతర్జాతీయ పరిణామాలను అవపోశన పట్టి అగ్రరాజ్య అధిపతిగా నెగ్గుకురాగలడా? వంటివి పరిగణనలోకి తీసుకుని వేర్వేరు వార్తాసంస్థలు తమకు నచ్చిన అభ్యర్థికేే మద్దతు ప్రకటిస్తాయి. అయితే అమెరికాలో వార్తాపత్రికలు బలపరిచిన అభ్యర్థులు ప్రతిసారీ గెలవలేదనే వాదన కూడా ఉంది. 1897లో దాదాపు అన్ని న్యూయార్క్ వార్తాపత్రికలు మద్దతు పలికిన అభ్యర్థులు ఓటమిని చవిచూడటం గమనార్హం. కానీ న్యూయార్క్ టైమ్స్ అధ్యయనం ప్రకారం 1940 నుంచి 2016 వరకు జరిగిన దాదాపు అన్ని అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యధిక వార్తాపత్రికల మద్దతు అందుకున్న అభ్యర్థే అధికారాన్ని కైవసం చేసుకుని శ్వేతసౌధంలో అడుగుపెట్టగలిగారు. ఈసారి ఎందుకు వివాదాస్పదమైంది?అనుకూల, ప్రతికూల అనే అంశాలను పక్కనబెడితే అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అభ్యర్థుల్లో ట్రంప్ ఒకరు. అతని అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు అమెరికన్లను తీవ్రంగా విభజించాయి. డెమొక్రటిక్ అభ్యర్థి గెలిస్తే అమెరికా నాశనమవుతుందని ట్రంప్ బలంగా ప్రచారంచేశారు. 2016లో తొలిసారి గెలిచినప్పటి నుంచి మీడియాలో వస్తున్న విమర్శలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి వార్తా పత్రికలను ఫేక్ న్యూస్ అని పదేపదే ఖండించారు. ఈ నేపథ్యంలో ఎండార్స్మెంట్ విషయమై వాషింగ్టన్ పోస్ట్, లాస్ఏంజిల్స్ టైమ్స్ వెనుకంజ వేయడానికి వ్యాపారపరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్కు అమెరికా ప్రభుత్వంతో బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాలు ఉన్నాయి. ఆయన రాకెట్ కంపెనీ బ్లూ ఆరిజిన్కు స్పేస్ ఫోర్స్, నాసాతో ఒప్పందాలున్నాయి. 2023లో డెమొక్రాట్ల బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ ట్రస్ట్ దావాను కూడా అమెజాన్ ఎదుర్కొంటోంది. బయోఫార్మా ఇన్నోవేటర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సూన్–షియోంగ్ ప్రస్తుతం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి అవసరమయ్యే కొత్త మందులపై పనిచేస్తున్నారు. విజయావకాశాలు 50–50 ఉన్నాయని సర్వేలు చెబుతుండటంతో ట్రంప్ను గెలిపిస్తే తమ వ్యాపార ఒప్పందాలకు ఢోకా ఉండబోదని వ్యాపార దిగ్గజాలు భావించి ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. -
భారతీయ అమెరికన్లలో హారిస్కు తగ్గిన ఆదరణ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్కు జైకొట్టారు. ట్రంప్కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్కు జైకొట్టారు.→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్కు మద్దతిచ్చారు.→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్కు, 39 శాతం మంది ట్రంప్కు ఓటేస్తామని చెప్పారు.→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్కు 44 శాతం జైకొట్టారు.→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్కు మద్దతిస్తామన్నారు.→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్కు, 27 శాతం ట్రంప్కు మద్దతిచ్చారు.→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే. -
USA Presidential Elections 2024: లేడీస్ అండ్ జెంటిల్మెన్!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వారం రోజుల్లో జరగనున్నాయి. పురుష ఓటర్లలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కే భారీ ఆదరణ కన్పిస్తుండగా మహిళలు మాత్రం డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ వైపే మొగ్గుతున్నారు. అగ్రరాజ్యంలోనూ రాజకీయంగా నెలకొని ఉన్న లింగ వివక్షను ఇది ప్రతిబింబిస్తోంది. ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో కూడా ఈ అంశం కీలకంగా మారింది. హారిస్ తొలినుంచీ ఇలాంటి గుర్తింపు రాజకీయాల జోలికి వెళ్లలేదు. ఎక్కడా తను మహిళను కనుక ఓటేయండని కోరలేదు. దాన్ని ప్రచారాంశంగా మలచుకునే ప్రయత్నమూ చేయలేదు. జాతి, జెండర్తో నిమిత్తం లేకుండా అమెరికన్లందరి శ్రేయస్సు కోసం పని చేయడానికి తానే సమర్థురాలినని నమ్ముతున్నట్టు పలు ఇంటర్వ్యూల్లో హారిస్ స్పష్టం చేశారు కూడా. అలా జెండర్ను తటస్థంగా ఉంచడానికి ఆమె ఎంత ప్రయత్నించినా అది ప్రధానాంశంగానే ఉంటూ వస్తోంది. ఎందుకంటే ‘మేడం ప్రెసిడెంట్’ అనేది అమెరికాకు చాలా కొత్త విషయం. ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా అత్యున్నత పీఠాన్ని అధిరోహించింది లేదు. ఈ నేపథ్యంలో హారిస్ ప్రెసిడెంట్ అవడమనే ఆలోచననే చాలామంది ఓటర్లు ఇష్టపడుతున్నారు. పలువురు అమెరికన్లు మాత్రం ఈ తరహా కొత్తదనాన్ని ఇబ్బందికరంగా భావిస్తున్నారు. బహిరంగ రహస్యమే హారిస్ తన ప్రచారంలో ఎక్కడా జెండర్ విషయాన్ని ప్రస్తావించకపోయినా లైంగికత అనేది అమెరికా సమాజంలోనే అంతర్లీనంగా దాగుందని, అధ్యక్షురాలిగా ఓ మహిళకు ఓటేయడానికి చాలామందికి ఇదో అడ్డంకిగా కనిపిస్తోందని భావిస్తున్నారు. ట్రంప్ ప్రచార బృందం కూడా పైకి జెండర్తో సంబంధం లేదని చెబుతున్నా, ‘‘హారిస్ బలహీనురాలు. నిజాయితీ లేని వ్యక్తి. ప్రమాదకరమైన ఉదారవాది’’ తరహా ప్రచారంతో ఊదరగొడుతోంది. అమెరికా ప్రజలు ఆమెను తిరస్కరించడం ఖాయమంటోంది. అంతేగాక అధ్యక్ష అభ్యర్థుల్లోని ఈ లింగపరమైన తేడా తమకే లాభిస్తుందని ట్రంప్ ప్రచార బృందం సీనియర్ సలహాదారు బ్రయాన్ లాంజా బాహాటంగానే అన్నారు. ఫలితంగా ట్రంపే గెలుస్తారని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చారు. ‘మీటూ’ ప్రభావమెంత? సమాజంలో తన స్థానంపై మహిళల దృక్కోణంలో 2016 నుంచి పెను మార్పులొచ్చాయి. 2017లో ‘మీ టూ’ ఉద్యమం పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వివక్షపై సమాజంలో అవగాహనను ఎంతో పెంచింది. మహిళల గురించి మాట్లాడే విధానాన్నీ మార్చింది. కానీ భిన్నత్వం, సమానత్వం, సమ్మిళితం వంటి అంశాల్లో అంతటి పెద్ద ముందడుగును జీరి్ణంచుకునే స్థితిలో అమెరికా సంప్రదాయ యువకులు లేరు. దీన్ని కేవలం తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా వారు భావిస్తున్నారు. అధ్యక్ష రేసులో లింగ అంతరం ప్రారంభమైందన్న సీబీఎస్ న్యూస్ పోల్ తాజా ఫలితాలు ఇందుకు అద్దం పట్టేవే. అమెరికాలో పురుషులు ప్రధానంగా ట్రంప్ మద్దతుదారులుగానే ఉన్నారు. హారిస్ను బలమైన నేతగా చూసే పురుషులు కూడా తక్కువగా ఉన్నారు. యువకులు చాలావరకు ట్రంప్, ఎలాన్ మస్క్ ‘బ్రో కల్చర్’లో నిండా మునిగి తేలుతున్నారు. ‘‘డెమొక్రాట్లు ఎంతసేపూ మహిళలు, గర్భస్రావ హక్కులు, ఎల్జీటీబీక్యూ సంస్కృతి గురించే మాట్లాడుతున్నారు. మరి మా పరిస్థితేమిటి?’’ అన్నది అమెరికా యువత నుంచి గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న. దీన్ని డెమొక్రాట్ల పాలిట డేంజర్ బెల్గా విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు! ఎంతో అంతరం అమెరికా పురుషుల్లో 51 శాతం మంది ట్రంప్కు మద్దతిస్తుండగా హారిస్కు 45 శాతం మాత్రమే సానుకూలంగా ఉన్నట్టు ఇటీవలి సీఎన్ఎన్ జాతీయ ఓటర్ల సర్వే తేలి్చంది. హార్వర్డ్ యూత్ పోల్లో 30 ఏళ్ల లోపు మహిళల్లో హారిస్ ఏకంగా 47 శాతం ఆధిక్యంలో ఉన్నారు. అదే 30 ఏళ్లలోపు పురుషుల్లో ఆమెకు మద్దతిస్తున్నది కేవలం 17 శాతమే. దీంతో హారిస్ ప్రస్తుతం ఈ అంతరాన్ని తగ్గించే పనిలో పడ్డారు. గత వారాంతంలో స్వింగ్ స్టేట్స్లోని పురుషులను లక్ష్యంగా చేసుకుని కొత్త ప్రకటనలకు తెరతీశారు. ‘బీ ఏ మాన్.. ఓట్ ఫర్ ఉమన్’ వంటి నినాదాలను నమ్ముకున్నారు. హారిస్ రన్నింగ్ మేట్ టిమ్ వాల్జ్ ప్రచార కూడా పలు కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, డిజిటల్ మీడియా కంటెంట్తో పురుష ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ట్రంప్ మాత్రం మరిన్ని ఇంటర్వ్యూలతో పురుష ఓటర్లకు మరింత దగ్గరవుతున్నారు. మొత్తంగా చూస్తే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ‘లేడీస్ అండ్ జంటిల్మెన్’, ‘బాయ్స్ అండ్ గాళ్స్’ డిసైడ్ చేయబోతున్నారు. ఆ లెక్కన అమెరికన్ల జీవితంలో మహిళల పాత్రపై దీన్ని రెఫరెండంగా కూడా భావించొచ్చేమో! ‘పురుష నిస్పృహ’.. ట్రంప్ ఆయుధం! అమెరికాలో యువతులతో పోలిస్తే యువకుల తీరు తీసికట్టుగానే ఉన్నట్టు గణాంకాలన్నీ చెబుతున్నాయి. కళాశాలలో యువకులు తక్కువగా చేరుతున్నారు. సమాజంతో సంబంధాలను కొనసాగించడమూ తక్కువే. ఆత్మహత్య రేటూ వారిలోనే ఎక్కువ. యువతులు బాగా చదువుకుంటున్నారు. సేవా రంగంలో రాణిస్తున్నారు. యువకులతో పోలిస్తే ఎక్కువ సంపాదిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక యువకుల కంటే యువతులే బాగా ఉదారంగా మారినట్టు గాలప్ పోలింగ్ బృందం తెలిపింది. అయితే ఇవన్నీ అమెరికా సమాజంలో లింగ విభేదాలను మరింతగా పెంచేందుకే దోహదపడుతుండటం చింతించాల్సిన విషయమే. యువత అసంతృప్తులను ట్రంప్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రచారం చివరి రోజుల్లో ఈ పురుష నిస్పృహపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ‘పురుషత్వం దాడికి గురవుతోంది’ అనే హెచ్చరికను తన సోషల్ మీడియా టూల్ ట్రూత్లో తిరిగి పోస్ట్ చేశారు.హిల్లరీకీ ఇదే పరిస్థితి!అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ చరిత్రలో నిలిచిపోయారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ హోరాహోరీ పోరులో హిల్లరీ ఓటమికి లింగ వివక్ష, స్త్రీల పట్ల అమెరికా సమాజంలో దాగున్న వ్యతిరేకత కూడా కారణమైంది. అప్పుడు కూడా ప్రధాన ప్రత్యరి్థ, అధ్యక్ష పోరులో అంతిమ విజేత ట్రంపే కావడం విశేషం. ఈసారి వివక్ష కాస్త తగ్గినట్టు కనిపిస్తున్నా మరోసారి గెలుపోటములను నిర్ణయించే కీలకాంశం కావచ్చన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి!1920లో మహిళలకు ఓటు హక్కు అమెరికా మహిళలు తొలిసారిగా 1920 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వారెన్ జి.హార్డింగ్ మొదటి ప్రపంచ యుద్ధం తాలూకు అనిశ్చితి నుంచి దేశం త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని హామీ ఇచ్చారు. కానీ ఆ ‘సాధారణ స్థితి’ అంటే ఏమిటో 100 ఏళ్లు గడిచినా సగటు అమెరికన్లకు అర్థం కావడం లేదు. 2024లో కూడా అమెరికన్ అంటే ‘పురుషుడా, లేక మహిళా?’ అనే ప్రశ్న అడుగడుగునా తలెత్తుతూనే ఉంది. చారిత్రికంగా తెల్లజాతి పితృస్వామ్యంలో నిండా మునిగి తేలుతూ వస్తున్న అగ్ర రాజ్యం ఇప్పుడు తమ నాయకురాలిగా నల్లజాతీయురాలైన మహిళను నామినేట్ చేసింది. ఫలితంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. 1920తో పోల్చుకుంటే ఆర్థిక, సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందినా అమెరికా మహిళలు ఇప్పటికీ తమ శరీరాలపై హక్కులు తదితరాల కోసం పోరాడాల్సే వస్తోంది. రాజకీయంగా పోటీని మరింత బలంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలా గెలుస్తుందేమోనని మీకు భయం పట్టుకుందిగా సార్!
-
USA Presidential Elections 2024: ఓట్లు తగ్గినా... గద్దెనెక్కవచ్చు!
అధ్యక్ష తరహా పాలన ఉన్న చాలా దేశాల్లో ఆ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతుంది. ప్రజలు తమ ప్రెసిడెంట్ను నేరుగా ఎన్నుకుంటారు. అత్యధిక ఓట్లు సాధించే వారే విజేతగా నిలుస్తారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో మాత్రం గమ్మత్తైన పరోక్ష ఎన్నిక విధానం అమల్లో ఉంది. అక్కడ అధ్యక్షున్ని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజీ. మరి పోలింగ్ తేదీన ప్రజలు ఓటేసేది ఎవరికంటారా? ఎలక్టర్లుగా పిలిచే ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు. అనంతరం వారంతా కలిసి అధ్యక్షున్ని, ఉపాధ్యక్షున్ని నేరుగా ఎన్నుకుంటారు.విన్నర్ టేక్స్ ఆల్! అధ్యక్ష ఎన్నిక విషయంలో అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలు విన్నర్ టేక్స్ ఆల్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దానిప్రకారం ఒక రాష్ట్ర ఎలక్టోరల్ ఓట్లన్నీ ఆ రాష్ట్రంలో మెజారిటీ ఓట్లు సాధించే అభ్యరి్థకే దక్కుతాయి (మెయిన్, నెబ్రాస్కా మాత్రం అభ్యర్థులు సాధించే ఓట్ల ప్రకారం నైష్పత్తిక పద్ధతిలో వారికి ఎలక్టర్లను కేటాయిస్తాయి). దీనివల్ల దేశవ్యాప్తంగా కలిపి అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి కూడా ఓటమి పాలయ్యే ఆస్కారం పుష్కలంగా ఉంది. గతంలో ఇలా జరిగింది కూడా. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కంటే ఏకంగా 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె ఏకంగా 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు! 2000లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అల్ గోర్ కూడా తన రిపబ్లికన్ ప్రత్యర్థి జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించారు. అయినా 271 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు సాధించిన బుష్కే పీఠం దక్కింది. 1876, 1888ల్లో కూడా పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థులు ఓటమి చవిచూశారు. కాకపోతే ఇప్పటిదాకా జరిగిన 59 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 54సార్లు పాపులర్ ఓట్ సాధించిన అభ్యర్థే విజేతగా నిలిచారు. ఎందుకీ ‘కాలేజీ’...? ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ వల్ల చిన్న రాష్ట్రాలకు కూడా అధ్యక్షుని ఎన్నికలో తగిన ప్రాధాన్యం దక్కుతుంది. అంతేగాక అభ్యర్థులు దేశమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగే అవసరముండదు. గెలుపోటములను నిర్దేశించి ఆరేడు స్వింగ్ స్టేట్స్పై గట్టిగా దృష్టి పెడితే సరిపోతుంది. కాకపోతే ఈ విధానంలో లోపాలూ లేకపోలేదు. పాపులర్ ఓట్ సాధించిన వాళ్లు కూడా ఓడే ఆస్కారముండటం వాటిలో ప్రధానమైనది. తమ ఓట్లకు ప్రాధాన్యం లేదనే భావనతో జనం ఓటింగ్కు దూరమయ్యే ఆస్కారమూ ఉంటుంది.జనాభాకు తగ్గట్టు... ప్రతి రాష్ట్రానికి జనాభాకు అనుగుణంగా ఎలక్టర్ల సంఖ్యను కేటాయిస్తారు. ఇది ఆ రాష్ట్రానికి కేటాయించిన ప్రతినిధుల సభ, సెనేట్ సభ్యుల సంఖ్యకు సమానంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల సంఖ్య 538. అధ్యక్ష ఎన్నికలో నెగ్గాలంటే వీటిలో కనీసం 270 ఓట్లు అవసరం. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లుంటే వ్యోమింగ్, నార్త్ డకోటా, అలస్కా వంటి రాష్ట్రాల్లో కేవలం మూడే ఉన్నాయి. అమెరికాలోనూ అప్పుడప్పుడూ గోడదూకుళ్లు! ఎలక్టర్లు తమ పార్టీ అభ్యరి్థకే ఓటేయాలన్న రాజ్యాంగ నిర్బంధమేమీ అమెరికాలో లేదు! 2016లో ఏడుగురు ఎలక్టర్లు ప్రత్యర్థులకు ఓటేశారు. వీరిలో ఐదుగురు డెమొక్రాట్లు కాగా ఇద్దరు రిపబ్లికన్లు. అయితే వారి చర్య తుది ఫలితంపై ప్రభావం చూపలేదు. హిల్లరీ క్లింటన్కు 232 ఎలక్టర్ ఓట్లు రాగా 306 ఓట్లతో ట్రంప్ సునాయాసంగా విజయం సాధించారు. ఇలాంటి గోడదూకుడు ఎలక్టర్లకు సంబంధిత పారీ్టలు జరిమానా విధించడమే గాక వారిపై అనర్హత వేటు కూడా వేయొచ్చు. వారిపై చట్టప్రకారం చర్యలు కూడా చేపట్టమే గాక వారి స్థానంలో వేరేవాళ్లను ఎలక్టర్లుగా నియమించుకునేందుకు వీలు కల్పిస్తూ 32 రాష్ట్రాలు చట్టాలు చేశాయి. సుదీర్ఘ ప్రక్రియ అమెరికాలో అధ్యక్ష ఎన్నిక సుదీర్ఘ ప్రక్రియ. ముందుగా ప్రధాన పార్టీలు తమ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుడతాయి. ఇది పోలింగ్కు దాదాపు 9 నెలల ముందుగానే మొదలవుతుంది... -అధ్యక్ష అభ్యర్థులపై కాకస్లు, ప్రైమరీల ద్వారా పార్టీ సభ్యులు, ప్రతినిధులు తమ అభిప్రాయం వెలిబుచ్చుతారు. -అనంతరం ఆగస్టు/సెప్టెంబర్ నెల్లలో పార్టీ జాతీయ సదస్సులో అభ్యరి్థని అధికారికంగా ప్రకటిస్తారు. అక్కడినుంచి ఎన్నికల పోరు ఊపందుకుంటుంది. -ప్రచారం, ప్రధాన అభ్యర్థుల డిబేట్లతో పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది. -నవంబర్లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం పోలింగ్ ఉంటుంది. -విజేత ఎవరో పోలింగ్ ముగియగానే ఆ రాత్రే దాదాపుగా తేలిపోతుంది. -అయితే అంతకు కొద్ది నెలల నుంచే ముందస్తు ఓటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ఈసారి ఇప్పటికే 3.5 కోట్ల మందికి పైగా అమెరికన్లు ముందుగానే ఓటేయడం విశేషం.జనవరి 6న ఫలితం జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్ల లెక్కింపు జరిపి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ ప్రక్రియను సెనేట్ అధ్యక్షుని హోదాలో పర్యవేక్షిస్తారు. నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల పేర్లను కూడా ప్రకటిస్తారు. → ఎలక్టోరల్ ఓట్లలో ఏ అభ్యరి్థకీ మెజారిటీ రాకపోతే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత ప్రతినిధుల సభపై పడుతుంది. దాని సభ్యులంతా కలిసి అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ముగ్గురు అభ్యర్థుల్లో నుంచి మెజారిటీ ఓటు ద్వారా ఒకరిని అధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → ఉపాధ్యక్ష పదవికి కూడా అంతే. ఎవరికీ మెజారిటీ రాకపోతే అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు సాధించిన తొలి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిని సెనేట్ సభ్యులు మెజారిటీ ఓటు ద్వారా ఉపాధ్యక్షునిగా ఎన్నుకుంటారు. → దాంతో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ కొలిక్కి వచి్చనట్టే. చివరగా జనవరి 20న ప్రమాణస్వీకారం ఉంటుంది. ముందుగా ఉపాధ్యక్షుడు, అనంతరం అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆ రోజు ఆదివారమైతే కార్యక్రమాన్ని జనవరి 21న నిర్వహిస్తారు. → 1933 దాకా కొత్త అధ్యక్షుడు మార్చి 4న ప్రమాణస్వీకారం చేసేవారు. 1937 నుంచి జనవరి 20కి మార్చారు.అసలు ఎన్నిక డిసెంబర్ 16న!ఓటింగ్ ముగిశాక కూడా అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఏకంగా మరో రెండు నెలల పాటు సాగుతుంది! → రాష్ట్రాల స్థాయిలో ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ దాదాపు నెల పాటు జరుగుతుంది. మెయిన్, నెబ్రాస్కా మినహా మిగతా 48 రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఓట్లు సాధించిన పారీ్టకే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎలక్టోరల్ ఓట్లూ దక్కుతాయి. → అనంతరం తమ ఎలక్టర్లుగా ఎవరుండాలో సదరు పార్టీ తాలూకు రాష్ట్ర శాఖ నిర్ణయిస్తుంది. → ఎలక్టర్లుగా ఎన్నికైన వారంతా డిసెంబర్లో రెండో బుధవారం తర్వాత వచ్చే సోమవారం ఆయా రాష్ట్రాల రాజధానుల్లో భేటీ అవుతారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకు విడివిడిగా ఓటేస్తారు. ఒకవిధంగా అధ్యక్షున్ని వాస్తవంగా ఎన్నుకునేది ఈ రోజే! ఈసారి ఎలక్టర్ల భేటీ డిసెంబర్ 16న జరగనుంది. → అనంతరం డిసెంబర్ నెల నాలుగో బుధవారం లోగా, అంటే ఎలక్టర్ల భేటీ జరిగిన 9 రోజుల్లోపు వారి ఓట్లన్నీ సెనేట్ అధ్యక్షునికి చేరాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ గెలుపు... మహిళలకు ముప్పు: మిషెల్
కలమజూ (మిషిగన్): అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అమెరికా మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా హెచ్చరించారు. దాన్ని నివారించాలంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం మిషిగన్లో డెమొక్రాట్ల ప్రచార సభలో ఆమె పాల్గొన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోకపోతే మీ భార్య, మీ కూతురు, మీ తల్లి... ఇలా మహిళలుగా మేమంతా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని ఆమె హెచ్చరించారు. డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ తర్వాత పార్టీ ప్రచారంలో మిషెల్ పాల్గొనడం ఇదే తొలిసారి. హారిస్కు మద్దతుగా ఆమె ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆమె ప్రజల ప్రయోజనాలకోసమే పని చేస్తారన్నారు. ర్యాలీ అనంతరం మిషిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్తో కలిసి హారిస్ ట్రాక్ హౌజ్ బార్ అండ్ గ్రిల్కు వెళ్లారు. స్థానికంగా తయారుచేసిన బీర్ తాగారు. స్థానికులతో పిచ్చాపాటీ మాట్లాడారు. యువతుల టేబుల్ వద్దకు రాగానే వారిలో ఒకరు హారిస్తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మిషిగన్లో ఇప్పటికే 20 శాతం మంది ముందస్తుగా ఓటేశారు. మహిళలకు అవకాశాలు: బైడెన్ హారిస్ గెలిస్తే అన్ని రంగాల్లోనూ మహిళలకు గతంలో కంటే ఎక్కువ అవకాశాలు లభిస్తాయని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. పిట్స్బర్గ్లోని లేబర్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ నార్త్ అమెరికాలో ఆయన మాట్లాడారు. కారి్మకులను ట్రంప బలహీనపరిచారని మండిపడ్డారు. కారి్మక ప్రయోజనాల కోసం ట్రంప్ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: కమలాహారిస్కు గాయని బియాన్స్ మద్దతు -
USA Presidential Elections 2024: కమలా హారిస్కు గాయని బియాన్స్ మద్దతు
హూస్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్కు ప్రఖ్యాత గాయని బియాన్స్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్లో జరిగిన డెమొక్రటిక్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. హూస్టన్ బియాన్స్ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు మద్దతు పలికారు. క్లీవ్లాండ్లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్ సభలో కమలా హారిస్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి
వాషింగ్టన్: చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు , మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్లు వాడే ఫోన్లు, నెట్వర్క్ను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ట్రంప్–వాన్స్ల ఎన్నికల ప్రచార బృందాన్ని అప్రమత్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్ ఎన్నికల ప్రచారాన్ని కూడా చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారని బీబీసీ పేర్కొంది. అదే నిజమైతే, ఏ మేరకు సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కి ఉంటుందనే విషయం స్పష్టత రాలేదు. అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు సైబర్ నేరగాళ్లకు లక్ష్యమయ్యారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్బీఐలు నిరాకరిస్తున్నాయి. చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు దేశంలోని వాణిజ్య టెలీకమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోకి దొంగచాటుగా ప్రవేశించిన విషయమై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిందని ఎఫ్బీఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ(సీఐఎస్ఏ) ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. అయితే, నేరగాళ్లు చేసిన ప్రయత్నాలను తాము గుర్తించామని తెలిపాయి. ఆ వెంటనే సంబంధిత సంస్థలను అప్రమత్తం చేయడంతోపాటు ఇతర బాధితులను అలెర్ట్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందించామని ఆ ప్రకటనలో వివరించాయి. కమర్షియల్ కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ రక్షణలను బలోపేతం చేసేందుకు, దాడులను ఎదుర్కొనేందుకు సంబంధిత విభాగాలను సమన్వయం చేస్తున్నామని ఎఫ్బీఐ, సీఐఎస్ఏ తెలిపాయి. అయితే, దీనిని ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేలా సైబర్ దాడికి జరిగిన యత్నంగా కాకుండా, గూఢచర్యంగాభావిస్తున్నామని న్యాయ విభాగం తెలిపింది.ఈ పరిణామంపై ట్రంప్ ప్రచార బృందం తీవ్రంగా స్పందించింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవకుండా చేసే కుట్రగా అభివర్ణించింది. ఈ నెల మొదట్లో కూడా హ్యాకర్లు ట్రంప్, వాన్స్లే లక్ష్యంగా సైబర్ దాడికి పాల్పడ్డారని సంబంధిత వెరిజోన్ అనే టెలీ కమ్యూనికేషన్ సంస్థ ఆరోపించింది. సెపె్టంబర్లో ఇరాన్కు చెందిన ముగ్గురు హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకునేందుకు ప్రయతి్నంచినట్లు అమెరికా ప్రభుత్వం ఆరోపించడం తెలిసిందే. -
USA Presidential Elections 2024: చెరో 47 శాతం!
అట్లాంటా: అమెరికా అధ్యక్ష రేసు అత్యంత హోరాహోరీగా సాగుతోంది. సీఎన్ఎన్ వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన జాతీయ స్థాయి పోల్లో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ చెరో 47 శాతంతో సమానంగా నిలిచారు. అంతేగాక అక్టోబర్ 20–23 మధ్య న్యూయార్క్టైమ్స్/సియెనా కాలేజీ జరిపిన జాతీయ సర్వేలోనూ వారిద్దరికీ చెరో 48 శాతం దక్కడం విశేషం. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో ఎవరు మెరుగనే అంశంపై ఫైనాన్షియల్ టైమ్స్, మిషిగన్ వర్సిటీకి చెందిన రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సరిపిన సంయుక్త సర్వేలో మాత్రం ట్రంప్ది పైచేయి అయింది. ఆయనకు 44 శాతం, హారిస్కు 43 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. మొత్తమ్మీద చూస్తే మాత్రం ట్రంప్ కంటే హారిస్కు 1.7 శాతం మొగ్గున్నట్టు 538 పోల్ ట్రాకర్ విశ్లేషణలో తేలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేందుకు 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 ఓట్లు సాధించాలి. -
USA Presidential Elections 2024: ఊరిస్తున్న ఊయల సేవ
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కురుక్షేత్రాన్ని తలపిస్తూ అత్యంత హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఎన్నికలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నా వాటిలో ఏడు రాష్ట్రాలు విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్గా పిలిచే ఆ ఏడింటిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. వాటిలో మెజారిటీ రాష్ట్రాలను నెగ్గిన వారే అధ్యక్షుడు కావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే అన్ని పోల్స్లోనూ ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా ట్రంప్, హారిస్ దాదాపుగా సమవుజ్జీలుగా నిలుస్తుండటం విశేషం. దాంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయి. స్వింగ్ స్టేట్స్ అంటే...?అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల్లో ఏదో ఒకదానివైపు స్పష్టంగా మొగ్గేవే ఉంటాయి. వాటిని సేఫ్ స్టేట్స్గా పిలుస్తారు. పారీ్టల జెండా రంగుపరంగా వీటిని బ్లూ (డెమొక్రాట్), రెడ్ (రిపబ్లికన్) స్టేట్స్గా పేర్కొంటారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఒక ఎన్నికలో డెమొక్రాట్లకు జై కొడితే మరో ఎన్నికలో రిపబ్లికన్ అభ్యరి్థని గెలిపిస్తుంటాయి. వీటినే స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్గ్రౌండ్ స్టేట్స్, పర్పుల్ స్టేట్స్ (డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల్లో ఎటైనా మొగ్గవచ్చనే అనే అర్థంలో) అని పిలుస్తుంటారు. అభ్యర్థులు సేఫ్ స్టేట్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. ఈ స్వింగ్ స్టేట్స్ను తమవైపు తిప్పుకోవడం, లేదా అవి ప్రత్యరి్థకి జై కొట్టకుండా చూడటంపైనే శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తారు. దాంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హోరాహోరీ ప్రచారం సాగుతుంటుంది. మీడియాలోనూ, బయటా భారీగా ఎన్నికల ప్రకటనలు ఇతరత్రా హడావుడి కూడా స్వింగ్ స్టేట్స్లోనే ఎక్కువ. ఆ 7 రాష్ట్రాలివే... ఈ ఎన్నికల్లో 7 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్లుగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్నాయి. అవి... పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, మిషిగన్, నెవడా, విస్కాన్సిన్పెన్సిల్వేనియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 19 రాష్ట్ర జనాభా 1.3 కోట్లు 2020లో విజేత బైడెన్ (82 వేల ఓట్ల మెజారిటీ) ఏడు స్వింగ్ స్టేట్లలో అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న రాష్ట్రం. దాంతో సహజంగానే ఇక్కడ గెలుపు అభ్యర్థులకు అత్యంత కీలకం. ట్రంప్పై గత జూలైలో హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. ఇది బైడెన్ సొంత రాష్ట్రం కూడా. ఆర్థిక పరిస్థితులు ఈసారి ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. ధరాభారంతో పెన్సిల్వేనియావాసులు నానా కష్టాలు పడుతున్నారు. అమెరికా అంతటినీ అతలాకుతలం చేస్తున్న జీవన వ్యయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరీ ఎక్కువగా పెరిగిందని మార్కెట్ సర్వే సంస్థ డేటాసెంబ్లీ సర్వేలో తేలింది. కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఏకంగా ఎనిమిది మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే తేలి్చంది! ఇది హారిస్కు బాగా ప్రతికూలంగా మారవచ్చంటున్నారు. తాజా పరిస్థితి తాజా పోల్ ఆఫ్ పోల్స్లో హారిస్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారునార్త్ కరోలినా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 10.8 కోట్లు 2020లో విజేత ట్రంప్ (74 వేల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన ఏకైక స్వింగ్ స్టేట్ ఇదే. ఈసారి కూడా బైడెన్ ప్రత్యరి్థగా ఉన్నన్ని రోజులూ ట్రంప్ హవాయే నడిచింది. ఆయన తప్పుకుని హారిస్ తెరపైకి రావడంతో పరిస్థితి మారుతూ వచి్చంది. దాంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. అందుకే ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. తాజా పరిస్థితి ట్రంప్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారుమిషిగన్ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 15 రాష్ట్ర జనాభా కోటి 2020లో విజేత బైడెన్ (1.5 లక్షల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో బైడెన్కు మంచి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్రమిది. కానీ రాష్ట్రంలో ప్రబల శక్తిగా ఉన్న అరబ్ అమెరికన్లు హారిస్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె ఇజ్రాయెల్కు మద్దతిస్తుండటం బాగా ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. దీన్ని గమనించి కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ విషయంలో హారిస్ కాస్త విమర్శనాత్మక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. అది ఇక్కడ అరబ్ ఓటర్ల ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లార్చిందన్నది ఫలితాలొస్తే గానీ తేలదు. తాజా పరిస్థితి కమలా హారిస్ 0.8 శాతం ఆధిక్యంలో ఉన్నారుజార్జియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 1.1 కోట్లు 2020లో విజేత బైడెన్ (13 వేల ఓట్ల మెజారిటీ)గత ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఫలితం జార్జియాదే. ఇక్కడి ఓటమిని ఒప్పుకునేది లేదంటూ ట్రంప్ భీషి్మంచారు. ఏకంగా ఫలితాలనే మార్చేసేందుకు ప్రయతి్నంచి భంగపాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి నాలుగు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకదాంట్లో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా మూడింట్లో విచారణ కొనసాగుతోంది. జార్జియా జనాభాలో ఏకంగా మూడో వంతు ఆఫ్రికా మూలాలున్నవారే. 2020లో బైడెన్ను గెలిపించినా, ఆయన నాలుగేళ్ల పాలనపై వారంతా పెదవి విరుస్తున్నారు. ఇది హారిస్కు ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. కానీ ఇక్కడ నిర్వహించిన ముమ్మర ప్రచారం పరిస్థితిని ఆమెకు కాస్త అనుకూలంగా మార్చిందంటున్నారు. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 2 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారుఅరిజోనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11 రాష్ట్ర జనాభా 74 లక్షలు 2020లో విజేత బైడెన్ (10 వేల ఓట్ల మెజారిటీ) 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంలో ఈ రాష్ట్రానిదే కీలక పాత్ర. ఇక్కడ డెమొక్రాట్ అభ్యర్థి గెలవడం 1990ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం. మెక్సికోతో అరిజోనా వందలాది కిలోమీటర్ల మేరకు సరిహద్దులను పంచుకుంటుంది. దాంతో సహజంగానే వలసలు ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. తాను గెలిస్తే ఏకంగా 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానన్న ట్రంప్ ప్రకటన అరిజోనావాసులను బాగా ఆకట్టుకుంటోంది. వలసలపై హారిస్ విధానాల పట్ల వారు పెదవి విరుస్తున్నారు. అయితే అబార్షన్లపై ట్రంప్ స్పష్టమైన వైఖరంటూ ప్రకటించకపోవడంపై ఆయనకు కాస్త మైనస్గా మారే ఆస్కారముంది. మహిళా ఓటర్లలో హారిస్ పట్ల స్పష్టమైన మొగ్గు కనిపిస్తుండటం కూడా డెమొక్రాట్లకు సానుకూలాంశమే. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 3 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారువిస్కాన్సిన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10 రాష్ట్ర జనాభా 59 లక్షలు 2020లో విజేత బైడెన్ (21 వేల ఓట్ల మెజారిటీ) స్వతంత్ర అభ్యరి్థగా తొలుత బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్.కెనెడీకి విస్కాన్సిన్లో భారీ జనాదరణ దక్కింది. ఆగస్టు చివర్లో ఆయన బరి నుంచి తప్పుకుని ట్రంప్కు మద్దతు పలకడం రిపబ్లికన్లకు బాగా కలిసొచ్చేలా ఉంది. దీనికి తోడు గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ ఇక్కడ డెమొక్రాట్ల అవకాశాలకు మరింత గండి కొట్టేలా కని్పస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా బరిలోంచి తప్పించాలని డెమొక్రాట్లు చివరిదాకా ప్రయతి్నంచినా కుదర్లేదు. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారునెవడా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 6 రాష్ట్ర జనాభా 32 లక్షలు 2020లో విజేత బైడెన్ (34 వేల ఓట్ల మెజారిటీ) కొద్ది ఎన్నికలుగా వరుసగా డెమొక్రాట్లకే జై కొడుతూ వస్తున్న రాష్ట్రమిది. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఖాతాలో పడే సూచనలు గట్టిగానే కని్పస్తున్నాయి. పోల్ ట్రాకింగ్ సంస్థ 538 తాజా గణాంకాల ప్రకారం ట్రంప్కు ఈ రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగింది. హారిస్ రంగప్రవేశంతో పరిస్థితి కాస్త మారినా ఇప్పటికీ ఇక్కడ ట్రంప్దే పై చేయిగా కన్పిస్తోంది. అమెరికాలోకెల్లా నిరుద్యోగం అతి ఎక్కువగా (5.1 శాతం)ఉన్న రాష్ట్రం నెవడానే. ఇక్కడ లాటిన్ అమెరికన్లు చాలా ఎక్కువ. వారంతా చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నారు. వారిలో హోటళ్లలో వెయిటర్లు తదితర పనులు చేసేవాళ్లే ఎక్కువ. టిప్పులపై పన్ను ఎత్తేస్తామన్న ట్రంప్ హామీ వారిని బాగా ఆకట్టుకుంది. దాన్ని గమనించిన హారిస్ తాను కూడా ఈ మేరకు గత ఆగస్టులోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం వారిలో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారు – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్, హారిస్ ప్రచారంపై చైనా హ్యాకర్ల టార్గెట్!
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరుపార్టీల అధ్యక్ష అభ్యర్థులు, ఉపాధ్యక్ష అభ్యర్థల ప్రచారంపై చైనా హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ.. అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచారానికి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఉపయోగించే ఫోన్లను చైనా హ్యాకర్లు.. హ్యాక్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.అదేవిధంగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ , ఉపాధ్యక్ష అభ్యర్థి జెడి వాన్స్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ట్రంప్, వాన్స్ ప్రచారాన్ని చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రంప్ బృందం ధృవీకరించకపోవటం గమనార్హం. అయితే హ్యాక్ విషయంలో ట్రంప్ బృందం దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలవకుండా అడ్డుకోవడానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ చైనా, ఇరాన్లను ప్రోత్సహించారని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆరోపణలు చేశారు.ఈ వ్యవహారంపై వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. ‘హ్యాకింగ్కు సంబంధించి నిర్దిష్టమైన సమాచారం మాకు తెలియదు. చైనా అన్ని రకాలుగా సైబర్ దాడులు, సైబర్ దొంగతనాలను వ్యతిరేకిస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది’ అని పేర్కొంది. ‘‘అధ్యక్ష ఎన్నికలు అమెరికా దేశీయ వ్యవహారాలు. వాటిపై చైనాకు ఎటువంటి ఉద్దేశ్యం లేదు. అమెరికా ఎన్నికలలో చైనా జోక్యం చేసుకోదు’’ అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ఇక.. ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ ప్రచారంపై హ్యాక్ జరిగింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్లోని ముగ్గురు సభ్యులపై ఆమెరికా ఆరోపణలు చేసింది. వారు నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొంది.చదవండి: అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్ -
హారిస్పై ట్రంప్ దూకుడు..
-
అడ్వాంటేజ్ డొనాల్డ్ ట్రంప్.. హారిస్తో ఉత్కంఠ పోరు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పది రోజులే మిగిలి ఉంది. పోలింగ్ తేదీ నవంబర్ 5 దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార హోరు పెరిగింది. పోల్స్ ఫలితాలు కూడా తారుమారవుతున్నాయి. అధ్యక్ష బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకొన్న మొదట్లో వరుస పోల్స్ హారిస్ వైపే మొగ్గు చూపాయి. కానీ తీరా పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ పరిస్థితి క్రమంగా తారుమారు అవుతున్నట్టు కన్పిస్తోంది. కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలోకి వెళ్తున్నారు. అంతేగాక తాజా పోల్స్లో సానుకూలతను పెంచుకున్నారు. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ట్రంప్, హారిస్ పోరు తారాస్థాయికి చేరుతోంది. మొన్నటిదాకా సర్వేల్లో హారిస్ ఆధిక్యంలో ఉండగా తాజాగా ట్రంప్ కాస్త ముందంజలోకి వచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ తాజా సర్వేలో ట్రంప్ 47 శాతం మద్దతు దక్కించుకోగా హారిస్కు 45 శాతం ఓట్లు పోలయ్యాయి. సీఎన్బీసీ ఆల్ అమెరికన్ ఎకనమిక్ సర్వేలోనూ హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్న 7 కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనూ తాజా సర్వేల్లో హారిస్ కంటే ట్రంప్ ఒక్క పాయింట్ ఆధిక్యం సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటలైన మిషిగన్, విస్కాన్సిన్, పెన్సిల్వేనియాతో పాటు నల్లజాతీయులు, లాటినో ఓటర్లలో ఆయన పట్టు సాధిస్తున్నారు.ఇది డెమొక్రాట్లకు ఆందోళన కలిగిస్తోంది. అయితే ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రధాన పోల్స్ అన్నింటినీ విశ్లేషించే రియల్క్లియర్పాలిటిక్స్ ప్రకారం హారిస్ ఇప్పటికీ ట్రంప్పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. కాకపోతే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్కే 0.9 శాతం మొగ్గుందని అది తేల్చింది. అమెరికా బెట్టింగ్ మార్కెట్ అయితే ట్రంప్ విజయావకాశాలను ఏకంగా 61 శాతంగా అంచనా వేసింది. హారిస్ గెలిచేందుకు 39 శాతం మాత్రమే చాన్సుందని పేర్కొంది. ట్రంప్పై కొన్ని రోజులుగా హారిస్ తీవ్ర విమర్శలు చేస్తుండటం తెలిసిందే. హిట్లర్ను ప్రశంసించిన ట్రంప్ అంతకంటే నియంత అంటూ దుయ్యబట్టారు. ఆయనో అసమర్థుడని ఎద్దేవా చేశారు. ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే పర్యవసానాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ పాపులర్ ఓట్లను గెలుచుకోవచ్చని సర్వేలంటున్నాయి. కానీ కీలక రాష్ట్రాలను కైవసం చేసుకుంటేనే ఎన్నికల విజయం సాధ్యం. మరోవైపు చాలా రాష్ట్రాల్లో ఓటర్లకు హారిస్పై పలు అంశాల్లో ఇప్పటికీ అభ్యంతరాలున్నాయి. మరోవైపు ముందస్తు ఓటేసిన అమెరికన్ల సంఖ్య 3.1 కోట్లు దాటింది.పెన్సిల్వేనియాలో ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత ముఖ్యమైనది పెన్సిల్వేనియా. వాటిలో అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓటు్లున్న రాష్ట్రం. ఇక్కడి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రకటనలపైనే రెండు పార్టీలు కోట్లు వెచ్చించాయి. ఇక్కడి ఓటర్లు ఆర్థిక వ్యవస్థపై చాలా ఆందోళన చెందుతున్నారు. వారు క్రమంగా ట్రంప్ వైపే మొగ్గుతున్నారు. వివాదాస్పద, కుంభకోణాల వ్యక్తిగా ట్రంప్పై విముఖత ఉన్నా ఆయన హయాంలో ఆహారం, పెట్రోల్ ధరలు తక్కువగా ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడి మహిళలు మాత్రం హారిస్ పట్ల సానుకూలంగా ఉన్నారు. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన దారుణం. ఆయన్ను మరోసారి వైట్హౌస్కు పంపించేదే లేదు’’ అంటున్నారు. కాంగ్రెస్ మాజీ సభ్యురాలు, మాజీ ఉపాధ్యక్షుడు డిక్ షెనీ కూతురు లిజ్ షెనీ వంటివారి ప్రచారం కూడా హారిస్కు ఎంతో కొంత కలిసి రానుంది.‘అబార్షన్ హక్కులు’ ప్రభావం చూపేనా?హారిస్కు అమెరికావ్యాప్తంగా ఉన్న సానుకూలత మహిళా ఓటర్లలో బలమైన ఆధిక్యం. ఆమె అభ్యర్థిత్వమే చరిత్రాత్మకం. కానీ ఆమె దీనిపై ప్రచారం చేసుకోవడం లేదు. మహిళల అబార్షన్ హక్కులకు బలంగా మద్దతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టిన అత్యంత కఠినమైన అబార్షన్ నిషేధం మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీన్ని రాజ్యాంగంలో చేర్చాలా వద్దా అనే అంశాన్ని పది రాష్ట్రాలు ఓటింగ్కు పెట్టాయి. అలాంటి రాష్ట్రాల్లో అరిజోనాలో హారిస్కు మెజారిటీ వచ్చే అవకాశముంది. అయితే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పుడు సృష్టించిన వాతావరణాన్ని హారిస్ బలంగా కొనసాగించలేకపోయినట్టు పోల్స్ చెబుతున్నాయి.డెమొక్రాట్లకు ‘గాజా’ షాక్ట్రంప్కే అరబ్–అమెరికన్ల జయహోకీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్లో అరబ్–అమెరికన్ ఓటర్లు అత్యధికంగా ఉంటారు. 2020లో బైడెన్ కేవలం అక్కడ 1.5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు, ఇక్కడ అరబ్ అమెరికన్ల జనాభా 3 లక్షలు. గాజా, లెబనాన్లలో ఇజ్రాయెల్ దాడులను నియంత్రించడంలో బైడెన్ విఫలమయ్యారని వారంతా భావిస్తున్నారు. ఈ ప్రభావం నేరుగా డెమొక్రాట్ల అభ్యర్థి హారిస్పై పడేలా ఉంది. ఉపాధ్యక్షురాలిగా హారిస్ కూడా దీనికి బాధ్యురాలేనని వారు భావిస్తున్నారు. డెమొక్రాట్ల కంటే అధిక వామపక్ష భావాలున్న వారిలోనూ ఇదే ధోరణి కనబడుతోంది. ‘‘మేమంతా ట్రంప్కు ఓటేస్తాం. అంతేగాక ఆయనకే ఓటేయాలని ఇతరులకూ చెబుతాం’’ అని వారంటున్నారు. ‘‘మేం ట్రంప్కు ఓటేస్తామని ఏడాది కిందట ఊహించను కూడా లేదు. కానీ ఇప్పుడు డెమొక్రాట్లను క్షమించలేం. హారిస్కు ఓటేసేది లేదు’’ అని స్పష్టంగా చెబుతున్నారు. మిషిగన్లో కార్మికవర్గం, యూనియన్ల ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. తామెవరికీ మద్దతివ్వబోమని ఇప్పటికే కొన్ని యూనియన్లు ప్రకటించాయి. హారిస్పై కొన్ని అభ్యంతరాలున్నా ఆమె తప్ప ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తుండటం ఆమెకు కాస్త కలిసొచ్చే అంశం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
దూసుకొస్తున్న ట్రంప్.. తాజా సర్వేలో సంచలనం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు మరో పది రోజులే సమయముందనగా న్యూయార్క్ టైమ్స్, సియెనా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే శుక్రవారం(అక్టోబర్ 25) ఆసక్తికర విషయం వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి హారిస్ పట్ల ప్రజలు సమానంగా మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఇద్దరికీ సరిగ్గా చెరో 48 శాతం పాపులర్ ఓట్ రానుందని తేలినట్లు ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలో హారిస్కు 49 పాపులర్ ఓట్ అనుకూలంగా ఉండగా ట్రంప్కు 46 శాతం మంది మదతిచ్చారు. అయితే క్రమంగా ట్రంప్ పుంజుకొని హారిస్ రేసులో సమాన స్థాయికి రావడం గమనార్హం. ఏది ఏమైనా నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది తేలనుంది.ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం.. అందరికీ అర్థమయ్యే రీతిలో -
అమెరికా ఎన్నికల సర్వేలో సూపర్ ట్విస్ట్.. లీడ్లోకి ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఎన్నికలు గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయం కోసం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి.అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య ఆధిపత్యంపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది. వీరిద్దరి మధ్య స్వల్ప తేడాతో పోటీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. తాజా సర్వే ప్రకారం.. ట్రంప్నకు 47 శాతం, హారీస్కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్టు తెలిపింది. సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో, ట్రంప్ లీడ్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడం ఇద్దరు అభ్యర్థులు స్వరం పెంచారు. తాజాగా ట్రంప్పై కమల విరుచుకుపడ్డారు. ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదని.. ఆయనో నియంత అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సైన్యం ట్రంప్కు నచ్చదు. అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞను గతంలో ఉల్లంఘించారు. గత వారమే తన సహచర అమెరికన్లను అంతర్గత శత్రువులుగా పేర్కొన్నారు అంటూ మండిపడ్డారు. ఇక, తనపై ఆరోపణలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఒక వేళ కమలా హారీస్ గెలిస్తే.. అమెరికాలో చైనా ఆడుకుంటుంది. ఆమెకు చిన్న పిల్లను చేసి జిన్పింగ్ గేమ్ ఆడుకుంటారని సెటైర్లు వేశారు. -
హిట్లర్ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్కు బిగ్ బూస్ట్
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో నాయకులు స్పీడ్ పెంచారు. తాజగా రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్పై డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలాహారీస్ సంచలన విమర్శలు చేశారు. క్రమంగా ట్రంప్ మతి తప్పుతోందని ఆమె కామెంట్స్ చేశారు.డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆరు మిలియన్ల మంది యూదులు, వందల వేల మంది అమెరికన్ల మరణాలకు కారణమైన వ్యక్తి హిట్లర్. అటువంటి వ్యక్తిని ట్రంప్ పొడుగుతున్నారు. హిట్లర్ కొన్ని మంచి పనులు చేశారని ట్రంప్ అంటున్నారు. అమెరికాకు మిలటరీ బదులుగా హిట్లర్ వంటి జనరల్స్ ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు. హిట్లర్ వంటి వ్యక్తిని ప్రశంసించడం ఆందోళన కలిగిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ట్రంప్ ఎలాంటి వారో ఆయన వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయి. అమెరికా ప్రజలు ట్రంప్ వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి’ అని కోరారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో నవంబర్ ఐదో తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 29న కమలా హరీస్ ప్రచార ముగింపు సభ ఉండనుంది. 29న తన చివరి ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇక, ఇప్పటికే ట్రంప్ కూడా వినూత్నంగా ప్రచారంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.As a Jew, nothing is more offensive to me than hearing Kamala Harris compare her political opponent to Hitler simply because she disagrees with him. Hitler was responsible for the murder of six million Jews, whereas Trump has done everything to make Jews in America safer. The… pic.twitter.com/GyidDA4dYu— Awesome Jew (@JewsAreTheGOAT) October 23, 2024 -
ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు
భారత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్కు 36 గంటల ముందే ప్రచారానికి తెర పడుతుంది. కానీ అమెరికాలో అలా కాదు. కనీసం నాలుగు వారాల పాటు ప్రచారం, ఓటింగ్ సమాంతరంగా సాగుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 12 రోజులే ఉంది. నవంబర్ 5న దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. కానీ ఏకంగా 2.1 కోట్ల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతుండటం తెలిసిందే.1.33 కోట్ల పోస్టల్ ఓట్లుఫ్లోరిడా వర్సిటీ ఎలక్షన్ ల్యాబ్ డేటా ప్రకారం 78 లక్షల ఓట్లు వ్యక్తిగత పద్ధతుల ద్వారా పోలయ్యాయి. మిగతా 1.33 కోట్ల పై చిలుకు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలయ్యాయి. ఆసియన్ అమెరికన్లలో మాత్రం 1.7 శాతం మంది మాత్రమే ముందస్తు ఓటింగ్ను ఉపయోగించుకున్నట్టు ఎలక్షన్ ల్యాబ్ తెలిపింది. దాని గణాంకాల ప్రకారం వ్యక్తిగత ప్రారంభ ఓటర్లలో 41.3 శాతం మంది రిప బ్లికన్లు ఓటు వేయగా, డెమొక్రాట్లు 33.6 శాతం మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యా లెట్ల ద్వారా డెమొ క్రాట్లు 20.4 శాతం, రిపబ్లికన్లు 21.2 శాతం ఓటు హక్కును వినియో గించుకున్నారు.జార్జియా రాష్ట్రంలో నాలుగో వంతు ఓటర్లు ఇప్పటికే ఓటేశారు. 18.4 లక్షల మంది జార్జియన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం తెలిపింది. ఇలినాయీ, టెక్సాస్ రాష్ట్రాల్లోనూ ముందస్తు ఓటింగ్ ఎక్కువగా జరిగింది. ఓటింగ్ సెంటర్లలో ఎక్కడ చూసినా పార్కింగ్ ప్రదేశాలు కిక్కిరిసి కన్పించాయి.అత్యధికంగా ఓటేసింది రిపబ్లికన్లే7 అతి కీలక స్వింగ్ స్టేట్లయిన అరిజోనా, నెవెడా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేని యా, నార్త్ కరోలినా, జార్జియాల్లో ఫలితాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తాయని అమెరికా రాజకీయ పండితులు చెబుతుంటారు. ఈ కీలక యుద్ధభూమి రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్లో రిపబ్లికన్ ఓటర్లే పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని సీనియర్ పొలి టికల్ జర్నలిస్ట్ మార్క్ హాల్పెరిన్ అన్నారు. బహుశా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విజయానికి ఇది సూచిక కావచ్చని అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్లు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ముందస్తు ఓటింగ్లో పాల్గొంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ బాగా శ్రమించిందని అరిజోనాలో ముందస్తు బ్యాలెట్లను ట్రాక్ చేసే డెమొక్రాటిక్ రాజకీయ వ్యూహకర్త శామ్ అల్మీ అంగీకరించారు.ప్రత్యేక సౌలభ్యం.. ముందస్తు ఓటింగ్ అమెరికా ఓటర్లకున్న ప్రత్యేకమైన సౌలభ్యం. వారు మెయిల్– ఇన్– బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీన్ని మన దగ్గరి పోస్టల్ బ్యాలెట్తో పోల్చవచ్చు. కొన్ని చోట్ల పోలింగ్ రోజుకు వారాల ముందే పోలింగ్ కేంద్రాలను తెరుస్తారు. ముందుగానే ఓటేయాలనుకునే వారు నిర్ధారిత బూత్లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లాక్(జైలులో వేయాలి) చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అధ్యక్ష ఎన్నికలకు రెండు వారాల ముందు న్యూ హాంప్షైర్లోని కాంకార్డ్లో ఉన్న డెమోక్రటిక్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ జో బైడెన్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్న పలు నేరారోపణల ఎత్తి చూపుతూ బైడెన్ జైలులో వేయాలని విమర్శలు గుప్పించారు. ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచి పలు నేరారోపణలను ఎదుర్కొంటున్నారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. అమెరికా ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పు కలుగుతుందని బైడెన్ హెచ్చరించారు.NOW - Biden says America needs to imprison Trump 14 days before election day: "We gotta lock him up."@disclosetv pic.twitter.com/FB6Xb8Wv3T— THE VOICE 🌹 🗣🎙🇺🇸🦅🌎⚓💜♠️CHRIST CONSCIOUSNESS (@WETHEKINGDQMQ98) October 22, 2024‘‘అమెరికా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ రాజకీయ ఉద్రిక్తత 2016 ఎన్నికలను గుర్తు చేస్తుంది. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్.. హిల్లరీ క్లింటన్ను ఉద్దేశిస్తూ ‘లాక్ హర్ అప్’ అని ప్రచారం చేయాలని తన మద్దతుదారులను ప్రోత్సహించారు. దీనిని అప్పుడు ట్రంప్ తన ప్రచారానికి అస్త్రంగా ఉపయోగించుకున్నారు. కానీ, ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్అ టువంటి వ్యాఖ్యలు, నినాదాలకు చాలా దూరంగా ఉన్నారు. నేరారోపణలను కోర్టులు చూసుకుంటాయి. మనం నవంబర్లో ఫలితాలను చూద్దామని కమల వ్యాఖ్యానించారు. నేను హాజరయ్యే ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ఇతర దేశాధినేతలు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేడని చెప్పారు’’ అని అన్నారు. అయితే.. 2016 ఎన్నికల ప్రచారంలో తన మద్దతుదారులు ‘లాక్ హర్ అప్’ అంటూ హిల్లరీ క్లింటన్ను ఉద్దేశిస్తూ భారీగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ట్రంప్ తన మద్దతుదారులను నిలువరించలేదు. ప్రస్తుతం అదే ఫార్ములాను ట్రంప్నకు కమలా హారిస్ మద్దతుదారులు అన్వయిస్తూ నినాదాలు చేయటం గమనార్హం. -
ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్లో కూర్చుంటారు: కమల
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. విస్కాన్సిన్లోని పార్టీ మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా ప్రజలు గుర్తించటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నేను చాలా బహిరంగంగా చెప్పాను. ట్రంప్ మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైతే కలిగే పరిణామాలు చాలా క్రూరంగా ఉంటాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ పొగడ్తలకు సులభంగా తన ఆలోచనలను మార్చుకుంటారు. కోవిడ్ సమయంలో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం (రష్యన్ అధ్యక్షుడు) వ్లాదిమిర్ పుతిన్కు రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు పంపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక రోజులో పరిష్కరిస్తానని చెప్పారు. లొంగిపోవడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అటువంటి సమస్యను పరిష్కరించాలని అమెరికన్లుగా మనం భావిస్తున్నామని నేను అనుకోను. డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కూర్చుంటారు. ట్రంప్ తనను అభిమానించే వ్యక్తులను సంతోషపెట్టాలని అనుకుంటారు’’ అని అన్నారు. ఇక.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ట్రంప్ గంతంలో కూడా చేసిన విషయం తెలిసిందే. -
కమల ఇంటర్వ్యూ ఎడిట్ చేశారు: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షు డొనాల్డ్ ట్రంప్ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్తో అక్టోబర్ 7న జరిగిన ఇంటర్వ్యూను మోసపూరితంగా ఎడిటింగ్ చేశారని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ఒకే ప్రశ్నకు రెండు వేర్వేరు సమాధానాలు ప్రసారం చేశారంటూ సీబీఎస్ నెట్వర్క్పై వ్యాఖ్యలు చేశారు.When will CBS release their Transcript of the fraudulent Interview with Comrade Kamala Harris? They changed her answer in order to make Kamala look intelligent, rather than “dumb as a rock.” This may be the Biggest Scandal in Broadcast History! CBS MUST GET THE TRANSCRIPT OUT NOW…— Donald J. Trump (@realDonaldTrump) October 21, 2024అయితే.. ట్రంప్ ఆరోపణలను ఇప్పటికే సీబీఎస్ నెట్వర్క్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొంది. ‘ఫేస్ ది నేషన్’ న్యూస్ ప్రోగ్రాం కంటే ‘60 మినిట్స్’ ప్రోగ్రాంలో ప్రసారమైన కమలా హారిస్ ఇంటర్వ్యూ అధిక భాగం ఉందని స్పష్టం చేసింది. ప్రసారమైన రెండు ప్రోగ్రాముల్లో ఒకే ప్రశ్నకు స్పందించినా.. కమల సమాధానంలోని వివిధ భాగాలను హైలైట్ చేశాయని తెలిపింది.‘‘మేము ఏదైనా ఇంటర్వ్యూని ఎడిట్ చేసినప్పుడు. ఒక రాజకీయవేత్త, అథ్లెట్ లేదా సినిమా స్టార్ అయినా మేము స్పష్టంగా ఖచ్చితంగా ఉండటానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపింది. అయినా విమర్శలు ఆగటం లేదు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలు విడుదల చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ పూర్తి ఇంటర్వ్యూపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరోపైపు.. సీబీఎస్ నెట్వర్క్పై దావా వేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. -
కమలకు స్టీవీ ‘హ్యాపీ బర్త్డే’
జార్జియా: స్వింగ్ స్టేట్స్లో ఒకటైన జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఆదివారం పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. న్యూ బర్త్ మిషనరీ బాప్టిస్ట్ చర్చితోపాటు, జోన్స్ బోరోలోని డివైన్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లను సందర్శించారు ద్వేషం, విభజన రాజకీయాలు చేసేవారిని కాకుండా కరుణ, ప్రేమతో దేశాన్ని నడిపే నేతను ఎన్నుకోవాలని ప్రజలను హారిస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమాల్లోనే హారిస్ తన 60వ జన్మదినం జరుపుకున్నారు. లెజెండరీ సింగర్ స్టీవీ వండర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. బాబ్ మార్లే ‘రిడంప్షన్ సాంగ్’లోని పంక్తులతో పాటు నల్లజాతి ఉద్యమ దిగ్గజం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జయంతి సందర్భంగా తాను రాసిన ‘హ్యాపీ బర్త్ డే’ పాటను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హారిస్ చప్పట్లు తన ‘హ్యాపీ బర్త్ డే’పాటను ఆస్వాదించారు. అనంతరం ఈ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వండర్ గతంలోనూ హారిస్ కోసం ప్రదర్శనలిచ్చారు. గత ఆగస్టులో డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లోనూ ఆయన ఆనూహ్యంగా మెరిశారు. హారిస్కు మద్దతుగా 1973 నాటి తన సూపర్ హిట్ సాంగ్ ‘హయ్యర్ గ్రౌండ్’ను ఆలపించి అలరించారు.శుభాకాంక్షల వెల్లువ ప్రచారంలో బిజీగా ఉన్న హారిస్ పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పెన్సిల్వేనియాలో ప్రచారంలో ఉన్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను అసాధారణ నాయకురాలిగా అభివరి్ణంచారు. ఉపాధ్యక్ష అభ్యర్థి, మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ కూడా హారిస్కు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అయితే హారిస్ను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల హక్కుల కోసం జీవితమంతా పోరాడుతున్న ఆమెను అధ్యక్షురాలిగా ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా హారిస్కు శుభాకాంక్షలు తెలిపారు. -
Video: మెక్డొనాల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన ట్రంప్.. మస్క్ రియాక్షన్
మరో రెండు వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్. రిపబ్లికర్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ సాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రత్యర్థుల బలహీనతలను ఎత్తిచూపుతూ, చిత్రవిచిత్ర ప్రచారాలతో ముందుకు సాగుతున్నారుతాజాగా రిపబ్లికెన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని ఓ మెక్డొనాల్డ్స్ ఓట్లెట్లో కొంతసేపు పనిచేశారు. తెలుపు రంగు షర్ట్ మీద బ్లాక్ అండ్ ఎల్లో డ్రెస్కోడ్ ధరించి ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేశారు. ఇక వీటిని ట్రంప్ తన మద్దతుదారులలో కొందరికి అందించారు.Fries: BAGGED ✅ pic.twitter.com/oj3T5KSazz— Trump War Room (@TrumpWarRoom) October 20, 2024ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ఈ పని తనకెంతో నచ్చిందని, ఇక్కడ పనిచేయడం సరాదాగా ఉందని తెలిపారు. తానెప్పటి నుంచో మెక్డొనాల్డ్స్లో పనిచేయాలనుకుంటున్ననని పేర్కొన్నారు. అయితే తాను యుక్త వయసులో ఉన్న సమయంలో మెక్డీలో పనిచేశానని ప్రచారాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు ట్రంప్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. ఆమె కంటే 15నిమిషాలు ఎక్కువ పనిచేశానని ప్రత్యర్థి కమలా హారిస్పై విమర్శలు గుప్పించారుpic.twitter.com/MWEUVcY6YG— Donald J. Trump (@realDonaldTrump) October 20, 2024ఇక ట్రంప్ డొనాల్డ్స్లో పనిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా అక్టోబర్ 20న కమలా హారిస్ 60వ పుట్టినరోజు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ..ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కమలకు కొన్ని పువ్వులు ఇస్తాననని అదే విధంగా తాను తయారు చేసిన ఫ్రైస్ కూడా ఇస్తానని చమత్కరించారు.ట్రంప్ వీడియో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. అద్భుతమైన వీడియో అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ ట్రంప్కు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఓటింగ్ను ట్రంప్కు అనుకూలంగా మార్చేందుకు అమెరికన్లకు తాయిలాలు ప్రకన్నారు. ఈ క్రమంలో పెన్సిల్వేనియాలో శనివారం నుంచి రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీసి ఎంపికైన ఓటరుకు దాదాపు రూ.8.4 కోట్లు అందజేస్తామని చెప్పారు. నవంబర్ 5 ఈ లాటరీ కొనసాగుతుందన్నారు. This is awesome 😎 pic.twitter.com/RMkE20qWo2— Elon Musk (@elonmusk) October 20, 2024 -
USA Presidential Elections 2024: నువ్వా నేనా!?
అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. కమలా హారిస్ రూపంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళ పీఠమెక్కుతారా, లేక పాత కాపు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయఢంకా మోగిస్తారా అన్నది ఆసక్తకరంగా మారింది. రెండు వారాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వారి విజయావకాశాలపై అమెరికా అంతటా జోరుగా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి సర్వేలు ఏం చెబుతున్నాయనే అంశాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఓటర్లు తలమునకలుగా ఉన్నారు. జాతీయ పోలింగ్ సగటులో హారిస్ ముందంజ జాతీయ పోలింగ్ సగటులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హారిసే ముందంజలో ఉన్నారు. ఏబీసీ న్యూస్, వెబ్సైట్ 538 గణాంకాల ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు దేశవ్యాప్తంగా 46 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నారు. హారిస్కు కాస్త ఎక్కువగా 48 శాతం మంది మద్దతుండటం విశేషం. అధ్యక్షుడు జో బైడెన్ను కాదని హారిస్ను డెమొక్రటిక్ పార్టీ బరిలో దింపడం తెలిసిందే. అనంతరం ఆమెకు ఫాలోయింగ్ అనూహ్యంగా పెరిగింది. సెపె్టంబర్ నుంచి హారిస్ ఆధిక్యత స్థిరంగా కొనసాగుతోంది. 7 కోట్ల మంది వీక్షించిన సెపె్టంబర్ పది నాటి హారిస్–ట్రంప్ బిగ్ డిబేట్ తర్వాత కూడా ఇందులో మార్పేమీ లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి కాకుండా ఎక్కువ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లను సాధించిన వారే విజేతగా నిలుస్తారు. ప్రతి రాష్ట్రానికీ జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు కేటాయిస్తారు. ఇలా మొత్తంగా అమెరికాలో 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. గెలుపు కోసం కనీసం 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెల్చుకోవాల్సి ఉంటుంది. స్వింగ్ రాష్ట్రాల్లోనూ హారిసే అమెరికా ఓటర్లు చాలావరకు తాము ఏ పార్టీని అభిమానిస్తామో, ఏ పారీ్టకి మద్దతు పలుకుతామో బహిరంగంగానే చెబుతారు. అంతమాత్రాన వారు పారీ్టకి ఓటేస్తారన్న గ్యారెంటీ లేదు. ఏ పారీ్టకీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లుంటారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. వీళ్ల మద్దతు దక్కిన అభ్యర్థే గెలవడం పరిపాటి. ఈసారి అందరి కళ్లూ ఏడు స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి! స్వింగ్ స్టేట్స్లో అత్యధికంగా 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాతో పాటు , 10 ఓట్లున్న విస్కాన్సిన్లో ట్రంప్, హారిస్ సమవుజ్జీలుగా నిలవడం విశేషం! 15 ఓట్లున్న మిషిగన్, ఆరు ఓట్లున్న నెవడాల్లో హారిస్కు స్వల్ప మొగ్గుంది. 16 ఓట్ల చొప్పున ఉన్న నార్త్ కరోలినా, జార్జియాల్లో, 11 ఓట్లున్న అరిజోనాలో ట్రంప్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాలన్నింటిలో కలిపి చూస్తే హారిసే సగటున 5 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు గణాంకాలు చాటుతున్నాయి. సగటు ఎలా లెక్కిస్తారు? రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో వేర్వేరు సంస్థలు చేసిన పోల్ సర్వేలను మదించి అభ్యర్థుల ఆదరణ తాలూకు సగటును లెక్కిస్తారు. అమెరికాలో ఏబీసీ న్యూస్లో భాగమైన పోలింగ్ విశ్లేషణ సంస్థ వెబ్సైట్ 538 దీన్ని లెక్కిస్తోంది. సర్వేలోఎంతమంది పాల్గొన్నారు, ఏ రోజున పోల్ చేపట్టారు, ఫోన్, టెక్సŠస్ట్ మెసేజ్, ఆన్లైన్... వీటిలో ఓటర్ల నుంచి ఎలా సమాచారం రాబట్టారు వంటి అంశాలను పారదర్శకంగా, నిజాయతీగా బేరీజు వేసి డేటాను సేకరిస్తారు. ఆ మీదట సగటును లెక్కిస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మొదటి అధ్యక్షురాలి అవకాశం మీకే!
న్యూయార్క్: అమెరికా సెనేట్ మెజారిటీ నేత చుక్ షుమర్తోపాటు డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జోకులు పేల్చారు. గురువారం న్యూయార్క్లో జరిగిన అల్ స్మిత్ మెమోరియల్ డిన్నర్కు హాజరైన ట్రంప్..కమలా హ్యారిస్ నెగ్గకుంటే మొదటి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యే అవకాశం మీకే వస్తుందంటూ షుమర్ను ఆటపట్టించారు. పలువురు ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు వచ్చి సరదాగా పట్టించుకుంటారు. ఇలా అందే విరాళాలు కేథలిక్ చారిటీలకు వెళ్తుంటాయి. అయితే, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమలా హారిస్ రాలేదు. బదులుగా చుక్ షుమర్ వచ్చారు. వేదికపై ట్రంప్కు సమీపంలోనే ఆయన కూడా ఉన్నారు. ‘షుమర్ చాలా డల్గా కనిపిస్తున్నారు. మరో కోణం కూడా చూడాలి. వాళ్ల పార్టీ చాలా చురుగ్గా తయారైంది. కమల అవకాశం కోల్పోతే, మొదటి అధ్యక్షురాలయ్యే అవకాశం మీకే వచ్చే అవకాశముంది’అని షుమర్నుద్దేశించి ట్రంప్ బిగ్గరగా అనడంతో హాలంతా నవ్వులతో నిండిపోయింది.ఈసారి కమలా హారిస్ లక్ష్యంగా ట్రంప్.. ‘నా ప్రత్యర్థి ఈ కార్యక్రమానికి రావల్సిన అవసరం లేదని భావించినట్లున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆమె తీవ్రంగా అవమానించారు. గతంలో 1984లో వాల్టర్ మొండెల్ మాత్రమే ఇలా చేశారు. అప్పట్లో ఆయన రొనాల్డ్ రీగన్ చేతిలో ఓడిపోయారు’అంటూ వ్యాఖ్యానించారు.దీనిపై అనంతరం కమల తనదైన శైలిలో స్పందించారు. ‘సహాయకుడు రాసిచ్చిన జోకుల్ని చదివేందుకే అవస్థలు పడ్డ ట్రంప్.. టెలీ ప్రాంప్టర్ను లోపలికి అనుమతించలేదంటూ ప్రశ్నించారు. తను అనుకుంటున్న జోకులకు ప్రేక్షకులు నవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ జోకులు ఎవరికైనా అర్థమవుతాయా? ట్రంప్ మాట్లాడింది ఒక్క ముక్క కూడా అర్థం కాదు’అంటూ చురకలు అంటించారు. అనంతరం సోషల్ మీడియాలో ట్రంప్ జోకులపై మిశ్రమ స్పందన వచ్చింది. -
అమెరికాలో భారతీయం
అమెరికా మొత్తం ఓటర్లు 16.1 కోట్ల పై చిలుకు. అందులో భారతీయ అమెరికన్ల సంఖ్య మహా అయితే 21 లక్షలు. కానీ ఆ దేశ రాజకీయాల్లో మనవాళ్లు నానాటికీ ప్రబల శక్తిగా ఎదుగుతున్నారు. ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ఇప్పుడు వారి రాజకీయ శక్తిని ఏ మాత్రమూ విస్మరించే పరిస్థితి లేదు. అందులోనూ భారత మూలాలున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈసారి ఏకంగా డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. దాంతో భారతీయ అమెరికన్ల ఉత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోతోంది. భారతీయ అమెరికన్లలో అత్యధికులు విద్యాధికులే. కేవలం ఓటర్లుగానే గాక అభ్యర్థులుగా, ఓటర్లను సమీకరించే శక్తిగా, నిధుల సేకర్తలుగా కొన్నేళ్లుగా వారి హవా బహుముఖంగా విస్తరిస్తోంది. దాంతో సహజంగానే అధికార సాధనలో వారి మద్దతు నానాటికీ కీలకంగా మారుతోంది.స్వింగ్ స్టేట్లలోనూ హవాఅధ్యక్ష ఎన్నికల్లో విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారే మిషిగన్, జార్జియా వంటి స్వింగ్ స్టేట్లలో భారతీయుల జనాభా చాలా ఎక్కువ. దాంతో వారి ఓట్లు, మద్దతు రెండు పార్టీలకూ మరింత కీలకంగా మారాయి. 2020లో బైడెన్ విజయంలో జార్జియా ఫలితమే నిర్ణాయకంగా మారడం తెలిసిందే. అక్కడ భారతీయ ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. గత రెండు మూడు అధ్యక్ష ఎన్నికలు అత్యంత హోరాహోరీగా జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హారిస్, ట్రంప్ భాగ్యరేఖలు స్వింగ్ స్టేట్లలోని ఇండియన్ ఓటర్ల మనోగతంపై గట్టిగానే ఆధారపడ్డాయంటే అతిశయోక్తి కాదంటారు డాక్టర్ మిశ్రా.→ స్వింగ్ స్టేట్లుగా పేరుబడ్డ 10 రాష్ట్రాల్లో ఉన్న దక్షిణాసియా ఓటర్లలో ఇండియన్లే మెజారిటీ.→ స్వింగ్ స్టేట్లలో పెన్సిల్వేనియాను అత్యంత కీలకమైనదిగా చెప్తారు. అలాంటి రాష్ట్రంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తేల్చడంలో బక్స్ కౌంటీది నిర్ణయాక పాత్ర. అక్కడ ఆధిపత్యం పూర్తిగా ఇండియన్లదే!→ దక్షిణాసియాకు చెందిన 48 లక్షల మంది పై చిలుకు యువ ఓటర్లను ప్రభావితం చేయడంలో భారతీయులు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు మిశ్రా వివరించారు.→ గత రెండు అధ్యక్ష ఎన్నికల్లోనూ భారతీయ అమెరికన్లు భారీ సంఖ్యలో ఓటేశారు. 2020లో 71 శాతం మంది ఓటేశారు. తాజా ఆసియన్ అమెరికన్ ఓటర్ సర్వేలో ఏకంగా 91 శాతానికి పైగా ఈసారి ఓటేస్తామని చెప్పారు!పార్టీలకు నిధుల వెల్లువభారతీయ అమెరికన్ల సగటు వార్షిక ఆదాయం 1.45 లక్షల డాలర్లు. అమెరికన్లతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలకు వారినుంచి నిధులు పోటెత్తుతున్నట్టు డెమొక్రటిక్ పార్టీ నేషనల్ ఫైనాన్స్ కమిటీ (డీఎన్ఎఫ్సీ) సభ్యుడు అజయ్ భుటోరియా చెబుతున్నారు. ‘‘నేను 20 ఏళ్లకు పైగా నిధుల సేకర్తగా వ్యవహరిస్తున్నా. మనవాళ్లు ఈ స్థాయిలో రాజకీయ విరాళా లివ్వడం గతంలో ఎన్నడూ లేదు’’ అంటూ విస్మయం వెలిబుచ్చారు. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. డీఎన్ఎఫ్సీలో 5 శాతానికి పైగా భారతీయులే ఉండటం విశేషం. భూరి విరాళాలిస్తున్న వారితో పాటు పార్టీలకు, వాటి ఎన్నికల ప్రచార కార్యకలాపాలకు చిన్న మొత్తాలు అందజేస్తున్న అమెరికన్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని ఆసియన్ అమెరికన్ డయాస్పొరాలో అతి పెద్దదైన రాజకీయ కార్యాచరణ కమిటీ ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. 2012 నుంచీ ఇండియన్ అమెరికన్లలో ఈ ధోరణి బాగా పెరుగుతోందని డ్రూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగయ్ మిశ్రా వెల్లడించారు. అమెరికా అధ్యక్ష పీఠానికి దారి సిలికాన్ వ్యాలీ గుండా వెళ్తుందన్నది నానుడి. కీలకమైన ఆ టెక్ రాజధానిలో భారతీయులదే హవా. హారిస్కు కాలిఫోర్నియాలో ఇటీవల ఒక్క వారంలోనే ఏకంగా 5.5 కోట్ల డాలర్ల విరాళాలు పోగయ్యాయి! వాటిలో మనవారి నుంచి వసూలైనవే ఎక్కువ. డెమొక్రాట్ పార్టీకి భారీ విరాళాలిచ్చిన జాబితాలో 60 మందికి పైగా ఇండియన్ అమెరికన్లు న్నారు. వీరిలో పారిశ్రామిక దిగ్గజం ఇంద్రా నూయీ మొదలుకుని ఏఐ ఇన్వెస్టర్ వినోద్ ఖోస్లా దాకా పలువురి పేర్లున్నాయి.రిపబ్లికన్లకూ...రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. సంపత్ శివాంగి, హోటల్ పరిశ్రమ దిగ్గజం డానీ గైక్వాడ్ వంటి పలువురు ఎన్నారైలు ట్రంప్ ప్రచార కార్యకలాపాలకు భారీ విరాళాలిస్తున్నారు. అయితే 2020 నుంచీ ఇండియన్ అమెరికన్లు, ముఖ్యంగా హిందువులు రిపబ్లికన్ పార్టీకి క్రమంగా దూరమవుతున్న వైనం స్పష్టంగా కన్పిస్తోంది.అధికార పదవుల్లోనూ...అమెరికాలో అన్ని స్థాయిల్లోనూ అధికార పదవుల్లో కూడా భారతీయుల హవా సాగుతోంది. సెనేట్, ప్రతినిధుల సభతో పాటు రాష్ట్రాల సెనేట్లు, అసెంబ్లీలు మొదలుకుని సిటీ కౌన్సిళ్లు, స్కూలు బోర్డుల దాకా, జిల్లా అటార్నీలుగా నియమితులవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.→ యూఎస్ కాంగ్రెస్లో ఐదుగురు భారతీయ అమెరికన్లున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది ఏడుకు పెరుగుతుందని భావిస్తున్నారు.→ అమెరికా యువజనుల్లో భారతీయులు కేవలం 0.6 శాతమే. కానీ 4.4 శాతం మంది ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.→ బైడెన్–హారిస్ పాలన యంత్రాంగంలో 150 మందికి పైగా భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారు.→ హారిస్ అధ్యక్షురాలిగా నెగ్గితే ఈ సంఖ్య 200 దాటుతుందని అంచనా.→ అమెరికా జనాభాలో యూదులు 2 శాతమే అయినా కాంగ్రెస్లో వారి సంఖ్య 10 శాతం. కొన్నేళ్లలో భారతీయులు అమెరికా సమాజంపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారన్నది ఒక అంచనా.సగానికి పైగా డెమొక్రాట్లే!→ తాజా సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లలో ఏకంగా 55 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులమని ప్రకటించుకున్నారు.→ 25 శాతం మంది రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నారు.→ స్వతంత్రులు, తటస్థులు 15 శాతం మందిగా లెక్క తేలారు. మిగతావాళ్లు తమ రాజకీయ మొగ్గుదలపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
#USELections2024 : కమలా హారీస్ అరుదైన ఫొటోలు
-
ఫాక్స్న్యూస్ ఇంటర్వ్యూలో హారిస్.. సారీలు.. హామీలు
వాషింగ్టన్: మూడు వారాల్లోపు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార జోరు పెంచారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్కు బహిరంగంగా మద్దతు పలుకుతూ ఆయనను తరచూ ఇంటర్వ్యూచేసే ‘ఫాక్స్ న్యూస్’వార్తాసంస్థకు బుధవారం హారిస్ ఇంటర్వ్యూ ఇచ్చారు. లక్షలాది మంది రిపబ్లికన్ మహిళా ఓటర్ల మనసునూ గెల్చుకునే ప్రయత్నంచేశారు. యాంకర్ బ్రెట్ బేయర్ అడుగడుగునా అడ్డుతగిలి ప్రశ్నలబాణాలు సంధిస్తుంటే హారిస్ వాటికి దీటుగా ఎదుర్కొని ఇంటర్వ్యూను రక్తికట్టించారు. హోరాహోరీగా సాగిన ఈ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు కొన్ని.. వలస బిల్లుపై తొలి సంతకం అమెరికాలోకి అక్రమంగా వలసవచి్చన వ్యక్తి చేతిలో హత్యకు గురైన 12 ఏళ్ల జాస్లిన్ నంగరే తల్లి పడే ఆవేదన వీడియోను యాంకర్ తొలుత హారిస్కు చూపించారు. అక్రమ వలసదారుల చేతుల్లో చనిపోతున్న అమెరికన్ల కుటుంబాలను క్షమాపణ కోరాలని మీకెప్పుడూ అనిపించలేదా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘చిన్నారిని కోల్పోయాం. ఈ విషయంలో నన్ను క్షమించండి’అని హారిస్ సారీ బేషరతుగా సారీ చెప్పారు. అక్రమ వలసలకు మద్దతు పలుకుతూ, వారిపై క్రిమినల్ కేసులను ఎత్తేయాలంటూ హారిస్ గతంలో చేసిన వ్యాఖ్యలను యాంకర్ వినిపించారు. ఈ అంశంలో మాట మార్చారని దెబ్బిపొడిచారు. దీంతో హారిస్ ‘సరిహద్దు దాటి అక్రమ చొరబాట్లపై నేరాలను మోపాల్సిందే. నాటి అభిప్రాయాలు ఉపాధ్యక్షురాలిగా చేసినవి కాదు. ఇకమీదట అధ్యక్షురాలినైతే అలా చేయను. అస్తవ్యస్తంగా ఉన్న వలస విధానాన్ని సంస్కరిస్తా. నేను దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసల కట్టడిపైనే చట్టం తెస్తా. ఆ బిల్లుపైనే తొలి సంతకం చేస్తా’అని హారిస్ అన్నారు. ఖైదీల లింగమార్పిడి సర్జరీలపై.. ఖైదీల లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ప్రజాధనాన్ని ఖర్చుచేస్తారా ? అని యాంకర్ ప్రశ్నించగా చట్టప్రకారమే వెళ్తామని హారిస్ సమాధానమిచ్చారు. ట్రంప్ హయాంలో కూడా ఇలాంటి సర్జరీలు జరిగాయని హారిస్ అన్నారు. అయితే ట్రంప్ హయాంలో కొందరు ఖైదీలకు హార్మోన్ థెరపీ చేశారుగానీ ఇలాంటి ఆపరేషన్లు జరగకపోవడం గమనార్హం. బైడెన్ హయాంలోనే ఇలాంటి ఆపరేషన్లు జరగడం విశేషం. వారసత్వ పాలన కాబోదు బైడెన్తో పోలిస్తే ఉపాధ్యక్షురాలిగా మీరేమైనా చేశారా? అని గతంలో ‘ది వ్యూ’టాక్షోలో అడిగిన ప్రశ్నకు ‘నాకేం గుర్తురావట్లేవు’అని హారిస్ చెప్పిన సమాధానాన్ని యాంకర్ ప్లే చేసి హారిస్ను ఇరకాటంతో పెట్టారు. అధికారంలో ఉన్న సొంత పార్టీ నేత బైడెన్ అనుసరిస్తున్న విధానాలను అధ్యక్షురాలిగా కొనసాగిస్తారా? అని ప్రశ్నించగా ‘నా పరిపాలన అనేది బైడెన్ పాలనకు కొనసాగింపుగా ఉండబోదు. నా జీవితపాఠాల సారాన్ని, ప్రాసిక్యూటర్గా, జిల్లా అటారీ్నగా, కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా వృత్తి అనుభవాన్ని, ఉపాధ్యక్షురాలిగా పరిపాలనా దక్షతను జోడించి ప్రజారంజకంగా పరిపాలిస్తా ’అని హారిస్ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన ట్రంప్కు ఇంకా మద్దతు ఇస్తున్న వాళ్లను తెలివితక్కువ వాళ్లుగా, విషయపరిజ్ఞానం లేని వాళ్లుగా పరిగణిస్తారా? అని ప్రశ్నించగా ‘అమెరికా ప్రజలను అంతమాట నేను ఎప్పుడూ అనలేదు’అని హారిస్ స్పష్టంచేశారు. బైడెన్ మానసిక స్థితిపై.. ‘‘మా పార్టీ నేత జో బైడెన్ నిర్ణయాలు ఏనాడూ తప్పుకాలేదు. అమెరికా ప్రజల కోసం అధ్యక్షుడిగా ఆయన ఎన్నో కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయనతో పోలిస్తే ట్రంప్ అసమర్థుడు. అధ్యక్ష పీఠంపై కూర్చునే అర్హత ఆయనకు లేదు. ట్రంప్ అమెరికా ప్రజాస్వామ్యానికి ప్రమాదకారి. అయినా బైడెన్ గురించి ఇక్కడ ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఇప్పుడు బైడెన్ రేసులో లేరు. ట్రంప్ గురించే మాట్లాడదాం’’అని హారిస్ అన్నారు. మహిళల అబార్షన్ వంటి కీలక అంశం ఇంటర్వ్యూలో అస్సలు చర్చకురాలేదు. ప్రధానంగా సరిహద్దు భద్రత, వలసలపైనే ఎక్కువ సేపు ఇంటర్వ్యూ సాగింది. -
నా పాలన బైడెన్కు కొనసాగింపుగా ఉండదు: కమల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే తన అధ్యక్ష పాలన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలను కొనసాగిపు ఉండదని ఉపాధ్యక్షురాలు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిని కమలా హారిస్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘నేను నా జీవిత అనుభవాలు, వృత్తిపరమైన అనుభవాలు,ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కొత్త ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటాను. నేను అమెరికాలోని కొత్త తరానికి చెందిన నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలను కించపరచేందుకు, ప్రజల గౌరవాన్ని తగ్గించేందుకు ఇష్టపడే వ్యక్తి’’ అని అన్నారు.Kamala Harris on what she would do differently from Biden’s presidency: “Let me be very clear: My presidency will not be a continuation of Joe Biden's presidency.” pic.twitter.com/zGzgvB9M20— Elizabeth Weibel (@elfaddis) October 16, 2024 ఇక.. ఇప్పటికే కమలా హరీస్ అధ్యక్షురాల గెలిస్తే తన సొంతమార్గం ఎంచుకుంటారని అధ్యక్షడు జో బైడెన్ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోపం ప్రదరిస్తూ అమెరికా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు బాధ్యత వహించకుండా మరోసారి తప్పుకున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.చదవండి: ఐవీఎఫ్ తండ్రిని నేను: డొనాల్డ్ ట్రంప్ -
‘కమల మార్క్ పాలన వేరు’.. బైడెన్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ గెలిస్తే.. సొంత మార్గాన్ని ఎంచుకుంటారని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే ప్రత్యేకంగా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఏమీ చేయలేదన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు.‘‘అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే.. ఆమె సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రతి ప్రెసిడెంట్ కూడా సొంత మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటారు. నేనే కూడా అదే చేశాను. నేను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విధేయుడిగా ఉన్నా. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన అడుగుజాడల్లో నడిచాను. కానీ నేను అధ్యక్షుడిగా నా స్వంత మార్గాన్ని ఎప్పుడూ తప్పలేదు. .. నాలాగే కమల కూడా చేస్తారు. ఆమె ఇంతవరకు నాకు విధేయంగా ఉన్నారు. అయితే.. ఆమె అధ్యక్షురాలి గెలిస్తే తన సొంత మార్గాన్ని ఎంచుకుంటారు. అమెరికా ప్రజల సమస్యలపై కమల అలోచన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం పాతది, విఫలమైంది. ఆయన ఆలోచనల్లో ఎటువంటి నిజాయితీ ఉండదు’’ అని అన్నారు. ఇక.. 2009 నుంచి 2017 వరకు ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు -
రసవత్తర పోరు.. ‘అంకెల్లో’ అమెరికా అధ్యక్ష ఎన్నికలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు ఎంతో రసవత్తరంగా సాగుతోంది. నవంబర్లో జరగబోయే ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది, అగ్ర రాజ్యంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వివరాలు అంకెల్లో చూసుకుంటే..అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీఅమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు పోటీ పడ్డారు. చివరికి ఎన్నికల బరిలో ఇద్దరు నిలిచారు. వారు డెమోక్రాట్ కమలా హారిస్, రిపబ్లికన్ డోనాల్డ్ ట్రంప్.నవంబర్ ఐదున ఎన్నికలు2024, నవంబర్ 5 ఎన్నికల రోజు. నవంబర్ నెలలో మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం నాడు అమెరికాలో సాంప్రదాయకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటారు.ఏడు స్వింగ్ స్టేట్స్స్వింగ్ స్టేట్స్ సంఖ్య ఏడు. ఈ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు జరగనుంది. ఈ జాబితాలో అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. అత్యంత రసవత్తరంగా సాగే అధ్యక్ష ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు అత్యంత కీలకం. ఈ జాబితాలోని ఏ రాష్ట్రంలోనైనా కొద్ది ఓట్లు తేడాతో అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలుంటాయి.ప్రతినిధుల సభలో 435 స్థానాలు ఖాళీ34 సెనేట్ స్థానాలు కలిగిన ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఓటర్లు అధ్యక్షుడిని ఎన్నిక చేయడమే కాకుండా, కాంగ్రెస్ సభ్యులను కూడా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. సభలోని సభ్యుల పదవీకాలం రెండేళ్లు. ప్రస్తుతం రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. కమలా హారిస్కు చెందిన డెమోక్రాట్లు విజయంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సెనేట్లో ఆరేళ్ల పదవీ కాలానికి 100 సీట్లకు గాను 34 సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వల్పంగా ఉన్న డెమొక్రటిక్ మెజారిటీని తిప్పికొట్టాలని రిపబ్లికన్లు భావిస్తున్నారు.ఓటర్ల గణాంకాలుఅమెరికాలోని ప్రతి రాష్ట్రంలో వేర్వేరుగా ఓటర్ల సంఖ్య ఉంది. సభకు ఎంపికయ్యే వారి సంఖ్య జనాభా ప్రాతిపదికన మారుతుంది. ఉదాహరణకు, గ్రామీణప్రాంతమైన వెర్మాంట్లో కేవలం మూడు ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కాగా కాలిఫోర్నియాలో 54 ఓట్లు ఉన్నాయి. 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో మొత్తం 538 మంది ఓటర్లు ఉన్నారు.పోల్ వర్కర్ల సంఖ్యప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం 2020లో అమెరికా ఎన్నికలు సజావుగా జరిగేలా చూడటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన పోల్ వర్కర్ల సంఖ్య 7,74,000. అమెరికాలో మూడు గ్రూపుల ఎన్నికల సిబ్బంది ఉంటారు. వారు ఓటర్లకు సహాయం చేయడం, ఓటింగ్ పరికరాలను ఏర్పాటు చేయడం, ఓటరు ఐడీలను, రిజిస్ట్రేషన్లను ధృవీకరించడం వంటి పనులు చేస్తారు. వీరిని పోల్ వర్కర్లు అని అంటారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లాంటి ప్రత్యేక విధులను నిర్వహించడానికి ఎన్నికల అధికారులు ఉంటారు. బ్యాలెట్ లెక్కింపును పర్యవేక్షించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల పరిశీలకులను నియమిస్తాయి. 2020లో ఎన్నిక ఫలితాలను అంగీకరించేందుకు నాటి అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించిన నేపధ్యంలో ఇప్పుడు బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నారు.244 మిలియన్ ఓటర్లు2024లో ఓటు వేసేందుకు అర్హులైన అమెరికన్ల సంఖ్య 244 మిలియన్ (ఒక మిలియన్ అంటే 10 లక్షలు)అని ద్వైపాక్షిక పాలసీ సెంటర్ తెలిపింది. వీరిలో ఎంత మంది ఓటు వేస్తారనేది వేచి చూడాలి. 2018, 2022 మధ్యంతర ఎన్నికలు, 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేనంత అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది. ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
కమలా హారిస్ హెల్త్పై డాక్టర్ రిపోర్టు ఇదే..
న్యూయార్క్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆరోగ్యంతో భేషుగ్గా ఉందని ఆమె డాక్టర్ యూఎస్ ఆర్మీ ఫిజిషియన్ జాషువా ఆర్. సిమన్స్ తెలిపారు. కమల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన నివేదికను శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది.‘‘కమలా హారిస్కు కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు, దద్దుర్లు ఉన్నాయి. ఆమె ఇమ్యునైజేషన్లు , నివారణ సంరక్షణ సిఫార్సులు సరిగా ఉన్నాయి. ఆమె ఎప్రిల్నెలలో చేసుకున్న ఫిజికల్ పరీక్ష, సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఎటువంటి సమస్య లేదు. కళ్లకు కాంటాక్ట్ లెన్స్లు ధరిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుంటారు. కొన్ని సమయాల్లో అల్లెగ్రా, నాసల్ స్ప్రే , ఐ డ్రాప్స్తో పాటు అలెర్జీకి మందులను ఉపయోగిస్తారు. .. కమల తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. హారిస్ పొగాకు ఉత్పత్తులు, అల్కాహాల్ తీసుకోరు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అదీకూడా చాలా మితంగా తీసుకుంటారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆమె చాలా ఫిట్గా ఉన్నారు. విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక, మానసిక స్థితిని కమల కలిగి ఉన్నారు’’ అని డాక్టర్ సిమన్స్ నివేదికలో వివరించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలిగి.. ఉపాధ్యక్షురాలు కమలను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగానే అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినట్లు గతంలో ఆరోపణలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని విడుదల చేశారు.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
కమలా హారిస్కు మద్దతుగా ఏఆర్ రెహమాన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్లు తమ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతుగా ఓ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) అనే నిధుల సేకరణ బృందం ప్రకటించింది. కాగా ఈ కార్యక్రమ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఏఏపీఐ తెలిపింది. ఈ విషయమై ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే తేదీ నిర్ణయించిన తరువాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్కు మద్దతుగా రెహమాన్ సంగీత కార్యక్రమం జరగబోతున్నదనే వార్త వెలువడగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో కమలా హారిస్ ఓటర్ల నుంచి మరింత ఆదరణ పొందగలరని పలువురు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
మరో నాలుగేళ్లు భరించలేం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్పై మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నాయకుడు బరాక్ ఒబామా విరుచుకుపడ్డారు. అహంకారి, అసమర్థుడు, బడాయికోరు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుడు మనకు అవసరం లేదని తేల్చిచెప్పారు. అలాంటి వ్యక్తిని మరో నాలుగేళ్లపాటు మనం భరించలేమని అన్నారు. పేజీ తిప్పేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఒకరిపై ఒకరు తిరగబడే పరిస్థితి రాకుండా కలిసి పనిచేసేలా ఉత్తమమైన పేజీ మన కోసం సిద్ధమవుతోందని తెలిపారు. అధ్యక్షురాలు కమలా హారిస్ కోసం మనం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని పిట్స్బర్గ్లో గురువారం డెమొక్రటిక్ పార్టీ ప్రచార కార్యక్రమంలో బరాక్ ఒబామా మాట్లాడారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న పన్ను విధానం, విదేశాంగ విధానాన్ని తప్పుపట్టారు. ట్రంప్ పచ్చి అబద్ధాలకోరు అని మండిపడ్డారు. జో బైడెన్ ప్రభుత్వం రిపబ్లికన్లకు తుపాను సాయం అందించలేదంటూ ట్రంప్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి వివక్ష ఉండదన్నారు. అమెరికా విలువలను ఉల్లంఘించవద్దని ట్రంప్నకు సూచించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరగబోతున్నాయని, రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ విజయం ఖాయమని ఒబామా స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. అధ్యక్ష పదవిని చేపట్టేందుకు హారిస్ సర్వసన్నద్ధంగా ఉన్నారని ఒబామా తేల్చిచెప్పారు. ఆమె విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. కమలా హారిస్ను గెలిపిస్తే ఆమె తన సొంత సమస్యలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరిస్తారని వివరించారు. ప్రజల కష్టాలు ఏమిటో ఆమెకు క్షుణ్నంగా తెలుసని చెప్పారు. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ను ఎన్నుకుంటే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని ప్రజలను అప్రమత్తం చేశారు. ట్రంప్ వస్తే సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు తగ్గిస్తారని, సామాన్య ప్రజలపై పన్నులు పెంచుతారని అన్నారు. మెరుగైన జీవితం, పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలనుకుంటే ఎన్నికల్లో కమలా హారిస్ను గెలిపించుకోవాలని అమెరికా ప్రజలకు ఒబామా పిలుపునిచ్చారు. -
ట్రంప్పై ఒబామా విమర్శలు.. అమెరికాకు కమలా హారిస్ కావాలి
‘అహంకారం, ద్వేషం, విభజన వాదం నరనరాన జీర్ణించుకుపోయిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అలాంటి వారు మనకొద్దు’ అంటూ ట్రంప్పై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శలు గుప్పించారు.త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేస్తుండగా..తాజాగా ఆమెకు మద్దతుగా బరాక్ ఒబామా పెన్సిల్వేనియాలలో ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ట్రంప్పై తీవ్ర విమర్శలు చేశారు.‘గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కోవిడ్-19 ప్రారంభం నుంచి అమెరికన్లు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అధిక ధరలతో పాటు పలు ఇతర అంశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించే నాయకులు కావాలి. ట్రంప్ అందుకు అనర్హులు. ఆయనలో అహంకారం, ద్వేషం మెండుగా ఉన్నాయి. సమస్యలు పరిష్కరిస్తూ.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అధ్యక్షుడు మాత్రమే మనకు కావాలి. కమలాహారిస్ మాత్రమే అలా చేయగలరని నేను నమ్ముతున్నాను’ అని ఒబమా పేర్కొన్నారు. -
కమలా హ్యారిస్ ఖాళీ బుక్... బెస్ట్ సెల్లర్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారపర్వంలో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్పై వ్యంగ్యాస్త్రంగా ఇటీవల వెలువడిన పుస్తకం ‘అమెజాన్’ బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ‘ది అచీవ్మెంట్స్ ఆఫ్ కమలా హ్యారిస్’ అనే ఈ పుస్తకంలో ఉన్నవల్లా దాదాపు ఖాళీ పేజీలే! ఈ పుస్తకంలో కొన్ని అధ్యాయాల పేర్లు మాత్రమే ముద్రించి, అధ్యాయానికీ అధ్యాయానికీ మధ్యనున్న పేజీలన్నీ ఖాళీ తెల్లకాగితాలుగా విడిచిపెట్టి అచ్చేశారు. వాల్మార్ట్ బుక్స్టోర్లో ఒక వ్యక్తి ఈ పుస్తకం వీడియోను చిత్రించి ‘టిక్ టాక్’లో పోస్ట్ చేశారు. తర్వాత జాక్ అనే వ్యక్తి ఈ పుస్తకం వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తే, దాదాపు ఏడు గంటల వ్యవధిలోనే ఇరవై లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని రీ΄ోస్ట్ చేశారు. కమలా హ్యారిస్ మీద ఈ వెటకారం వీడియో సంగతి ఎలా ఉన్నా, హోరాహోరీ పోరు నెలకొన్న ఈ ఎన్నికల్లో ఆమె విజయం తథ్యమని ‘ఎన్నికల నోస్ట్రడామస్’గా పేరు పొందిన అమెరికన్ రాజకీయ విశ్లేషకుడు అలన్ లిచ్మన్ ఘంటాపథంగా చెబుతుండటం విశేషం. ఇవీ చదవండి: గురుడి చందమామ యూరోపా.. మంచు లోకంలో మహా సముద్రం!నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో -
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. పెరుగుతున్న ఉత్కంఠ
US presidential elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో ఉత్కంఠ నానాటికీ పెరిగిపోతోంది. ఎన్నికలకు మరో నెల రోజుల సమయమే మిగిలి ఉంది. నవంబర్ 5న జరిగే ఎన్నికలపై ప్రపంచ దేశాలన్నీ అమితాసక్తి చూపుతున్నాయి. కాబోయే అగ్రరాజ్యాధిపతి ఎవరు? అనే ప్రశ్న అందరి మదిని తొలచివేస్తోంది. రకరకాల సర్వేలు, అంచనాలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అమెరికాకు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు వస్తారా? లేక డొనాల్డ్ ట్రంప్ మరోసారి రాజ్యమేలుతారా? అనే ప్రశ్నకు సమాధానం రావాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే. ఇప్పుడున్న పరిణామాలను బట్టి చూస్తే అధ్యక్ష రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కంటే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారతీయ అమెరికన్ కమలా హారిస్ ముందంజలో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది జూలై నెలాఖరులో కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. పోటీ నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో హారిస్కు మార్గం సుగమమైంది. జూలై నెలాఖరు నుంచి ఇప్పటిదాకా వివిధ ముఖ్యమైన సర్వేల్లో నేషనల్ పోలింగ్ సగటును పరిగణనలోకి తీసుకుంటే ట్రంప్ కంటే హారిస్కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కమలా హారిస్కు 49 శాతం, ట్రంప్నకు 46 శాతం ప్రజాదరణ కనిపిస్తోంది. ఇరువురు నేతల మధ్య వ్యత్యాసం స్పల్పంగానే ఉంది. మరో నెల రోజుల్లో ప్రజాభిప్రాయంలో మార్పు వచ్చే అవకాశం లేకపోలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ 👉 ట్రంప్, హారిస్ మధ్య సెప్టెంబర్ 10న కీలకమైన డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ట్రంప్పై హారిస్ పైచేయి సాధించారు. ఆ రోజు ఆమె ప్రజాదరణ 2.5 పర్సంటేజీ పాయింట్లు పెరగా, మరో వారం తర్వాత 3.3 పాయింట్లు పెరిగింది. ట్రంప్ పట్ల ప్రజాదరణ గణనీయంగా తగ్గిపోయింది. 👉 ఎన్నికల్లో ఎవరెక్కువ ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే వారిదే విజయం. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలున్నాయి. ఒక్కో రాష్ట్రంలోని జనాభాను బట్టి ఆ రాష్ట్రానికి ఎలక్టోరల్ ఓట్లు కేటాయించారు. 👉మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 538. విజయానికి కావాల్సింది 270. 👉 దేశంలో 50 రాష్ట్రాలు ఉన్నప్పటికీ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించేవి మాత్రం కొన్నే ఉన్నాయి. వీటినే స్వింగ్ స్టేట్స్ అంటున్నారు. ఇక్కడ ఎవరు పాగా వేస్తే వారిదే అధికారం. 👉 మొత్తం 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. అవి నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, నెవడా, జార్జియా, అరిజోనా, విస్కాన్సిన్, మిషిగాన్. 👉 ఇందులో నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనాలో ట్రంప్ వైపు మొగ్గు కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల్లో కమలా హారిస్కు జనం జేజేలు పలుకున్నారు. 👉 ఇద్దరి మధ్య ఈ ఏడు రాష్ట్రాల్లో హోరాహోరీ పోటీ తథ్యమని చెప్పక తప్పదు.చదవండి: కమలా హారిస్కు అండాదండా ఆమే! 👉స్వింగ్ రాష్ట్రాల్లో ఇరువురు నేతల నడుమ ప్రజాదరణలో వ్యత్యాసం 2 శాతం లోపే ఉండడంగమనార్హం. ఈ స్వల్ప వ్యత్యాసం నెల రోజుల్లో తారుమారు కావడం పెద్ద విశేషం కాదు. 👉అందుకే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఎన్నికల పరిశీలకులు కచి్చతంగా అంచనా వేయలేకపోతున్నారు. 👉 మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో డెమొక్రటిక్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ, 2016లో అక్కడి ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపడంతో ఆయన సునాయాసంగా గెలిచారు. 👉2020లో మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు ఆదరణ లభించింది. ఈసారి కూడా ఈ మూడు రాష్ట్రాల్లో డెమొక్రటిక్ అభ్యర్థి అయిన కమలా హారిస్ పట్ల ఆదరణ కనిపిస్తోంది. -
ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్
ఇజ్రాయెల్- ఇరాన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. హమాస్, హెజ్బొల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకుంటోంది. శత్రుదేశం ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.ఇరాన్- ఇజ్రాయెల్ల యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరుదేశాల మధ్య సాగుతోన్న భీకర దాడులు ఇద్దరు చిన్నపిల్లల మధ్య కొట్లాటలా ఉందని అభివర్ణించారు. ఇజ్రాయెల్పై మంగళవారం ఇరన్ జరిపిన రాకెట్ దాడి వంటి ఘటనలు భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రాచ్యంలో జరిగే సంఘటనలపై అమెరికా మరింత లోతుగా జోక్యం చేసుకుంటుందని వెల్లడించారు.‘ఇది నిజంగా చెడు విషయం. కానీ, వారు ఆ యుద్ధ ప్రక్రియను పూర్తిచేయాలి. పాఠశాల ప్రాంగణంలోఇద్దరు చిన్నారులు కొట్లాడుకుంటున్నట్లు ఉంది. కొన్నిసార్లు ఏం జరుగుతుందో వదిలేయాలి. ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మేము చూస్తున్నాం. ఇది భయంకరమైన యుద్ధం. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందో మీకు తెలుసా? ఇజ్రాయెల్ దళాలు 200 రాకెట్లను కూల్చేశారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ప్రతిఒక్కరూ జీవించాలి. కాబట్టి ఈ అంశంపై అమెరికా మరింత దృష్టిపెట్టాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ ఆందోళన చెందుతోంది: జై శంకర్అయితే ఇరాన్ దాడుల అనంతరం ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లపై విమర్శలు గుప్పించారు. వారు ఈ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఆర్థికసాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉందని పేర్కొన్నరు. తాను చాలాకాలంగా మూడో ప్రపంచ యుద్ధం గురించి ప్రస్తావిస్తున్నానని, తన అంచనాలు ఎప్పుడూ నిజమవుతాయని ఈసందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మధ్యప్రాచ్యంలో ఎటువంటి యుద్ధాలు జరగలేదన్నారు.కాగా హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యతో పాటు ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, జెరూసలెంపై మంగళవారం రాత్రి ఏకబిగిన 200 క్షిపణుల్ని ప్రయోగించింది. అయితే వీటిలో చాలావాటిని అమెరికా మిలటరీ సాయంతో ఇజ్రాయెల్ అడ్డుకోగలిగింది. మరికొన్ని ఈ నగరాలను తాకాయి. ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు 12 నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయి. -
కమలా హారిస్కు అండాదండా ఆమే!
Laurene Powell Jobs: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ బరి నుంచి తప్పుకున్నాక ట్రంప్ను ధీటుగా ఎదుర్కొంటున్న కమలా హారిస్ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగుతోంది. అయితే దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హారిస్పై నమ్మకం నిలుపుకున్న ఏకైక వ్యక్తి లారెన్ పావెల్ జాబ్స్. వాళ్లది 20 ఏళ్ల స్నేహం. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన కాలం నుంచి ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగడం దాకా హారిస్కు చోదకశక్తిగా ఉన్నది లారెన్ పావెల్ అని చాలా మందికి తెలీదు. హారిస్కు ఆర్థిక, హార్దిక బలమూ ఆమే. ఆడదానికి ఆడదే శత్రువనే మూస ప్రచారాలను వెనక్కు నెట్టి ఒక మహిళ ఆర్థిక ఎదుగుదల మరెంతో మంది మహిళలకు బాసటగా నిలుస్తుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ వీళిద్దరి స్నేహం.ఎవరీ లారెన్ పావెల్? 60 ఏళ్ల లారెన్ పావెల్ జాబ్స్... ఎమర్సన్ కలెక్టివ్ అనే దాతృత్వ, పెట్టుబడి సంస్థ వ్యవస్థాపకురాలు. ది అట్లాంటిక్ మేగజైన్లో పెద్ద వాటాదారు. ఆపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి ఈమె. పావెల్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ చేశారు. ఇక్కడే 1989లో స్టీవ్ జాబ్స్ను కలిశారు. 1991లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు రీడ్, ఎరిన్, ఈవ్. స్టీవ్జాబ్స్ మరణానంతరం ఆపిల్, డిస్నీ సంస్థల్లో వాటాలను ఆమె వారసత్వంగా పొందారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం, పావెల్ ప్రస్తుత నికర విలువ 11.5 బిలియన్ డాలర్లు. ఆమె సిలికాన్ వ్యాలీలో అత్యంత సంపన్న మహిళగా పేరొందారు.హారిస్, లారెన్ స్నేహం.. ప్రజాజీవితం గడుపుతూ రాజకీయాలు, కళలు, సంస్కృతి పట్ల ఇద్దరూ ఒకే అభిరుచి కల్గిఉండటం ఇద్దరినీ స్నేహితులుగా మార్చింది. హారిస్కు నిధులు, సలహాలు అందించడమే కాకుండా ప్రజల్లో ఆదరణ పెరగడానికి లారెన్ దోహదపడ్డారు. లారెన్ కొన్నేళ్లుగా డెమొక్రటిక్ పార్టీకి నిధులు సమకూరుస్తున్నారు. 2020 నుంచి డెమొక్రటిక్ నామినీలకు, పార్టీకి దాదాపు రూ.29 కోట్ల విరాళం ఇచి్చనట్లు ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ గణాంకాలు చెబుతున్నాయి. 2003లో శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా పోటీ చేసిన సమయం నుంచే లారెన్.. హారిస్ వెన్నంటి ఉన్నారు. ఆ సమయంలో పావెల్ 500 డాలర్లు విరాళం ఇచ్చారు.తర్వాతి ఏడాది బే ఏరియాకు చెందిన ఇతర మహిళా నాయకులతో కలిసి వాషింగ్టన్లో నిర్వహించిన ‘మార్చ్ ఫర్ ఉమెన్స్ లైవ్స్’లో ఇద్దరూ పాల్గొన్నారు. హారిస్ కోసం లారెన్ అనేక నిధుల సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. గత ఏడాది కమల ప్రచారానికి ఆమె దాదాపు రూ.8.37 కోట్ల విరాళాలు ఇచ్చారు. 2017లో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా 2020 అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం గురించి లారెన్ను ప్రశ్నించగా.. ‘‘నా ఓటు హారిస్కే’ అంటూ ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న తన స్నేహితురాలు హారిస్ను చూపించారు. చదవండి: అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న చీలికలుహారిస్ను తెరపైకి తెచ్చి.. వాస్తవానికి జూన్లో బిగ్ డిబేట్ తర్వాత ప్రభ కోల్పోయిన బైడెన్ను అధ్యక్ష రేసు నుంచి తప్పించడానికి తెరవెనుక నుంచి లారెన్ పనిచేశారని అప్పట్లో వదంతులు వినిపించాయి. డిబేట్లో బైడెన్ పేలవ ప్రదర్శన చూశాక ట్రంప్ను ఓడించలేమేమో అని డెమొక్రటిక్ పార్టీ ప్రధాన దాతల వద్ద లారెన్ అభిప్రాయం వ్యక్తించేశారని వార్తలొచ్చాయి. పోటీలో కొనసాగుతానని బైడెన్ పట్టుబట్టడంతో హారిస్ సలహాల కోసం లారెన్ను సంప్రదించినట్లు సమాచారం. హారిస్కు మద్దతుగా ఇతర మహిళా టెక్ నాయకుల మద్దతు కూడగట్టే బాధ్యతను లారెన్ తన భూజాలకెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో హారిస్ గెలిస్తే డెమొక్రాట్ల పాలనలో లారెన్ ఏదైనా పాలనా బాధ్యతలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అధికారిక పదవిలో లేకపోయినా ‘ఇన్సైడర్’గా ఉంటారని తెలుస్తోంది. -
USA Presidential Elections 2024: అమెరికా కార్పొరేట్ల పార్టీల బాట
అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అమెరికాలో రాజకీయ చీలికలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు రాజకీయ పార్టీలకు, నాయకులకు మద్దతు తెలపడం సాధారణం. అయితే అమెరికాలో కార్పొరేట్లు సైతం రెండు వర్గాలుగా విడిపోయాయి. చిన్న, ప్రాంతీయ సంస్థలు మొదలు టెక్, బ్యాంకింగ్ దిగ్గజాల వంటి పెద్ద సంస్థల దాకా మెజారిటీ సంస్థలన్నీ డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య విడిపోయాయి. కొన్ని సంస్థలు కమలా హారిస్వైపు, మరికొన్ని సంస్థలు డొనాల్డ్ ట్రంప్ వైపు నిలిచారు. ఈ చీలికతో ఉదారవాద, వామపక్ష భావాలు కలిగిన కమలా హారిస్కు మితవాద ట్రంప్కు మధ్య పోటీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు మారిపోయాయి. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్ (ఆల్ఫాబెట్), అమెజాన్, సన్ మైక్రోసిస్టమ్స్ ఉద్యోగులు కమలా హారిస్ ప్రచారానికి మిలియన్ల డాలర్లను విరాళంగా ఇచి్చనట్లు రాజకీయరంగ విషయాలను బహిర్గం చేసే ‘ఓపెన్ సీక్రెట్స్’సంస్థ వెల్లడించింది. ట్రంప్ ప్రచారానికి వచి్చన విరాళాల కంటే కమలా హారిస్ ప్రచారానికి వచి్చన సహకారం గణనీయంగా ఉంది. ఎలాన్ మస్్క, మార్క్ జుకర్బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు మాత్రం ట్రంప్కు మద్దతుగా ప్రకటించడం తెల్సిందే. హారిస్కు గూగుల్ సహా పలు సంస్థల బాసట భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా, వెంచర్ క్యాపిటలిస్ట్ రీడ్ హాఫ్మన్ తదతరులు హారిస్కు మద్దతుగా నిలిచారు. సుందర్ పిచాయ్ నేతృత్వంలోని గూగుల్ (ఆల్ఫాబెట్), దాని అనుబంధ సంస్థలు హారిస్కు దాదాపు రూ.18 కోట్లు విరాళంగా ఇచి్చనట్లు అమెరికా ఎన్నికల నిధుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ సంస్థ అటు కమలకు విరాళాలు అందిస్తూ ట్రంప్కు సైతం విరాళాలు పంపుతున్నాయి. అయితే కమలతో పోలిస్తే ట్రంప్కు వస్తున్న కార్పొరేట్ విరాళాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. హారిస్ ప్రచారానికి సత్య నాదెళ్ల నేతృత్వంలోని మైక్రోసాఫ్ట్ దాదాపు రూ.9.2 కోట్లు విరాళం ఇచి్చంది. అమెరికా కుబేరుడు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని అమెజాన్ సంస్థ దాదాపు రూ.8.36 కోట్లు విరాళంగా ఇచ్చింది. సిలికాన్వ్యాలీలో వందకు పైగా పెద్ద పెట్టుబడిదారులు, పెద్ద టెక్ సంస్థలు హారిస్కు మద్దతుగా నిలిచాయి. ట్రంప్కు బ్యాంకింగ్,ఆయిల్ దిగ్గజాల మద్దతు కార్పొరేట్లపై పన్ను మరింత తగ్గిస్తామని, విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై అధిక సుంకాలు విధిస్తామని, చమురు, సహజవాయువు, బొగ్గు గనుల రంగాల్లో పెట్టుబడులు పెంచుతామని ట్రంప్ ఎన్నికల వేళ హామీలు గుప్పించారు. అమెరికాలో చమురు వెలికితీతను మొదట్నుంచీ సమర్థించే ట్రంప్కు చమురురంగ సంస్థలు మద్దతు పలుకుతున్నాయి. ట్రంప్పై హత్యాయత్నం జరిగినప్పుడు అమెరికా స్టాక్ మార్కెట్ కదలికలు సైతం ట్రంప్కు అనుకూలంగా ఉండటం గమనార్హం. చమురు వినియోగం అధికంగా ఉన్నంత మాత్రాన వాతావరణంలో ఎలాంటి మార్పులు రావని, వాతావరణ మార్పులు అనేది పచ్చి అబద్ధమని ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఉన్నకాలంలో పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగేలా చేశారు. అమెరికా అభివృద్దిలో చమురు, బొగ్గుది కీలక పాత్ర అని ప్రకటించారు. దీంతో ఈ రెండు రంగాలు ట్రంప్కు మద్దతుగా నిలుస్తున్నాయి. బైడెన్ పాలనలో అమలు చేసిన కఠిన నిబంధనలను ట్రంప్ వెనక్కి తీసుకుంటారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బైడెన్ సూచించిన కొత్త కఠిన బ్యాంకింగ్ నిబంధనలపై ఆ రంగం చూపుతున్న విముఖత ట్రంప్కు అనుకూలిస్తోంది. జుకర్బర్గ్, మస్క్ బహిరంగంగానే.. మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్బర్గ్ మితవాద ట్రంప్కు మద్దతు ఇస్తూ బహిరంగ ప్రకటనలు చేశారు. అయితే తర్వాత జుకర్బర్గ్ తాను తటస్థంగా, నిష్పక్షపాతంగా కనిపించాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రచారానికి జుకర్బర్గ్ ఎంత విరాళంగా ఇచ్చారనే అంశాలు ఇంకా బహిర్గతంకాలేదు. ఫేస్బుక్లో వచ్చే కంటెంట్ను సెన్సార్ చేయాలని బైడెన్ ప్రభుత్వం మెటాపై ఒత్తిడి తేవడం తెల్సిందే. ఎలాన్ మస్క్ ట్రంప్కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ట్రంప్ ప్రచారాన్ని చూసుకునే అమెరికా పీఏసీ సంస్థకు తాను వ్యక్తిగతంగా ప్రతి నెలా దాదాపు రూ.376 కోట్లు విరాళంగా పంపుతున్నానని మస్క్ జూలైలో బహిరంగంగా ప్రకటించారు. భారీ వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థెయిల్ సైతం ట్రంప్కు జై కొడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో గన్ కల్చర్పై బైడెన్ కొత్త చట్టం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని వారాల్లో తన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికాలో గన్ కల్చర్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో తుపాకీ హింసకు అంతం పలకాలనే ఉద్దేశంతో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు.తాజాగా బైడెన్ ట్విట్టర్ వేదికగా..‘అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చాలా మంది పిల్లులు చనిపోతున్నారు. వ్యాధులు, ప్రమాదాల కారణంగా మృతి చెందుతున్న చిన్నారుల కంటే.. తుపాకీల కారణంగా మరణించిన వారి సంఖ్యే ఎక్కవగా ఉంది. ఇది చాలా బాధాకరమైనది. ఈ హింసను అంతం చేయడానికి నేను, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కృషి చేస్తున్నాం. మీరు మాతో చేతులు కలపండి తుపాకీ హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై తాను సంతకాలు చేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.ఆర్డర్ ప్రకారం, మొదటి భాగం మెషిన్ గన్ మార్పిడి పరికరాలతో సహా ఉత్పన్నమయ్యే తుపాకీ బెదిరింపులుపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. ఇది హ్యాండ్ హెల్డ్ గన్ లేదా పిస్టల్ను ఆటోమేటిక్ తుపాకీ లేదా ఆయుధంగా మారుస్తుంది. ఇటువంటి పరికరాలు ఇప్పటికే చట్టవిరుద్ధం, అయితే చట్ట అమలు సంస్థలు అటువంటి పరికరాలను విచక్షణారహితంగా ఉపయోగించడాన్ని నిరోధిస్తుంది. కొత్త చట్టం దాని లభ్యతపై అణిచివేతను నిర్ధారిస్తుంది.అగ్రరాజ్యంలో తుపాకీదే హవా..అమెరికాలో తీవ్రమైన తుపాకీ హింస ఉంది. ముఖ్యంగా పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో కాల్పుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. గత రెండు దశాబ్దాలలో పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో వందలాది కాల్పులు జరిగాయి. ఈ హింసలు యూఎస్ తుపాకీ చట్టాలు, రాజ్యాంగం రెండవ సవరణపై తీవ్ర చర్చకు దారితీసింది. ఈ చట్టం ప్రకారం.. ఆయుధాలను కలిగి ఉండే హక్కు ఉంది.విద్యాసంస్థల్లో కాల్పుల కారణంగా 2020లో 4,368 మంది పిల్లలు తుపాకీ కారణంగా మృతి చెందారు. ఇక, 2019లో ఆ సంఖ్య 3,390గా ఉండగా.. 2021లో 4,752కు చేరింది. ఇక, 2007లో వర్జీనియా టెక్లో కాల్పుల కారణంగా 30 మందికిపైగా మరణించిన అత్యంత ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లల గన్ వాడకంపై పేరెంట్స్ కూడా దృష్టిసారించాలని అన్నారు. Today, I'll sign an Executive Order to crack down on emerging firearm threats like unserialized, 3D-printed guns and machine gun conversion devices.It'll also direct my Cabinet to help improve school-based active shooter drills.It's our job to do better.— President Biden (@POTUS) September 26, 2024 ఇది కూడా చదవండి: పాలస్తీనా మా సొంతం -
‘హారిస్కు బైడెన్ను మించిన సమస్యలున్నాయ్’
వాషింగ్టన్: వృద్ధాప్యం, మతిమరుపు, తడబాటు సమస్యలతో సతమతమవుతూ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్తో కమలా హారిస్ను పోలుస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. జార్జియా రాష్ట్రంలో బుధవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రచార సభలో కార్యకర్తలనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఉపాధ్యక్షురాలు హారిస్ను చూసి ప్రపంచమే నవ్వుతోంది. ఎందుకో తెలుసా?. ఆమె అధ్యక్షురాలు కాబోయే ఛాన్సుందని తెల్సి నమ్మశక్యంకాక నవ్వుతున్నారు. ఇక ఆలోచనా శక్తి గురించి మాట్లాడితే ఈమెకు బైడెన్ను మించిన సమస్యలున్నాయి. అధిక ధరలు, గందరగోళ పాలనకు మనం తెరదించబోతున్నాం. కమల, అసమర్థ బైడెన్ కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా మనకు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం’’అని అన్నారు. సొంత డబ్బా కొట్టుకున్న ట్రంప్హంగేరి ప్రధాని విక్టర్ అర్బాన్ గురించి ట్రంప్ మాట్లాడుతూ పనిలోపనిగా ట్రంప్ సొంత గొప్పలు చెప్పుకున్నారు. ‘‘విక్టర్ సమర్థవంతమైన నేత. విదేశీయులు ఎవరినీ తన దేశంలోకి రానివ్వడు. ప్రపంచంలో ఎందుకు ఇన్ని సమస్యలు?. మధ్యప్రాశ్చ్యంలో యుద్ధాలెందు జరుగుతున్నాయి. మూడో ప్రపంచయుద్ధం దిశగా రష్యా ఎందుకు పయనిస్తోందని విక్టర్ను అంతా అడిగితే ఆయన ఒక్కటే సులువైన పరిష్కారం చెప్పారు. ట్రంప్ దేశాధ్యక్ష పీఠంపై లేకపోవడం వల్లే. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నపుడు అంతా అతడిని చూసి భయపడ్డారు. చైనా, రష్యా.. అందరికీ భయమే. నేను అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్లోకి రష్యా అడుగుపెట్టలేకపోయింది. నేను దిగిపోగానే ఉక్రెయిన్ గడ్డపై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసింది. ఇక హారిస్ నాలుగేళ్లు అధ్యక్ష పీఠంపై కూర్చుంటే అమెరికాలో పరిశ్రమలు లేకుండా చేస్తుంది. దేశాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు మన ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదు. మన పని అయిపోతుంది. డెమొక్రాట్ల విధాన నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి’’అని ఆరోపించారు. ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ నుంచి ప్రాణహాని పొంచి ఉందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాలు ఈ మేరకు తమకు సమాచారం అందించాయని ట్రంప్ ప్రచార బృందం తాజాగా ప్రకటించింది. వివరాలను ట్రంప్ ప్రచార విభాగ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియంగ్ వెల్లడించారు. ‘‘అమెరికాలో అస్థిరత, గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా మిమ్మల్ని హత్య చేయడానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని మంగళవారం ఉదయం భేటీ సందర్భంగా ట్రంప్కు జాతీయ నిఘా విభాగ డైరెక్టర్ వివరించారు. నిరంతరం సమన్వయంతో హత్య కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ట్రంప్ను కాపాడేందుకు అన్ని నిఘా, భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ ఘటనలు లేకుండా స్వేచ్ఛగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు సంస్థలు కృషిచేస్తున్నాయి’’అని స్టీవెన్ అన్నారు. జూలై 13న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో సభలో ఒక ఆగంతకుడు ట్రంప్పైకి బుల్లెట్ల వర్షం కురిపించగా ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి సమీపంగా దూసుకుపోవడం, వెనక కూర్చున్న ఒక వ్యక్తి మరణించడం తెల్సిందే. వెస్ట్ పామ్బీచ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ను చంపేందుకు రౌత్ అనే వ్యక్తి ప్రయత్నించడం తెల్సిందే. హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులువాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై దాడి జరిగింది. అరిజోనాలో ఫీనిక్స్ శివార్లలో ఉన్న కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు పెల్లెట్ గన్తో కిటికీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. దాంతో కార్యాలయ తలుపుకు, కిటికీలకు రంధ్రాలు పడ్డాయి. ‘‘ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. దాంతో ఎవరికీ ఏ హానీ జరగలేదు’’అని పోలీసు లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యాలయంపై ఈ నెలలోనే ఇది రెండో దాడి. సెప్టెంబర్ 16న కూడా ఇలాగే పెలెట్ గన్తో కాల్పులు జరిగాయి. దాంతో ప్రచార కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలకు భద్రత పెంచారు. హారిస్ శుక్రవారం అరిజోనాలో మెక్సికో సరిహద్దును సందర్శించనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఈ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అరిజోనా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు యోలాండా బెజరానో చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం జరగడం తెలిసిందే. -
US ELECTION: సర్వేల్లో హారిస్ ముందంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ కాస్త ముందంజలో ఉన్నట్లు తాజా సర్వే ఒకటి తెలిపింది. ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాల కల్పన అనే కీలక అంశాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ను కమల వెనక్కి నెట్టేసినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోల్సర్వే సోమవారం(సెప్టెంబర్23)తో ముగిసింది. ఈ సర్వేలో ట్రంప్నకు 40.48శాతం అనుకూలత రాగా కమలకు 46.61శాతం అనుకూల ఓట్లు వచ్చాయి.సెప్టెంబర్ తొలి వారంలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే కమల ఒక శాతం ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం. దేశవ్యాప్త ట్రెండ్ను అంచనా వేయడంలో కీలకంగా భావించే పోల్సర్వేల్లో రాయిటర్స్-ఇప్సోస్ సర్వే ఒకటి కావడం గమనార్హం. నవంబర్5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుదిపోరు జరగనుంది. -
కమలా హారీస్ ఆఫీసుపై కాల్పులు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అమెరికా ఉపాధ్యక్షురాలు, అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. వివరాల ప్రకారం.. అరిజోనాలోని కమలా హరీస్ ఎన్నికల ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగినట్టు పోలీసులు ధృవీకరించారు. రాత్రిపూట ఆఫీసులో ఎవరూ లేని సమయంలో ఫైరింగ్ జరిగినట్టు తెలిపారు. కాల్పుల కారణంగా భవనంలో కిటికీలు, ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగుల కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, డిటెక్టివ్ టీమ్స్.. కాల్పులు ఎవరూ చేశారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. కాల్పుల ఘటన నేపథ్యంలో డెమోక్రటిక్ ఆఫీసు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. అదనంగా పోలీసుల బలగాలను ఏర్పాటు చేశారు. కమలా ఆఫీసుపై కాల్పుల ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. ఇటీవలే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కూడా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ గాయపడ్డారు. ఇది కూడా చదవండి: పేజర్ దాడులు నిజంగా ఇజ్రాయెల్ పనేనా? -
ఎన్నికల్లో ఓడిపోతే.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గనుక ఓడిపోతే.. ఇక జీవితంలో మరోసారి బరిలో నిలవనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారాయన.‘‘ఈసారి అధ్యక్ష ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తా. ఈసారి ఓడిపోయే ప్రసక్తే ఉండదని అనుకుంటున్నా. ఎందుకంటే అమెరికన్లలో డెమోక్రట్లపై అంతలా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవేళ ఓటమి పరిస్థితే ఎదురైతే మాత్రం.. ఇక శాశ్వతంగా పోటీకి దూరమవుతా. ఇంకోసారి పోటీ చేయను’’ అని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడి కోసం జరిగిన 2016 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేశారు ట్రంప్. ప్రత్యర్థి హిలరీ క్లింటన్పై ఘన విజయం సాధించి.. 2017 నుంచి 2021 (జనవరి) మధ్య అధ్యక్షుడిగా పని చేశారు. 2021 ఎన్నికల్లో బైడెన్పై మరోసారి పోటీ చేస్తానని 2020లోనే ట్రంప్ ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ట్రంప్ అంతలా ద్వేషించినా.. ఆమె లాభపడింది!ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో నిలబడతానని.. 2022 నవంబర్ నుంచే చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాగా.. నాటకీయ పరిణామాల అనంతరం బైడెన్ వైదొలగడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. నవంబర్ 5న 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ట్రంప్కు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నుంచి గట్టి పోటీ ఎదురు కావొచ్చని సర్వేలు చెబుతున్నాయి. కీలక రాష్ట్రాల్లోనూ కమలదే పైచేయి కొనసాగుతోందని నివేదికలు ఇస్తున్నాయి. తొలి డిబేట్లో బైడెన్పై నెగ్గిన ట్రంప్.. రెండో డిబేట్లో కమలా హారిస్పై మాత్రం ఆయన తడబడ్డారు. దీంతో మూడో(ఆఖరి)డిబేట్కు దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 23వ తేదీన మూడో డిబేట్ జరగాల్సి ఉంది. ఇప్పటికే తాను డిబేట్కు రెడీ అంటూ కమల ప్రకటించారు. ఈ సవాల్ను ట్రంప్ అంగీకరిస్తారో? లేదో? అనే ఆసక్తి నెలకొంది. -
కమలా హారీస్కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.— Amanda Liyang (@esraa28305334) September 22, 2024ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బైడెన్తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
Kamala Harris: రెండో డిబేట్కు నేను రెడీ
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సమ్మతించారు. అక్టోబర్ 23న జరిగే డిబేట్లో పాల్గొనాలని సీఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్ అంగీకరించారు. ట్రంప్తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో డిబేట్కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్ శనివారం ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్లో ట్రంప్పై హారిస్ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. -
హారిస్ ప్రచారంలో విన్ఫ్రే
మిషిగన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు టీవీ లెజెండ్ ఓప్రా విన్ఫ్రే జత కలిశారు. ఇద్దరూ కలిసి గురువారం మిషిగన్లో జరిగిన ‘యునైటెడ్ ఫర్ అమెరికా’పేరిట టాక్షో తరహా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యక్ష ప్రసారంలో జెన్నిఫర్ లోపెజ్, క్రిస్ రాక్, జూలియా రాబర్ట్స్, మెరిల్ స్ట్రీప్తో సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయ మీడియాకు దూరంగా ఉండే ఓటర్లను చేరుకోవడానికి హారిస్ ఈ ప్రయత్నం చేశారు. దీన్ని ఐక్యత కోసం సాగుతున్న ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థ, స్త్రీల పునరుత్పత్తి హక్కులు, వలసలు తదితర కీలకాంశాలపై ఈ సందర్భంగా హారిస్ చర్చించారు. స్టార్టప్లు, చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి 50,000 డాలర్ల వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలన్నది తన ప్రణాళికలో భాగమన్నారు. ‘‘ప్రస్తుతం ఇది 5,000 డాలర్లుంది. అంత తక్కువతో ఎవరూ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించలేరు’’అన్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతిపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ‘‘నేను తుపాకీ యజమానిని. నా రన్నింగ్మేట్ టిమ్ వాల్జ్కు కూడా తుపాకీ ఉంది. ఎవరైనా నా ఇంట్లోకి చొరబడితే కాల్చి చంపుతా’’అని నవ్వుతూ చెప్పారు. ట్రంప్తో హోరాహోరీయే గానీ... హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ‘‘వారిద్దరూ చొరో 47 శాతంతో సమానంగా కని్పస్తున్నారు. అయితే స్వింగ్ రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో మాత్రం హారిస్ 4 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు’’అని గురువారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్ పోల్ తెలిపింది. కాకపోతే కమల డెమొక్రటిక్ అభ్యరి్థగా ఎన్నికైనప్పటి నుంచి సంప్రదాయ మీడియాకు దూరంగా ఉంటున్నారని, ఇది ఆమె అవకాశాలను క్లిష్టతరం చేస్తోందని విమర్శకులు అంటున్నారు. ‘‘ఆధునిక అమెరికా చరిత్రలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అతి తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చిన అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా హారిస్, వాల్జ్ నిలిచారు. వాళ్లు కేవలం ఏడు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో మాత్రమే పాల్గొన్నారు’’అని ఆక్సియోస్ సంస్థ గురువారం నివేదించింది. ట్రంప్, ఆయన రన్నింగ్మేట్ జేడీ వాన్స్ మాత్రం ఏకంగా 70కి పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించింది. -
మస్క్ VS టెస్లా ఉద్యోగులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో బిలియనీర్ ఎలాన్ మస్క్.. తన ఈవీ కంపెనీ టెస్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు పరస్పరం విరుద్ధంగా మారారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు మస్క్ మద్దతు ఇస్తుండగా టెస్లా ఉద్యోగులు మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలహారిస్ వైపు నిలుస్తున్నారు.అధ్యక్ష రేసులో పాల్గొంటున్న అభ్యర్థులకు ప్రచారం నిమిత్తం ఇస్తున్న విరాళాల ద్వారా టెస్లా ఉద్యోగుల మొగ్గు ఎటువైపు అన్నది తెలుస్తోంది. టెస్లా ఉద్యోగులు ట్రంప్ కంటే దాదాపు రెట్టింపు విరాళాలను కమలాహారిస్కు ఇస్తున్నట్లు తెలిసింది. యూఎస్ ప్రచార సహకారాలు, లాబీయింగ్ డేటాను ట్రాక్ చేసే ఓపెన్ సీక్రెట్ అనే సంస్థ ప్రకారం.. టెస్లా ఉద్యోగులు కమలకు 42,824 డాలర్లు విరాళం అందించగా ట్రంప్నకు 24,840 డాలర్ల విరాళం అందించారు.ఎక్స్, స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా..ఎలాన్ మస్క్కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ ఉద్యోగులు కూడా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలహారిస్కే మద్దతిస్తున్నారు. వీరు కమలహారిస్కు 34,526 డాలర్లు విరాళం అందించగా ట్రంప్నకు ఇచ్చింది కేవలం 7,652 డాలర్లు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’ (ట్విటర్) ఉద్యోగులు సైతం హారిస్కు 13,213 డాలర్లు విరాళమిచ్చారు. ట్రంప్కు ఇచ్చింది 500 డాలర్ల కంటే తక్కువ కావడం గమనార్హం. -
ట్రంప్కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన కీలక యూనియన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అమెరికా పలు యూనియన్ల ఓట్ల కీలకంగా మారనున్నాయి. కొన్ని యూనియన్ల సభ్యులు డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, అమెరికాలో ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ టీమ్స్టర్స్ యూనియన్కు సంబంధించిన ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారానున్నాయి. ఈ యూనియల్లో దాదాపు 1.3 మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్లో ట్రక్ డ్రైవర్లు, ఎయిర్లైన్స్ పైలట్స్, జూకీపర్ల వరకు అనేక ఇతర కార్మికులు కూడా ఉన్నారు. ఇక, యూనియన్కు సంబంధించి బుధవారం ఎలక్ట్రానిక్ పోల్ను విడుదల చేశారు. ఈ పోల్స్లో ఎక్కువ మంది డొనాల్డ్ ట్రంప్వైపే మొగ్గుచూపారు.యూనియన్ సభ్యుల జాతీయ ఎలక్ట్రానిక్ పోల్ ప్రకారం.. ట్రంప్కు 59.6 శాతం ఓట్లు రాగా, కమలా హారీస్కు మాత్రం కేవలం 34 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో, కమలాపై ట్రంప్ పైచేయి సాధించారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోకముందు ఆయనకు మద్దుతుగా 44 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, యూనియన్లో మెజార్టీ ఓటర్లు ట్రంప్కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓట్లు అభ్యర్థులు ఇద్దరికీ యూనియన్ కీలకంగా మారనుంది. అయితే, 2000 సంవత్సరం నుంచి ఈ యూనియన్ సభ్యులు డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి సపోర్టు ఇస్తూ పోల్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు యూనియన్ మద్దతు ఇలా..1984లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్కు1988లో వైస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యు బుష్తో సహా రిపబ్లికన్లను ఆమోదించారు.1996 తర్వాత యూనియన్ ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి.2000 నుండి ప్రతి డెమోక్రాటిక్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం! -
యుద్ధానికి ముగింపు పలకాలి
ఫిలడెల్ఫియా: గాజా స్ట్రిప్లో దురాక్రమణకు దిగిన ఇజ్రాయెల్ ఇకనైనా మారణహోమం ఆపాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ సాయుధుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందమే గాజా్రస్టిప్ సమస్యకు అసలైన పరిష్కారమని ఆమె అభిప్రాయపడ్డారు. గాజాలోని ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కాల్పుల విరమణకు ఇరు పక్షాలు ముందుకు రావాలని ఆమె అభిలషించారు. ఫిలడెలి్ఫయాలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ (ఎన్ఏబీజే)సమావేశంలో కమల పాల్గొని ప్రసంగించారు. దాదాపు 45 నిమిషాలపాటు పలు అంశాలపై ఆమె మాట్లాడారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో బదులిచ్చారు. హైతీలు ఇంటి పెంపుడు జంతువులను తింటున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను, వలసదారులను సామూహిక బహిష్కరణ చేస్తామని ట్రంప్ ఇచి్చన హామీని హారిస్ తప్పుబట్టారు. ‘ట్రంప్ ద్వేషపూరిత వ్యాఖ్యలు హానికరం. ఇలాంటి వాటిని సహించకూడదు’అని అన్నారు. ఆర్థిక అంశాలపైనా ఆమె విస్తృతంగా మాట్లాడారు. ‘‘అమెరికన్లను ప్రభావితం చేసే పెద్ద సమస్యలలో సరిపడా గృహాలు లేకపోవడం కూడా ఒకటి. నేనుఅధ్యక్షురాలిగా ఎన్నికైతే గృహాల నిర్మాణానికి ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తా. చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ను 6,000 డాలర్లకు విస్తరిస్తాం. దీంతో అమెరికన్లు తమ ఆదాయంలో ఏడు శాతం కంటే ఎక్కువ మొత్తాలను పిల్లల సంరక్షణకు చెల్లించాల్సిన అవసరం లేదు’’అని కమల వ్యాఖ్యానించారు. కమలకు నల్లజాతీయుల బాసట 2020 అధ్యక్ష ఎన్నికల్లో నల్లజాతీయుల్లో ఏకంగా 92 శాతం మంది అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్కు మద్దతు పలికారు. రిపబ్లికన్ పార్టీ తరఫున నాటి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు కేవలం 8 శాతం మంది నల్లజాతీయులే మద్దతు పలికారు. ఈ సారిసైతం అదే సరళి కనిపిస్తోంది ఎన్ఏఏసీపీ సర్వే తేలి్చంది. ఇటీవల విడుదలైన ఎన్ఏఏసీపీ సర్వే ప్రకారం 63 శాతం మంది నల్లజాతి ఓటర్లు కమలా హారిస్కు మద్దతు పలికారు. గతంతో పోలిస్తే డెమొక్రటిక్ పార్టీ నుంచి నల్లజాతీయులు కాస్తంత దూరం జరిగారని చెప్పాలి. అయినప్పటికీ ఇప్పటికీ నల్లజాతీయుల మెజారిటీ మద్దతు కమలకే దక్కడం విశేషం. ఈసారీ పోటీలో నిలిచిన ట్రంప్కు కేవలం 13 శాతం మంది నల్లజాతీయులు మద్దతుగా నిలబడినట్లు సర్వే వెల్లడించింది. పెన్సిల్వేనియా, జార్జియా వంటి రాష్ట్రాల్లో నల్లజాతీయుల మద్దతు నిర్ణయాత్మకంగా ఉంటుంది. పెన్సిల్వేనియా అత్యంత కీలకమైన రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం ఎన్ఏబీజేకు ఉందని చెబుతారు. దీంతో వీరిని ఎలాగైనా తమ వైపునకు తిప్పుకోవాలని కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ చెమటోడుస్తున్నారు. అయితే గతంలో ట్రంప్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల కారణంగా ఇప్పటికీ నల్లజాతీయుల మద్దతు కూడగట్టడం ఆయనకు సంక్లిష్టంగా తయారైంది. జార్జియాలో మూడు వంతుల మంది నల్లజాతీయులే కావడంతో ఇక్కడా వారి ఓటు నిర్ణయాత్మకంగా మారింది. -
ట్రంప్ ‘ఐ హేట్ టేలర్ స్విప్ట్’ పోస్ట్.. క్యాష్ చేసుకున్న పాప్ స్టార్
అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కమలా హారిస్ కి మద్దతుగా నిధులు సేకరిస్తున్నారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను టేలర్ స్విప్ట్ అస్త్రంగా మలుచుకున్నారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్విప్టీస్ ఫర్ కమలా అని పిలిచే టేలర్ స్విప్ట్ అభిమానుల సంస్థ కమలా హారిస్ ప్రచారం కోసం 40వేల డాలర్లకు పైగా నిధుల్ని సేకరించినట్లు ప్రకటించింది. అమెరికన్ పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్.. అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్కి తాను ఓటు వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే టేలర్ స్విఫ్ట్ నిర్ణయంపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఐ హేట్ టేలర్ స్విప్ట్ అంటూ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు హారిస్ కు మద్దతు పలికిన టేలర్ స్విఫ్ట్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను ఉపయోగించిన టేలర్ స్విప్ట్ అభిమానులు ఈ భారీ మొత్తంలో నిధులు సేకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా .. ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్ ను మేం ఒక అవకాశంగా మరల్చుకున్నాం. సోషల్ మీడియాలో ట్రంప్ కామెంట్స్ ను ఉపయోగించి ప్రచారం చేశాం. ప్రచారం మంచి ఫలితాల్ని అందించింది.మేము ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మీమ్లను ఉపయోగిస్తాము. వాటి అనుగుణంగా నెటిజన్ల భావోద్వేగాల్ని తమకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలో తెలుసు. వాస్తవానికి ద్వేషించేవారు ద్వేషిస్తారని మాకు (టేరల్ స్విప్ట్ అభిమానులు)తెలుసు. అలా ద్వేషించేవాళ్ల కంటే మేం ఇంకా మంచి పనులు చేయగలమని తెలుసు అని కమల ఫర్ స్విఫ్టీస్ కమ్యూనికేషన్స్ టీమ్ మెంబర్ కార్లీ లాంగ్ వ్యాఖ్యానించారు. -
ట్రంప్పై మరోసారి హత్యాయత్నం?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రాబోయే ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. అయితే ట్రంప్ క్షేమంగానే ఉన్నట్టు ఆయన ప్రచార బృందం వెల్లడించింది. ఫ్లోరిడాలో తన వెస్ట్ పామ్ బీచ్ నివాసం సమీపంలోని సొంత గోల్ఫ్ కోర్స్ లో గోల్ఫ్ ఆడుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి ఇంతకన్నా వివరాలేవీ లేవు‘అని ట్రంప్ ప్రచార బృందం అధికార ప్రతినిధి స్టీవెన్ చెంగ్ తెలిపారు. ట్రంప్ క్షేమమేనని ఆయన భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ విభాగం కూడా ధ్రువీకరించింది. కాల్పుల శబ్దం వినిపించగానే గోల్ఫ్ కోర్స్ ను మూసేసి ట్రంప్ ను అక్కడి నుంచి హుటాహుటిన తరలించినట్టు తెలిపింది. మరోవైపు.. కాల్పుల ఘటన అనంతరం తాను సేఫ్గా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఘటన గురించి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అధికారులు నివేదించారు. ఘటనలో ఎవరికీ గాయాలు అయినట్టు కూడా సమాచారం లేదని స్థానిక పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. నాకు సమీపంలోనే కాల్పులు జరిగాయి. పరిస్థితి అదుపులో లేదనేది రూమర్లే. మీ అందరికీ ఓ విషయం గట్టిగా చెప్పదల్చుకున్నా. నేను బాగున్నా. సురక్షితంగా ఉన్నా. ఏదీ నన్ను అడ్డుకోలేదు. నన్నెవరూ ఆపలేరు. ఎప్పటికీ లొంగేదే లేదు.:: డొనాల్డ్ ట్రంప్ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. ఆయనపై హత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన అనుమానితుడు భద్రతా సిబ్బంది అదుపులో ఉన్నాడు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. మన దేశంలో రాజకీయ హింసకు చోటు లేదని పునరుద్ఘాటిస్తున్నా. ట్రంప్నకు అన్ని విధాలా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భద్రతా సిబ్బందిని ఆదేశించా.:: అధ్యక్షుడు జో బైడెన్ట్రంప్ను లక్ష్యంగా చేసుకొనే దుండగుడు ఏకే 47 మోడల్ వంటి తుపాకీతో సంచరించాడు. మాజీ అధ్యక్షుడిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే సదరు దుండగుడు ఆయుధంతో అక్కడికి వచ్చినట్లు గుర్తించాం. నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్ డొనాల్డ్ ట్రంప్నకు 400 నుంచి 500 గజాల దూరంలోనే తన ఆయుధంతో సిద్ధమవుతుండగా భద్రతా ఏజెంట్లు కాల్పులు జరిపాయి. నిందితుడు ప్రస్తుతం మా అదుపులో ఉన్నాడు.. విచారణ చేపట్టాం.:::ఎఫ్బీఐ ఈ ఘటనపై కమలా హారిస్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికాలో రాజకీయ హింసకు తావులేదని అన్నారామె. I have been briefed on reports of gunshots fired near former President Trump and his property in Florida, and I am glad he is safe. Violence has no place in America.— Vice President Kamala Harris (@VP) September 15, 2024 ఇదీ చదవండి: ‘టారిఫ్’పై ట్రంప్కే ఓటుఇటీవలే హత్యాయత్నంఅధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ బరిలో ఉన్న 78 ఏళ్ల ట్రంప్ పై రెండు నెలల క్రితమే హత్యాయత్నం జరగడం తెలిసిందే. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రూక్ అనే యువకుడు సమీపంలోని గోడౌన్ మీదినుంచి ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. కుడి చెవికి తూటా తగిలింది. ట్రంప్ రక్తమోడుతూనే అమాంతం దయాస్ కిందకు ఒరిగి తనను తాను కాపాడుకున్నారు. భద్రతా సిబ్బంది వెంటనే దుండగున్ని కాల్చి చంపారు. అనంతరం ట్రంప్ ను హుటాహుటిన అక్కడినుంచి తరలించారు. నాటినుంచి ఆయనకు భద్రతను మరింత పెంచారు. -
Kamala Harris: నవతరం నాయకురాలిని
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కంటే తాను భిన్నమైన నేతనని, ‘నవతరం నాయకత్వాన్ని’అందిస్తానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. మార్పుకు ప్రతినిధిగా అమెరికన్ల ముందు తనను తాను ఆవిష్కరించుకుంటున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఫిలడెలి్ఫయాలో శుక్రవారం హారిస్ ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ విద్వేష, విభజన రాజకీయాలతో అమెరికన్లు విసిగిపోయారన్నారు. తనకు తుపాకీ ఉందని, ఎవరి తుపాకీ హక్కులను తాను హరించాలనుకోవడం లేదని తెలిపారు. ఆసల్ట్ స్టైల్ ఆయుధాలపైనే నిషేధం తప్పనిసరని తాను భావిస్తునన్నారు. బైడెన్కు మీరెలా భిన్నమో చెప్పాలని యాంకర్ బ్రియాన్ టాఫ్ అడగ్గా.. ‘నైనేతే జో బైడెన్ను కాను. నవతరం నాయకత్వాన్ని అందిస్తా’అని కమలా హారిస్ స్పందించారు. గతంలో ఆ నడిచిపోతుందిలే అని తేలికగా తీసుకున్న అంశాలను ఇకపై ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్నారు. పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులకు ఇచ్చే చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ను 6 వేల డాలర్లకు పెంచుతానన్నారు. ఒకరినొకరు వేలెత్తి చూపుకునేలా ప్రొత్సహిస్తున్న నాయకుడిలా (ట్రంప్లా) కాకుండా అమెరికన్లను ఏకతాటిపై నడిపే నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తనకు తెలుసన్నారు. -
ఉద్యోగాలకు డిగ్రీ తప్పనిసరేం కాదు : కమలా హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉద్యోగాలు, విద్యార్హతపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అద్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత దేశంలో కొన్ని ఫెడరల్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతను తొలగిస్తానని పేర్కొన్నారు. ఓ వ్యక్తి నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు.ఈ మేరకు పెన్సిల్వేనియాలోని విల్కేస్-బారేలో ప్రసంగిస్తూ.. ‘నేను అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. ఫెడరల్ ఉద్యోగాల కోసం అవసరంలేని డిగ్రీ అర్హతను తొలగిస్తాను. ఇది నాలుగు సంవత్సరాల డిగ్రీ లేని వారికి ఉద్యోగాల అవకాశాలు పెంచడానికి దోహదపడుతుంది. ’ అని తెలిపారు.కళాశాల డిగ్రీ కంటే అప్రెంటిస్షిప్, సాంకేంతిక కార్యక్రమాలు వంటివి విజయానికి గల మార్గాల విలువను అమెరికా గుర్తించాలని అన్నారు. వ్యక్తి నైపుణ్యాలను సూచించేందుకు డిగ్రీ తప్పనిసరి కాదని తెలిపారు. అదే విధంగా ప్రైవేట్ రంగం కూడా ఇదే విధాన్ని పాటించేలా చూస్తానని భరోసా ఇచ్చారు.అయితే కమలా హారిస్ ప్రసంగానికి. నిరసనకారుల ఆందోళన వల్ల అంతరాయం ఏర్పడింది. గాజాలో 10 వేల మంది మరణానికి కారణమైన ఇజ్రాయెల్ యుద్ధానికి యూఎస్ మద్దత తెలపడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కు ఆయుధాల రవాణాపై ఆంక్షలు విధించాలని, యుద్ధాన్ని ముగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో హారిస్ మాట్లాడుతూ..తమ ఆందోళనలను గౌరవిస్తానని చెప్పారు. కాల్పుల విరమణ, బందీల రక్షణ ఒప్పందానికి తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. చదవండి: పుతిన్పై ప్రశ్న.. రిపోర్టర్పై బైడెన్ ఆగ్రహంఇదిలా ఉండగా హారిస్ ఇజ్రాయెల్కు మద్దతిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్లకు అత్యధికంగా ఓటు వేసిన కార్యకర్తలు, ముస్లింలు, అరబ్బులతో సహా పాలస్తీనా అనుకూల అమెరికన్లు ఉన్నారు. వీరు ఈసారి తమ ఆలోచనను మార్చుకుంటే.. అది హారిస్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని పరిశీలకులు అంటున్నారు.అయితే 2023లో యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అమెరికన్ యువతలో 62% కంటే ఎక్కువ మంది బ్యాచిలర్ డిగ్రీని కూడా కలిగి లేరు. 2020లో ఐదుగురు ఓటర్లలో ముగ్గురు కళాశాల డిగ్రీ కూడా చేయలేదు. ఇందుకు కారణం విద్యకు అధిక ఖర్చు అవ్వడమేనని తేలింది.కాగా అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరులో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ పడబోతున్నారు. వీరిరువురు ఇటీవల ఓ టీవీ చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. -
కమల గెలిస్తే శ్వేతసౌధంలో కర్రీ వాసనలే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీ పడుతున్న భారత సంతతి మహిళ కమలా హారిస్ పట్ల జాతి వివక్ష వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సన్నిహితురాలు లారా లూమర్ తాజాగా కమల హారిస్పై నోరుపారేసుకున్నారు. కమల అమెరికా అధ్యక్షురాలైతే శ్వేతసౌధం కర్రీ (కూర) వాసనలతో నిండిపోతుందని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కమల తల్లి శ్యామల గోపాలన్ భారతీయురాలన్న సంగతి తెలిసిందే. కమల భారతీయ మూలాలను, అలవాట్లు, సంస్కృతిని లారా లూమర్ పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఇటీవల ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘‘నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే వైట్హౌస్లో కూర వాసనలే ఉంటాయి. వైట్హౌస్లో ప్రసంగాలు కాల్ సెంటర్ ద్వారా వినిపిస్తాయి. అమెరికా ప్రజలు ప్రభుత్వానికి తమ సలహాలు, సూచనలు కేవలం కస్టమర్ శాటిస్ఫాక్షన్ సర్వే ద్వారా పంపించాల్సి ఉంటుంది’’ అని లూమర్ పేర్కొన్నారు. నేషనల్ గ్రాండ్పేరెంట్స్ డే సందర్భంగా కమలా హారిస్ సోషల్ మీడియా పోస్టు చేసిన చేసిన ఫోటోపై ఆమె పై విధంగా స్పందించారు. కమలా హారిస్పై లూమర్ చేసిన వ్యాఖ్యల పట్ల వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరీన్ జీన్–పియర్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ చర్చా.. ఆ చాన్సే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్తో మరో డిబేట్లో పాల్గొనబోనని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన బిగ్ డిబేట్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్పై తాను గెలిచానని, ఆమె ఓడిపోయినందునే మరో చర్చ అంటున్నారని తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్లో గురువారం ప్రకటించారు. జూన్లో అధ్యక్షుడు జో బైడెన్తో జరిగిన మొదటి డిబేట్, ఆ తర్వాత హ్యారిస్తో మంగళవారం జరిగిన డిబేట్ను ప్రస్తావిస్తూ ఇక మూడోది ఉండబోదని స్పష్టం చేశారు. గెలుపు తనదేనని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని ట్రంప్ చెప్పారు. కాగా, ప్రధాన మీడియా సంస్థల సర్వేల ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బిగ్ డిబేట్ను చూసిన వారిలో 63 శాతం మంది కమలా హారిస్ గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేయగా, 37 శాతం మంది మాత్రమే ట్రంప్ వైపు మొగ్గు చూపారని సీఎన్ఎన్ సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఇయర్రింగ్స్తో కుట్ర చేయొచ్చా? ట్రంప్-హారిస్ డిబేట్పై ఒకటే చర్చ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్లు తమ ప్రచారంతో దూసుకుతున్నారు. ఈ తరుణంలో ఏబీసీ మీడియా నిర్వహించిన డిబేట్పై ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. డిబేట్లో ట్రంప్పై హారిస్పై చేయి సాధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ట్రంప్ మద్దతు దారులు హారిస్పై మండిపడుతున్నారు. కుట్రపూరితంగా కమలా హారిస్ తన ముత్యాల చెవిపోగుల ముసుగులో ఆడియో హెడ్ఫోన్లను వినియోగించారని మండిపడుతున్నారు. ట్రంప్ సైతం డిబేట్లో హారిస్ ఈ తరహా చెవిపోగులు ధరించడం అనవసరమన్నారు. కమలా హారిస్ తన ముత్యాల చెవిపోగుల ముసుగులో ఆడియో హెడ్ఫోన్లను వినియోగించారని డిబేట్లో కలిగి ఉన్నారని వాదించిన ట్రంప్ మద్దతుదారులు ఎక్కువగా కుట్ర సిద్ధాంతాన్ని అనుసరించారు. ఆమె చెవిపోగులు నిజానికి ఐస్బాచ్ సౌండ్ సొల్యూషన్స్ నోవా హెచ్1 ఆడియో చెవిపోగులు అని ఊహాగానాలు వచ్చాయి, ఇది బ్లూటూత్ పరికరం ఆభరణాల వలె కనిపిస్తుంది. 🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOFShe is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023. This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024ఈ నేపథ్యంలో టెక్ కంపెనీ ఐస్బాచ్ ఎండీ మాల్టే ఐవర్సెన్ స్పందించారు.హారిస్ మా ఉత్పత్తులలో ఒకదాన్ని ధరించారో లేదో మాకు తెలియదు.కానీ ఆమె ధరించిన ఇయర్రింగ్స్ బాగున్నాయని సెలవిచ్చారు. డిబేట్పై అనేక వాదనలు తెరపైకి వస్తున్నప్పటికీ టిఫనీ అండ్ కో అనే సంస్థ ఇయర్రింగ్స్ ధర సుమారు 800కి అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఐస్బాచ్ విక్రయించే బ్లూటూత్ ధర సుమారు 625 డాలర్లుగా ఉంది. హారిస్ గతంలో బ్లూటూత్ ఇయర్పీస్ల వినియోగంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల ప్రచార సమయంలో వైర్డు ఇయర్బడ్లను ఉపయోగించారు. ఇలా ప్రతి సారి ఆమె ధరించే ఆభరణాల చుట్టూ ఊహాగానాలు, రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కాగా, హారిస్ ట్రంప్ టీవీ డిబేట్, టేలర్ స్విప్ట్పై ఎలోన్ మస్క్ కామెంట్స్ చర్చ కొనసాగుతూనే ఉంది. నీల్సన్ డేటా ప్రకారం, ఏబీసీ మీడియా నిర్వహించిన డిబేట్ను 67.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి : మోదీ నా మంచి స్నేహితుడు : పుతిన్ -
‘మీపై అసహ్యం వేస్తుంది నాన్న’ : మస్క్ కుమార్తె
అమెరికన్ పాప్ సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్పై ఎలోన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ స్పందించారు. తన తండ్రి స్విప్ట్పై చేసిన కామెంట్స్ అసహ్యం కలుగుతున్నాయని, మహిళల్ని ద్వేషించే వ్యక్తి మస్క్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాలని అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తొలి డిబేట్ జరిగింది. ఆ డిబేట్పై టేలర్ స్విప్ట్ స్పందించారు. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను హరిస్కు మద్దతు పలుకుతున్నట్లు సోషల్ మీడియా పోస్ట్లో వెల్లడించారు. ఇదీ చదవండి : కేజ్రీవాల్కు బెయిల్ఆ పోస్ట్పై స్పందించిన ఎలోన్ మస్క్ స్విప్ట్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై వివియన్ జెన్నా విల్సన్ మాట్లాడుతూ స్విప్ట్పై తన తండ్రి చేసిన కామెంట్లు అత్యంత హేయం. అసహ్యకరంగా ఉంది. ఈ సందర్భంగా నా అభిమానులు ఒకటే చెప్పాలను అనుకుంటున్నారు. మీతో ఎవరైనా ఇలా మాట్లాడతారేమో..మాట్లాడన్వికండి అని సలహా ఇచ్చారు.నాన్నంటే నచ్చదుఎలోన్ మస్క్ మాజీ భార్య జస్టిన్ విల్సన్తో 2008లో విడాకులు తీసుకున్నారు. మస్క్ - జస్టిన్ దంపతులకు జేవియర్ అలెగ్జాండర్,గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్ అలెగ్జాండర్ అమ్మాయిగా మారి తన పేరును వివియన్ జెన్నా విల్సన్గా మార్చుకుంది. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు జెన్నా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. -
హారిస్తో మళ్లీ డిబేట్.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్తో మళ్లీ డిబేట్లో పాల్గొనే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఓడిపోయిన వాళ్లే మళ్లీ డిబేట్ అవసరమని అడుగుతారని కమలాహారిస్ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్మీడియా ప్లాట్ఫాం ట్రూత్సోషల్లో ట్రంప్ ఒక పోస్టు చేశారు. ‘కామ్రేడ్ హారిస్తో డిబేట్లో నాదే పైచేయి అని సర్వేలన్నీ చెబుతున్నాయి. ఆమె డిబేట్లో ఓడిపోయారు. ఓడిపోయినందునే ఆమె మరో డిబేట్ కావాలని అడుగుతున్నారు. ఆమెతో రెండో డిబేట్ అనేది ఉండదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా, డిబేట్లో తనదే పైచేయి అని ట్రంప్ ఉటంకించిన సర్వేలన్నీ పెద్దగా పేరులేని, ఎవరికీ తెలియని సంస్థలు వెల్లడించినవి కావడం గమనార్హం. సీఎన్ఎన్లాంటి ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు మాత్రం హారిస్, ట్రంప్ డిబేట్ వీక్షించిన 63 శాతం మంది ప్రజలు హారిసే విజయం సాధించారని భావిస్తున్నట్లు వెల్లడించడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అభ్యర్థులు ట్రంప్, హారిస్ల మధ్య మంగళవారం ఫిలడెల్ఫియాలో బహిరంగ చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఇదీ చదవండి.. మరోసారి ట్రంప్తో కమల కరచాలనం -
మరోసారి ట్రంప్తో కమల కరచాలనం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్లు మరోసారి చేతులు కలిపారు. నిన్న డిబేట్ ప్రారంభానికి ముందు ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా మరోసారి కరచలనం చేసుకున్నారు.9/11 దాడులు.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన. నిన్నటితో దాడులకు 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంలో.. న్యూయార్క్లోని 9/11మొమోరియల్ వద్ద సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జో బైడెన్తో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి బైడెన్ సమక్షంలో మరోసారి కరచాలనం చేసుకున్నారు. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలదెల్ఫియాలో 90 నిమిషాల ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో ట్రంప్, హారిస్ ఇద్దరూ సరికొత్త సంప్రదాయానికి తెరతీశారు. గత కొన్నేళ్లలో జరిగిన డిబేట్లలో అధ్యక్ష అభ్యర్థులెవరూ డిబేట్కు ముందు ఎవరూ ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. 🚨 After putting on a MAGA hat, Joe Biden told a group of Trump supporters: “No eating dogs and cats”pic.twitter.com/TIxtN5LDOa— Benny Johnson (@bennyjohnson) September 12, 2024ట్రంప్ టోపీ ధరించిన జో బైడెన్ ఇదే సంస్మరణ సభలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొన్నారు. అయితే ఇదే కార్యక్రమానికి ట్రంప్2024 అని ఉన్న టోపీని ధరించిన ట్రంప్ అభిమానులున్నారు. ట్రంప్ అభిమానులు ధరించిన టోపీని చూసిన బైడెన్ సరదాగా వారితో మాట్లాడారు. అందులో ఓ ట్రంప్ మద్దతు దారుడు ధరించిన టోపీని బైడెన్ ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇదీ చదవండి : ట్రంప్- హారిస్ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి -
USA Presidential Elections 2024: కమలదే పై చేయి
డిబేట్ కోసం ప్రత్యర్థులిద్దరూ ఏబీసీ వేదికపైకి రాగానే హారిసే చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. తద్వారా ముందే పైచేయి సాధించారు. డిబేట్ చక్కగా సాగాలని ఆమె ఆకాంక్షించగా, ‘హావ్ ఫన్’ అంటూ ట్రంప్ స్పందించారు.గంటా నలభై ఐదు నిమిషాల పాటు సాగిన డిబేట్ ముగిశాక మాత్రం కరచాలనం వంటివేమీ లేకుండానే ఎవరికి వాళ్లు వేదిక నుంచి నిష్క్రమించారు.డిబేట్ పొడవునా హారిస్ పదేపదే ట్రంప్ను ఉడికించే వ్యాఖ్యలు చేశారు. పలు కేసుల్లో ఆయన దోషి అని ఇప్పటికే నిరూపణ అయిందంటూ ఎత్తిచూపారు. ఆయనపై మరెన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ మాట్లాడుతుండగా పదేపదే నవ్వులు, ప్రశ్నార్థక చూపులతో ఆయన్ను ఒత్తిడిలోకి నెట్టారు.ఈ ఎత్తుగడలన్నీ బాగా ఫలించాయి. హారిస్ ఇలాంటి విమర్శలు చేసినప్పుడల్లా ట్రంప్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆగ్రహంలో అదుపు తప్పి పదేపదే అబద్ధాలు, అవాస్తవాలు చెప్పారు.ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం హారిస్ ఇటీవల ఆమె నల్లజాతి మూలాలను పదేపదే చెప్పుకుంటున్నారన్న తన గత వ్యాఖ్యలపై స్పందించేందుకు ట్రంప్ నిరాకరించారు. హారిస్ మాత్రం పలు సందర్భాల్లో ట్రంప్ చేసిన వివాదాస్పద జాతి వివక్షపూరిత, విద్వేష వ్యాఖ్యలన్నింటినీ ఏకరువు పెట్టారు.వాషింగ్టన్: అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూసిన తొలి, బహుశా ఏకైక ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59)దే పై చేయి అయింది. ఆమె దూకుడు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (78) వెలవెలబోయారు. మంగళవారం రాత్రి పెన్సిల్వేనియాలో ఏబీసీ వార్తా సంస్థ వేదికగా జరిగిన డిబేట్లో మాజీ అధ్యక్షునిపై హారిస్ ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించారు. దాదాపుగా ప్రతి అంశంలోనూ ట్రంప్ను చిత్తు చేశారు. ఆమె పక్కాగా హోం వర్క్ చేసి వచి్చన తీరు డిబేట్లో అడుగడుగునా కని్పంచింది. తొలుత కాస్త తడబడ్డా డిబేట్ సాగుతున్న కొద్దీ హారిస్ దూకుడు కనబరిచారు. పదునైన పంచ్లతో, టైమ్లీ వన్ లైనర్లతో ఎక్కడికక్కడ ట్రంప్ను ఇరుకున పెట్టారు. ఆర్థిక వ్యవస్థ మొదలుకుని విదేశీ విధానం, వలసలు, అబార్షన్ల దాకా ప్రతి అంశం మీదా చర్చను తను కోరుకున్న దిశగా నడిపించడంలో విజయవంతమయ్యారు. పూర్వాశ్రమంలో లాయర్ అయిన హారిస్ వాదనా పటిమ ముందు ట్రంప్ నిలువలేకపోయారు. చాలావరకు ఆమె ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు వివరణలు ఇచ్చుకోవడానికే పరిమితమయ్యారు. తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో అధ్యక్షుడు జో బైడెన్ను ట్రంప్ ఓ ఆటాడుకోవడం తెలిసిందే. ట్రంప్ పచ్చి అబద్దాలు చెప్పినా బైడెన్ కనీసం వాటిని వేలెత్తి చూపలేకపోయారు. పైగా ప్రసంగం మధ్యలో పదేపదే ఆగుతూ, పదాల కోసం తడుముకుంటూ, వయోభారంతో వణుకుతూ అభాసుపాలయ్యారు. ఈ దారుణ వైఫల్యంతో చివరికి పోటీ నుంచే బైడెన్ తప్పుకోవాల్సి వచి్చంది. ఆయన స్థానంలో అధ్యక్ష రేసులోకి వచ్చిన హారిస్ మాత్రం తాజా డిబేట్లో ట్రంప్కు చెమటలు పట్టించారు. ‘‘మన దేశాన్ని ఎలా నడపాలన్న ప్రధానాంశంపై ఈ రాత్రి మీరు ఇంతసేపూ రెండు భిన్నమైన వాదనలు విన్నారు. ఒకటి భవిష్యత్తుపై దృష్టి పెట్టిన నా వాదన. రెండోది గతం గురించి మాత్రమే మాట్లాడిన, దేశాన్ని వెనక్కే తీసుకెళ్లజూస్తున్న ట్రంప్ వాదన’’ అంటూ డిబేట్ను అంతే ప్రభావవంతంగా ముగించారు హారిస్.అబార్షన్పై హారిస్ → ట్రంప్ గెలిస్తే అబార్షన్లను నిషేధిస్తూ చట్టం తెస్తారు. → గర్భధారణలు, అబార్షన్లను ప్రభుత్వం వేయి కళ్లతో గమనిస్తుంటుంది. → అమెరికన్ల శరీరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోరాదన్నదే నా వైఖరి. → ట్రంప్ మాత్రం మహిళల శరీరాలపై హక్కులు ప్రభుత్వాలవేనంటున్నారు.ట్రంప్ → అబార్షన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలన్నదే నా విధానం. → అదిప్పటికే అమల్లో ఉంది. కనుక దీనిపై అసలు గొడవ గానీ, భిన్నాభిప్రాయాలు గానీ లేవు. → అంతే తప్ప నేనేమీ అబార్షన్లను నిషేధించబోవడం లేదు. → ఈ విషయంలో హారిస్ చెప్పేవన్నీ అబద్ధాలే.ఎన్నికల ర్యాలీలపైహారిస్ → ట్రంప్ ఎన్నికల ర్యాలీలు ఆద్యంతం పరమ బోరుగా సాగుతున్నాయి.→ జనాన్ని ఆకట్టుకునేలా మాట్లాడటంలో ఆయన ఘోరంగా విపలమవుతున్నారు. → విండ్ మిల్లుల వల్ల క్యాన్సర్ వస్తుంది వంటి కామెంట్లతో అభాసుపాలవుతున్నారు. → ట్రంప్ ప్రసంగం వినలేక జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.ట్రంప్ → అన్నీ శుద్ధ అబద్ధాలు. బైడెన్–హారిస్ విధానాలతో అమెరికా అన్ని రంగాల్లోనూ కుదేలవుతోంది. అందుకే అమెరికన్లు పాత రోజులను కోరుకుంటున్నారు.→ దాంతో నా ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. → వాటికి అమెరికా చరిత్రలోనూ అపూర్వమైన ఆదరణ దక్కుతోంది. → హారిస్ తన ర్యాలీలకు డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు.ఆర్థిక వ్యవస్థపైట్రంప్: ఈ విషయంలో నేనేం చేయబోతున్నదీ అందరికీ తెలుసు. నా హయాంలో కరోనా కల్లోలాన్ని తట్టుకుంటూ అమెరికా ఆర్థిక వ్యవస్థను గొప్పగా మలిచా. దాన్ని మరోసారి చేసి చూపిస్తా. పన్నులకు భారీగా కోత పెడతా. హారిస్ మార్క్సిస్టు. మార్క్సిస్టు తండ్రి నుంచి పాఠాలు నేర్చుకున్నారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విధానాల్లో ఆమె ఇప్పుడు నా భాషనే మాట్లాడుతున్నారు. కానీ గెలిచారంటే మాత్రం దేశాన్ని సర్వనాశనం చేస్తారు. బైడెన్కు, ఆమెకు తేడా లేదు. హారిస్: నేను బైడెన్నూ కాను, ట్రంప్ను అంతకన్నా కాను. ఈ విషయంలో నేను చెప్పదలచుకున్నది ఒక్కటే. దేశానికి కొత్త తరం నాయకత్వాన్ని అందిస్తా. ఉత్త మాటలే తప్ప నిజానికి ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ట్రంప్ వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. తన క్షేమం తప్ప ఆయనకు మీరెవరూ పట్టరు. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచి్చన నాకు ఆర్థికంగా దేశానికి ఏం కావాలో బాగా తెలుసు.వలసలపైట్రంప్ సరిహద్దుల నుంచి లక్షలాది మంది చొరబడుతున్నారంటే వలసల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న హారిసే ప్రధాన కారణం. వాళ్లు మన పెంపుడు జంతువులను కూడా తినేస్తున్నారు. ఈ చొరబాట్లు అమెరికాకు చాలా చేటు చేస్తాయి.హారిస్ ట్రంప్ వల్లే వలసల బిల్లు బుట్టదాఖలైందని విమర్శించడం మినహా ఈ అంశంపై పెద్దగా ఏమీ మాట్లాడలేదు. వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారన్న ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికన్లే పెదవి విరుస్తున్న నేపథ్యంలో వాటిపై వ్యూహాత్మక మౌనం పాటించారు.యుద్ధాలు, విదేశీ వ్యవహారాలపై... ట్రంప్ → నేను గెలిస్తే ఉక్రెయిన్ యుద్ధానికి ఒక్క రోజులో ముగింపు పలుకుతా. నేను ప్రెసిడెంట్గా ఉంటే యుద్ధం జరిగేదే కాదు. (ఉక్రెయిన్ గెలవాలనుకుంటున్నారా అన్న మోడరేటర్ల ప్రశ్నకు బదులు దాటవేశారు. పైగా యుద్ధానికి మిలియన్ల మంది బలయ్యారని అవాస్తవాలు చెప్పారు) → 2021లో అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలగడం దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సందర్భం. → ఇజ్రాయెల్ను హారిస్ ద్వేషిస్తారు. హారిస్ గెలిస్తే రెండేళ్లలోనే ఇజ్రాయెల్ సర్వనాశనం ఖాయం. అరబ్బులన్నా ఆమెకు ద్వేషమే.హారిస్ → అఫ్గాన్ నుంచి వైదొలగాలన్న బైడెన్ నిర్ణయం నాటి పరిస్థితుల్లో పూర్తిగా సబబే. ట్రంప్ తాలిబన్లతో అత్యంత బలహీన ఒప్పందం చేసుకున్నారు.→ నియంతలంటే ట్రంప్కు మహా ఆరాధన.→ నేను ఇజ్రాయెల్ను ద్వేషిస్తానన్నది పచ్చి అబద్ధం. యూదు రాజ్యాన్ని మొదటినుంచీ సమర్థిస్తున్నా. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్కు స్వీయరక్షణకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ అమాయక పాలస్తీనియన్లు భారీ సంఖ్యలో యుద్ధానికి బలవుతున్నారన్నది కూడా వాస్తవమే. కనుక యుద్ధం తక్షణం ఆగాలి. కాల్పుల విరమణ, బందీల విడుదలే అందుకు మార్గం. దానికోసం కృషి చేస్తా.2020 ఎన్నికల ఫలితాలపైట్రంప్: వాటిలో నిజమైన విజేతను నేనే. క్యాపిటల్ హిల్ భవనంపై దాడితో నాకు సంబంధం లేదు. హారిస్: అమెరికా చరిత్రపై చెరగని మచ్చ ఏదన్నా ఉంటే అది కాపిటల్ హిల్పై దాడే. దాన్ని మర్చిపోయి ముందుకు సాగాలి. ట్రంప్పై హారిస్ పంచ్లు → ట్రంప్ ఓ బలహీన నాయకుడు. తప్పుడు నేత. ఆయన్ను చూసి ప్రపంచ దేశాధినేతలంతా నవ్వుతున్నారు. → అధ్యక్ష పదవికి ట్రంప్ కళంకమని ఆయనతో కలిసి పని చేసిన సైనిక ఉన్నతాధికారులే అంటున్నారు. → ట్రంప్ అంటేనే అబద్ధాలు, అభూత కల్పనలు. ఈ డిబేట్లో కూడా ఆయన చేసేదదే. → ట్రంప్ ఎంతసేపూ తన గురించే మాట్లాడతారు. ప్రజలు ఆయనకు అసలే పట్టరు. దేశానికి కావాల్సింది ప్రజల కోసం పాటుపడే నాయకుడే తప్ప ట్రంప్ వంటి స్వార్థపరుడు కాదు. → ఆయన 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. 8.1 కోట్ల మంది ఆయనకు అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసన పలికారు (బైడెన్కు ఓటేసిన వారి సంఖ్యను ఉటంకిస్తూ). దాన్ని ట్రంప్ ఇప్పటికీ అస్సలు జీరి్ణంచుకోలేకపోతున్నారు.హారిస్కే 63 శాతం మంది ఓటు → డిబేట్లో ట్రంప్ను హారిస్ చిత్తు చేశారని సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఫ్లాష్ పోల్లో 63 శాతం మంది పేర్కొన్నారు! → ట్రంప్కు బాగా అనుకూలమని పేరున్న ఫాక్స్ న్యూస్ కూడా డిబేట్ విజేత హారిసేనని అంగీకరించడం విశేషం. → చర్చకు వేదికైన ఏబీసీ న్యూస్ అభ్యర్థులిద్దరి వ్యాఖ్యలు, ప్రకటనలను లైవ్లో అప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసింది.ట్రంప్ చెప్పిన వాటిలో చాలావరకు అవాస్తవాలేనని తేలడం విశేషం. -
ఆమె మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్కు తాను మద్దతిస్తున్నట్లు అమెరికన్ పాప్స్టార్ టేలర్ స్విఫ్ట్ తెలిపారు.అయితే తాజాగా ఆమె కమలకు మద్దతు ఇవ్వటంపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ టేలర్ స్విఫ్ట్పై అక్కసు వెళ్లగక్కారు. ఆమె ఎప్పుడూ డెమోక్రట్లకే మద్దతు పలుకుతుందని విమర్శలు గుప్పించారు. ట్రంప్ బుధవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ నేను టేలర్ స్విఫ్ట్ అభిమానిని కాదు. ఆమె చాలా ఉదారవాద వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ డెమొక్రాట్ల మాత్రమే సమర్థిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆమె తర్వాత తగిన మూల్యం చెల్లించవల్సి వస్తుంది’’ అని అన్నారు.కమల హారిస్, డొనాల్డ్ తొలి డిబేట్ పూర్తి అయిన వెంటనే టేలర్ స్విఫ్ట్ తన మద్దతును సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. ‘ అధ్యక్ష ఎన్నికల్లో నేను డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, టిమ్ వాల్జ్కు ఓటు వేస్తాను. ఎందుకంటే ఆమె దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. వారియర్ అయిన కమల ఛాంపియన్గా గెలవాల్సిన అవసరం ఉంది. గొడవలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా పరిపాలన అందిస్తే.. దేశంలో మనం చాలా ఎక్కువగా సాధించగలమని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు.మరోవైపు.. అభిమానులు ‘స్విఫ్టీస్ ఫర్ కమల’ అని కమలా హారిస్ కోసం ప్రచారం ప్రారంభించినా మంగళవారం వరకు కూడా టేలర్ స్పందించలేదు. అయితే మరికొంత మంది ఆమె ట్రంప్కు మద్దతు పలుకుతున్నట్లు ఏఐ జనరేటెడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆసత్య ప్రచారానికి చెక్ పెడుతూ కమలకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏఐతో భయం కలుగుతోందని, తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు. -
కమలా హారిస్ క్లియర్ విన్నర్ కాదా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ వాడీవేడిగా సాగింది. అయితే, ఈ డిబేట్లో ఆద్యాంతం కమలదేపై చేయి నడిచిందంటూ అమెరికా మీడియా చెబుతుండగా.. సోషల్ మీడియాలో మాత్రం ఓ కొత్త చర్చ మొదలైంది.కమలా హారిస్ ఛీటింగ్ చేశారంటూ కొందరు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. దానికి ట్రంప్ మద్దతుదారులు జత కలవడంతో అది తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఈ చర్చకు కారణం..డిబేట్ టైంలో ఆమె ధరించిన చెవిపోగులే.పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా ట్రంప్-కమల మధ్య సంవాదం 90 నిమిషాల పాటు కొనసాగింది. ఇద్దరూ పలు అంశాలపై పరస్పర విమర్శలు గుప్పించున్నారు. డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ డిబేట్ను అత్యుత్తమ చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానని చెప్పారు. అయితే కమలకే ఎక్కువ ఓట్లు పడ్డప్పటికీ.. ఇప్పుడు ఓ విమర్శ ఆమెను చుట్టుముట్టింది.ఈ చర్చలో కమలా హారిస్ ధరించిన చెవిపోగులు సీక్రెట్ పరికరమని, వాటి సాయంతోనే ఆమె డిబేట్లో అంత అద్భుతంగా మాట్లాడగలిగారంటూ కొందరు వాదిస్తున్నారు. ఈమేరకు కొన్ని వెబ్సైట్ ఫొటోలను, రివ్యూలను చూపిస్తున్నారు.Kamala Harris wasn’t wearing Nova H1 earring headphones. Quit lying to yourselves. She’s wearing Tiffany Hardwear pearl earrings. See how the Nova earrings only have one stalk coming off of them? See how Kamala’s has two? They’re not even the same thing. pic.twitter.com/zfTXRjEfDr— Daulton (@DaultonVenglar) September 11, 2024‘‘డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సంవాదంలో కమలా హారిస్ అద్భుతంగా మాట్లాడారు. ఇయర్రింగ్ మాదిరిగా ఉండే ఇయర్ఫోన్కు సంబంధించిన కథనం గుర్తుకు వచ్చింది’’ అని ఓ నెటిజన్, ఒబామా మాదిరిగానే కమలా బాగా మాట్లాడారన్న మరో యూజర్.. ఆమె ధరించిన చెవిపోగులు నోవా హెచ్1 ఆడియో ఇయర్రింగ్స్ మాదిరిగానే ఉన్నాయన్నారు. అయితే ఆమె మద్దతుదారులు మాత్రం ఆ వాదనను ఖండించారు. ఆమె రెగ్యులర్గా ధరించే ఇయర్రింగ్స్ అవని, వాటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు.🚨🚨KAMALA HARRIS EXPOSED FOR WEARING EARPIECE IN DEBATE *PROOFShe is seen wearing an earring developed by Nova Audio Earrings first seen at CES 2023. This earring has audio transmission capabilities and acts as a discreet earpiece.Kamala Harris confirms claims that a… pic.twitter.com/1y60rUdJT0— ELECTION2024 🇺🇸 (@24ELECTIONS) September 11, 2024ఇక.. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో విన్నర్గా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ గెలిచారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా చానెల్స్ అధికారికంగా ప్రకటించాయి. డిబేట్లో ట్రంప్, హారిస్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారంటూ విశ్లేషణాత్మక కథనాలు ఇచ్చాయి. డిబేట్లో పాల్గొన్న అభ్యర్థులిద్దరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు: ఫాక్స్ న్యూస్కమలా హారిస్పై పైచేయి సాధించేందుకు ట్రంప్ అసంబద్ధ వాదనలు. అయితే టైం వేస్ట్ చేయకుండా ట్రంప్పై హారిస్ విరుచుకుపడ్డారు: ఏబీసీ మీడియాఈ డిబేట్లో కమలా హారిస్దే భారీ విజయం: పొలిటికోడిబేట్లో ట్రంప్ తనను తాను సమర్థించుకునేందుకు యత్నించారు. ట్రంప్ వాదనలు సత్యదూరంగా ఉన్నాయి. ఒక ప్రాసిక్యూటర్గా తన అనుభవాన్ని ఉపయోగించి ట్రంప్ను ఇరకాటంలో పడేసేందుకు కమల ప్రయత్నించారు: ది న్యూయార్క్ టైమ్స్కమలా హారిస్ ప్రసంగంతో ట్రంప్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆమె పూర్తి సన్నద్ధతతో డిబేట్కు వచ్చారు: సీఎన్ఎన్డిబేట్లో ఇద్దరి మధ్య విమర్శ-ప్రతివిమర్శల్లో.. హారిస్దే పైచేయిగా సాగిందని, ట్రంప్ ఘోరంగా తడబడ్డారంటూ యూఎస్ మీడియా పేర్కొంది. అలాగే.. స్వింగ్ స్టేట్స్లోనూ కమలకు మంచి మార్కులు పడ్డాయని తెలిపాయి. మొత్తంగా హారిస్ ఈ డిబేట్లో క్లియర్ విన్నర్ అని తేల్చేశాయి.ఇదీ చదవండి: ట్రంప్ ఏమాత్రం మారలేదు -
కమలా హారిస్కు మద్దతుగా పాప్స్టార్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మద్దతు పలికారు.ఈ నేపథ్యంలో ఈసందర్భంగా హారిస్ను వారియర్గా అభివర్ణించిన ఆమె..చైల్డ్లెస్ క్యాట్లేడీ (తనకూ పిల్లలు లేరంటూ) ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు.అంతేకాదు అధ్యక్ష ఎన్నికల్లో హారిస్కు ఓటు వేస్తానని ప్రకటించారు. అందుకు గల కారణాల్ని వివరించారు. హారిస్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. వాటిని సాధించాలంటే వారియర్ అవసరమని నేను నమ్ముతున్నాను’అని ఇన్స్టా పోస్ట్లు రాశారు. హారిస్ స్థిరమైన, ప్రతిభావంతులైన నాయకురాలు అని భావిస్తున్నాను. ప్రశాంతతో గందరగోళంతో కాకుండా ప్రశాంతంగా దేశం కోసం ఏదైనా సాధించవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు. కాగా, స్విఫ్ట్ 2020లో ప్రెసిడెంట్ జో బైడెన్, హారిస్లకు మద్దతు పలికారు. ఆమె కెరీర్లో డెమోక్రటిక్ పార్టీ రాజకీయ నాయకులకు మద్దతుగా పలుమార్లు బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరో ఎనిమిది వారాల్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్కు మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి : దేశాన్ని అమ్మేసిన ట్రంప్World’s shittiest dad offers to impregnate Taylor Swift (presumably because she threw her support behind Kamala Harris).Totally normal. Right? Right? 🤮#Debate2024 #ElonMusk pic.twitter.com/UP0zSWxnmj— Nonsensei Sean (@yes_nonsensei) September 11, 2024ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ తరుఫున అమెరికా ఉపాధ్యక్షుడిగా బరిలోకి దిగిన జేడీ వాన్స్ గతంలో హారిస్ను ఛైల్డ్లెస్ క్యాట్ లేడీ విమర్శలు చేసిన వీడియో వైరల్గా మారింది. వాన్స్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. దానిపై టేలర్ స్విప్ట్ స్పందించారు. తాను కూడా ఛైల్డ్లెస్ క్యాట్ లేడీ అంటూ పిల్లిని ఎత్తుకున్న ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోపై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆమె పిల్లులకు తాను సంరక్షకుడిగా ఉంటానంటూ అభ్యంతరకంగా మాట్లాడారు. -
అమెరికా ఎన్నికల్లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ సాంగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ దూసుకెళ్తున్నారు. భారత మూలాలున్న ఆమెకు భారీగానే మద్దతు లభిస్తోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య పోటీ కూడా తీవ్రంగానే ఉంది. నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రట్, రిపబ్లికన్ అభ్యర్థులు తమ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ సరికొత్తగా ఆర్ఆర్ఆర్ సాంగ్తో ప్రచారంలో దిగారు.దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలను ఆకర్షించేందుకు కమలా హారీస్ అడుగులేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె వినూత్న ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ 'నాటు నాటు' సాంగ్ హిందీ వర్షన్తో ఒక వీడియోను రూపొందించారు. ఈ పాటలో ఆమె విజువల్స్ వచ్చేలా ఎన్నికల ప్రచార గీతాన్ని క్రియేట్ చేశారు.ఆ వీడియోను ఇండియన్-అమెరికన్ వ్యవస్థాపకుడు అజయ్ భూటోరియా విడుదల చేశారు. ఆ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రచారం గీతం వస్తున్న క్రమంలో భారతీయ మూలాలకు చెందిన పలువురు వ్యక్తుల కామెంట్లను కూడా వినిపించారు. కమలా హారిస్కు ఓట్ వేయాలని తెలుగు భాషలో కూడా డెమొక్రాటిక్ పార్టీ నేతలు అభ్యర్థించారు. దక్షిణాసియాకు చెందినవారు అమెరికాలో భారీగానే ఉన్నారు. సుమారు 60 లక్షల ఓట్లు దక్షిణాసియాకు చెందిన వారివి ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పడు వారు ఎటువైపు మద్ధతు ఇస్తే.. వారిదే గెలుపు అని అక్కడ ట్రెండ్ అవుతుంది. ఇదీ చదవండి: విడాకుల గురించి జయం రవిపై భార్య సంచలన ఆరోపణకమలాహారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలేనని తెలిసిందే. శ్యామల తండ్రే పీవీ గోపాలన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. అయితే, శ్యామల 1958లో ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియా వెళ్లి అక్కడే డాక్టరేట్ పూర్తి చేశారు. రొమ్ము క్యాన్సర్పై ఆమే అనేక పరిశోధనలు జరిపారు. అనంతరం జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ను శ్యామలా పెళ్లి చేసుకున్నారు. అలా వారికి జన్మించిన మొదటి సంతానమే కమలా హారిస్. ఆమెకు చెల్లెలు మాయా కూడా ఉంది.Excited to share the release of our new music video, 'Nacho Nacho,' supporting @VP Kamala Harris for President! Let’s mobilize and turn out the South Asian vote in key battleground states @DNC @CNN @ABC @maddow @aajtak @ndtvindia @IndiaToday @republic pic.twitter.com/x92vns4gH8— Ajay Jain Bhutoria (@ajainb) September 8, 2024 -
ట్రంప్ అమెరికాను చైనాకు అమ్మేశారు : హారిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రత్యక్ష డిబేట్ జరిగింది. ఈ డిబేట్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్ఛిత్తి అంశం, ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం,ఉక్రెయిన్పై రష్యా యుద్ధంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. డిబెట్లో ట్రంప్-హారిస్ల మధ్య మాటలు తూటాల్లా పేలాయి. అధ్యక్షుడిగా ట్రంప్ పాలనలో జరిగి తప్పిదాలను ప్రధాన అంశంగా చర్చిస్తూ హారిస్ పైచేయి సాధించారు. డిబెట్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్,లిన్సే డేవిస్..ఆర్థిక వ్యవస్థ, కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో చెప్పాలంటూ హారిస్ను ప్రశ్నించారు. అందుకు హారిస్ ముందుగా పేదరికం గురించి మాట్లాడారు. తనని అమెరికా అధ్యక్షురాలిగా గెలిస్తే.. పేదరికంపై దృష్టిసారిస్తామని చెప్పారు. చిరు వ్యాపారాల్ని ప్రోత్సహిస్తామన్నారు. చిరు వ్యాపారం చేసే వారికి అండగా నిలుస్తాం. అందుకు వద్ద ప్రణాళికలు ఉన్నాయి’అని వాటి గురించి వివరించారు. అదే సమయంలో హారిస్..ట్రంప్ను టార్గెట్ చేశారు. ఒకానొక దశలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చేసిన ఘోర తప్పిదాల్ని ప్రాస్తావిస్తూ ట్రంప్ను ఉక్కిరి బిక్కిరి చేశారు. మేం పేదలకు అండగా ఉంటే ట్రంప్ మాత్రం ధనికులకు, కార్పొరేట్ కంపెనీలకు అండగా నిలుస్తారు. ట్యాక్స్ కూడా తగ్గిస్తారు’ అని మండిపడ్డారు.అమెరికాను చైనాకి అమ్మేశారు : హారిస్అమెరికాను నెంబర్వన్గా నిలపడమే లక్ష్యం. తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ దేశాన్ని సమస్యల్లో వదిలేశారు. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీశారు. దేశాన్ని చైనాకు అమ్మేశారు. ఇప్పటికే ట్రంప్ చేసిన తప్పుల్ని బైడెన్ నేనూ సరిచేశాం. అలాంటి ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికాకు చిక్కులు తప్పువంటూ హారిస్ హెచ్చరించారు.జోబైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ట్రంప్ నాశనం చేసిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిలోకి పెట్టామంటూ నాటి ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తావించగా..డొనాల్డ్ ట్రంప్కు ఎలాంటి ప్రణాళికలు లేవనన్నారు. ట్రంప్ ఏం మారలేదు ఆ తర్వాత ట్రంప్ సైతం కమలా హారిస్కు ధీటుగా బదులిచ్చారు. జోబైడెన్ ప్రభుత్వంలో రికార్డ్ స్థాయిలో పెరిగాయంటూ వ్యాఖ్యానిస్తుండగా.. హారిస్ అడ్డుతగిలారు. చూశారా? ట్రంప్ ఏం మారలేదు. అవే అబద్ధాలు. అవే మోసాలు. చెప్పిన అబద్దాల్ని పదే పదే చెబుతున్నారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా వాదనల్ని వినిపించాలి. అలా కాకుండా ప్రజల్ని మోసం చేసేలా అవే పాత వ్యూహాలు, అబద్దాలు చెప్పడం.. ట్రంప్ వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రతిబింబిస్తున్నాయి.గర్భవిచ్ఛిత్తిపై.. ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్ (అబార్షన్)సహా పలు అంశాలు చర్చకు వచ్చాయి. డిబేట్ జరిగే సమయంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాన్ని హారిస్ తప్పుబట్టారు. ఆ ప్రక్రియను అనుమతిస్తూ ‘రో వర్సెస్ వేడ్’ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మహిళల అభివృద్ధి ట్రంప్నకు గిట్టదు. అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారు. ఇది మహిళలను అవమానించడమే’ అని హారిస్ అన్నారు.ఇదీ చదవండి : బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంఇజ్రాయెల్కే మా మద్దతుడిబేట్లో గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై హారిస్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేయగా.. ఆమె అధ్యక్షురాలిగా ఉంటే సాధ్యం కాదంటూ ట్రంప్ విమర్శలు గుప్పించారు. హారిస్ ఇజ్రాయెల్తో పాటు అరబ్లను ద్వేషిస్తున్నారు’ అని అన్నారు. అందుకు హారిస్ కలగజేసుకుని.. ట్రంప్ చేస్తున్న వాదనలు నిజం కాదు. ఇజ్రాయెల్కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మీ మద్దతు ఎవరికి ఉక్రెయిన్ యుద్ధంపై హారిస్ స్పందిస్తూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నట్లైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఉండేవారు. పుతిన్ కీవ్లో కూర్చుని పోలాండ్తో ప్రారంభించి యూరప్లోని మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారిస్తూ ఉండేవారు అని అన్నారు. యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ విజయ సాధించాలని కోరుకుంటున్నారా? అని డిబేట్లో ట్రంప్ను ఏబీసీ యాంకర్లు ప్రశ్నించారు. అందుకు ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు కమలాహారిస్ , డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి టీవీ డిబేట్ అమెరికా వార్తాసంస్థ ఏబీసీ న్యూస్ ఫిలడెల్ఫియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్లో నిర్వహించింది. అమెరికా కాలమాన ప్రకారం రాత్రి 9.00 గంటలకు ప్రారంభం కాగా.. భారత్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో ప్రారంభమైంది. ఇక డిబెట్ జరిగే న్యూస్ స్టూడియోలో ప్రేక్షకులు ఎవ్వరూ లేదు. ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ చర్చకు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్లో రెండు సార్లు స్వల్ప విరామం ఇచ్చారు. డిబేట్ చివరలో చెరో రెండు నిమిషాలు ముగింపు ప్రసంగం చేసేందుకు అనుమతిచ్చారు. -
మా తాత భారత స్వతంత్ర పోరాట యోధుడు: కమలా హ్యారిస్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన చిన్ననాటి భారత పర్యటనకు సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భాతరదేశ వారసత్వాన్ని ప్రతిబింబించే ఓ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నేషనల్ గ్రాండ్ పేరెంట్స్ డే (సెప్టెంబర్ 10న) సందర్పంగా అమ్మమ్మ తాతయ్యలు పీవీ గోపాలన్-రాజమ్మలతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. భారత్ వెళ్లినప్పుడల్లా తాత తనను మార్నింగ్ వాక్కు తీసుకెళ్లేవారని తెలిపారు. అలాగే భారత స్వతంత్ర పోరాటంలో తాత పాత్రను వివరించారు. సమానత్వం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం గురించి తాత మాట్లాడేవారని అన్నారు. ఆయన భారతదేశ స్వతంత్ర పోరాటంలో పాలుపంచుకున్న రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అని సోషల్ మీడియా ఎక్స్ రాశారు. అలాగే తన అమ్మమ్మ సహకారాన్ని కూడా హైలెట్ చేస్తు రాశారు. ఆమె మహిళకు కుటుంబ నియంత్రణ పట్ల అవగాహన కల్పించేలా భారతదేశం అంతటా ప్రయాణించేదని అన్నారు. అందువల్లే తనకు ప్రజాసేవ పట్ల నిబద్ధతగా ఉండటం, మంచి భవిష్యత్తు కోసం పోరాడటం వంటివి వారసత్వంగా వచ్చాయని అంటోంది. ఇలా హారిస్ తాను తన అమ్మమ్మ తాతయ్యల నుంచి సామాజికి విలువలు గురించి ఎలా నేర్చుకున్నానో చెప్పుకొచ్చారు. తరువాత తరాలను తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా కీలకం అంటూ స్ఫూర్తిని కలిగించే తాతాయ్య అమ్మమ్మలందరికీ జాతీయ గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ నిమిషాల వ్యవధిలోనే వైరల్గా మారింది. అయితే నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. చాలామంది ఆమె కుటుంబ వారసత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు మాత్రం మీ తాత బ్రిటిష్ ఇంపీరియల్ సెక్రటేరియట్ సర్వీస్లో ఉన్నప్పుడూ ఆ ప్రభుత్వాన్నే వ్యతిరేకించేలా తన సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా స్వాతంత్ర్యం కోసం ఎలా పోరాడగలరని ప్రశ్నించారు. అంతేగాక ఆ సర్వీస్ స్వాత్రంత్య్రం అనంతరమే సెక్రటేరియట్ సర్వీస్గా మారిందని విషయాన్ని గుర్తు చేశారు. అంతేగాదు క్షమించండి మిమ్మల్ని నమ్మలేం. ఇది కేవలం భారత సంతతి వ్యక్తులను బుట్టలో వేసుకునే రాజకీయ ఎత్తుగడ అంటూ విమర్శలు చేశారు.(చదవండి: శ్రావణ బెండకాయల గురించి విన్నారా..? గణేషోత్సవంలో..!) -
ట్రంప్, హారిస్ హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోందని ఆదివారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్, సియానా సర్వేలో వెల్లడైంది. ఆస్తులను ఎక్కువ చేసి చూపి రుణాలు పొందడం, పార్లమెంట్పైకి తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాసరే సగం ఓటర్లు ట్రంప్కు మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 48 శాతం మంది ట్రంప్కు మద్దతు పలికారు. కమలా హారిస్ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఆధిక్యత చూపారు. నెవడా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజోనాలో ఇద్దరికీ గట్టి పోటీ ఉంది. మిషిగన్, విస్కాన్సిన్లో హారిస్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారని, పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొందని సీబీఎస్ న్యూస్, యూగౌ సర్వేలో తేలింది. బిగ్ డిబేట్కు వేళాయే!వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య అధ్యక్ష చర్చ మంగళవారం జరగనుంది. పలు అంశాలపై తమ వైఖరిని తెలుపుతూ అమెరికన్లను మెప్పించడానికి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఏబీసీ న్యూస్ ఛానెల్లో ఈ బిగ్ డిబేట్ మంగళవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటలకు) జరగనుంది. ఫిలడెలి్ఫయాలోని నేషనల్ కాస్టిట్యూషన్ సెంటర్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ దీన్ని నిర్వహిస్తారు. 90 నిమిషాల పాటు ఈ చర్చ ఉంటుంది. అధ్యక్ష చర్చ నిర్వహించే యాంకర్లు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. -
కమల వర్సెస్ ట్రంప్: డిబేట్ రూల్స్ ఇవే..
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతంది. మరోవైపు.. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తొలిసారి రేపు (మంగళవారం) అమెరికా బ్రాడ్కాస్టర్ ఏబీసీ నిర్వహించే డిబేట్లో తలపడనున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల పోరు.. ఇరువురి మధ్య నువ్వా-నేనా అనే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల అభ్యర్థులు డిబేట్ కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే జరిగిన తొలి డిబేట్లో ట్రంప్.. ప్రెసిడెంట్ జో బైడెన్పై పైచేయి సాధించిన విషయం తెలిసిందే. ఇక రేపు జరగబోయే డిబేట్లో ఎలాంటి నియమాలు, నిబంధనలు ఉంటాయనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏబీసీ డిబేట్ రూల్స్ను వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ రూల్స్ ఇవే..ఫిలడెల్ఫియాలోని జాతీయ రాజ్యాంగ కేంద్రంలో మంగళవారం రాత్రి 9:00 గంటలకు డిబేట్ ప్రారంభం అవుతుంది. ఈ డిబేట్ను ఏబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇక.. డిబేట్ జరిగే గదిలో ప్రేక్షకులు ఎవరూ ఉండరు. చర్చను ఏబీసీ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్లు నిర్వహిస్తారు. మొత్తం చర్చ సమయం రెండుసార్లు బ్రేక్ తీసుకొని 90 నిమిషాల పాటు జరుగుతుంది.ఒకరు మాట్లాడుతున్న సయయంలో మరోకరు రన్నింగ్ కామెంట్రీ చేయటంతో ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన తొలి డిబేట్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అందుకు ఈసారి ఏబీసీ మైక్లను మ్యూట్ చేస్తామని తెలిపింది. అంటే ఒకరు మాట్లాడుతుంటే.. మరొకరి మైక్ మ్యూట్లో ఉంటుంది. డిబేట్ను జరిపించే యాంకర్లు మాత్రమే సంబంధిత అంశాలు, ప్రశ్నలను అభ్యర్థులను అడుగుతారు. ఎటువంటి అంశాలనే విషయాన్ని ముందుగా అభ్యర్థలకు తెలియజేయటం అనేది ఉండదు. మొత్తం లైవ్లోనే చర్చ జరుగుతుంది.ప్రతి అభ్యర్థి మాట్లాడాటానికి రెండు నిమిషాలు సమయం కేటాయిస్తారు. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతారు. నిబంధనలు ప్రకారం కొనసాగింపు, వివరణ, ప్రతిస్పందనకు సంబంధించి మరో నిమిషం కేటాయిస్తారు. చర్చ చివరిలో ముగింపు వ్యాఖ్యల కోసం ఇరువురికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తారు. చర్చ మొత్తం అభ్యర్థులు నిల్చొని కొనసాగించాల్సి ఉంటుంది. ముందస్తుగా రాసుకున్న నోట్స్, డాక్యుమెంట్లు చర్చకు అనుమతించరు. కానీ డిబేట్ జరగుతున్న సమయంలో కీలక విషయాలను నోట్ చేసుకొని వాటి ఆధారంగా మాట్లాటం కోసం ఇద్దరు అభ్యర్థులకు ఒక పెన్ను, పేపర్ ప్యాడ్, వాటర్ బాటిల్ అందజేస్తారు. చర్చ మధ్యలో రెండు సార్లు ఇచ్చే బ్రేక్ సమయంలో తమ ప్రచారం బృందంతో మాట్లాడానికి అనుమతి లేదు.ఇక.. ట్రంప్, కమలా మధ్య రేపు జరిగే తొలి డిబేట్పై అమెరికా ప్రజలు, ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ డిబేట్ ఫలితం కూడా అధ్యక్ష ఎన్నికల్లో అభర్థులను గెలుపు, ఓటమిలపై ప్రభావం చూపుతుంది.