Top Stories
ప్రధాన వార్తలు
![Lok Sabha Speaker Election June 26 Live Updates](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Lok_Sabha_Speaker_Election.jpg.webp?itok=7hJReZ88)
నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక: ఓటింగ్ ఎలా జరుగుతుందంటే..
లోక్సభ స్పీకర్ ఎన్నిక.. అప్డేట్స్ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నికదశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి తెరస్పీకర్ ఎంపిక చర్చల్లో అధికార-ప్రతిపక్ష కూటమి మధ్య కుదరని ఏకాభిప్రాయం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి అనాసక్తిఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిని నిలపడంతో అనివార్యమైన ఎన్నికతొలిసారి లోక్సభ స్పీకర్కు జరగనున్న ఎన్నిక1946లో చివరిసారిగా దేశచట్టసభ స్పీకర్ పదవికి ఎన్నికస్వతంత్ర భారతావనిలో ఇవాళ(జూన్ 26)న మూడోసారి జరగనున్న ఎన్నికనేడు సీక్రెట్ బ్యాలెట్తో ఓటింగ్స్పీకర్ ఓటింగ్ ఎన్నిక ఎలాగంటే.. బుధవారం ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్తో ఓటింగ్ సాధారణ మెజార్టీతోనే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ సభలో పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్ సంబంధిత వార్త: ఓటింగ్కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?స్పీకర్ పోస్టుకు అర్హతలివేలోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఎవరైనా స్పీకర్ పోస్టుకు పోటీ చేయొచ్చుప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. ఇండియా కూటమికి గట్టి పోటీలోక్సభలో ఇండియా కూటమి సంఖ్యా బలం 232ఇండియా కూటమి తరఫున ఎంపీలుగా ప్రమాణం చేయని ఐదుగురు సభ్యులుదీంతో తగ్గిన ఎంపీల సంఖ్యఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ సురేష్ ఎంచుకోవడంపై తృణముల్ కాంగ్రెస్ అసంతృప్తి?ఎన్డీయే కూటమి బలం 293ఎన్డీయే కూటమిలో లేకపోయినా.. బీజేపీ కోరడంతో ఓం బిర్లాకు మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ542 ఓట్లు ఉన్న లోక్సభలో స్పీకర్ ఎన్నికకు 271 ఓట్లు అవసరంఅయితే సభలో ఇవాళ హాజరయ్యే సభ్యుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకోనున్న ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబామెజారిటీ ఎవరికి వస్తే వారే స్పీకర్గా ఎన్నికైనట్లు ప్రకటనపార్టీల విప్ జారీలోక్సభ ఎన్నిక నేపథ్యంలో విప్ జారీ చేసిన వివిధ పార్టీలుఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీవైఎస్సార్సీపీ మద్దతు కోరిన బీజేపీ.. సానుకూలంగా స్పందించిన పార్టీత్రీ లైన్స్ విప్ జారీ చేసిన టీడీపీఓటింగ్ విధానంపై 16 మంది ఎంపీలకు ఈ ఉదయం అవగాహన కార్యక్రమం టీడీపీతో పాటు ఏపీ బీజేపీ, జనసేన ఎంపీలకు సైతం ఆహ్వానంసమావేశం తర్వాతే పార్లమెంట్కు మూడు పార్టీల ఎంపీలుఓం బిర్లా వర్సెస్ సురేష్నేడే లోక్ సభ స్పీకర్ ఎన్నికఏకాభిప్రాయం కుదరకపోవడంతో అనివార్యంగా మారిన పోటీడిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడం పోటీకి దిగిన కాంగ్రెస్ పార్టీఎన్డీయే లోక్సభ అభ్యర్థిగా ఓం బిర్లాఇండియా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీల బలంతో స్పష్టమైన మెజారిటీబీజేపీ అగ్రనేతలు అడగడంతో, ఓం బిర్లాకు మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీవైఎస్ఆర్సీపీ మద్దతుతో 297 కు చేరిన ఎన్డీయే బలంకాంగ్రెస్ లాలూచీ రాజకీయాల నేపథ్యంలో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడంలేదన్న వైఎస్సార్సీపీఉదయం 11 గంటలకు లోకసభలో స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబా సమక్షంలో జరగనున్న ఎన్నికస్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి..1952లో తొలి సార్వత్రిక ఎన్నికలుఅదే సంవత్సరం లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక శంకర్ శాంతారామ్పై మౌలాంకర్ విజయం మౌలాంకర్కు 394 ఓట్లు రాగా.. శాంతారామ్కు 55 ఓట్లు 1976లో (ఎమర్జెన్సీ సమయంలో) బలిరామ్ భగత్, జగన్నాథ్ రావు పోటీ 344 ఓట్లతో భగత్ విజయం ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు స్పీకర్లుగా ఎన్నిక
![Telangana Junior Doctors Strike Rift Between Osmania And Gandhi JUDAs](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Telangana_Junior_Doctors_St.jpg.webp?itok=ErHV2YHu)
జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ ప్రకటించారు.అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.ఈ క్రమంలో జూడా జనరల్ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది.
![Prabhas Kalki 2898 AD Movie Ticket Purchase Precautions](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Kalki-2898-AD.jpg06.jpg.webp?itok=s5ILwHyJ)
'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్ఫుల్!
ప్రభాస్ 'కల్కి' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతుంది. దేశవ్యాప్తంగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దామనుకునే చాలామందికి ఇంకా టికెట్స్ దొరకట్లేదు. పోనీ తొలిరోజు ఏ షో అయినా పర్లేదు మూవీ చూద్దామనుకున్నా సరే టికెట్ దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి టైంలో బ్లాక్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కాకపోతే ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి.(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)ఒకప్పుడు బ్లాక్ టికెట్స్ అంటే థియేటర్ల దగ్గర యాభై, వంద అని చెప్పి అమ్మేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియాలో బ్లాక్ టికెట్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. టికెట్స్ ఉన్నాయని చెప్పి డబ్బులు పంపించమని చెప్తారు. తీరా తీరా పంపిన తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. మీరు వాళ్లని ఏం చేయలేరు.మరోవైపు ఆన్లైన్ టికెట్ని ఎవరైనా మీకు అమ్మిన సరే కొన్నిసార్లు మీరు మోసపోవచ్చు. ఎందుకంటే బార్ కోడ్ ఉన్న టికెట్ని మీకు విక్రయించినట్లే, వేరొకరికి కూడా అమ్మే అవకాశముంది. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. లేదంటే అటు సినిమా చూడక ఇటు డబ్బులు పోగొట్టుకున్న వాళ్లు అవుతారు. కాబట్టి సినిమా ఈ రోజు కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. కానీ టికెట్ కొనే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!)
![Kejriwal Bail Hearing By Supreme Court In Liquor Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/kejriwalbail.jpg.webp?itok=gT3MMJRM)
కేజ్రీవాల్ బెయిల్.. నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: లిక్కర్స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే ఇస్తూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూన్26) తుది తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు ఇచ్చిన ఈ స్టే ఆర్డర్పై సుప్రీంకోర్టు బుధవారం విచారించట్లు తెలుస్తోంది. ఇంతకుముందే బెయిల్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టు వెళ్లారు. అయితే హైకోర్టు తుది తీర్పు వెలువరించిన తర్వాత విచారిస్తామని సుప్రీం తెలిపింది. దీంతో ఇవాళ ఈ అంశంపై సుప్రీం ఈ అంశంపై విచారణ జరపనుంది. కాగా కేజజ్రీవాల్ బెయిల్పై స్టే విధిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేముందు ట్రయల్ కోర్టు వెకేషన్ జడ్జి పూర్తిస్థాయి విచారణ జరపలేదని, కేసు డాక్యుమెంట్లను కూడా సరిగా పరిశీలించినట్లు కనిపించడం లేదని హైకోర్టు పేర్కొంది. కాగా, లిక్కర్ కేసులో సోమ, మంగళవారాల్లో కేజ్రీవాల్ను తీహార్ జైలులో విచారించిన సీబీఐ ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశాయి. మరోపక్క సీబీఐ కేజ్రీవాల్ను అరెస్టు చేసినట్లు ఆయనను బుధవారం ఉదయం రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది.
![Eenadu false writings on YS Jagan security](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Jagan_Security_Factcheck.jpg.webp?itok=WX08gM8L)
Fact Check: భద్రతపైనా తప్పుడు రాతలా?
సాక్షి, అమరావతి: అవాస్తవాలు, అభూత కల్పనలే ఆసరాగా బతికేస్తున్న పచ్చ మీడియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై ఈనాడు పత్రిక అభూత కల్పనలతో అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆయనకు 983 మందితో భారీ భద్రత కల్పించినట్లు అబద్ధాలతో కథనాన్ని వండింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లకు ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, ఆ కమిటీ నిర్ణయం మేరకే ఏర్పాట్లు జరుగుతాయన్న కనీస జ్ఞానం ఆ పత్రికకు లేకపోయింది. వాస్తవంగా వైఎస్ జగన్కు ఉన్న భద్రతా సిబ్బంది ఎందరు అన్న విషయాన్ని పరిశీలించాలన్న నైతిక విలువలకూ తిలోదకాలిచ్చి నోటికొచ్చిన సంఖ్యలతో ఉద్దేశపూర్వకంగా దు్రష్పచారం చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద ఈనాడు చెప్పినట్లుగా 983 మంది భద్రతా సిబ్బంది లేరు. కాన్వాయ్ కాంపొనెంట్తో కలిపి కేవలం 196 మందే విధుల్లో ఉన్నారు. అదీ షిఫ్ట్లులవారీగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశం కాకుండానే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లను ఉన్నత స్థాయిలోని సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ కమిటీ సూచనల మేరకే భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రీ తనకు ఇంత భద్రత కావాలని అడగరు. సెక్యూరిటీ రివిజన్ కమిటీయే అన్ని అంశాలను విశ్లేíÙంచి ఎంత మేర భద్రత కల్పించాలన్నది ఖరారు చేస్తుంది. ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు తదితర అంశాలను కూడా ఈ కమిటీ ఆదేశాల మేరకే చేపడతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం మేరకే చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇంకా సమావేశమవ్వనే లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లపై సమీక్షించనే లేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమే. నాడు బాబు మనవడికి కూడా భద్రత2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మనవడు దేవాన్‡్షకు కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారనే వాస్తవాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్‡్షకు ప్రత్యేకంగా భద్రత కల్పించారు.ఉండవల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసంతోపాటు హైదరాబాద్లోని వారి నివాసం, చివరకు ఫామ్ హౌస్ వద్ద కూడా భారీ భద్రత కల్పించడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కల్పించిన భద్రతకంటే ఎన్నో రెట్లు అధికంగా భద్రత కల్పించారు. ఈ అధికార దురి్వనియోగంపై ఏనాడూ పట్టించుకోని ఈనాడు.. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు నిబంధనల ప్రకారం వైఎస్ జగన్కు కల్పించిన భద్రతపై అభూత కల్పనలు ప్రచురించింది. వివిధ విభాగాల నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలు సివిల్ పోలీసులు: సీఐ–1, ఎస్సైలు–4, హెడ్ కానిస్టేబుల్–1, కానిస్టేబుళ్లు –12 , మహిళా కానిస్టేబుల్ –1. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు: ఆర్ఎస్సైలు – 2, ఏఆర్ఎస్సై –1, కానిస్టేబుళ్లు – 28 ఏపీఎస్పీ: డీఎస్పీ –1, ఆర్ఎస్సై – 3, ఏఆర్ఎస్సై–2, హెడ్ కానిస్టేబుళ్లు – 14, కానిస్టేబుళ్లు – 69 ఆక్టోపస్: ఆర్ఐ –1, ఆర్ఎస్సైలు –2, కానిస్టేబుళ్లు–10 మొత్తం: 152 మంది ఐసోలేషన్లో: అదనపు ఎస్సీ – 1, ఆర్ఐ – 2, ఆర్ఎస్సై – 3, కానిస్టేబుళ్లు – 17 మొత్తం: 23 మంది కాన్వాయ్ విభాగంలో: సీఐ – 1, ఎస్సై – 3, హెడ్ కానిస్టేబుల్ – 1, కానిస్టేబుళ్లు – 16 మొత్తం: 21 మంది.
![Gulbadin Naib Faces Ban For Faking Injury In Afghanistan T20 World Cup Thriller?](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/afghan_0_0.jpg.webp?itok=mghhNQPs)
అఫ్గాన్ ఆల్రౌండర్ చీటింగ్.. ఐసీసీ సీరియస్!? రూల్స్ ఇవే
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా ఆఫ్గానిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఆఖరి సూపర్-8 మ్యాచ్ సినిమా థ్రిల్లర్ను తలిపించిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో 8 పరుగులతో తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. తొలి సారి ప్రపంచకప్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఆఫ్గాన్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నైబ్ వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమైంది.అసలేం ఏం జరిగిందంటే?ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేయగల్గింది. అయితే బౌలింగ్లో మాత్రం అఫ్గానిస్తాన్ సత్తాచాటింది. లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 11.4 ఓవర్లు ముగిసే సరికి 81/7 పరుగులు చేసింది.అయితే అప్పుడే చినుకులు ప్రారంభం అయ్యాయి. వర్షం మొదలయ్యే సమయానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గాన్ రెండు పరుగులు ముందు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే అఫ్గానిస్తాన్ 2 పరుగుల తేడాతో గెలవనుంది.అయితే వర్షం మొదలైనప్పటికి అంపైర్లు మాత్రం ఆ ఓవర్ను ఫినిష్ చేయాలని భావించారు. ఈ క్రమంలో అపట్టికే నాలుగు బంతులు వేసిన నూర్ ఆహ్మద్ను అంపైర్లు ఓవర్ పూర్తి చేయమని ఆదేశించారు.అయితే రెండు బంతలు మిగిలుండడంతో బంగ్లా బ్యాటర్ బౌండరీ బాదితే.. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ ముందంజవేస్తోంది. ఈ తరుణంలో అఫ్గాన్ హెడ్కోచ్ ట్రాట్ ఆలస్యం చేయాలని డగౌట్ నుంచి తమ ప్లేయర్లకు సైగలు చేశాడు. ఈ క్రమంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. కండరాలు పట్టేశాయంటూ నొప్పితో విలవిలలాడినట్లు కన్పించాడు. సరిగ్గా ఆ సమయంలో ఊపందుకోవడంతో మ్యాచ్ను అంపైర్లు నిలిపివేశాడు. ఫిజియో వచ్చి నైబ్ను మైదానం నుంచి బయటకు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడవరకు అంతబాగానే ఉన్నప్పటకి.. నొప్పితో అంతలా విలవిల్లాడిన నైబ్ 10 నిమిషాల్లో మళ్లీ ఫిట్గా కనిపించి బౌలింగ్ చేసేశాడు.దీంతో అతడు చీటింగ్ చేశాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది మాజీలు సైతం అతడి తీరును తప్పుబడుతున్నారు. అస్కార్ అవార్డు ఇవ్వాలని పోస్ట్లు చేస్తున్నారు.రూల్స్ ఏమి చెబుతున్నాయంటే?కాగా నైబ్ వ్యవహరాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీరియస్గా తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా సమయం వృదా చేయకూడదు. అలా చేస్తే ఆర్టికల్ 2.10.7 ప్రకారం లెవల్ 1 లేదా 2 నేరంగా మ్యాచ్ రిఫరీ పరిగణిస్తాడు. ఈ క్రమంలో లెవల్ 1 నేరానికి 100 శాతం మ్యాచ్-ఫీజు జరిమానా, రెండు సస్పెన్షన్ పాయింట్లు విధించే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో 41.9 ప్రకారం.. బౌలర్ లేదా ఫీల్డర్ కావాలనే సమయం వృధా చేస్తే ఆ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ విధించే అధికారం అంపైర్లకు ఉంటుంది. కానీ బంగ్లా-అఫ్గాన్ మ్యాచ్లో అంపైర్లు ఎటువంటి పెనాల్టీ విధించలేదు. ఇక నైబ్ వ్యవహరంపై ఇప్పటివరకు ఐసీసీ నుంచి గానీ మ్యాచ్ రిఫరీ నుంచి ఎటువంటి ఆధికారిక ప్రకటన వెలువడలేదు.
![Adani To Invest RS 2 Lakh Crore In Renewable Energy Capacity Growth By 2030](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/ADANI%20GREEN%20ENERGY.jpg.webp?itok=KrdJ2P6Q)
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది.
![Daily Horoscope On June 26, 2024 In Telugu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/144.jpg.webp?itok=aNmn7BFQ)
జూన్ 26 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.పంచమి రా.10.48 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ధనిష్ట ప.3.27 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.10.14 నుండి 11.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.37 నుండి 12.29 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.34. మేషం....ఇంటాబయటా అనుకూలం..పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటి నిర్మాణయత్నాలు. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం...పనులు సకాలంలో పూర్తి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.మిథునం...పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కర్కాటకం...పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.సింహం...పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. దైవదర్శనాలు.కన్య...వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.తుల...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.వృశ్చికం.....కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు.ధనుస్సు....ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం.మకరం....ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం...సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి.మీనం...కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
![YS Jagan letter to AP Assembly Speaker Ayyannapatrudu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Jagan-Sir_2-final.jpg.webp?itok=k3ZsC91A)
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి
- Kalki 2898 AD: ‘కల్కి’లో ‘కలి’ ఎవరు? నాగ్ అశ్విన్ ఏం చూపించబోతున్నాడు?
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
సినిమా
![Janhvi Kapoor And Sunny Leone Latest Pics And News](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/janhvi-kapoor-sunny-leone.jpg.webp?itok=mMVddoYO)
జాన్వీ గ్లామర్ ఫ్యూజులు ఔట్.. సన్నీ లియోన్ సొగసులు!
జాన్వీ కపూర్ జిగేలు.. హాట్నెస్ మామూలుగా లేదుగాటైట్ డ్రస్సులో తమన్నా వయ్యారాలు.. చూస్తే మెంటలేహాట్ బ్యూటీ సన్నీ లియోన్ సొగసులు చూడతరమాసంప్రదాయ చీరకట్టులో రష్మిక.. ఇలా ఎప్పుడూ చూసుండరు'పొలిమేర' బ్యూటీ అందాల జాతర.. ఇలా ఉందేంట్రా బాబుపూనమ్ పరువాల విందు.. చీరలో బొద్దుగుమ్మలాపూల్లో గ్లామర్ చూపించి మరీ రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియానా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555)
![Salaar Hero Super Hit Movie Release In Ott On This Date](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/malayalm.jpg.webp?itok=tPTtLQig)
ఓటీటీకి సలార్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. #GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024
![Actor Tamayo Perry Shark Incident In Hawaii Beach](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/tamayo-perry.jpg.webp?itok=o9DcaYKA)
సొరచేప వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటుడు
హాలీవుడ్ హిట్ సినిమా 'పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్' మూవీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో నటించిన తమయో పెర్రీ (49) అనే నటుడు ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనితో పాటు పలు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు ఇతడు ఊహించని విధంగా షార్క్ చేప దాడిలో మరణించాడు. హువాయి బీచ్లో సర్ఫింగ్ చేస్తుండగా, ఈ సంఘటన చోటు చేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)స్వతహాగా నటుడు అయినప్పటికీ తమయో పెర్రీ.. గతంలో ఓషన్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. లైఫ్ గార్డ్గానూ విధులు నిర్వర్తించాడు. అలానే సర్ఫింగ్లోనూ మంచి ఎక్స్పెర్ట్. కానీ హవాయి బీచ్లో అదే సర్ఫింగ్ చేస్తుండగా ఇతడిపై సొరచేప దాడి చేసింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి, అధికారులకు సమాచారం ఇవ్వగా ఇతడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే గాయాలు తీవ్రంగా ఉండేసరికి ప్రాణాలు వదిలేశాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో జయం రవి విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?)
![Tollywood Actress Sreeleela Visits Tirumala Video Goes Viral](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sreelea.jpg.webp?itok=fVjVRBj8)
శ్రీలీల బుగ్గ గిల్లిన తమన్.. అంత పని చేశాడేంటి?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రవితేజతో మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తాజాగా హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శ్రీలీలను అప్యాయంగా పలకరించారు. సరదాగా ఆమె బుగ్గలు గిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీతమందించారు.திருப்பதியில் நடிகை ஸ்ரீலீலா..கூட்டத்தில் சிக்கிய நடிகை..பதறி போன பௌன்சர்ஸ்..! #thirupathi #sreeleela #thanthitv pic.twitter.com/SoCnn3jCE8— Thanthi TV (@ThanthiTV) June 25, 2024
ఫొటోలు
![Kamal Haasan Indian 2 HD Movie Stills](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/26/Kamal%20Haasan%20Indian%202%20HD%20Movie%20Stills_1.jpg.webp?itok=MiVNBjwd)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/26/Kamal%20Haasan%20Indian%202%20HD%20Movie%20Stills_1.jpg.webp?itok=MiVNBjwd)
కమల్హాసన్ 'భారతీయుడు 2' మూవీ స్టిల్స్
![Alia Bhatt And Ranbir Kapoor Cute Photos In Anant-Radhika Pre-Wedding Cruise Bash In Italy](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/26/Alia-Bhatt_Ranbir-Kapoor-Italy.jpg.webp?itok=V0XCu871)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/26/Alia-Bhatt_Ranbir-Kapoor-Italy.jpg.webp?itok=V0XCu871)
భర్తతో హీరోయిన్ ఆలియా భట్ క్యూట్ (ఫొటోలు)
![Rishab Shetty joins promotions of Kalki 2898 AD, Bujji photos goes viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Rishab%20Shetty%20joins%20promotions%20of%20Kalki%202898%20AD%20goes%20for%20a%20ride%20with%20Bujji%20Photos%20%2814%29.jpg.webp?itok=t_FSlH5I)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Rishab%20Shetty%20joins%20promotions%20of%20Kalki%202898%20AD%20goes%20for%20a%20ride%20with%20Bujji%20Photos%20%2814%29.jpg.webp?itok=t_FSlH5I)
పవర్ కపుల్ స్వీట్ మెమరీస్ : రిషబ్ శెట్టి చేతికి కల్కి ‘బుజ్జి’ (ఫొటోలు)
![Afghanistan erupts in celebration as team reaches T20 World Cup semifinal Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Afghanistan%20erupts%20in%20celebration%20as%20team%20reaches%20T20%20World%20Cup%20semifinal%20Photos%20%2813%29.jpg.webp?itok=oJ91adHt)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Afghanistan%20erupts%20in%20celebration%20as%20team%20reaches%20T20%20World%20Cup%20semifinal%20Photos%20%2813%29.jpg.webp?itok=oJ91adHt)
తొలిసారి T20వరల్డ్కప్ సెమీస్లో.. అఫ్గన్లో అంబరాన్నంటిన సంబరాలు (ఫొటోలు)
![Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Nita%20Ambani%20Visit%20Kashi%20Vishwanath%20Temple%20Viral%20Photos%20%2811%29.jpg.webp?itok=jj_FFqYF)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Nita%20Ambani%20Visit%20Kashi%20Vishwanath%20Temple%20Viral%20Photos%20%2811%29.jpg.webp?itok=jj_FFqYF)
త్వరలో కొడుకు పెళ్లి.. కాశీలో సందడి చేసిన 'నీతా అంబానీ' (ఫొటోలు)
క్రీడలు
![The Spanish team registered a hat trick victory](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/spain.jpg.webp?itok=8Hfb8lio)
స్పెయిన్ ‘హ్యాట్రిక్’
డసెల్డార్ఫ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా అల్బేనియాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 13వ నిమిషంలో స్పెయిన్ జట్టుకు ఫెరాన్ టోరెస్ ఏకైక గోల్ అందించాడు. మూడు విజయాలతో స్పెయిన్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. గ్రూప్ ‘బి’లో భాగంగా క్రొయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్ను డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. క్రొయేíÙయా తరఫున లూకా మోడ్రిచ్ (55వ ని.లో), ఇటలీ తరఫున జకాగ్ని (90+8వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. యూరో టోర్నీ చరిత్రలో గోల్ చేసిన అతి పెద్ద వయస్కుడిగా మోడ్రిచ్ (38 ఏళ్ల 289 రోజులు) గుర్తింపు పొందాడు. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్ల్లో ఆస్ట్రియా 3–2తో నెదర్లాండ్స్ను ఓడించగా... ఫ్రాన్స్, పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ‘డి’ గ్రూప్ నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాయి.
![If South Africa Beat Afghanistan in Semis, They Will Win T20 WC Title: Brad Hogg](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sa1_0.jpg.webp?itok=hEdLnc3a)
అఫ్గనిస్తాన్ను ఓడిస్తే టైటిల్ సౌతాఫ్రికాదే: ఆసీస్ దిగ్గజం
టీ20 ప్రపంచకప్లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. దర్జాగా సెమీస్లోకాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించి దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్కు చేరాయి.మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు.వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయంరోవ్మన్ పావెల్ (1), రూథర్ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్ను ఓడించి తొలిసారి వరల్డ్కప్లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.అఫ్గనిస్తాన్ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో అతడు అదరగొట్టి ఫైనల్కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.సౌతాఫ్రికా సెమీస్లో గనుక అఫ్గనిస్తాన్ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.చదవండి: ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్
![Sehwag Comments On Gill Being Appointed India Captain For Zimbabwe Series](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/gill2.jpg.webp?itok=9UH6fETG)
టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు: సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా జరుగనున్న ఈ సిరీస్కు టీమిండియా సీనియర్లంతా దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీ కారణంగా.. తొలిసారిగా ఈ పంజాబీ బ్యాటర్కు టీమిండియా కెప్టెన్గా వ్యవహరించే సువర్ణావకాశం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ తర్వాత అతడేరోహిత్ శర్మ వారసుడిగా శుబ్మన్ గిల్ సరైన ఎంపిక అంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్కు ఎంతో భవిష్యత్తు ఉంది.మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడగల సత్తా అతడికి ఉంది. గతేడాది తనకు గొప్పగా గడిచింది. అయితే, దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.సరైన నిర్ణయంనా అభిప్రాయం ప్రకారం.. గిల్ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. రోహిత్ శర్మ వెళ్లిన తర్వాత శుబ్మన్ గిల్ మాత్రమే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలుగుతాడు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ గిల్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.అదే విధంగా.. జింబాబ్వేతో సిరీస్కు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్ వంటి ఐపీఎల్ హీరోలను ఎంపిక చేయడం పట్ల సెహ్వాగ్ స్పందించాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నాడు.జింబాబ్వే టూర్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్పాండే.
![Rohit Deserves To Lift Trophy: Akhtar Wants India to Win T20 WC 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/wc1.jpg.webp?itok=w0olsTqW)
ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. లీగ్, సూపర్-8 దశలో ఓటమన్నదే ఎరుగక రోహిత్ సేన సెమీ ఫైనల్ చేరుకుంది. కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్లో అడుగుపెట్టేందుకు.. ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.సెయింట్ లూసియా వేదికగా గురువారం(జూన్ 27) ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లోనే రోహిత్ ట్రోఫీ గెలవాల్సిందని.. ఈసారి కూడా టీమిండియాకే గెలిచే అర్హత ఉందని పేర్కొన్నాడు.‘‘ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్కప్. ఈసారి మీరు కచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచకప్ ట్రోఫీ ఉండాలి.ఇటీవలే మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. ఈసారి మాత్రం వందకు వంద శాతం మీకే టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే. రోహిత్ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు అతడు అర్హుడు.వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సారి బదులు తీర్చుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బకొట్టింది’’ అని షోయబ్ అక్తర్ భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తాడు.కాగా సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్(41 బంతుల్లో 92)తో జట్టుకు విజయం అందించాడు.మరోవైపు.. దాయాది పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్-ఏలో అమెరికా, టీమిండియా చేతిలో ఓడిపోయి.. సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్ ఆజం బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. India's perfect revenge on a big stage pic.twitter.com/bcuK19Bbzz— Shoaib Akhtar (@shoaib100mph) June 24, 2024
బిజినెస్
![Interesting Facts About Hope Diamond Price and Details](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/hope-diamond_0.jpg.webp?itok=3EzxPprE)
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూర్లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500.
![Bureau of Indian Standards Introduces 2 New Standards](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/electric-vehicles.jpg.webp?itok=oOUbrTa-)
ఎలక్ట్రిక్ వాహనాల్లో సేఫ్టీ కోసం కొత్త స్టాండర్డ్స్: బీఐఎస్
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో.. వాహన తయారీ సంస్థలు కొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడానికి 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్' (BIS) రెండు కొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టింది.బీఐఎస్ ప్రవేశపెట్టిన రెండు కొత్త ప్రమాణాలలో ఒకటి 'IS 18590:2024'.. మరొకటి IS 18606:2024. అన్ని వర్గాల ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతను పెంచడమే లక్యంగా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కంపెనీలు ఉత్పత్తి చేసే వాహనాల్లో మరింత భద్రతను పెంచాలని బీఐఎస్ ప్రమాణాలు చెబుతున్నాయి.కారులో ప్రయాణికుల సేఫ్టీ మాత్రమే కాకుండా.. బ్యాటరీల భద్రతకు కూడా పెద్దపీట వేయాలని బీఐఎస్ చెబుతోంది. ప్రస్తుతం దేశంలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ మాత్రమే కాకుండా పెద్ద ట్రక్కులు, రిక్షాలు మొదలైనవన్నీ కూడా ఈవీల రూపంలో లభిస్తున్నాయి. కాబట్టి వీటి వినియోగం కూడా ఎక్కువవుతోంది.బీఐఎస్ IS 18294:2023 ప్రమాణాల ప్రకారం.. కంపెనీలే వాహనాలకు ప్రత్యేకంగా భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేస్తాయి. ఇవన్నీ వాహన నిర్మాణం, కార్యాచరణ వంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కొత్త భద్రతా ఫీచర్స్ అన్నీ కూడా డ్రైవర్లు మరియు ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయి.కొత్తగా అమలులోకి ప్రవేశపెట్టిన కొత్త భద్రతా ప్రమాణాలతో కలిపి మొత్తం 30 బీఐఎస్ భారతీయ ప్రమాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సమర్థవంతమైన రవాణా వ్యవస్థకు నడపడంలో ఈ ప్రమాణాలు చాలా కీలకమైనవిగా ఉంటాయి.BIS just upped the safety game for EVs with new standards focusing on powertrains and batteries.This means more secure #electric cars, bikes, and even #rickshaws!BIS is passionate about making #EVs a safe and #sustainable way to travel.#IndianStandards @jagograhakjago pic.twitter.com/sbM8pkzqk8— Bureau of Indian Standards (@IndianStandards) June 25, 2024
![Anand Mahindra Says Never Underestimate Your self](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/anand-mahindra.jpg.webp?itok=AlDG4SaO)
మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి.. ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మండే మోటివేషన్ పేరుతో మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కండబలం మీకు ఉండవచ్చు'' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరాల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. బలంగా కండలు కలిగిన వ్యక్తి ఆస్ట్రేలియా అని, అతై ముందు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అని చూడవచ్చు. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆస్ట్రేలియా వ్యక్తి గెలుస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆఫ్గనిస్తాన్ వ్యక్తి గెలుస్తారు. దీన్ని ఉదాహరణగా చెబుతూ.. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అని పేర్కొన్నారు.Never underestimate yourself. You may have more muscles than you imagine…#MondayMotivationpic.twitter.com/vKiC23jJCU— anand mahindra (@anandmahindra) June 24, 2024
![Elon Musk Welcomes His 12th Child He Says That is Not Secret](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/elon-musk_1.jpg.webp?itok=tFzJMJTG)
మరో బిడ్డకు తండ్రైన మస్క్.. ఇదేమీ సీక్రెట్ కాదు
టెస్లా బాస్ ఇలాన్ మస్క్ (Elon Musk).. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్తో మరో బిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మస్క్ స్పందింస్తూ.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు.మా స్నేహితులకు, కుటుంబ సభ్యులందరికీ తెలుసు. పత్రికా ప్రకటనను విడుదల చేయకాపోతే.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు. అయితే పుట్టిన బిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ అనే విషయాన్ని మస్క్ స్పష్టం చేయలేదు.ఇప్పటికే ఇలాన్ మస్క్కు ఇప్పటికే తన మొదటి భార్య జస్టిన్ మస్క్ ద్వారా ఐదుమంది, రెండో భార్య గ్రిమెస్ ద్వారా ముగ్గురు, షివోన్ జిలిస్ ద్వారా నలుగురు (ఈమెకు 2021లో కవలలు జన్మించారు).. ఇలా మొత్తం 12మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా ఇలాన్ మస్క్ 2022 జులైలో పెద్ద కుటుంబాలకే తన సపోర్ట్ తెలుపుతూ.. బ్రేవో టు బిగ్ ఫ్యామిలీస్ అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎంతమంది పిల్లలతో సమయం గడపగలిగితే.. అంతమంది పిల్లలను కలిగి ఉండాలని, మంచి తండ్రిగా కూడా ఉండాలని గతంలో మస్క్ వెల్లడించారు. నాగరికత ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం.. తగ్గుతున్న జనన రేటు మస్క్ అప్పట్లోనే ట్వీట్ చేశారు.
వీడియోలు
![Debate On Eenadu Yellow Media Fake News](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/ks_1.jpg.webp?itok=3oDd1baQ)
![Debate On Eenadu Yellow Media Fake News](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/ks_1.jpg.webp?itok=3oDd1baQ)
చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు
![Unfortunate Fire Incident In Software Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/fi.jpg.webp?itok=Q8IkmrYH)
![Unfortunate Fire Incident In Software Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/fi.jpg.webp?itok=Q8IkmrYH)
జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చెలరేగిన మంటలు
![Asaduddin Owaisi Oath Taking Speech In Parliament Got Controversy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/os_0.jpg.webp?itok=_usrzlcS)
![Asaduddin Owaisi Oath Taking Speech In Parliament Got Controversy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/os_0.jpg.webp?itok=_usrzlcS)
అసదుద్దీన్ ప్రమాణస్వీకారం పై లోక్ సభ లో దుమారం
![MLC Jeevan Reddy Resignation](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/st.jpg.webp?itok=e1Bd37za)
![MLC Jeevan Reddy Resignation](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/st.jpg.webp?itok=e1Bd37za)
శాంతించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
![Telangana High Court Big Relief to Former CM KCR](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/cr_0.jpg.webp?itok=kOzS8Y1j)
![Telangana High Court Big Relief to Former CM KCR](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/cr_0.jpg.webp?itok=kOzS8Y1j)
హైకోర్టులో మాజీ సీఎం సీఎం కేసీఆర్కు ఊరట...
![Delhi Government Big Shock to TDP Government](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/b_2_0.jpg.webp?itok=YYuxvuuP)
![Delhi Government Big Shock to TDP Government](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/b_2_0.jpg.webp?itok=YYuxvuuP)
టీడీపీ ప్రభుత్వానికి ఢిల్లీ హై కోర్టు షాక్
![YS Jagan Open Letter to Speaker Ayyannapatrudu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/ja_1.jpg.webp?itok=S4ERHD_u)
![YS Jagan Open Letter to Speaker Ayyannapatrudu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/ja_1.jpg.webp?itok=S4ERHD_u)
అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి లేదు.. స్పీకర్ కు జగన్ బహిరంగ లేఖ
![Election For Lok Sabha Speaker For First Time In India History](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sr_1.jpg.webp?itok=844mQrCy)
![Election For Lok Sabha Speaker For First Time In India History](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sr_1.jpg.webp?itok=844mQrCy)
స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నిక
![NDA Picks Om Birla For Speaker](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/tw.jpg.webp?itok=B9hUjc0m)
![NDA Picks Om Birla For Speaker](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/tw.jpg.webp?itok=B9hUjc0m)
స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్
![Government Employees Impatience against TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/t_0.jpg.webp?itok=60FSdXjl)
![Government Employees Impatience against TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/t_0.jpg.webp?itok=60FSdXjl)
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు ప్రభుత్వోద్యోగుల వార్నింగ్..
ఫ్యామిలీ
![Runner Meenal Kotak Sets New Record](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/meenal%20kotak.jpg.webp?itok=StEAhppZ)
అల్ట్రా రన్నర్ మీనల్
ఆమె ఖాతాలో అనేక రేస్లు పూర్తి చేసిన రికార్డులు ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి అల్ట్రా రన్నర్గా పేరొందింది. పేరు మీనల్ కొటక్, గుర్గావ్వాసి.ఇటీవల 680కి పైగా కిలోమీటర్ల పరుగును 6 రోజుల్లో అంటే 144 గంటల్లో కవర్ చేసి సరికొత్త రికార్డ్ను నెలకొల్పిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. తనను తాను మెరుగుపరుచుకోవాలనే సంకల్పంతో అల్ట్రారన్లలో పాల్గొంటున్నాను అని చెబుతోంది మీనల్ కొటక్. ‘‘పురుషుల రికార్డ్ ఇప్పటి వరకు 574.5 కిలోమీటర్ల ఉంటే, నా రికార్డ్ 680 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసింది. మిగతావారికంటే ఉన్నతంగా ఉండేలా నన్ను నేను మెరుగుపరుచుకోవాలన్నదే నా సంకల్పం. కిందటేడాది అమెరికాలోని మిల్వాకీలో జరిగిన అల్ట్రామారథాన్లో భారతదేశం తరపున పాల్గొన్న మల్టీ డే రికార్డ్ అసాధారణమైంది. ఇటీవల జరిగిన ఆరు రోజుల ఈవెంట్లోనూ నేనే ముందున్నాను.ఈ రేసుతో ఆసియాలో టాప్ 5 యాక్టివ్ రన్నర్గా, ప్రపంచంలో టాప్ 12 యాక్టివ్ 6–డే ఉమెన్ అల్ట్రారన్నర్లలో ఒకరిగా ఉన్నాను. నా మనుగడ కోసం మొండిగా పోరాడతాను. సుదీర్ఘమైన చలి, ఒంటరితనం దేనినీ లెక్కచేయను. చాలా కఠినమైన సాధన. నా ఎమోషన్స్ అన్నీ సమం చేసుకుంటూ ప్రయత్నం చేశాను. చివరకు నా సంకల్పం మనసు, శరీరంపై గెలిచింది. మార్చిన పరుగు2014లో ఒక ట్రెడ్మిల్ పరుగు నా రన్నింగ్ సామర్థ్యాన్ని, శక్తిని గ్రహించేలా చేసింది. నా బలాన్ని గుర్తించిన సరైన వ్యక్తుల సహాయంతో ఢిల్లీ హాఫ్ మారథాన్లో పరుగెత్తాను. 34 సంవత్సరాల వయసులో వృత్తిపరమైన రన్నింగ్ అనుభవం లేకుండా పాల్గొన్న ఆ మారథాన్ నా జీవిత గమనాన్ని మార్చింది. ఆ సమయంలోనే మహిళా అల్ట్రారన్నర్లు చాలా తక్కువ మంది ఉన్నారని తెలిసి, ఆసక్తి కలిగింది. మారథాన్లకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించి, చరిత్ర సృష్టించాలనుకున్నాను. 2017లో 24 గంటల పరుగు విభాగంలో భారతదేశం నుంచిప్రాతినిధ్యం వహించాను. అక్కడ నుంచి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా సామర్థ్యాన్ని గుర్తించింది. వారు నాకున్న రికార్డులన్నీ పరిశీలించారు. అలా 2017లో బెల్ఫాస్ట్లో తొలిసారిగా భారతదేశానికిప్రాతినిధ్యం వహించాను. ఆ తర్వాత 2018లో ఆసియా ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను. డిప్రెషన్ నుంచి కోలుకొని...2019లో ప్రపంచ ఛాంపియన్షిప్లో దేశానికిప్రాతినిధ్యం వహించడానికి కొంత కాలానికి ముందు కాలికి తీవ్ర గాయమైంది. అనేక కారణాల వల్ల డిప్రెషన్ బారిన పడ్డాను. నా కెరీర్ పీక్లో ఉన్న సమయంలో బెడ్రెస్ట్లో ఉండటం వల్ల చాలా బాధపడ్డాను. మొత్తానికి ఆ ఒత్తిడిని జయించి ఇప్పుడు నా 44 ఏళ్ల వయసులో 680 కిలోమీటర్ల పరుగును సాధించేంతగా ఎదిగాను. ఏడాది కిందట అమెరికాలో 72 గంటల్లో 379 కిలోమీటర్లు పరుగును పూర్తి చేశాను. మూడేళ్లుగా ఈ రేసులను ట్రాక్ చేస్తున్నాను. ఇక్కడ ఆటలో మనసు శక్తి ఎంతటిదో తెలుసుకున్నాను.ప్రణాళికతో దినచర్యమల్టీడే రేసులు 24 గంటల రేసుల కంటే భిన్నంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడు ఇక్కడ రోజుల తరబడి పరిగెత్తడంలో ఎన్నో ప్రణాళికలను అమలు పరచాల్సి ఉంటుంది. దీంతో గతంలోకంటే ఎక్కువ ప్రేరణ, మద్దతు అవసరం అవుతుంది. ఈ రేసులోకి వెళ్లడానికి మొదటి మూడు రోజులు ఆలోచించాను. ఒకసారి శిక్షణ మొదలుపెట్టాక ఇక ప్రణాళికలను అనుసరించేలా నా దినచర్య మారిపోయింది. రన్నింగ్ కోసం మాత్రమే కాదు ఒక రేసర్గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించు కోవాలంటే పోషకాహారం వంటి అనేక ఇతర అంశాలు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఒక గంట లేదా రెండు గంటలు నిద్ర, బట్టలు మార్చుకోవడం, ఆహారం తీసుకోవడం, కాళ్లకు బొబ్బలు రాకుండా చూసుకోవడం... వీటన్నింటిపైనా శిక్షణప్రారంభించనప్పటి నుండే శ్రద్ధ వహించాలి. మల్టీ డే రేసింగ్ ఆరోగ్య పోటీగా కూడా మార్చుకోవచ్చు.ఇప్పటివరకు భారత దేశం నుండి ఏ మహిళ కూడా మల్టీ డే మారథాన్లో పాల్గొనలేదు. ఈ విషయం నన్ను ఆలోచించేలా, రికార్డ్ను సాధించేలా చేసింది. అల్ట్రారన్ రేస్లో మొదటి భారతీయ మహిళను నేనే అవుతానని అనుకోలేదు. మానవ పరిమితులన్నీ అధిగమించడానికి ఒక అడుగు ముందుకు వేసినందుకు సంతోషంగా ఉన్నాను. నా భర్త సచిన్ ఉద్యోగి అయినప్పటికీ నా ముఖ్యమైన రన్నింగ్రేసులన్నింటికీ తప్పక హాజరై, నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు’’ తన విజయపరంపరను వెనకాల ఉన్న రహస్యాలను వివరించింది మీనల్ కొటక్.
![world anti drug day on june 26 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/lead%20story%20pic222.jpg.webp?itok=ptrQq0Fo)
మత్తు డేగ ఎగురుతోంది... జాగ్రత్త
వీధి చివర బంకుల్లో మత్తు చాక్లెట్లు కాలేజీ క్యాంపస్లో గంజాయి పొగ పబ్లో మాదకద్రవ్యాలు బుద్ధిగా చదువుకోవాల్సిన టీనేజ్ పిల్లల్ని మత్తులోకి లాగడానికి పొంచి ఉన్న డేగలు. జాగ్రత్త... తల్లిదండ్రులూ.. జాగ్రత్త. పిల్లలు తెలిసీ తెలియక చిక్కుకుంటారు. గమనించాలి. చర్చించాలి. కాపాడుకోవాలి.స్కూల్ వయసు పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా హర్యాణ రాష్ట్రంలో పోలీసులు ఆయా స్కూళ్లకెళ్లి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేది ఈ కార్యక్రమం పేరు. అంటే చిన్న వయసులోనే పిల్లల దృష్టిని ఆకర్షించి వారిని డ్రగ్స్ దుష్ప్రభావాల గురించి చెప్పాలి. ఇందుకు వారు అంబాలలోని ఒక ప్రయివేటు స్కూల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్రయత్నం చేశారు. దాని పేరు ‘చక్రవ్యూహ్’. వరుసగా ఉన్న ఐదు గదుల్లో రకరకాల పజిల్స్ ఇచ్చి ఒక గదిలో నుంచి మరో గదిలోకి కేవలం తెలివితేటల ఆధారంగా తలుపు తెరుచుకుని ప్రవేశిస్తూ అంతిమంగా బయట పడాలి. ‘ఇది ఒక అద్భుత ప్రయోగం’ అని విద్యార్థులు అంటున్నారు.చక్రవ్యూహ్ ప్రయోగంచక్రవ్యూహ్ అనేది ఒక పజిల్ గేమ్. ఆటోమేటిక్ తాళాలు ఉన్న గదుల్లోకి నలుగురు విద్యార్థుల బృందాన్ని పంపిస్తారు. ఆ బృందం అక్కడ తమ జీవితంలో ఎదురయ్యే రకరకాల సమస్యలను పజిల్స్ రూపంలో ఎదుర్కొంటుంది. అంటే పరీక్షలో ఫెయిల్ కావడం, మంచి ర్యాంక్ రాకపోవడం, నిరుద్యోగం, ఒంటరితనం, తల్లిదండ్రుల కొట్లాట... ఇలాంటి సమయంలో ఆ సమస్యలను ఎలా దాటాలో అక్కడే క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ ద్వారా ముందుకు సాగితే తర్వాతి గదిలోకి తలుపు తెరుచుకుంటుంది. ఇదంతా íసీసీ టీవీల ద్వారా అధ్యాపకులు గమనిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రతి సవాలు ఎదుర్కొనే సమయంలో ఆ సమస్య నుంచి పారిపోయి డ్రగ్స్ను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. కాని ఈ మొత్తం చక్రవ్యూహ్లో కలిగే అవగాహన ఏమిటంటే నిజ జీవిత సమస్యల్ని తల్లిదండ్రుల, స్నేహితుల సాయంతో దాటితే వచ్చే కిక్కు డ్రగ్స్ తీసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవడంలో లేదని తెలియడం. ఇలాంటి చక్రవ్యూహ్ ప్రయోగాన్ని హర్యాణలోని స్కూళ్లల్లో విస్తృతంగా నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. జీవితపు చక్రవ్యూహంలో చిక్కుకుంటే బయటపడే దారి ఉంటుందిగాని డ్రగ్స్లో చిక్కుకుంటే దారి ఉండదు అని తెలియడం వల్ల విద్యార్థులు చిన్న వయసులోనే గట్టి సందేశం అందుకుంటారు.కుతూహలం, సాంగత్యంటీనేజీ పిల్లలు అయితే కుతూహలం కొద్దీ లేదా దుష్ట సాంగత్యంలోని ఒత్తిడి వల్ల డ్రగ్స్ను ట్రై చేస్తున్నారని డీ అడిక్షన్ థెరపిస్టులు అంటున్నారు. పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించే లోపు వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సరదా షికార్లు, స్లీప్ ఓవర్ల సమయంలో సరదా కొద్ది సీనియర్లో స్నేహితులో డ్రగ్స్ ఇస్తున్నారు. మొదటి ఒక రకం డ్రగ్స్ తీసుకున్నాక మెదడు ఇంకా ‘హై’ కావాలని కోరుకుంటుంది. దాంతో పిల్లలు ఇంకా ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయో చూద్దామని వెతుకులాట సాగిస్తారు. ఇక అంతటితో వారి చదువు, ఆరోగ్యం, ఏకాగ్రత, వ్యక్తిత్వం మొత్తం ధ్వంసమైపోతాయని డ్రగ్స్కు బానిసలైన టీనేజ్ విద్యార్థులను పరిశీలిస్తున్న డీ అడిక్షన్ థెరపిస్టులు తెలియచేస్తున్నారు.బయట పడేయాలిడ్రగ్స్కు అలవాటు అయ్యారని తెలియగానే తల్లిదండ్రులు పిల్లల్ని మందలించడానికి చూస్తారు. వెంటనే ఆ పిల్లలు ‘మీరిలా తిడితే ఇల్లు విడిచి వెళ్లిపోతాం’ అని బ్లాక్మెయిల్ చేస్తారు. వీరిని చాలా ఓర్పుతో థెరపీల ద్వారా తిరిగి మామూలు మనుషుల్ని చేయాల్సి వస్తుంది. పోలీసుల గమనింపు ప్రకారం 18 నుంచి 25 ఏళ్ల లోపు వారిని డ్రగ్ పెడలర్స్ లక్ష్యం చేసుకున్నా నేడు 14 ఏళ్ల పిల్లలతో మొదలు ప్రతి టీనేజ్ అమ్మాయి అబ్బాయి డ్రగ్స్ డేగ రెక్కల కింద ఉన్నట్టే లెక్క.నెగెటివ్ కుటుంబ వాతావరణంటీనేజ్ పిల్లలు డ్రగ్స్ వైపు మొగ్గు చూపడంలో ప్రధానంగా నెగెటివ్ కుటుంబ వాతావరణం ఒక ముఖ్యకారణమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు ఘర్షణతో ఉన్నా పిల్లలతో మంచి అనుబంధం ఏర్పరుచుకోకపోయినా ఆత్మీయంగా వారితో సమయం గడపకపోయినా ‘మనం పట్టని తల్లిదండ్రుల’ కంటే ‘మనకు కిక్ ఇచ్చే డ్రగ్స్ మేలు’ అనే భావనలో భ్రష్ట సాంగత్యాలలోకి పిల్లలు వెళతారు. ఆ సంగతి తెలియనివ్వరు. చదువుతో పాటు క్రీడలు, ప్రకృతి ప్రేమ, బంధుమిత్రులు, క్రమశిక్షణ గల ఆర్థిక పరిస్థితి, భావోద్వేగాలకు అయినవారు ఉన్నారన్న భరోసా, విలువలు లేదా ఏదో ఒక ఆధ్యాత్మిక ఆలంబన... ఇవి టీనేజ్ పిల్లల రోజువారీ జీవనంలో ఉంటే వారు డ్రగ్స్ బారిన ఏ మాత్రం పడరు. తల్లిదండ్రులూ బహుపరాక్.ఎలా గుర్తించాలి?మీ టీనేజ్ పిల్లలు డ్రగ్స్కు అలవాటు పడ్డారని ఎలా గుర్తించాలి?1. చాలా మూడీగా తయారవుతారు 2. సరిగా భోజనం చేయరు 3. సడన్గా కొత్త కొత్త స్నేహితులు ప్రత్యక్షమవుతుంటారు. తరచూ ఏవో పార్టీలున్నాయని వెళుతుంటారు. 4. గతంలో కంటే ఎక్కువ డబ్బు అడుగుతారు 5. పొడి పెదిమలు 6. ఎర్రబడ్డ కళ్లు 7. వాదనలకు దిగి ఆధిపత్యం ప్రదర్శించడం 8. కుటుంబంతో కలివిడిగా లేకపోవడం 9. అర్థం పర్థం లేని నిద్రా సమయాలు.
![Celebrity Mehendi Artist Veena Nagda Who Charges Much For One Design](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/Design.jpg.webp?itok=kiBsvjX4)
సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్కి ఎంత ఛార్జ్ చేస్తారంటే..
పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో కచ్చితంగా అమ్మాయిల చేతికి ఉండేది మెహిందీ. ఇది లేకుంటే పండుగే లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొందరూ మాత్రం ఈ రంగంలో మంచి అందె వేసిన చేయిలా నైపుణ్యం సంపాదిస్తున్నారు. సెలబ్రెటీ స్థాయి మెహిందీ డిజైనర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు వీణ నగ్దా. ఆమె ముంబైలో ప్రముఖ మెహిందీ డిజైనర్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు గాంచారుఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు అభిమానులు. తన సృజనాత్మకతో కూడిన కళా నైపుణ్యంతో వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు వీణా. ఆమె వేసే మెహిందీ డిజైన్లు అన్ని చాలా క్లిష్టమైనవే. అదే ఆమె ప్రత్యేకత. మరొకరు అనుకరించడం కూడా కష్టమే. ప్రతీ డిజైన్ను విభిన్న కళానైపుణ్యంతో వేస్తారామె. అంతేగాదు ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వివాహ వేడుకలో కూడా ఆమెనే మెహిందీ డిజైనర్. ముఖేష్, నీతా అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్గా పెట్టుకున్నారు. ఆ వేడుకకు హాజరైన అతిధులకు మెహందీలు పెట్టే బాధ్యత ఈమెదే. అయితే ఇలా డిజైన్ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేస్తారట. సాధారణంగా ఒక్కో డిజైన్కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ మెహిందీ ప్రారంభ డిజైనే ఏకంగా రూ. 5,500 నుంచి మొదలవుతుందట. దీపిక పడుకోన్-రణవీర్ సింగ్, కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ వంటి ప్రముఖల వివాహాల్లో మెహిందీ డిజైనర్ వీణ నగ్దానే. ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకలో ఆమె కచ్చితంగా ఉంటారు. వీణ మెహిందీ డిజైన్లలోని మ్యాజిక్ అలాంటిది మరి.
![how to make tasty Potato Rice or Aloo Rice](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/aloorice_raita_recipe.jpg.webp?itok=1npZraVS)
Potato Rice ఆలూ రైస్.. పిల్లలు భలే తింటారు!
దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల సింపుల్గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా టేస్ట్ అదిరి పోతుంది. బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్డ్ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇపుడు మాత్రం వెరైటీగా ఆలూ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.కావలసిన పదార్థాలుబాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్ అయినా పరవాలేదు) చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు అరకప్పుతరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీరతయారీబియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.ప్యాన్లో కొద్దిగా నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు.బాగా వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్ పొడిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది.
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ముఖ్యమంత్రి అంటే ‘కటింగ్ మాస్టరా’?.. తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ఒకే దఫా రైతుల పంట రుణాల మాఫీ... రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 47 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్యాలెట్టే బెటర్. ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకోనున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయొచ్చు, ఎన్నికల్లో వీటిని ఉపయోగించొద్దు... స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టీకరణ... ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివేనన్న రాహుల్ గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/crime_2_0.jpg.webp?itok=FDoSees4)
కుటుంబ కలహాలతో.. యువకుడి తీవ్ర నిర్ణయం..!
కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రాయికల్ పట్టణానికి చెందిన షేక్ ఫిర్దోజ్(27), కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన ఫిర్దాజ్కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల పాప ఉంది. షేక్ ఫిర్దోజ్ కథలాపూర్లోని అత్తగారింట్లో ఉంటూ బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు.15 రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో అతను రాయికల్ వెళ్లిపోయాడు. భార్యను కూడా రావాలని కోరగా.. ఆమె నిరాకరించింది. ఈ క్రమంలో ఫిర్దాజ్ ఇటీవల పోలీస్స్టేషన్లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఇరుకుటుంబాల మధ్య వివాదం సద్దుమణగలేదు. సోమవారం కథలాపూర్లో ఫిర్దోజ్తో అతని భార్యతోపాటు మామ షేక్ అమీర్ గొడవ పడ్డారు. తర్వాత ఫిర్దోజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మంగళవారం కథలాపూర్ మండలం సిరికొండ శివారులోని మామిడితోట వద్ద చెట్టుకు ఉరేసుకొని కనిపించినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ సురేశ్బాబు పరిశీలించి, వివరాలు సేకరించారు. తన కుమారుడి ఆత్మహత్యకు భార్య ఫిర్దాజ్, మామ అమీర్లే కారణమని మృతుడి తండ్రి షేక్ బాషుమీయా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై నవీన్కుమార్ పేర్కొన్నారు.
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/accident.jpg.webp?itok=e4PrWexD)
ఘోర రోడ్డు ప్రమాదం! ఆగి ఉన్న లారీని..
ఆదిలాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 28 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 34 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు బయలుదేరింది.మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో కామారెడ్డి సమీపంలోకి రాగానే క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆదిలాబాద్లోని అంబేడ్కర్నగర్ కాలనీకి చెందిన అఫ్సర్ఖాన్ (25) మృతి చెందగా, మరో 28 మందికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ షేక్ రఫీక్తోపాటు మరో ప్రయాణికుడు మోబీన్కు తీవ్ర గాయాలుకాగా వైద్యులు నిజామాబాద్కు రిఫర్ చేశారు. గాయాలపాలైన వారంతా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన వారే. అఫ్సర్ఖాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/141.jpg.webp?itok=2GwpBGg0)
దర్శన్ కేసులో త్వరలో చార్జిషీటు!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రిదర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్శన్ అభిమాని అరెస్టుయశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది.
![Army employee commits suicide to Love proposal Issue](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/544.jpg.webp?itok=ROiNCDd0)
ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
సదరాగా చేసిన తప్పు.. ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎంతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించి, దేశ రక్షణలో భాగస్వామి అవుతాడనుకున్న కొడుకు శవంగా మారి.. పాడె ఎక్కడాన్ని తల్లిదండ్రులు భరించలేక పోతున్నారు. దోమ: పరువు పోతుందనే మనస్తాపంతో ఓ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుంట రాములు, మంగమ్మకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు సంతానం. వీరిలో చింటు (21) పెద్దవాడు. డిగ్రీ పూర్తి చేసిన ఇతను అగి్నపథ్లో భాగంగా ఇండియన్ ఆరీ్మకి ఎంపికయ్యాడు. ఇటీవలే బెంగళూర్లో శిక్షణ పూర్తి చేసుకోగా.. గుజరాత్లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులు సెలవులు ఇవ్వడంతో ఈనెల 22న ఇంటికి వచ్చాడు. గత సోమవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి చింటు సరదాగా బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా సాయంత్రం వేళ దాదాపూర్లో స్కూల్ ముగించుకుని కాలి నడకన గుండాలకు వెళ్తున్న ఓ బాలికను గమనించిన చింటు.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తానని స్నేహితులతో చెప్పాడు. ఆ వెంటనే వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నా.. ఇందుకు అంగీకరించమని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి కొత్తపల్లికి చేరుకుని చింటు తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఇంటికి చేరుకున్న చింటు జరిగిన విషయం గ్రామంలో తెలిస్తే తనతో పాటు తల్లిదండ్రుల పరువు పోతుందని మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం బైక్ తీసుకుని పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లిన కొడుకు అర్ధరాత్రి దాటినా తిరిగి రాకపోవడంతో అనుమానం వచి్చన కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించాడు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.