Zimbabwe
-
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఐర్లాండ్
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఐర్లాండ్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (ఫిబ్రవరి 16) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. వెస్లీ మెదెవెరె (61), సికందర్ రజా (58) అర్ద సెంచరీలతో రాణించి జింబాబ్వేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వెల్లింగ్టన్ మసకద్జ (35), బ్రియాన్ బెన్నెట్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. బెన్ కర్రన్ (18), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (4), జోనాథన్ క్యాంప్బెల్ (2), టి మరుమణి (0), ముజరబానీ (0), ట్రెవర్ గ్వాండు (2) నిరాశపరిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ నాలుగు, కర్టిస్ క్యాంఫర్ మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించారు. హ్యూమ్, జాషువ లిటిల్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 48.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (89), వన్డౌన్ బ్యాటర్ కర్టిస్ క్యాంఫర్ (63) అర్ద సెంచరీలతో రాణించి ఐర్లాండ్ విజయానికి గట్టి పునాదాలు వేశారు. లోర్కాన్ టక్కర్ (36 నాటౌట్), జార్జ్ డాక్రెల్ (20 నాటౌట్) ఐర్లాండ్ను విజయతీరాలకు చేర్చారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ (11), హ్యారీ టెక్టార్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో గ్వాండు 2, నగరవ, ముజరబానీ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఐర్లాండ్ మూడు మ్యాచ్ల సిరీస్లో జింబాబ్వే ఆధిక్యాన్ని 1-1కి తగ్గించింది. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే ఫిబ్రవరి 18న జరుగనుంది. -
బెన్నెట్ విధ్వంసకర సెంచరీ.. ఐర్లాండ్ను చిత్తు చేసిన జింబాబ్వే
ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ను జింబాబ్వే విజయంతో ఆరంభించింది. హరారే వేదికగా జరిగిన తొలి వన్డేలో జింబాబ్వే 49 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. మొదట జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెనెట్ (163 బంతుల్లో 169; 20 ఫోర్లు, 3 సిక్స్లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన బెనెట్ చివరి ఓవర్ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (61 బంతుల్లో 66; 3 ఫోర్లు, 4 సిక్స్లు)... బెనెట్కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.ఏకైక టెస్టులో ఐర్లాండ్ చేతిలో పరాజయం పాలైన జింబాబ్వే తొలి వన్డేలో దానికి బదులు తీర్చుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 46 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.కెప్టెన్ స్టిర్లింగ్ (32), క్యాంపెర్ (44), టెక్టర్ (39), టకర్ (31), డాక్రెల్ (34), మెక్బ్రైన్ (32) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎన్గరవా మూడు వికెట్లు పడగొట్టారు. బెనెట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.చదవండి: ENG vs IND: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్గా స్టార్ ప్లేయర్? -
సచిన్, కోహ్లికి సాధ్యం కాని ఘనతను సాధించిన జింబాబ్వే ఆటగాడు
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) సాధించలేని ఘనతలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో ఓ ఘనతను ఇవాళ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ (Brian Bennett) సాధించాడు. బెన్నెట్.. 22 ఏళ్లు నిండకముందే (21 ఏళ్ల 96 రోజులు) వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించాడు. దిగ్గజ బ్యాటర్లు సచిన్, విరాట్ ఇంత చిన్న వయసులో ఈ ఘనతను సాధించలేదు. విరాట్ 23 ఏళ్ల 134 రోజుల వయసులో .. సచిన్ 26 ఏళ్ల 198 రోజుల వయసులో 150 ప్లస్ స్కోర్ సాధించారు.వన్డే క్రికెట్ చరిత్రలో బ్రియాన్ కంటే చిన్న వయసులో 150 ప్లస్ స్కోర్ చేసిన బ్యాటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (20 ఏళ్ల 4 రోజులు) అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించగా.. బంగ్లాదేశ్ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ (20 ఏళ్ల 149 రోజులు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ (20 ఏళ్ల 353 రోజులు) ఆతర్వాతి ఉన్నారు. తాజాగా బ్రియాన్ వన్డేల్లో 150 ప్లస్ స్కోర్ సాధించిన నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు.ఐర్లాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 14) జరుగుతున్న వన్డేలో బ్రియాన్ 163 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేశాడు. కెరీర్లో కేవలం ఏడో వన్డేలోనే బ్రియాన్ రికార్డు సెంచరీ సాధించాడు. జింబాబ్వే తరఫున వన్డేల్లో 150 పరుగుల మార్కును తాకిన ఐదో క్రికెటర్గా బ్రియాన్ రికార్డుల్లోకెక్కాడు. దీనికి ముందు బ్రియాన్ జింబాబ్వే తరఫున టెస్ట్ల్లో సెంచరీ చేసిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగానూ రికార్డు నెలకొల్పాడు.మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఐర్లాండ్తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ క్రెయిగ్ ఐర్విన్ (66) అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ బెన్ కర్రన్ 28, సికందర్ రజా 8, మెదెవెరె 8, జోనాథన్ క్యాంప్బెల్ (అలిస్టర్ క్యాంప్బెల్ కొడుకు) 6, మరుమణి 2 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 2, జాషువ లిటిల్, హ్యూమ్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 31 ఓవర్ల అనంతరం 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో ఆండ్రూ బల్బిర్నీ డకౌట్ కాగా.. పాల్ స్టిర్లింగ్ 32, కర్టిస్ క్యాంపర్ 44 పరుగులు చేసి ఔటయ్యారు. హ్యారీ టెక్టార్ (33), లోర్కాన్ టక్కర్ (30) క్రీజ్లో ఉన్నారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, సికందర్ రజా తలో వికెట్ పడగొట్టారు. -
జింబాబ్వేకు షాకిచ్చిన ఐర్లాండ్
జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ (Ireland) జట్టు సంచలన విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఐర్లాండ్.. ఆతిథ్య జట్టును 63 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 260 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆండీ మెక్బ్రైన్ (90 నాటౌట్), మార్క్ అదైర్ (78) అర్ద సెంచరీలు సాధించి ఐర్లాండ్కు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. వీరిద్దరు ఏడో వికెట్కు 127 పరుగులు జోడించారు. మెక్బ్రైన్, అదైర్తో పాటు ఐర్లాండ్ ఇన్నింగ్స్లో పాల్ స్టిర్లింగ్ (10), లోర్కాన్ టక్కర్ (33) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. రిచర్డ్ నగరవ 2, ట్రెవర్ గ్వాండు ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 267 పరుగులు చేసింది. అరంగేట్రం ఆటగాడు నిక్ వెల్చ్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 10వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన ముజరబానీ 47 పరుగులు చేసి జింబాబ్వే తరఫున సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అతనికి 11వ నంబర్ ఆటగాడు ట్రెవర్ గ్వాండు (18 నాటౌట్) సహకరించాడు. వీరిద్దరూ ఆఖరి వికెట్కు 67 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యం మూలానా జింబాబ్వేకు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఐర్లాండ్ బౌలర్లలో బ్యారీ మెక్కార్తీ 4, ఆండీ మెక్బ్రైన్ 3, మార్క్ అదైర్ 2, మాథ్యూ హంఫ్రేస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బరిలోకి దిగిన ఐర్లాండ్.. ఆండీ బల్బిర్నీ (66), లొర్కాన్ టక్కర్ (58) అర్ద సెంచరీలతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్లో 298 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్లో కర్టిస్ క్యాంఫర్ (39), మూర్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 4, ట్రెవర్ గ్వాండు, మధెవెరె తలో 2, ముజరబానీ, జోనాథన్ క్యాంప్బెల్ చెరో వికెట్ పడగొట్టారు.292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా కుప్పకూలింది. మాథ్యూ హంఫ్రేస్ ఆరు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించాడు. హంఫ్రేస్ 6, మెక్కార్తీ 2, మార్క్ అదైర్, ఆండీ మెక్బ్రైన్ తలో వికెట్ పడగొట్టడంతో జింబాబ్వే రెండో ఇన్నింగ్స్లో 228 పరుగులకు చాపచుట్టేసింది. వెస్లీ మెదెవెరె (84) జింబాబ్వేను ఓటమి బారి నుంచి గట్టెక్కించేందుకు విఫలయత్నం చేశాడు. మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్ (33) జింబాబ్వే ఓటమిని కాసేపు అడ్డుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో మెదెవెరె, జోనాథన్ క్యాంప్బెల్తో పాటు బ్రియాన్ బెన్నెట్ (45) రాణించాడు.కాగా, ఐర్లాండ్ జట్టు ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 14, 16, 18 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 22, 23, 25 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. -
రాణించిన ఐరీష్ కెప్టెన్.. జింబాబ్వే లక్ష్యం 292
బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో ఐర్లాండ్... ఆతిథ్య జట్టు ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. శనివారం మూడో రోజు 83/1 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఐర్లాండ్ 93.3 ఓవర్లలో 298 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (60; 2 ఫోర్లు), లార్కన్ టక్కర్ (58; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. జింబాబ్వే బౌలర్లలో ఎన్గరవ 4, ట్రెవర్ వాండు, వెస్లీ చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో 7 పరుగుల స్వల్ప ఆధిక్యం కలిపి 292 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే... మూడో రోజు ఆట నిలిచే సమయానికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది.టాపార్డర్ బ్యాటర్లు కైటానో (14; 3 ఫోర్లు), బెన్ కరన్ (4), నిక్ వెల్చ్ (5) వికెట్లను పారేసుకోగా... ఆట నిలిచే సమయానికి బ్రియాన్ బెన్నెట్ (15 బ్యాటింగ్, 1 ఫోర్), ట్రెవర్ వాండు (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడేర్, బారీ మెకార్తీ, మాథ్యూ హంఫ్రేస్ తలా ఒక వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్నప్పటికీ జింబాబ్వే విజయానికి 254 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 7 వికెట్లున్నాయి.చదవండి: SA T20: ఫైనల్లో సన్రైజర్స్ చిత్తు.. ఛాంపియన్స్గా ముంబై టీమ్ -
సంచలనం.. అరంగేట్రంలోనే టీమ్ కెప్టెన్గా
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య ఏకైక టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్తో లెజెండరీ క్రికెటర్ అలిస్టర్ క్యాంప్బెల్ తనయుడు జోనాథన్ కాంప్బెల్ జింబాబ్వే తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా తన అరంగేట్ర మ్యాచ్లోనే జింబాబ్వే కెప్టెన్గా వ్యవహరించే అవకాశం కాంప్బెల్కు దక్కింది. ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు రెగ్యూలర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారంణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. దీంతో 27 ఏళ్ల జోనాథన్కు జట్టు పగ్గాలను జింబాబ్వే టీమ్ మెనెజ్మెంట్ అప్పగించింది. తద్వారా కాంప్బెల్ ఓ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అరంగేట్రంలోనే జింబాబ్వే టెస్టు కెప్టెన్గా వ్యవహరించిన రెండో ప్లేయర్గా కాంప్బెల్ నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ డేవ్ హౌటన్ ఉన్నాడు. హౌటన్ 1992లో హరారే వేదికగా భారత్తో జరిగిన తొలి టెస్టులో జింబాబ్వే సారథిగా వ్యవహరించాడు.ఇక ఓవరాల్గా 21వ శతాబ్దంలో డెబ్యూలోనే టెస్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఐదో ప్లేయర్గా జోనాథన్ కాంప్బెల్ రికార్డులకెక్కాడు. కాంప్బెల్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ లీ జెర్మెన్ 1995లో భారత్తో జరిగిన టెస్టులో తన అరంగేట్రంలోనే కెప్టెన్గా పనిచేశాడు. ఆ తర్వాత స్ధానాల్లో నైమూర్ రెహమాన్ (2000లో బంగ్లాదేశ్), విలియం పోర్టర్ఫీల్డ్ (2018లో ఐర్లాండ్), అస్గర్ ఆఫ్ఘన్ (2018లో ఆఫ్ఘనిస్తాన్) ఉన్నారు. వీరిందరూ అరంగేట్రంలోనే తమ జట్ల టెస్టు కెప్టెన్గా వ్యవహరించారు. జోనాథన్ కాంప్బెల్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో అద్బుతమైన రికార్డు ఉంది. 34 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలతో సహా 1,913 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ 42 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లు:జింబాబ్వే (ప్లేయింగ్ XI): బెన్ కుర్రాన్, టకుద్జ్వానాషే కైటానో, నిక్ వెల్చ్, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ కాంప్బెల్(కెప్టెన్), వెస్లీ మాధవెరె, న్యాషా మాయావో(వికెట్ కీపర్), న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ న్గారవ, బ్లెస్సింగ్ ముజారబానీ, ట్రెవర్ గ్వాండుఐర్లాండ్ (ప్లేయింగ్ XI): పీటర్ మూర్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్(వికెట్కీపర్), ఆండీ మెక్బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, క్రెయిగ్ యంగ్చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్.. పాంటింగ్ ఆల్టైమ్ రికార్డు సమం -
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఆరు టెస్ట్ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డు నెలకొల్పాడు. 26 ఏళ్ల రషీద్ ఆరు టెస్ట్ల అనంతరం 45 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ స్పిన్నర్ అల్ఫ్ వాలెంటైన్, శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ఆరు టెస్ట్ల అనంతరం 43 వికెట్లు పడగొట్టి రషీద్ తర్వాతి స్థానంలో ఉన్నారు.జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్లో రషీద్ 11 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టెస్ట్లో విజయంతో ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన రషీద్.. రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. రషీద్ తన ఆరు మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 5 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 3 పది వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.రెండో ఇన్నింగ్స్లో రషీద్ నమోదు చేసిన గణాంకాలు (7/66) ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యుత్తమమైనవి. రషీద్ తన సొంత రికార్డునే (7/137) అధిగమించి ఈ గణాంకాలు నమోదు చేశాడు.రెండో స్థానంలో రషీద్ఆరు టెస్ట్ల అనంతరం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ (45) సౌతాఫ్రికా పేసర్ వెర్నన్ ఫిలాండర్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ చార్లీ టర్నర్ టాప్లో నిలిచాడు. టర్నర్ ఆరు టెస్ట్ల అనంతరం 50 వికెట్లు పడగొట్టాడు.వరుసగా రెండు మ్యాచ్ల్లో 10 వికెట్లుఈ మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రషీద్.. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఈ ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో రషీద్తో పాటు సౌతాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ మాత్రమే వరుసగా రెండు టెస్ట్ల్లో 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.జింబాబ్వేతో రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో తక్కువ స్కోర్కే (157) చాపచుట్టేసిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా పుంజుకుని 363 పరుగులు చేసింది. రహ్మత్ షా (139), ఇస్మత్ ఆలం (101) సెంచరీలతో కదంతొక్కారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఇస్మత్ అరంగేట్రంలోనే శతక్కొట్టాడు. ఎనిమిది అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చి డెబ్యూలో సెంచరీ చేసిన 11 ఆటగాడిగా ఇస్మత్ ఆలం రికార్డుల్లోకెక్కాడు.జింబాబ్వే విషయానికొస్తే.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఎక్కువ స్కోర్ చేసింది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. రషీద్ తన స్పిన్ మాయాజాలంలో జింబాబ్వేను 205 పరుగులకు పరిమితం చేశాడు. ఫలితంగా జింబాబ్వే లక్ష్యానికి 73 పరుగుల దూరంలో నిలిచిపోయింది. -
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 72 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు అఫ్గన్ క్రికెట్ జట్టు జింబాబ్వే(Afghanistan tour of Zimbabwe, 2024-25) పర్యటనకు వెళ్లింది.పరిమిత ఓవర్ల సిరీస్లు కైవసంఈ క్రమంలో హరారే వేదికగా తొలుత టీ20 సిరీస్ను 2-1తో గెలిచిన అఫ్గన్.. వన్డే సిరీస్ను కూడా 2-1తో నెగ్గింది. అనంతరం బులవాయోలో టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ క్రమంలో అఫ్గన్- జింబాబ్వే(Zimbabwe vs Afghanistan) మధ్య గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధీటుగా బదులిచ్చినాఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందుకు జింబాబ్వే ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులు సాధించింది. సికందర్ రజా(61), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(75) అర్ధ శతకాలతో రాణించగా.. సీన్ విలియమ్స్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురి పోరాటం కారణంగా అఫ్గన్ కంటే.. జింబాబ్వే 86 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.అయితే, రెండో ఇన్నింగ్స్లో హష్మతుల్లా బృందం పొరపాట్లకు తావివ్వలేదు. రహ్మత్ షా(Rahmat Shah) భారీ శతకం(139)తో చెలరేగగా.. ఇస్మత్ ఆలం(101) కూడా శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అఫ్గన్ 363 పరుగులు చేయగలిగింది. తద్వారా జింబాబ్వేకు 278 పరుగుల టార్గెట్ విధించింది.13 నిమిషాల్లోనే ఖేల్ ఖతంలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ జింబాబ్వే.. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి.. ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తద్వారా విజయానికి 73 పరుగుల దూరంలో నిలిచింది. అయితే, అఫ్గన్ స్పిన్నర్ల ధాటికి ఆఖరి రోజు ఆటలో కేవలం 13 నిమిషాల్లోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అఫ్గన్ 72 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర2017లో అఫ్గనిస్తాన్ టెస్టు జట్టు హోదా పొందింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడగా.. ఇది నాలుగో విజయం. అదే విధంగా జింబాబ్వేపై రెండోది. కాగా 2021లోనూ జింబాబ్వేతో అఫ్గనిస్తాన్ రెండు టెస్టుల్లో తలపడగా.. 1-1తో నాటి సిరీస్ డ్రా అయింది. అయితే, ఈసారి మాత్రం అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేపై రెండో టెస్టులో గెలిచి.. తొలిసారి ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.చదవండి: Ind vs Pak: ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు -
రషీద్ ఖాన్ విశ్వరూపం.. 10 వికెట్ల ప్రదర్శన నమోదు
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ 10 వికెట్ల ఘనత నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన రషీద్ రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా రషీద్ ఖాన్కు టెస్ట్ల్లో ఇది మూడో 10 వికెట్ల ప్రదర్శన. రషీద్ తన ఆరు మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో ఐదు 5 వికెట్ల ప్రదర్శనలు, మూడు 10 వికెట్ల ప్రదర్శనల సాయంతో 44 వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభించడంతో రెండో టెస్ట్లో జింబాబ్వే ఓటమి అంచుల్లో ఉంది. ఛేదనలో తడబడిన జింబాబ్వే విజయానికి ఇంకా 82 పరుగుల దూరంలో ఉంది. చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్లో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. క్రెయిగ్ ఎర్విన్ (44), రిచర్డ్ నగరవ (3) క్రీజ్లో ఉన్నారు. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్లో బెన్ కర్రన్ (38), సికందర్ రజా (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఆరు వికెట్లు పడగొట్టగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. తొలుత రహ్మత్ షా (139) సెంచరీతో కదం తొక్కగా.. ఎనిమిదో నంబర్ ఆటగాడు ఇస్మత్ ఆలం (101) ఆఖర్లో బాధ్యతాయుతమైన సెంచరీ చేశాడు. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ సెకెండ్ ఇన్నింగ్స్లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ ఆరు వికెట్లు పడగొట్టగా.. నగరవ 3, సికందర్ రజా ఓ వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో సీన్ విలియమ్స్ (49) విలువైన పరుగులు జోడించాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 157 పరుగులకే ఆలౌటైంది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు, ముజరబానీ రెండు, నగరవ ఓ వికెట్ పడగొట్టి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. -
సూపర్ సెంచరీతో ఆదుకున్న రహ్మత్ షా
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మత్ షా (105 నాటౌట్) సూపర్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో షా బాధ్యతాయుతంగా ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. షా సెంచరీతో కదంతొక్కడంతో ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతుంది. మూడో రోజు టీ విరామం సమయానికి ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 207/6గా ఉంది. షా అజేయ సెంచరీతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తుండగా.. అతనికి జతగా ఇస్మత్ ఆలం (31) క్రీజ్లో ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ 121 పరుగుల ఆధిక్యంలో ఉంది.ఆదుకున్న షా69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ను రహ్మత్ షా ఆదుకున్నాడు. షా.. షాహీదుల్లా కమాల్ (22), ఇస్మత్ ఆలమ్ల సహకారంతో ఇన్నింగ్స్ను నిర్మిస్తున్నాడు. షా సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ ఘోరంగా పతనమయ్యేది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో అబ్దుల్ మాలిక్ 1, రియాజ్ హసన్ 11, హష్మతుల్లా షాహిది 13, జియా ఉర్ రెహ్మాన్ 6, అఫ్సర్ జజాయ్ 5 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ 3, నగరవ 2, సికందర్ రజా ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకు ఆలౌటైంది. సికందర్ రజా (61), క్రెయిగ్ ఎర్విన్ (75) అర్ద సెంచరీలతో రాణించగా.. సీన్ విలియమ్స్ (49) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, అహ్మద్జాయ్ 3, ఫరీద్ అహ్మద్ 2, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వే బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 157 పరుగులకే చాపచుట్టేసింది. సికందర్ రజా, న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ 2, నగరవ ఓ వికెట్ పడగొట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్గా నిలిచాడు.కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
సింహాల ఆవాసంలో 5 రోజులు
అడవి మధ్యలో చిన్న పిల్లాడు.. చుట్టూ గర్జించే సింహాలు.. ఘీంకరించే ఏనుగులు. జంగిల్ బుక్లోని మోగ్లీ గుర్తొస్తున్నాడు కదూ! అది కల్పిత కథ. నిజ జీవితంలో అంతకు మించిన సాహసాన్ని చేశాడు జింబాబ్వేకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు. ఐదురోజులపాటు క్రూర మృగాల ఆవాసంలో బతికాడు. ఈ ఆధునిక మోగ్లీ పేరు.. టినోటెండా పుదు. పండ్లు తింటూ.. చెలిమల్లో నీళ్లు తాగుతూ.. జింబాబ్వేలోని మాటుసడోనా గేమ్ పార్క్.. టెనోటెండా పుదు ఇంటికి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎందుకు? ఎలా? వెళ్లాడో తెలియదు. ఒక్కసారి అడవిలోకి వెళ్లాక బయటపడటానికి మార్గం తెలియలేదు. అయితేనేం అధైర్య పడలేదు. బతికేందుకు అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అడవి పండ్లు తింటూ ఆకలి తీర్చుకున్నాడు. ఎండిపోయిన నదీ తీరాల వెంబడి.. కర్రలతో చిన్న చిన్న చెలిమెలు తవ్వి వచ్చిన నీటితో దాహం తీర్చుకుని ప్రాణాలు నిలుపుకొన్నాడు. రాత్రిపూట రాతి బండలపై నిద్రపోయాడు. మరోవైపు కనిపించకుండా పోయిన బాలుని కోసం ఊరంతా వెదికిన తల్లిదండ్రులు చివరకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానిక బృందాలతో కలిసి సెర్చ్ పార్టీ ప్రతిరోజూ డ్రమ్ములు మోగిస్తూ బాలుడిని పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేసింది. నాలుగురోజులపాటు వెదికి ఆశలు వదులుకుంది. చివరి అవకాశంగా 5వ రోజు పార్క్ రేంజర్లు వాహనంపై అడవిమొత్తం గాలించడం మొదలుపెట్టారు. వాహనం శబ్దం విన్న బాలుడు అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే అక్కడినుంచి దూరంగా వచ్చేశారు. చివరకు తడిగా ఉన్న ఓ ప్రాంతంలో చిన్న చిన్న తాజా పాదముద్రలు కనిపించడంతో బాలుడు ఇక్కడే ఉంటాడని భావించారు. వాహనాన్ని వెనక్కి తిప్పి వెళ్లారు. ఎట్టకేలకు పుదుని కనిపెట్టగలిగారు. ప్రశంసల వర్షం.. జింబాబ్వే పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకారం ఆఫ్రికాలో అత్యధిక సింహాలున్న పార్క్ అదే. ప్రస్తుతం అక్కడ 40 సింహాలున్నాయి. 1,470 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సింహాలతోపాటు జీబ్రాలు, ఏనుగులు, హిప్పోలు, జింకలకు నిలయంగా ఉంది. అలాంటి పార్క్ నుంచి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. కానీ ఎంతో ధైర్యంతో ప్రాణాలతో బయటపడ్డ బాలుని స్టోరీని.. స్థానిక ఎంపీ ముట్సా మురోంబెడ్జి ఎక్స్లో పంచుకున్నారు. పుదు ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జింబాబ్వేకు ఆధిక్యం
బులవాయో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్లో జింబాబ్వేకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 243 పరుగులకు ఆలౌటైంది. తద్వారా 86 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో క్రెయిగ్ ఎర్విన్ (75) చివరి వికెట్గా వెనుదిరిగాడు. సికందర్ రజా (61), సీన్ విలియమ్స్ (49) రాణించారు. జింబాబ్వే జట్టులో జాయ్లార్డ్ గుంబీ 8, బెన్ కర్రన్ 15, కైటానో 0, డియాన్ మైయర్స్ 5, బ్రియాన్ బెన్నెట్ 2, న్యూమ్యాన్ న్యామ్హురి 11, రిచర్డ్ నగరవ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అహ్మద్జాయ్ మూడు, ఫరీద్ అహ్మద్ రెండు, జియా ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ 8 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 19 పరుగులు చేసింది. అబ్దుల్ మాలిక్ 1, రియాన్ హసన్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. రహ్మత్ షా (6), హస్మతుల్లా షాహిది (0) క్రీజ్లో ఉన్నారు. బ్లెస్సింగ్ ముజరబాని రెండు వికెట్లు తీశాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా 67 పరుగులు వెనుకపడి ఉంది. రెండో రోజు ఆట కొనసాగుతుంది.అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 157 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో రషీద్ ఖాన్ (25) టాప్ స్కోరర్గా నిలిచాడు. అబ్దుల్ మాలిక్ 17, రియాజ్ హసన్ 12, రహ్మద్ షా 19, షాహిది 13, జజాయ్ 16, షహీదుల్లా 12, ఇస్మత్ అలామ్ 0, అహ్మద్ జాయ్ 2, జియా ఉర్ రెహ్మాన్ 8 (నాటౌట్), ఫరీద్ అహ్మద్ 17 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమ్యాన్ న్యామ్హురి తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజరబాని రెండు, నగరవ ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో సీన్ విలియమ్స్ (154), క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో రహ్మత్ షా (234), హష్మతుల్లా షాహిది (246) డబుల్ సెంచరీలు చేయగా.. అఫ్సన్ జజాయ్ (113) శతక్కొట్టాడు. -
జింబాబ్వేతో రెండో టెస్టు.. అఫ్గాన్ 157 ఆలౌట్
బులవాయో: అద్వితీయ బ్యాటింగ్తో జింబాబ్వేతో తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న అఫ్గానిస్తాన్ జట్టు... రెండో టెస్టులో స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. ఇరు జట్ల మధ్య గురువారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.రషీద్ ఖాన్ (20 బంతుల్లో 25; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల మార్క్ దాటలేకపోయారు. కెపె్టన్ హష్మతుల్లా (13), రహమత్ షా (19), అబ్దుల్ మాలిక్ (17), రియాజ్ హసన్ (12), అఫ్సర్ (16), షహీదుల్లా (12), ఇస్మత్ ఆలమ్ (0) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కు వరస కట్టారు.జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, న్యూమన్ న్యామురి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. చేతిలో 10 వికెట్లు ఉన్న జింబాబ్వే ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 151 పరుగులు వెనుకబడి ఉంది. జాయ్లార్డ్ గుంబీ (4 బ్యాటింగ్), బెన్ కరన్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.చదవండి: IND vs AUS: రోహిత్ను కావాలనే పక్కన పెట్టారా?.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే? -
టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్.. కానీ
జింబాబ్వే- అఫ్గనిస్తాన్(Zimbabwe vs Afghanistan) జట్ల మధ్య బులవాయో వేదికగా తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్ చివరిరోజు ఓవర్నైట్ స్కోరు 515/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గనిస్తాన్ 197 ఓవర్లలో 699 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక టెస్టు క్రికెట్లో అఫ్గనిస్తాన్ జట్టుకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2021లో అబుదాబిలో జింబాబ్వేతోనే జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్ 4 వికెట్లకు 545 పరుగులు చేసింది.హష్మతుల్లా, రహ్మత్ షా డబుల్ సెంచరీలుఇక జింబాబ్వేతో తొలి టెస్టు ఆఖరి రోజు అఫ్గానిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(Hashmatullah Shahidi- 474 బంతుల్లో 246; 21 ఫోర్లు) డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... అఫ్సర్ జజాయ్ (169 బంతుల్లో 113; 5 ఫోర్లు, 3 సిక్స్లు) శతకం సాధించాడు. అంతకుముందు మూడో రోజు రహ్మత్ షా (424 బంతుల్లో 234; 23 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీ చేశాడు.‘డ్రా’కు అంగీకరించిన కెప్టెన్లుఓవరాల్గా అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్లో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు కావడం విశేషం. 113 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 34 ఓవర్లలో 4 వికెట్లకు 142 పరుగులు చేసింది. మ్యాచ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్ల కెప్టెన్లు ‘డ్రా’కు అంగీకరించారు. రిజల్ట్ రాకపోయినా పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లోనే ఇలాఇదిలా ఉంటే.. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 586 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి బులవాయోలోనే జరుగుతుంది. కాగా టెస్టు క్రికెట్లో తొలిసారి 600 పరుగుల స్కోరు దాటేందుకు అఫ్గనిస్తాన్ పది టెస్టులు ఆడాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 10 జట్లు టెస్టుల్లో 600 అంతకంటే ఎక్కువ స్కోరు నమోదు చేశాయి. ఇందులో అఫ్గనిస్తాన్ తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని దాటడం విశేషం.కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటన(Afghanistan tour of Zimbabwe, 2024-25)కు వెళ్లింది. టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న అఫ్గన్.. వన్డే సిరీస్లోనూ 2-1తో నెగ్గింది. ఇక తొలి టెస్టును డ్రా చేసుకుంది.జింబాబ్వే వర్సెస్ అఫ్గనిస్తాన్ తొలి టెస్టు(డిసెంబరు 26-30)👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: జింబాబ్వే... తొలుత బ్యాటింగ్👉జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోరు: 586👉అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 699👉జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ స్కోరు: 142/4👉ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఆఖరి రోజు ‘డ్రా’కు అంగీకరించిన ఇరుజట్లు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హష్మతుల్లా షాహిది(అఫ్గనిస్తాన్- 474 బంతుల్లో 246 పరుగులు).చదవండి: WTC 2025: భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే.. అదొక్కటే దారి! -
రికార్డు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సరికొత్త చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో డబుల్ సెంచరీ (246) చేసిన షాహిది.. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్ల్లో రెండు డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షాహిది 2021లో జింబాబ్వేపై తొలి డబుల్ సెంచరీ (200) చేశాడు.తాజాగా డబుల్తో షాహిది మరో రికార్డు కూడా సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (246) సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇదే మ్యాచ్లో మరో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రహ్మత్ షా (234) కూడా డబుల్ సెంచరీ చేశాడు. షాహిదికి ముందు రహ్మత్ షాదే ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక స్కోర్గా ఉండేది.మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ తరఫున టెస్ట్ల్లో మూడు డబుల్ సెంచరీలు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడింటిలో రెండు ఇదే మ్యాచ్లో నమోదు కావడం విశేషం. ఈ మ్యాచ్లో మరో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు (అఫ్సన్ జజాయ్) సెంచరీ (113) చేశాడు.రహ్మత్, షాహిది డబుల్.. జజాయ్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (699) చేసింది. టెస్ట్ల్లో ఆఫ్ఘనిస్తాన్కు ఇదే అత్యధిక స్కోర్. ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు ఆఫ్ఘన్ ఆటగాళ్లు మూడంకెల స్కోర్లు సాధించడం కూడా ఇదే మొదటిసారి. 639 పరుగుల వరకు 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఆతర్వాత 60 పరుగుల వ్యవధిలో మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ ఐదు వికెట్లు పడగొట్టగా.. సీన్ విలియమ్స్ 2, ముజరబానీ, గ్వాండు, న్యామ్హురి తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు జింబాబ్వే సైతం తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (586) చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో సైతం ముగ్గురు మూడంకెల స్కోర్లు సాధించారు. సీన్ విలియమ్స్ (154), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (104), బ్రియాన్ బెన్నెట్ (110 నాటౌట్) సెంచరీలు చేశారు. కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతున్న బెన్ కర్రన్ (ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కర్రన్ అన్న) అర్ద సెంచరీతో (68) రాణించాడు. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ స్కోర్తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ 113 పరుగులు ఎక్కువగా సాధించింది. జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెంచరీ సహా ఐదు వికెట్లు ప్రదర్శన నమోదు చేయడం మరో విశేషం.113 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే 5 ఓవర్ల అనంతరం వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. బెన్ కర్రన్ (23), జాయ్లార్డ్ గుంబీ (4) క్రీజ్లో ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు జింబాబ్వే ఇంకా 81 పరుగులు వెనుకపడి ఉంది. మ్యాచ్ చివరి రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్లను ఆఫ్ఘనిస్తాన్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్ను 2-1 తేడాతో నెగ్గిన ఆఫ్ఘన్లు.. వన్డే సిరీస్ను 2-0 తేడాతో గెలుచుకున్నారు. ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుండగా.. రెండో టెస్ట్ జనవరి 2న ప్రారంభంకానుంది. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అఫ్గాన్ ఆటగాడు..
బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వేకు అఫ్గానిస్తాన్ ధీటుగా బదులిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి అఫ్గానిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా 161 పరుగులు వెనంజలో ఉంది. 95/2 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన అఫ్గాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 330 పరుగులు చేసింది.రహ్మత్ షా డబుల్ సెంచరీ..అఫ్గానిస్తాన్ ఫస్ట్ డౌన్ బ్యాటర్ రహ్మత్ షా (416 బంతుల్లో 23 ఫోర్లు, 3 సిక్స్లు 231 బ్యాటింగ్) ఆజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి ఇన్నింగ్స్ను అద్బుతంగా నడిపించాడు. రహ్మత్కు ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు షాహిదీ(276 బంతుల్లో 16 ఫోర్లు, 141 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 361 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.రహ్మత్ షా అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్లో ద్విశతకంతో చెలరేగిన రహ్మత్ షా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అఫ్గాన్ తరపున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్గా రహ్మత్(231*) నిలిచాడు. గతంలో ఈ రికార్డు హష్మతుల్లా షాహిదీ(200) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో షాహిదీ ఆల్టైమ్ రికార్డును షా బ్రేక్ చేశాడు. అదే విధంగా టెస్టు మ్యాచ్లో ఒక రోజు మొత్తం వికెట్ కోల్పోకపోవడం ఇదే తొలిసారి 2019 తర్వాత ఇదే తొలిసారి.చదవండి: VHT 2024-25: పంజాబ్ ఓపెనర్ విధ్వంసం.. 14 ఫోర్లు, 10 సిక్స్లతో -
ZIM Vs AFG: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే.. శతకాల మోత
బులవాయో: అఫ్గానిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు కూడా జింబాబ్వే జోరే కొనసాగింది. దీంతో ఆ జట్టు తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (176 బంతుల్లో 104; 10 ఫోర్లు), బ్రియాన్ బెనెట్ (124 బంతుల్లో 110 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీలతో మొత్తం మూడు శతకాల మోత మోగింది. తొలిరోజు ఆటలో సీన్ విలియమ్స్ సెంచరీ సాధించాడు.ఓవర్నైట్ స్కోరు 363/4తో రెండో రోజు ఆట కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 135.2 ఓవర్లలో 586 పరుగుల వద్ద ఆలౌటైంది. 2001లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో జింబాబ్వే చేసిన 563/9 స్కోరే ఇప్పటిదాకా అత్యధిక పరుగులు కాగా... ఇప్పుడా రికార్డును సవరించింది.ఓవర్నైట్ బ్యాటర్లలో విలియమ్స్ ఎంతోసేపు నిలువలేదు. ఇర్విన్... తర్వాత వచ్చిన బెనెట్తో ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. టెయిలెండర్లు న్యుమన్ న్యామ్హురి (26; 2 ఫోర్లు, 1 సిక్స్), ముజరబని (19; 1 ఫోర్, 1 సిక్స్) చేసిన పరుగులతో జింబాబ్వే అత్యధిక స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 3, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్, జియావుర్ రహ్మాన్ తలా 2 వికెట్లు తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అఫ్గానిస్తాన్ ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. ఓపెనర్లు సిదిఖుల్లా అతల్ (3), అబ్దుల్ మాలిక్ (23; 1 ఫోర్) నిష్క్రమించగా.. రహ్మత్ షా (49 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అఫ్గాన్ ఇంకా 491 పరుగులు వెనుకబడి ఉంది. -
సీన్ విలియమ్స్ అజేయ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా జింబాబ్వే
బులవాయో: జింబాబ్వే పర్యటనకు వచ్చిన అఫ్గానిస్తాన్కు తొలి టెస్టులో ఆతిథ్య బ్యాటర్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. గురువారం మొదలైన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ కరన్ (74 బంతుల్లో 68; 11 ఫోర్లు), వన్డౌన్ బ్యాటర్ కైటానో (115 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్కు 49 పరుగులు జతచేశారు. కరన్ నిష్క్రమించాక వచ్చిన సీన్ విలియమ్స్ (161 బంతుల్లో 145 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) అఫ్గాన్ బౌలర్లపై వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. విలువైన భాగస్వామ్యాలతో జట్టు భారీస్కోరుకు బాటలు వేశాడు.కైటానోతో కలిసి మూడో వికెట్కు 78 పరుగులు, అనంతరం మైయెర్స్ (27; 3 ఫోర్లు)తో నాలుగో వికెట్కు 50 పరుగులు జోడించారు. తర్వాత విలియమ్స్, కెప్టెన్ ఇర్విన్ (94 బంతుల్లో 56 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో 115 బంతుల్లోనే విలియమ్స్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఇర్విన్ కూడా అర్ధసెంచరీ సాధించడంతో ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్కు 143 పరుగులు జోడించారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్ఫర్ 2, నవీద్ జద్రాన్, జహీర్ ఖాన్ చెరో వికెట్ తీశారు. -
చరిత్ర సృష్టించిన అఫ్గనిస్తాన్
Zimbabwe vs Afghanistan, 2nd ODI: అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డే సందర్భంగా ఈ ఘనత సాధించింది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు అఫ్గనిస్తాన్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా తొలుత హరారేలో టీ20 సిరీస్ జరుగగా.. అఫ్గనిస్తాన్ 2-1తో నెగ్గింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అదే వేదికపై మంగళవారం వన్డే సిరీస్ మొదలైంది. అయితే, వర్షం కారణంగా తొలి వన్డే ఫలితం తేలకుండానే ముగిసిపోయింది.అతల్ సెంచరీఈ నేపథ్యంలో జింబాబ్వే- అఫ్గనిస్తాన్ మధ్య గురువారం రెండో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు.. అఫ్గన్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ అర్ధ శతకంతో మెరిశాడు. అటల్ 128 బంతుల్లో 104 పరుగులు చేయగా.. అబ్దుల్ 101 బంతుల్లో 84 పరుగులు రాబట్టాడు.ఇలా ఓపెనర్లు బలమైన పునాది వేయగా.. వన్డౌన్ బ్యాటర్ అజ్మతుల్లా(5), నాలుగో స్థానంలో వచ్చిన రహ్మత్ షా(1) మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో కెప్టెన్ హష్మతుల్లా షాహిది(30 బంతుల్లో 29 నాటౌట్) బ్యాట్ ఝులిపించగా.. మహ్మద్ నబీ(16 బంతుల్లో 18) అతడికి సహకారం అందించాడు. వికెట్ కీపర్ ఇక్రమ్ అలిఖిల్ 5 పరుగులు చేశాడు.54 పరుగులకే జింబాబ్వే ఆలౌట్ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన అఫ్గనిస్తాన్ 286 పరుగులు స్కోరు చేసింది. అయితే, లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే(17.5 ఓవర్లలో) కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ జయభేరి మోగించింది.తద్వారా.. సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్లో సికందర్ రజా సాధించిన 19 పరుగులే టాప్ స్కోర్. అతడు ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.సింగిల్ డిజిట్ స్కోర్లుఓపెనర్లు బెన్ కర్రన్(0), తాడివనాషి మరుమాణి(3).. అదే విధంగా మిగతా ఆటగాళ్లలో డియాన్ మైయర్స్(1), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(4), బ్రియాన్ బెనెట్(0), న్యూమన్ నియామురి(1), రిచర్డ్ ఎంగర్వ(8), ట్రెవర్ గ్వాండు(0), టినోడెండా మపోసా(0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సీన్ విలియమ్స్ 16 పరుగులు చేయగలిగాడు.ఇక అఫ్గనిస్తాన్ బౌలర్లలో ఘజన్ఫర్, నవీద్ జద్రాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. ఫజల్హక్ ఫారూకీ రెండు, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. సెంచరీ వీరుడు సెదికుల్లా అతల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం మూడో వన్డే జరుగనుంది. చదవండి: ‘త్వరలోనే భారత్కు కోహ్లి గుడ్బై... లండన్లో స్థిరనివాసం’ -
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే తొలి వన్డే రద్దు
ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది.సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రంఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్లో ఇక్రమ్ అలీఖిల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.నిప్పులు చెరిగిన ఒమర్జాయ్తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్లో ఉన్నారు. -
టెస్ట్ జట్టులో రషీద్ ఖాన్
త్వరలో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఇవాళ (డిసెంబర్ 16) ప్రకటించారు. ఆఫ్ఘన్ స్టార్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ చాలాకాలం తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. రషీద్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను 2021లో ఆడాడు. గజ్జల్లో గాయం కారణంగా రషీద్ టెస్ట్ మ్యాచ్లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజాగా సెలెక్టర్ల కోరిక మేరకు రషీద్ టెస్ట్ జట్టులో చేరాడు.జింబాబ్వేతో టెస్ట్ సిరీస్ కోసం హష్మతుల్లా షాహిది నేతృత్వంలో 18 మంది సభ్యులతో కూడిన ఆఫ్ఘన్ జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏడుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ బషీర్ అహ్మద్, ఆల్రౌండర్ ఇస్మత్ ఆలమ్ దేశవాలీ టోర్నీల్లో సత్తా చాటారు.మరో నలుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మలిక్, రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్ ఈ ఏడాది సెప్టెంబర్లో న్యూజిలాండ్తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్కు ఎంపికయ్యారు. ఆ మ్యాచ్ వర్షం, వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఒక్క రోజు కూడా సాగలేదు.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లలో టీ20 సిరీస్ ఇదివరకే ముగిసింది. టీ20 సిరీస్ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్లు డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ హరారే వేదికగా జరుగుతాయి. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి బులవాయో వేదికగా జరుగుతాయి.జింబాబ్వేతో రెండు టెస్ట్ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు..హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా (వైస్ కెప్టెన్), ఇక్రమ్ అలీఖైల్ (వికెట్కీపర్), అఫ్సర్ జజాయ్ (వికెట్కీపర్), రియాజ్ హసన్, సెదిఖుల్లా అటల్, అబ్దుల్ మలిక్, బహీర్ షా మహబూబ్, ఇస్మత్ ఆలం, అజ్మతుల్లా ఒమర్జాయ్, జహీర్ ఖాన్, జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ , జహీర్ షెహజాద్, రషీద్ ఖాన్, యామిన్ అహ్మద్జాయ్, బషీర్ అహ్మద్ ఆఫ్ఘన్, నవీద్ జద్రాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్ -
మూడో టీ20లో జింబాబ్వే ఓటమి.. సిరీస్ అఫ్గాన్ సొంతం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 2-1 తేడాతో పర్యాటక అఫ్గాన్ జట్టు సొంతం చేసుకుంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరోసారి బంతితో మ్యాజిక్ చేశాడు. రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆతిథ్య జింబాబ్వేను దెబ్బతీశాడు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్తో పాటు ఓమర్జాయ్, నవీన్ ఉల్ హాక్, ముజీబ్ తలా రెండు వికెట్లు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్(31) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మాధవిరే(21), మజకజ్దా(17) పరుగులతో రాణించారు. అనంతరం 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు అఫ్గానిస్తాన్ తీవ్రంగా శ్రమించింది. 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. అఫ్గాన్ బ్యాటర్లలో ఒమర్జాయ్(34) టాప్ స్కోరర్గా నిలవగా.. మహ్మద్ నబీ(24 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బాని, గ్వాండు, రజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. -
జింబాబ్వేపై ప్రతీకారం తీర్చుకున్న ఆఫ్ఘనిస్తాన్
తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది. -
ఉత్కంఠ పోరులో ఆఫ్ఘనిస్తాన్పై జింబాబ్వే విజయం
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో ఇవాళ (డిసెంబర్ 11) జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ చివరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగింది. చివరి బంతికి ఒక్క పరుగు చేయల్సి ఉండగా.. తషింగ సింగిల్ తీసి జింబాబ్వేను గెలిపించాడు. చివరి ఓవర్లో జింబాబ్వే 11 పరుగులు రాబట్టి గెలుపు తీరాలకు చేరింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ను కరీమ్ జనత్ (54 నాటౌట్), మహ్మద్ నబీ (44) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 79 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. జింబాబ్వే బౌలర్లలో నగరవ 3 వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ, ట్రెవర్ గ్వాండు, మసకద్జ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే ఆదిలో సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (49) జింబాబ్వేను గెలుపు వాకిటి వరకు తీసుకొచ్చి ఔటయ్యాడు. ఇక్కడే ఆఫ్ఘన్లు జింబాబ్వేపై ఒత్తిడి పెంచారు. 11 పరుగుల వ్యవధిలో జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం చివరి బంతి వరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తషింగ (16 నాటౌట్), మసకద్జ (6 నాటౌట్) సాయంతో జింబాబ్వేను విజయతీరాలకు చేర్చాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ (4-1-33-3), రషీద్ ఖాన్ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. మహ్మద్ నబీకి ఓ వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 13న జరుగనుంది. -
జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ సోదరుడు
ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కర్రన్, టామ్ కర్రన్ల సోదరుడు బెన్ కర్రన్ జింబాబ్వే జాతయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జింబాబ్వే వన్డే జట్టులో బెన్ చోటు దక్కించుకున్నాడు. 28 ఏళ్ల బెన్ జింబాబ్వే మాజీ ఆటగాడు, ఆ జట్టు మాజీ హెడ్ కోచ్ కెవిన్ కర్రన్ తనయుడు. కెవిన్కు ముగ్గురు కుమారులు. వీరిలో సామ్, టామ్ కర్రన్లు ఇంగ్లండ్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించగా.. తాజాగా బెన్ జింబాబ్వే జట్టులో చోటు దక్కించుకున్నాడు. జింబాబ్వే దేశవాలీ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చడం ద్వారా బెన్ జాతీయ జట్టు నుంచి తొలిసారి పిలుపునందుకున్నాడు. బెన్ ఎడమ చేతి వాటం బ్యాటర్.కాగా, స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్ల కోసం వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (డిసెంబర్ 9) ప్రకటించారు. టీ20 జట్టుకు సికందర్ రజా, వన్డే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. బెన్ కర్రన్ కేవలం వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కించుకున్నాడు. బెన్తో పాటు న్యూమ్యాన్ న్యామ్హురి కూడా తొలిసారి జాతీయ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. న్యూమ్యాన్ వన్డేతో పాటు టీ20 జట్టుకు ఎంపికయ్యాడు.ఆఫ్ఘనిస్తాన్ పర్యటన తొలుత మూడు మ్యాచ్ల టీ20 సిరీస్తో మొదలవుతుంది. డిసెంబర్ 11, 13, 14 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం డిసెంబర్ 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్తాన్ రెండు టెస్ట్ మ్యాచ్లు కూడా ఆడనుంది. తొలి టెస్ట్ డిసెంబర్ 26 నుంచి.. రెండో టెస్ట్ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి మొదలవుతాయి. జింబాబ్వే టెస్ట్ జట్టును ప్రకటించాల్సి ఉంది.టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా డి ముసెకివాని, బ్లెస్సింగ్ ముజరబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురివన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రన్, జాయ్లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజారబానీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, న్యూమ్యాన్ న్యామ్హురి, విక్టర్ న్యూయుచి, సికందర్ రజా, సీన్ విలియమ్స్ -
పాకిస్తాన్పై సంచలన విజయం సాధించిన పసికూన
బులవాయో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్పై పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే పాక్ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ను జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి 132 పరుగులకే పరిమితం చేశారు. పాక్ ఇన్నింగ్స్లో టాపార్డర్ విఫలం కాగా.. సల్మాన్ అఘా (32), తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు.133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే అష్టకష్టాలు పడి ఎట్టకేలకే విజయతీరాలకు చేరింది. జింబాబ్వే మరో బంతి మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ (43) టాప్ స్కోరర్గా నిలువగా.. మరుమణి (15), డియాన్ మైర్స్ (13), సికంబర్ రజా (19) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. జహన్దాద్ ఖాన్ 2, సల్మాన్ అఘా, సుఫియాన్ ముఖీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. పాకిస్తాన్పై జింబాబ్వేకు టీ20ల్లో ఇది మూడో గెలుపు మాత్రమే.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పాక్ తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచి ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్ నామమాత్రంగా సాగింది. ఈ మ్యాచ్లో గెలిచి జింబాబ్వే క్లీన్ స్వీప్ పరాభవం నుంచి తప్పించుకుంది. అంతకుముందు వన్డే సిరీస్లోనూ జింబాబ్వే ఓ మ్యాచ్ గెలవగా.. పాక్ మిగతా రెండు మ్యాచ్లు గెలిచి 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. -
రాణించిన జింబాబ్వే బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో పాకిస్తాన్ స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్ బర్ల్ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్ చేసి పాక్ను కట్టడి చేశారు. పాక్ ఇన్నింగ్స్లో సల్మాన్ అఘా (32) టాప్ స్కోరర్గా నిలువగా.. తయ్యబ్ తాహిర్ (21), ఖాసిమ్ అక్రమ్ (20), అరాఫత్ మిన్హాస్ (22 నాటౌట్), అబ్బాస్ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ టాపార్డర్ బ్యాటర్లు సాహిబ్జాదా ఫర్హాన్ (4), ఒమైర్ యూసఫ్ (0), ఉస్మాన్ ఖాన్ (5) విఫలమయ్యారు.కాగా, మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన పాక్ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టీ20 నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్ను సైతం పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లలో జింబాబ్వే తొలి వన్డేలో మాత్రమే గెలిచింది. -
చరిత్రపుటల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ రిస్ట్ స్పిన్నర్ సుఫియాన్ ముఖీమ్ చరిత్రపుటల్లోకెక్కాడు. జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ముఖీమ్ 2.4 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ తరఫున టీ20ల్ల ఇవే అత్యుత్తమ గణాంకాలు. గతంలో ఉమర్ గుల్ రెండు సార్లు 5/6 గణాంకాలు నమోదు చేశాడు. పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్గానూ ముఖీమ్ రికార్డుల్లోకెక్కాడు. ముఖీమ్, గుల్, ఇమాద్ వసీం (5/14) పాక్ తరఫున టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించారు. ముఖీమ్ తన ఏడో టీ20లోనే ఈ ఘనత సాధించడం విశేషం.ముఖీమ్ దెబ్బకు జింబాబ్వే టీ20ల్లో తమ అత్యల్ప స్కోర్ను (57) నమోదు చేసింది. ఈ మ్యాచ్లో పాక్ మరో 87 బంతులు మిగిలుండగానే జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని (58) ఛేదించింది. టీ20ల్లో బంతుల పరంగా పాక్కు ఇది భారీ విజయం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 12.4 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌటైంది. ముఖీమ్ 5, అబ్బాస్ అఫ్రిది 2, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, సల్మాన్ అఘా తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో ఓపెనర్లు బ్రియాన్ బెన్నెట్ (21), మరుమణి (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్కు 37 పరుగులు జోడించారు. అనంతరం 20 పరుగుల వ్యవధిలో జింబాబ్వే 10 వికెట్లు కోల్పోయింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్ 5.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. సైమ్ అయూబ్ (36), ఒమైర్ యూసఫ్ (22) అజేయంగా నిలిచారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 5న జరుగనుంది. -
Zim vs Pak: తొలి టీ20లో పాకిస్తాన్ గెలుపు
జింబాబ్వేతో తొలి టీ20లో రిజర్వ్ బెంచ్తో బరిలోకి దిగిన పాకిస్తాన్ శుభారంభం చేసింది. బులవాయోలో ఆదివారం జరిగిన మ్యాచ్లో 57 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై నెగ్గింది. సల్మాన్ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్లు), తయ్యబ్ తాహిర్ (25 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (15 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) ధాటిగా ఆడారు.108 పరుగులకే ఆలౌట్జింబాబ్వే బౌలర్లలో ఎన్గరవ, సికందర్ రజా, మసకద్జా, బర్ల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే 15.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), తదివనషి మరుమని (20 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు.ఇక మిగతా 9 మందిలో ఏ ఒక్కరు కూడా కనీసం పది పరుగులైనా చేయలేకపోయారు. పాక్ బౌలర్లు అబ్రార్ అహ్మద్, సుఫియాన్ చెరో మూడు వికెట్లు తీయగా, రవూఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది.ఇక మంగళవారం ఇక్కడే రెండో టీ20 జరుగుతుంది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో వన్డే సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న పాక్.. టీ20 సిరీస్ విజయంపై కూడా కన్నేసింది.పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 స్కోర్లు👉వేదిక: క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్, బులవాయో👉టాస్: పాకిస్తాన్.. బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు: 165/4 (20)👉జింబాబ్వే స్కోరు:108 (15.3)👉ఫలితం: జింబాబ్వేపై 57 పరుగుల తేడాతో పాకిస్తాన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తయ్యబ్ తాహిర్.చదవండి: ‘పింక్’ మ్యాచ్లో భారత్దే విజయం -
జింబాబ్వేతో తొలి టీ20.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన పాకిస్తాన్
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఒమైర్ యూసఫ్ 16, సైమ్ అయూబ్ 24, ఉస్మాన్ ఖాన్ 39, సల్మాన్ అఘా 13 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో తయ్యబ్ తాహిర్ (39), ఇర్ఫాన్ ఖాన్ (27) వేగంగా పరుగులు రాబట్టి అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ, సికందర్ రజా, వెల్లింగ్టన్ మసకద్జ, ర్యాన్ బర్ల్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మూడు వన్డేలు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం పాకిస్తాన్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా తొలి టీ20 ఇవాళ (డిసెంబర్ 1) బులవాయోలో జరుగుతుంది. తొలి టీ20కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో తొలి వన్డే గెలిచి సంచనలం సృష్టించిన జింబాబ్వే ఆతర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయింది. -
జింబాబ్వేను చిత్తు చేసిన పాకిస్తాన్.. సిరీస్ సొంతం
బులవాయో స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 99 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. ఇక 304 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 40.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది.ఆతిథ్య జింబాబ్వే బ్యాటర్లలో కెప్టెన్ క్రెయిగ్ ఎర్వైన్(51) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. బెన్నెట్(37) పరుగులతో పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, ఆర్బర్ ఆహ్మద్, హ్యారీస్ రౌఫ్, జమాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.కమ్రాన్ గులాం సెంచరీ..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పాక్ బ్యాటర్లలో కమ్రాన్ గులాం(103) తొలి వన్డే సెంచరీ సాధించగా.. షఫీక్(50), మహ్మద్ రిజ్వాన్(37), సల్మాన్ ఆఘా(30) పరుగులతో రాణించారు.జింబాబ్వే బౌలర్లలో రజా,నగరవా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ముజాబ్రనీ, అక్రమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. -
అరంగేట్రంలోనే రికార్డుల్లోకెక్కిన పాక్ బౌలర్
పాకిస్తాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ అరంగేట్రంలోనే (వన్డే) రికార్డుల్లోకెక్కాడు. అబ్రార్ తొలి మ్యాచ్లోనే తమ దేశ దిగ్గజ బౌలర్ అబ్దుల్ ఖాదిర్ సరసన చేరాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో (రెండో వన్డే) 4 వికెట్లు తీసిన అబ్రార్, అబ్దుల్ ఖాదిర్తో పాటు ఎలైట్ గ్రూప్లో చేరాడు. 1984లో న్యూజిలాండ్తో జరిగిన వన్డేలో అబ్దుల్ ఖాదిర్ కూడా తన అరంగేట్రంలో 4 వికెట్లు తీశాడు. పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో ఇవే అత్యధిక వికెట్లు. అబ్దుల్ ఖాదిర్, అబ్రార్ అహ్మద్తో పాటు జాకిర్ ఖాన్, సర్ఫరాజ్ నవాజ్ కూడా పాక్ తరఫున వన్డే అరంగేట్రంలో నాలుగు వికెట్లు తీశారు. కాగా, జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో పాక్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాక్, ఈ మ్యాచ్లో గెలుపొంది ప్రతీకారం తీర్చుకుంది. ఈ గెలుపుతో పాక్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.విజృంభించిన అబ్రార్.. 145 పరుగులకే కుప్పకూలిన జింబాబ్వేఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. అబ్రార్ అహ్మద్ (8-2-33-4), అఘా సల్మాన్ (7-0-26-3), సైమ్ అయూబ్ (4-0-16-1), ఫైసల్ అక్రమ్ (5.3-0-19-1) జింబాబ్వే ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో డియాన్ మైర్స్ (33) టాప్ స్కోరర్గా నిలిచాడు.53 బంతుల్లో శతక్కొటిన సైమ్ అయూబ్146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. 18.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ సైమ్ అయూబ్ విధ్వంసకర సెంచరీతో పాక్ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్లో అయూబ్ 53 బంతుల్లో శతక్కొట్టాడు. పాక్ తరఫున వన్డేల్లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ (జాయింట్). ఈ మ్యాచ్లో సైమ్ ఓవరాల్గా 62 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ 48 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సిరీస్లో నిర్ణయాత్మక మూడో వన్డే నవంబర్ 28న జరుగనుంది. -
పాక్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో ఊచకోత
తొలి వన్డేలో జింబాబ్వే చేతిలో ఓటమికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన రెండో వన్డేలో 10 వికెట్లను తేడాతో జింబాబ్వేను పాక్ చిత్తు చేసింది. 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లు సైమ్ అయూబ్, అబ్దుల్లా షషీక్ ఊదిపడేశారు.కేవలం 18.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా పాక్ లక్ష్యాన్ని చేధించింది. సైమ్ ఆయూబ్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 62 బంతులు ఎదుర్కొన్న అయూబ్.. 17 ఫోర్లు, 3 సిక్స్లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు అబ్దుల్ షఫీక్(32 నాటౌట్) రాణించాడు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 32.3 ఓవర్లలో కేవలం 145 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక పాక్ బౌలర్లలో స్పిన్నర్ అర్బర్ ఆహ్మద్ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. అఘా సల్మాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడర్ ఇదే వేదికలో నవంబర్ 28న జరగనుంది.చదవండి: IPL 2025: 'రూ.75 లక్షలకు కూడా ఎవరూ తీసుకులేదు.. ఇప్పటికైనా సిగ్గు పడు' -
సంచలనం.. పాకిస్తాన్ను చిత్తు చేసిన జింబాబ్వే
జింబాబ్వే పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. బులవాయో వేదికగా జరిగిన తొలి వన్డేలో 80 పరుగుల(డీఎల్ఎస్) తేడాతో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జింబాబ్వే 40.2 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో నగరవా(48) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రజా(39) పరుగులతో రాణించారు. మరోవైపు పాక్ బౌలర్లలో ఆఘా సల్మాన్, ఫైజల్ ఆక్రమ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు జింబాబ్వే బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. ఆతిథ్య జట్టు బౌలర్లు దాటికి పాక్ జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో జింబాబ్వేను విజేతగా అంపైర్లు నిర్ణయించారు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్ రానీ, సికిందర్ రజా, సీన్ విలియమ్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన సికిందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా వన్డేల్లో పాకిస్తాన్ను జింబాబ్వే ఓడించడం ఇదే ఆరోసారి కావడం గమనార్హం. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 26న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IPL 2025: వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు -
పాకిస్తాన్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం జింబాబ్వే జట్ల ప్రకటన
స్వదేశంలో పాకిస్తాన్తో జరిగే వన్డే, టీ20 సిరీస్ల కోసం రెండు వేర్వేరు జింబాబ్వే జట్లను ఇవాళ (నవంబర్ 18) ప్రకటించారు. వన్డే జట్టుకు కెప్టెన్గా క్రెయిస్ ఎర్విన్.. టీ20 జట్టు సారధిగా సికందర్ రజా ఎంపికయ్యారు. వన్డే జట్టులో కొత్తగా ముగ్గురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు (ట్రెవర్ గ్వాండు, తషింగ ముసెకివా, టినొటెండా మపోసా) చోటు దక్కింది. వన్డే జట్టులో సికందర్ రజా, సీన్ విలియమ్స్, బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ లాంటి సీనియర్ ప్లేయర్లు.. క్లైవ్ మదండే, బ్రియాన్ బెన్నెట్, డియాన్ మైర్స్ లాంటి యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. టీ20 జట్టులో వన్డే జట్టు కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్, జాయ్లార్డ్ గుంబీకు చోటు దక్కలేదు. పాకిస్తాన్ జట్టు నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో పాక్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ల కోసం పాక్ జట్లను ఇదివరకే ప్రకటించారు. ఈ సిరీస్ల కోసం పాక్ మేనేజ్మెంట్ బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది లాంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చింది.జింబాబ్వే పర్యటనలో పాక్ షెడ్యూల్..నవంబర్ 24- తొలి వన్డే నవంబర్ 26- రెండో వన్డేనవంబర్ 28- మూడో వన్డేడిసెంబర్ 1- తొలి టీ20డిసెంబర్ 3- రెండో టీ20డిసెంబర్ 5- మూడో టీ20మ్యాచ్లన్నీ బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగనున్నాయి.జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, జాయ్లార్డ్ గుంబీ, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, బ్రాండన్ మవుటా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, సీన్ విలియమ్స్.జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రజా (కెప్టెన్), ఫరాజ్ అక్రమ్, బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, ట్రెవర్ గ్వాండు, క్లైవ్ మదాండే, వెస్లీ మాధవెరె, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్ మవుటా, తషింగ ముసెకివా, బ్లెస్సింగ్ ముజరాబనీ, డియాన్ మైర్స్, రిచర్డ్ నగరవ -
వాట్సాప్ గ్రూప్లకు లైసెన్స్.. ఫీజు కూడా!
అక్కడ వాట్సాప్ గ్రూప్ను నిర్వహించడమంటే ఆషామాషీ కాదు. గ్రూప్ అడ్మిన్కు లైసెన్స్ ఉండాలి. ఇందుకోసం ఫీజు కూడా చెల్లించాలి. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా? పూర్తి వివరాల కోసం ఈ కథనంలో చదివేయండి..వాట్సాప్ గ్రూప్ నిర్వహణకు సంబంధించి జింబాబ్వే ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేసింది. దీని ప్రకారం ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లందరూ జింబాబ్వే పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (POTRAZ)లో నమోదు చేసుకోవాలి. వారి గ్రూప్ నిర్వహణకు లైసెన్స్ పొందాలి. ఈ లైసెన్స్ కోసం ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇందు కోసం కనీసం 50 డాలర్లు (సుమారు రూ.4,200) ఖర్చవుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ, పోస్టల్ అండ్ కొరియర్ సర్వీసెస్ (ICTPCS) మంత్రి తటెండా మావెటెరా ప్రకటించారు.కొత్త రూల్ ఎందుకంటే..తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా, దేశంలో శాంతి నెలకొనేందుకు ఆ దేశ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఈ కొత్త వాట్సాప్ నిబంధనను రూపొందించారు. ఈ చట్టం ప్రకారం, ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల వద్ద సభ్యుల ఫోన్ నంబర్లు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రకారం, వారు డేటా ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోకి వస్తారు.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు! -
ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు పాక్ జట్ల ప్రకటన
నవంబర్ 4 నుంచి మొదలుకానున్న ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం వేర్వేరు పాకిస్తాన్ జట్లను ఇవాళ (అక్టోబర్ 27) ప్రకటించారు. ఈ జట్లకు కెప్టెన్ను ఇంకా ప్రకటించలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వి ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి కెప్టెన్ను అనౌన్స్ చేస్తాడు.ఆస్ట్రేలియా పర్యటన నవంబర్ 4 నుంచి 18 వరకు జరుగనుంది.ఇందులో మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి.జింబాబ్వే పర్యటన నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జరుగుతుంది.ఈ పర్యటనలోనూ మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగుతాయి.ఇంగ్లండ్తో చివరి రెండు టెస్ట్లకు రెస్ట్ ఇచ్చిన బాబర్ ఆజమ్, నసీం షా, షాహీన్ అఫ్రిదిలను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేశారు.వీరికి తిరిగి జింబాబ్వేతో సిరీస్లకు విశ్రాంతినిచ్చారు.స్టార్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్ జింబాబ్వేతో టీ20లకు మినహా మిగతా మ్యాచ్లకు అన్నింటికీ అందుబాటులో ఉంటాడు.ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు పాకిస్తాన్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిదిఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్జింబాబ్వేతో వన్డే సిరీస్కు పాక్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షానవాజ్ దహానీ, తయ్యబ్ తాహిర్జింబాబ్వేతో టీ20 సిరీస్కు పాక్ జట్టు..అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్కీపర్), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా, సుఫ్యాన్ మొఖిమ్, ఉస్మాన్ ఖాన్ -
పరుగుల విధ్వంసం.. ఫాస్టెస్ట్ సెంచరీ.. రోహిత్ రికార్డు బ్రేక్
-
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో పెను సంచలనం
-
స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా
జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్ సికందర్ రజా ఓ విషయంలో టీమిండియా స్టార్లు సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లిలను అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా గాంబియాతో నిన్న (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్లో సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇది అతని కెరీర్లో 17వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. ఈ మ్యాచ్కు ముందు వరకు టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు రజా, స్కై, విరాట్, విరన్దీప్ సింగ్ల పేరిట సంయుక్తంగా ఉండేది. వీరంతా తలో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నారు. తాజాగా రజా.. స్కై, విరాట్, విరన్లను అధిగమించి తన పేరిట సింగిల్గా ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా, స్కై, విరాట్, విరన్ తర్వాత రోహిత్ శర్మ (14), మొహమ్మద్ నబీ (14) ఉన్నారు.జింబాబ్వే, గాంబియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో జింబాబ్వే వరల్డ్ రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్. ఈ మ్యాచ్లో సికందర్ రజా సుడిగాలి శతకం (43 బంతుల్లో 133 నాటౌట్; 7 ఫోర్లు, 15 సిక్సర్లు) బాదాడు. బ్రియాన్ బెన్నెట్ (26 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), మరుమణి (19 బంతుల్లో 62; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), మదండే (17 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలు సాధించారు. అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలి 290 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు -
రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు బ్రేక్.. ఫాస్టెస్ట్ సెంచూరియన్గా!
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. కాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్లో భాగంగా జింబాబ్వే బుధవారం గాంబియాతో మ్యాచ్ ఆడింది.ఫాస్టెస్ట్ సెంచరీనైరోబీలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు బ్రియాన్ బెనెట్( 26 బంతుల్లో 50), తాడివాన్షే మరుమణి(Tadiwanashe Marumani- 19 బంతుల్లోనే 62) దుమ్ములేపగా.. సికందర్ రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.ఈ క్రమంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. టెస్టు హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.టెస్టులు ఆడే దేశాలకు చెందిన ఆటగాళ్లలో టీ20 ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదు చేసింది వీరే1. సికందర్ రజా(జింబాబ్వే)- గాంబియాపై 33 బంతుల్లో శతకం2. డేవిడ్ మిల్లర్(సౌతాఫ్రికా)- బంగ్లాదేశ్పై 35 బంతుల్లో సెంచరీ3. రోహిత్ శర్మ(ఇండియా)- శ్రీలంకపై 35 బంతుల్లో శతకం4. జాన్సన్ చార్ల్స్(వెస్టిండీస్)- సౌతాఫ్రికాపై 39 బంతుల్లో శతకం5. సంజూ శాంసన్(ఇండియా)- బంగ్లాదేశ్పై 40 బంతుల్లో శతకంఏకంగా 15 సిక్సర్లతో మరో రికార్డుఇక గాంబియాతో మ్యాచ్లో మొత్తంగా 3 బంతులు ఎదుర్కొన్న సికందర్ రజా.. ఏడు బౌండరీలు, పదిహేను సిక్స్ల సాయంతో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మరో రికార్డును కూడా సికందర్ రజా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. ఈ లిస్టులో సాహిల్ చౌహాన్, హజ్రతుల్లా జజాయ్, ఫిన్ అలెన్ 16 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా.. సికందర్ రజా, జీషన్ కుకిఖెల్ 15 సిక్స్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో జింబాబ్వే గాంబియాపై 344 పరుగులుస్కోరు చేసి ప్రపంచ రికార్డు సాధించింది.చదవండి: Asia Cup 2024: పాకిస్తాన్ భారీ విజయం.. భారత్తో పాటు సెమీస్లో! -
టీ10 క్రికెట్లో సంచలనం.. స్కాట్లాండ్ క్రికెటర్ సుడిగాలి శతకం
టీ10 క్రికెట్లో సంచనలం నమోదైంది. జిమ్ ఆఫ్రో లీగ్-2024లో స్కాట్లాండ్ క్రికెటర్ జార్జ్ మున్సే సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. డర్బన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్లో మున్సే (హరారే బోల్ట్స్) కేవలం 38 బంతుల్లో శతక్కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. జిమ్ ఆఫ్రో లీగ్ చరిత్రలో ఇదే తొలి సెంచరీ. మున్సే సెంచరీతో శివాలెత్తడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హరారే బోల్ట్స్ నిర్ణీత 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. బోల్ట్స్ ఇన్నింగ్స్లో మున్సే సెంచరీ తర్వాత ఎక్స్ట్రాల రూపంలో (29) అత్యధిక పరుగులు వచ్చాయి. జనిష్క పెరీరా 24, లహీరు మిలంత 13, దసున్ షనక 7 పరుగులు చేశారు. వోల్వ్స్ బౌలర్లలో దౌలత్ జద్రాన్ రెండు వికెట్లు తీశాడు.174 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వోల్వ్స్.. ఏ దశలో గెలుపు దిశగా సాగలేదు. ఆ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 116 పరుగులకే పరిమితమై 54 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కొలిన్ మున్రో (32), షర్జీల్ ఖాన్ (25), విల్ స్మీడ్ (16), ఇన్నోసెంట్ కాలా (16), రిచ్మండ్ ముతుంబామి (15) రెండంకెల స్కోర్లు చేశారు. బోల్ట్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, బ్రాండన్ మవుటా, దసున్ షనక, జేమ్స్ నీషమ్, అరినెస్టో వెజా తలో వికెట్ పడగొట్టారు.చదవండి: కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..! -
డేవిడ్ మలాన్ విధ్వంసం.. 25 బంతుల్లోనే..!
జిమ్ ఆఫ్రో టీ10 లీగ్లో కేప్ టౌన్ సాంప్ ఆర్మీ (ఇంగ్లండ్) ఆటగాడు డేవిడ్ మలాన్ విధ్వంసం సృష్టించాడు. నైస్ లాగోస్తో జరిగిన మ్యాచ్లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. మలాన్తో పాటు రోహన్ ముస్తఫా కూడా మెరుపు అర్ద సెంచరీతో (23 బంతుల్లో 50; 10 ఫోర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సాంప్ ఆర్మీ.. నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగుల భారీ స్కోర్ చేసింది. సాంప్ ఆర్మీ ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ 0, మరుమణి 7, లియోనార్డో జూలియన్ 10, ఖయాస్ అహ్మద్ 8 పరుగులు చేశారు. లాగోస్ బౌలర్లలో బినుర ఫెర్నాండో, ముజరబానీ, తిసార పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లాగోస్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా సాంప్ ఆర్మీ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. లాగోస్ ఇన్నింగ్స్లో తిసార పెరీరా (17 బంతుల్లో 48; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలువగా.. రస్సీ వాన్ డెర్ డస్సెన్ 19, అవిష్క ఫెర్నాండో 19, నజీబుల్లా జద్రాన్ 11, ర్యాన్ బర్ల్ 17*, జాషువ బిషప్ 6 పరుగులు చేశారు. సాంప్ ఆర్మీ బౌలర్లలో అమీర్ హంజా 2, డేవిడ్ విల్లే, రోహన్ ముస్తఫా, ఖయాస్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.నిన్ననే (సెప్టెంబర్ 23) జరిగిన మరో రెండు మ్యాచ్ల్లో జోబర్గ్ బంగ్లా టైగర్స్పై హరారే బోల్ట్స్.. డర్బన్ వోల్వ్స్పై బులవాయో జాగ్వర్స్ విజయాలు సాధించాయి. జోబర్గ్ బంగ్లా టైగర్స్తో జరిగిన మ్యాచ్లో హరారే బోల్ట్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టైగర్స్ 9.4 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. 20 పరుగులు చేసిన సికందర్ రజా టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బోల్ట్స్ 9.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దసున్ షనక (21 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో బోల్ట్స్ను గెలిపించాడు.డర్బన్ వోల్వ్స్తో జరిగిన మ్యాచ్లో బులవాయో జాగ్వర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వోల్వ్స్.. విల్ స్మీడ్ (55 నాటౌట్), మార్క్ చాప్మన్ (38 నాటౌట్) రాణించడంతో 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అనంతరం లారీ ఈవాన్స్ (26), నిక్ హబ్సన్ మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో జాగ్వర్స్ మరో మూడు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: చరిత్ర సృష్టించిన పూరన్ -
క్రికెట్ చరిత్రలో ఓ ఆశ్చర్య ఘటన..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 18వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1997లో ఈ రోజు మొదలైన టెస్ట్ మ్యాచ్లో మూడు అన్నదమ్ములు జోడీలు ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించాయి. నాడు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే తరఫున ఫ్లవర్ సోదరులు (ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్), స్ట్రాంగ్ సోదరులు (పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్), రెన్నీ సోదరులు (జాన్ రెన్నీ, గావిన్ రెన్నీ) తుది జట్టులో ఆడారు.ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జింబాబ్వే జట్టులో 12వ నంబర్ ఆటగాడు ఆండీ విట్టల్.. జింబాబ్వే ప్లేయింగ్ ఎలెవెన్లో ఉన్న గయ్ విట్టల్కు సోదరుడు. ఒకవేళ ఆ మ్యాచ్లో ఆండీ విట్టల్ కూడా ఆడి ఉంటే నాలుగు బ్రదర్స్ జోడీలు బరిలో ఉండేవి. క్రికెట్ చరిత్రలో మూడు అన్నదమ్ముల జోడీలు ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్లో బరిలోకి దిగడం అదే మొదటిసారి, చివరిసారి. క్రికెట్లో అన్నదమ్ములు జోడీలు చాలానే ఉన్నప్పటికీ.. ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్లో మూడు జోడీలు బరిలోకి దిగింది లేదు.ఒకే మ్యాచ్లో ఒకే జట్టు తరఫున బరిలోకి దిగిన అన్నదమ్ముల జోడీలు..హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా (భారత్)షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)టామ్ కర్రన్, సామ్ కర్రన్ (ఇంగ్లండ్)ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ (భారత్)స్టీవ్ వా, మార్క్ వా (ఆస్ట్రేలియా)ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే)గై విట్టల్, ఆండీ విట్టల్ (జింబాబ్వే)పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్ (జింబాబ్వే)అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ (సౌతాఫ్రికా)బ్రెండన్ మెక్కల్లమ్, నాథన్ మెక్కల్లమ్ (న్యూజిలాండ్)మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ (ఆస్ట్రేలియా)కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్ (పాకిస్తాన్)బ్రెట్ లీ, షేన్ లీ (ఆస్ట్రేలియా)గ్రెగ్ ఛాపెల్, ఇయాన్ ఛాపెల్, ట్రెవర్ ఛాపెల్ (ఆస్ట్రేలియా)జెస్సీ రైట్, ఫ్రాంక్ రైట్, రిచర్డ్ రైట్ (న్యూజిలాండ్)చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్లో..! -
IRE Vs ZIM: బౌండరీని ఆపబోతే ఇలా అయ్యిందేంటి..?
ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఓ ఆరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆట నాలుగో రోజు ఐర్లాండ్ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. ఫీల్డర్ బౌండరీని ఆపబోతే బ్యాటర్లు ఐదు పరుగులు తీశారు. ఈ ఆసక్తికర పరిణామానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతంది.Fielder saves 4, batters run 5.pic.twitter.com/UgZqOp7iBc— CricTracker (@Cricketracker) July 28, 2024వివరాల్లోకి వెళితే.. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. ఈ దశలో రిచర్డ్ నగరవ బౌలింగ్లో ఆండీ మెక్బ్రైన్ కవర్ డ్రైవ్ ఆడగా.. టెండాయ్ చటార బౌండరీ లైన్ వరకు ఛేజింగ్ చేసి బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపగలిగాడు. అయితే ఈ లోపు ఆండీ మెక్బ్రైన్, లోర్కాన్ టక్కర్ ఐదు పరుగులు తీశారు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.కాగా, ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో జింబాబ్వేపై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్.. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడటంతో చారిత్రక విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్ను గెలిపించాడు. టెస్ట్ల్లో ఐర్లాండ్కు ఇది రెండో విజయం. ఈ ఏడాదే ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250, సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
ఐర్లాండ్ బ్యాటర్ల వీరోచిత పోరాటం.. జింబాబ్వేపై సంచలన విజయం
స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 21 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ అద్భుత విజయం నమోదు చేసింది. లొర్కాన్ టక్కర్ (56), ఆండీ మెక్బ్రైన్ (55 నాటౌట్) వీరోచితంగా పోరాడి ఐర్లాండ్కు చారిత్రక విజయం అందించారు. ఓవర్నైట్ స్కోర్ 33/5 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్.. టక్కర్ వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. మెక్బ్రైన్.. మార్క్ అదైర్ (24) సహకారంతో ఐర్లాండ్ను గెలిపించాడు. టెస్ట్ల్లో ఐర్లాండ్కు ఇది రెండో విజయం. ఈ ఏడాది ఐర్లాండ్ తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్కు షాకిచ్చింది.కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250, సెకెండ్ ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. -
నిప్పులు చెరిగిన నగరవ.. ఓటమి దిశగా ఐర్లాండ్
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. 158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ మూడో రోజు ఆఖరి సెషన్లో నిప్పులు చెరిగాడు. నగరవ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ టాపార్డర్ను కుప్పకూల్చాడు. బ్లెస్సింగ్ ముజరబాని ఓ వికెట్ పడగొట్టాడు. నగరవ ధాటికి ఐర్లాండ్ టాపార్డర్ ఏకంగా ముగ్గురు (పీటర్ మూర్, కర్టిస్ క్యాంఫర్, హ్యారీ టెక్టార్) డకౌట్లయ్యారు. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 4, పాల్ స్టిర్లింగ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. లొర్కాన్ టక్కర్ 9, ఆండీ మెక్ బ్రైన్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఐర్లాండ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే మరో 125 పరుగులు చేయల్సి ఉంది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగా చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్లో 210, రెండో ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులు చేసింది. -
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే క్రికెటర్ క్లైవ్ మండాడే టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్లో ‘బై’స్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. ఐర్లాండ్తో టెస్టు సందర్భంగా ఈ పరాభవం మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే చేదు జ్ఞాపకాన్ని పోగుచేసుకున్నాడు.అరంగేట్రంలో డకౌట్ఏకైక టెస్టు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా గురువారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే.. 71.3 ఓవర్లలో 210 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది.ఓపెనర్లు గుంబీ 49, మస్వారే 74 పరుగులతో రాణించారు. సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మండాడే ఏడో స్థానంలో బరిలోకి దిగి.. డకౌట్గా వెనుదిరిగాడు.ఇక తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్ 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మూర్ 79 రన్స్ చేయగా.. ఆండీ మెక్బ్రైన్ 28 పరుగులతో ఐరిష్ ఇన్నింగ్స్లో రెండో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్లో జింబాబ్వే కంటే.. 40 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.90 ఏళ్ల రికార్డు బద్దలుఅయితే, ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 24 ఏళ్ల క్లైవ్ మండాడే బైస్ రూపంలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ వికెట్ కీపర్ లెస్ ఆమ్స్ నమోదు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా 147 ఏళ్ల చరిత్రలో ఇలాంటి అన్వాంటెడ్ రికార్డు సాధించిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. అయితే, ఇందులో కేవలం క్లైవ్ను మాత్రమే తప్పుపట్టడానికి లేదు. జింబాబ్వే బౌలర్లకు కూడా ఇందులో భాగం ఉంది. కాగా 1934లో ఆమ్స్ ఒక టెస్టు ఇన్నింగ్స్లో 37 పరుగులు బైస్ రూపంలో ఇచ్చుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే ఐర్లాండ్ కంటే 28 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది జింబాబ్వే.తుదిజట్లుజింబాబ్వేజోయ్ లార్డ్ గుంబీ, ప్రిన్స్ మస్వారే, డియాన్ మేయర్స్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మాండాడే (వికెట్ కీపర్), బ్లెస్సింగ్ ముజరాబానీ, రిచర్డ్ నగరవా, తనకా చివంగా, టెండాయ్ చటారా.ఐర్లాండ్ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), పీటర్ మూర్, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), ఆండీ మెక్బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, క్రెయిగ్ యంగ్, మాథ్యూ హంఫ్రీస్. -
ఐర్లాండ్ బౌలర్ల విజృంభణ.. కుప్పకూలిన జింబాబ్వేృ
స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఐర్లాండ్ బౌలర్లు చెలరేగిపోయారు. తొలి రోజే ప్రత్యర్ధిని 210 పరుగులకు ఆలౌట్ చేశారు. బ్యారీ మెక్ కార్తీ, ఆండీ మెక్బ్రైన్ చెరి మూడు వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాశించగా.. మార్క్ అదైర్ 2, క్రెయిగ్ యంగ్, కర్టిస్ క్యాంఫర్ తలో వికెట్ పడగొట్టారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో ప్రిన్స్ మస్వౌరే 74 పరుగులతో రాణించగా.. జాయ్లార్డ్ గుంబీ (49), సీన్ విలియమ్స్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డియాన్ మైయర్స్ (10), కెప్టెన్ క్రెయిర్ ఎర్విన్ (5), బ్రియాన్ బెన్నెట్ (8), క్లైవ్ మదండే (0), బ్లెస్సింగ్ ముజరబానీ (4), రిచర్డ్ నగరవ (5), టెండయ్ చటార (0) నిరాశపరిచారు.కాగా, సొంతగడ్డపై ఐర్లాండ్కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లు ఆడింది. -
జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్.. ఐర్లాండ్ జట్టు ప్రకటన
స్వదేశంలో జింబాబ్వేతో జరుగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్ జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ జట్టుకు ఆండ్రూ బల్బిర్నీ సారథ్యం వహించనున్నాడు. 22 ఏళ్ల అన్ క్యాప్డ్ లెగ్ స్పిన్నర్ గావిన్ హోయ్ జాతీయ జట్టుకు తొలిసారి ఎంపికయ్యాడు. ఈ ఒక్క ఎంపిక మినహా మిగతా జట్టంతా ఊహించిన విధంగానే ఉంది. సొంతగడ్డపై ఐర్లాండ్కు ఇది రెండో టెస్ట్ మ్యాచ్. 2018లో ఆ జట్టు తమ మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడింది. ఐర్లాండ్ టెస్ట్ హోదా లభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఆ జట్టు ఈ ఏడాదే తమ తొట్టతొలి టెస్ట్ విజయాన్ని సాధించింది. యూఏఈలో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్.. తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించి, సంచలనం సృష్టించింది. ఐర్లాండ్ ఇప్పటివరకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లు ఆడింది. జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ ఈ నెల 25-29 మధ్యలో బెల్ఫాస్ట్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం జింబాబ్వే జట్టును ఇదివరకే ప్రకటించారు. జింబాబ్వే జట్టుకు క్రెయిగ్ ఎర్విన్ సారథ్యం వహించనున్నాడు.జింబాబ్వేతో ఏకైక టెస్ట్కు ఐర్లాండ్ జట్టు..ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గావిన్ హోయ్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, ఆండీ మెక్బ్రైన్, బారీ మెక్కార్తీ, జేమ్స్ మెక్కొల్లమ్, పిజె మూర్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, క్రైగ్ యంగ్జింబాబ్వే జట్టు..డియోన్ మైర్స్, జోనాథన్ క్యాంప్బెల్, ప్రిన్స్ మస్వౌర్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, రాయ్ కయా, బ్రియాన్ బెన్నెట్, జాయ్లార్డ్ గుంబీ, క్లైవ్ మదండే, టనకా చివంగ, టెండాయ్ చటారా, బ్లెస్సింగ్ ముజరబాని, వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యాయుచి -
IND vs ZIM: ఆఖరి పంచ్ కూడా మనదే.. 4-1తో సిరీస్ విజయం
హరారే: మరోసారి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు జింబాబ్వే పర్యటనను ఘనవిజయంతో ముగించింది. ఆదివారం జరిగిన చివరిదైన ఐదో టి20 మ్యాచ్లో టీమిండియా 42 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. వరుసగా నాలుగో గెలుపుతో భారత బృందం సిరీస్ను 4–1తో సొంతం చేసుకుంది. కెప్టెన్ హోదాలో శుబ్మన్ గిల్ భారత్కు తొలి సిరీస్ను అందించాడు. ఈ మ్యాచ్కంటే ముందే సిరీస్ను కైవసం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్లోనూ ఆధిపత్యం కనబరిచింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు సాధించింది.సంజూ సామ్సన్ (45 బంతుల్లో 58; 1 ఫోర్, 4 సిక్స్లు) అర్ధ సెంచరీతో అలరించాడు. అనంతరం జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. 26 పరుగులు చేయడంతోపాటు రెండు వికెట్లు పడగొట్టిన శివమ్ దూబేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 8 వికెట్లు తీయడంతోపాటు 28 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. సిక్స్తో మొదలు... భారత్ ఇన్నింగ్స్ వరుసగా రెండు సిక్స్లతో మొదలైంది. సికందర్ రజా వేసిన తొలి బంతినే యశస్వి జైస్వాల్ (5 బంతుల్లో 12; 2 సిక్స్లు) సిక్స్గా మలిచాడు. ఇది నోబాల్ కూడా కావడంతో భారత్ ఖాతాలో తొలి బంతికే ఏడు పరుగులు చేరాయి. రెండో బంతిపై కూడా జైస్వాల్ సిక్స్ కొట్టాడు. అయితే మరో రెండు బంతుల తర్వాత జైస్వాల్ బౌల్డ్ అవ్వడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మూడో ఓవర్లో అభిõÙక్ ఒక సిక్స్ కొట్టగా... గిల్ రెండు ఫోర్లు బాదాడు.ముజరబాని వేసిన నాలుగో ఓవర్లో అభిõÙక్ (11 బంతుల్లో 14; 1 సిక్స్), ఎన్గరావా వేసిన ఐదో ఓవర్లో గిల్ (14 బంతుల్లో 13; 2 ఫోర్లు) అవుటయ్యారు. దాంతో భారత్ ఐదు ఓవర్లు ముగిసేసరికి 40/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో సంజూ సామ్సన్, రియాన్ పరాగ్ (24 బంతుల్లో 22; 1 సిక్స్) జాగ్రత్తగా ఆడి నాలుగో వికెట్కు 65 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సామ్సన్ 39 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. పరాగ్ పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో భారత స్కోరు 150 దాటింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఒకదశలో 85/3తో పటిష్టంగా కనిపించింది. అయితే మైర్స్ (32 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాకజింబాబ్వే తడబడింది. తొమ్మిది పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు వదులుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) సికందర్ రజా 12; శుబ్మన్ గిల్ (సి) సికందర్ రజా (బి) ఎన్గరావా 13; అభిõÙక్ శర్మ (సి) మందాడె (బి) ముజరబాని 14; సంజూ సామ్సన్ (సి) మరుమాని (బి) ముజరబాని 58; రియాన్ పరాగ్ (సి) ఎన్గరావా (బి) మవూటా 22; శివమ్ దూబే (రనౌట్) 26; రింకూ సింగ్ (నాటౌట్) 11; వాషింగ్టన్ సుందర్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–13, 2–38, 3–40, 4–105, 5–135, 6–153. బౌలింగ్: సికందర్ రజా 4–0–37–1, ఎన్గరావా 4–0–29–1, ఫరాజ్ అక్రమ్ 4–0– 39–0, ముజరబాని 4–0–19–2, మవూటా 4–0–39–1. జింబాబ్వే ఇన్నింగ్స్: మధెవెరె (బి) ముకేశ్ 0; మరుమాని (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 27; బెనెట్ (సి) దూబే (బి) ముకేశ్ 10; మైర్స్ (సి) అభిõÙక్ (బి) దూబే 34; సికందర్ రజా (రనౌట్) 8; క్యాంప్బెల్ (సి) తుషార్ (బి) దూబే 4; మదాండె (సి) సామ్సన్ (బి) అభిõÙక్ శర్మ 1; ఫరాజ్ అక్రమ్ (సి) సామ్సన్ (బి) ముకేశ్ 27; మవూటా (సి అండ్ బి) తుషార్ దేశ్పాండే 4; ముజరబాని (నాటౌట్) 1; ఎన్గరావా (బి) ముకేశ్ 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (18.3 ఓవర్లలో ఆలౌట్) 125. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–59, 4–85, 5–87, 6–90, 7–94, 8–120, 9–123, 10–125. బౌలింగ్: ముకేశ్ 3.3–0–22–4, తుషార్ దేశ్పాండే 3–0–25–1, రవి బిష్ణోయ్ 3–0–23–0, వాషింగ్టన్ సుందర్ 2–0–7–1, అభిõÙక్ శర్మ 3–0–20–1, శివమ్ దూబే 4–0–25–2.5 ఇప్పటి వరకు భారత జట్టు ఐదు మ్యాచ్లతో కూడిన ఏడు టి20 ద్వైపాక్ష సిరీస్లను ఆడింది. ఇందులో ఐదు సిరీస్లను (2020లో న్యూజిలాండ్పై; 2021లో ఇంగ్లండ్పై; 2022లో వెస్టిండీస్పై; 2023లో ఆ్రస్టేలియాపై, 2024లో జింబాబ్వేపై) భారత్ దక్కించుకుంది. ఒక సిరీస్ను (2023లో వెస్టిండీస్ చేతిలో) కోల్పోయి, మరో సిరీస్ను (2022లో దక్షిణాఫ్రికాతో) సమంగా ముగించింది. -
ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జయభేరి మోగించింది. మూడో వికెట్ కోల్పోయిన జింబాబ్వే59 పరుగుల వద్ద జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మరుమణి (27) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 9 ఓవర్ల తర్వాత జింబాబ్వే స్కోర్ 61/3గా ఉంది. మైర్స్ (18), సికందర్ రజా (1) క్రీజ్లో ఉన్నారు.టార్గెట్ 168.. రెండో వికెట్ కోల్పోయిన జింబాబ్వే15 పరుగుల వద్ద జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో శివమ్ దూబేకి క్యాచ్ ఇచ్చి బెన్నిట్ (10) ఔటయ్యాడు. టార్గెట్ 168.. తొలి వికెట్ కోల్పోయిన జింబాబ్వే168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్లో మధెవెరె (0) క్లీన్ బౌల్డ్ ఆయ్యాడు. రాణించిన జింబాబ్వే బౌలర్లు.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన టీమిండియాఈ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లు రాణించడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్కే (167/6) పరిమితమైంది. ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో సంజూ శాంసన్ (58) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. శివమ్ దూబే 26, రియాన్ పరాగ్ 22, అభిషేక్ శర్మ 14, శుభ్మన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 12 పరుగులకు ఔట్ కాగా.. రింకూ సింగ్ 11, వాషింగ్టన్ సుందర్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. ఐదో వికెట్ కోల్పోయిన భారత్.. శాంసన్ ఔట్135 పరుగుల వద్ద (17.3వ ఓవర్) టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ముజరబాని బౌలింగ్లో మరుమణి క్యాచ్ పట్టడంతో శాంసన్ పెవిలియన్ బాట పట్టాడు. శివమ్ దూబే (10), రింకూ సింగ్ క్రీజ్లో ఉన్నారు. 105 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా105 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. బ్రాండన్ మవుటా బౌలింగ్లో నగరవకు క్యాచ్ ఇచ్చి రియాన్ పరాగ్ (22) ఔటయ్యాడు.40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియాతొలి ఓవర్లలో దూకుడుగా ఆడిన టీమిండియా ఆతర్వాత ఢీలా పడిపోయింది. జింబాబ్వే బౌలర్లు పుంజుకోవడంతో భారత్ 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. యశస్వి (12), శుభమన్ గిల్ (13), అభిషేక్ శర్మ (14) ఔట్ కాగా.. సంజూ శాంసన్ (16), రియాన్ పరాగ్ (5) క్రీజ్లో ఉన్నారు. 8.2 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 62/3గా ఉంది.తొలి వికెట్ కోల్పోయిన టీమిండియాసికందర్ రజా వేసిన తొలి ఓవర్లో తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన యశస్వి జైస్వాల్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియాహరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
IND VS ZIM 5th T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్టులో విధ్వంసకర వీరుడు
హరారే వేదికగా జింబాబ్వేతో జరుగనున్న ఐదో టీ20లో టీమిండియా టాస్ ఓడింది. జింబాబ్వే కోరిక మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఖలీల్ అహ్మద్, రుతురాజ్ స్థానంలో ముకేశ్ కుమార్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు జింబాబ్వే ఓ మార్పు చేసింది. చటారా స్థానంలో బ్రాండన్ మవుటా తుది జట్టులోకి వచ్చాడు. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్ ఫలితం తేలిపోవడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ సిరీస్లో జింబాబ్వే తొలి మ్యాచ్ గెలవగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు మ్యాచ్లు గెలిచింది.తుది జట్లు..జింబాబ్వే: వెస్లీ మధేవెరే, తడివానాషే మారుమణి, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, ఫరాజ్ అక్రమ్, క్లైవ్ మదాండే(వికెట్కీపర్), బ్రాండన్ మవుటా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీటీమిండియా: శుభ్మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్కీపర్), రియాన్ పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే, ముఖేష్ కుమార్ -
జైస్వాల్, గిల్ ఘనంగా...
ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా వెళ్లిన యువ జట్టు అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి జింబాబ్వేపై టి20 సిరీస్ విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్లతో పోలిస్తే ఈ సారి సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. నాలుగో మ్యాచ్లో యశస్వి జైస్వాల్, శుబ్మన్ గిల్ దూకుడైన బ్యాటింగ్ ముందు జింబాబ్వే ఏమాత్రం పోటీనివ్వలేకపోవడంతో జట్టు అలవోకగా లక్ష్యం చేరింది.హరారే: టి20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన తొలి సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరింది. జింబాబ్వే గడ్డపై జరిగిన ఈ ఐదు మ్యాచ్ల పోరులో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా...మరుమని (31 బంతుల్లో 32; 3 ఫోర్లు), మదివెరె (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ శుబ్మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయంగా జట్టును గెలిపించారు. సిరీస్లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు ఇక్కడే జరుగుతుంది. రజా రాణించినా... జింబాబ్వేకు ఓపెనర్లు మరుమని, మదివెరె కొన్ని చక్కటి షాట్లతో మెరుగైన ఆరంభాన్ని అందించారు. సిరీస్లో తొలిసారి ఆ జట్టు పవర్ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత పేసర్లు ఆరంభంలో కట్టు తప్పడం జింబాబ్వేకు కలిసొచ్చింది.తొలి వికెట్కు 52 బంతుల్లో 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ తన తొలి అంతర్జాతీయ వికెట్గా మరుమనిని వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లో మదివెరె కూడా అవుట్ కాగా...10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 67/2కు చేరింది. ఈ దశలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టి పడేశారు. నాలుగు పరుగుల వ్యవధిలో బెన్నెట్ (9), క్యాంప్బెల్ (3) అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. అయితే రజా దూకుడుగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో జింబాబ్వే 54 పరుగులు సాధించింది. దూబే, రుతురాజ్ ఒక్కో క్యాచ్ వదిలేసినా...భారత్కు వాటి వల్ల పెద్దగా నష్టం జరగలేదు. ఆడుతూ పాడుతూ... జింబాబ్వే ఇన్నింగ్స్ మొత్తంలో 10 ఫోర్లు ఉండగా...భారత ఓపెనర్లు తొలి 4 ఓవర్లలోనే 10 ఫోర్లు బాదారు. ఎన్గరవ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన జైస్వాల్...చటారా ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. పవర్ప్లేలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అక్రమ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన గిల్ 35 బంతుల్లో సిరీస్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బెన్నెట్ ఓవర్లో గిల్ 2 సిక్స్లు బాదడంతో మరో ఎండ్లో జైస్వాల్కు సెంచరీ అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున రాణించి గుర్తింపు తెచ్చుకున్న పేసర్ తుషార్ దేశ్పాండే ఈ మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 115వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదివెరె (సి) రింకూ సింగ్ (బి) దూబే 25; మరుమని (సి) రింకూ సింగ్ (బి) అభిõÙక్ 32; బెన్నెట్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 9; రజా (సి) గిల్ (బి) దేశ్పాండే 46; క్యాంప్బెల్ (రనౌట్) 3; మయర్స్ (సి) అండ్ (బి) ఖలీల్ 12; మదాందె (సి) రింకూ సింగ్ (బి) ఖలీల్ 7; అక్రమ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–63, 2–67, 3–92, 4–96, 5–141, 6–147, 7–152. బౌలింగ్: ఖలీల్ 4–0–32–2, దేశ్పాండే 3–0–30–1, బిష్ణోయ్ 4–0–22–0, సుందర్ 4–0–32–1, అభిõÙక్ 3–0–20–1, దూబే 2–0–11–1. భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 93; గిల్ (నాటౌట్) 58; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 156. బౌలింగ్: ఎన్గరవ 3–0–27–0, ముజరబాని 3.2–0–25–0, చటారా 2–0–23–0, అక్రమ్ 4–0–41–0, రజా 2–0–24–0, బెన్నెట్ 1–0–16–0. -
సిరీస్ విజయమే లక్ష్యంగా...
హరారే: జింబాబ్వే పర్యటనలో భారత యువ జట్టు అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోంది. తక్కువ స్కోర్ల తొలి టి20లో తడబడి అనూహ్యంగా ఓటమి పాలైనా... తర్వాతి రెండు మ్యాచ్లలో జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారీ స్కోర్లు చేసిన అనంతరం వాటిని నిలబెట్టుకుంది. ఇదే జోరులో మరో మ్యాచ్లో నెగ్గి సిరీస్ సొంతం చేసుకోవాలని శుబ్మన్ గిల్ బృందం పట్టుదలగా ఉంది. జట్టు సభ్యులంతా ఫామ్లో ఉండటం సానుకూలాంశం. రుతురాజ్ నిలకడగా ఆడుతుండగా... అభిషేక్ శర్మ రెండో మ్యాచ్లో సెంచరీతో తన ధాటిని చూపించాడు. కెప్టెన్ గిల్ కూడా అర్ధ సెంచరీతో ఫామ్లోకి రాగా... వరల్డ్ కప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత యశస్వి జైస్వాల్ కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ సింగ్ కూడా రెండో టి20లో సిక్సర్ల మోత మోగించగా, గత మ్యాచ్లో ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాని సంజూ సామ్సన్ కూడా చెలరేగిపోగలడు. శివమ్ దూబే కూడా తన దూకుడును ప్రదర్శిస్తే ఇక ఈ లైనప్ను నిలువరించడం జింబాబ్వే బౌలర్లకు అంత సులువు కాదు. బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ను ప్రత్యర్థి బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి మూడు మ్యాచ్లు ఆడిన అవేశ్ స్థానంలో ముకేశ్కు మళ్లీ తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఈ మార్పు మినహా అదే జట్టు కొనసాగనుంది. మరోవైపు సిరీస్ను కోల్పోకుండా ఉండేందుకు జింబాబ్వే రెట్టింపు శ్రమించాల్సి ఉంటుంది. గత రెండు మ్యాచ్లలో ఆ జట్టు పేలవ ఫీల్డింగ్తో 7 క్యాచ్లు వదిలేయడంతో పాటు అదనపు పరుగులూ ఇచ్చింది. దీనిని నివారించగలిగితే టీమ్ పోటీనివ్వగలదు. మరోసారి కెప్టెన్ సికందర్ రజానే కీలకం కానుండగా... బెన్నెట్, మైర్స్, క్యాంప్బెల్లపై బ్యాటింగ్ భారం ఉంది. బౌలింగ్లో పేసర్ ముజరబాని, చటారా నిలకడగా ఆడుతున్నారు. సొంతగడ్డపై జింబాబ్వే తమ స్థాయికి తగినట్లు ఆడితే పోరు ఆసక్తికరంగా సాగవచ్చు. -
మళ్లీ మనదే గెలుపు
జింబాబ్వేపై వరుసగా రెండో మ్యాచ్లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు చక్కటి ప్రదర్శన చేయడంతో మరో పోరులో టీమిండియాకు సునాయాస విజయం దక్కింది. టి20 వరల్డ్ కప్లో ఆడిన ముగ్గురు ఆటగాళ్ల పునరాగమనంతో బ్యాటింగ్ ఆర్డర్లో కొంత మార్పు వచ్చినా... చివరకు భారత్దే పైచేయి అయింది. గత మ్యాచ్ తరహాలోనే ఈసారి కూడా పేలవ బ్యాటింగ్తోనే ఆతిథ్య జింబాబ్వే జట్టు ఆరంభంలోనే ఆటను అప్పగించింది. ఇక శనివారం జరిగే నాలుగో మ్యాచ్లో గెలిస్తే సిరీస్ మన ఖాతాలో చేరుతుంది. హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భారత్ 2–1తో ముందంజలో నిలిచింది. బుధవారం జరిగిన మూడో టి20లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్మన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. డియాన్ మైర్స్ (49 బంతుల్లో 65 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), క్లయివ్ మదాండె (26 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వాషింగ్టన్ సుందర్ (3/15) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. శనివారం ఇదే మైదానంలో నాలుగో టి20 జరుగుతుంది. కీలక భాగస్వామ్యాలు... భారత్ తమ ఇన్నింగ్స్ను జోరుగా ప్రారంభించింది. తొలి ఓవర్లో జైస్వాల్ 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా, రెండో ఓవర్లో గిల్ 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. పవర్ప్లే ముగిసేసరికి భారత్ 55 పరుగులు చేసింది. తొలి వికెట్కు గిల్తో 50 బంతుల్లో 67 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ వెనుదిరిగాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో అభిõÙక్ శర్మ (10) ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. ఈ దశలో జత కలిసిన గిల్, రుతురాజ్ మరింత ధాటిగా ఆడారు. మదెవెరె ఓవర్లో ఇద్దరూ చెరో సిక్స్ కొట్టగా... ఆ తర్వాత సికందర్ రజా ఓవర్లోనూ ఇదే పునరావృతమైంది. ఎట్టకేలకు గిల్ను అవుట్ చేసి ముజరబాని ఈ భాగస్వామ్యాన్ని ముగించాడు. గిల్, రుతురాజ్ మూడో వికెట్కు 44 బంతుల్లోనే 72 పరుగులు జత చేశారు. 36 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ చేయగా... ఎన్గరవ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ కొట్టిన రుతురాజ్ అర్ధ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. జింబాబ్వే పేలవ ఫీల్డింగ్తో భారత్కు అదనపు అవకాశాలు కల్పించింది. గిల్, జైస్వాల్, రుతురాజ్ ఇచ్చిన క్యాచ్లను ఫీల్డర్లు వదిలేశారు. చివరి 4 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది. టి20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్లో సభ్యులైన జైస్వాల్, సామ్సన్, దూబే ఈ మ్యాచ్లో బరిలోకి దిగగా... పరాగ్, సాయిసుదర్శన్, జురేల్లను పక్కన పెట్టారు. టపటపా... భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే బ్యాటర్లు నిలవలేకపోయారు. 13 బంతుల వ్యవధిలో తొలి 3 వికెట్లు కోల్పోయిన జట్టు ఆ తర్వాత ఒకే ఓవర్లో మరో 2 వికెట్లు చేజార్చుకుంది. 7 ఓవర్లు ముగిసేసరికి 39/5తో జింబాబ్వే ఓటమికి బాటలు వేసుకుంది. ఈ దశలో మైర్స్, మదాండె కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు 57 బంతుల్లోనే 77 పరుగులు జోడించారు. అనంతరం 45 బంతుల్లో మైర్స్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివర్లో ఓవర్లో మైర్స్, మసకద్జా (10 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి 18 పరుగులు రాబట్టినా... అప్పటికే ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) బెన్నెట్ (బి) రజా 36; గిల్ (సి) రజా (బి) ముజరబాని 66; అభిõÙక్ (సి) మరుమని (బి) రజా 10; రుతురాజ్ (సి) మదెవెరె (బి) ముజరబాని 49; సామ్సన్ (నాటౌట్) 12; రింకూ సింగ్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–67, 2–81, 3–153, 4–177. బౌలింగ్: బెన్నెట్ 1–0–15–0, ఎన్గరవ 4–0–39–0, చటారా 3–0–30–0, ముజరబాని 4–0–25–2, రజా 4–0–24–2, మసకద్జా 3–0–25–0, మదెవెరె 1–0–19–0. జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (సి) అభిషేక్ (బి) అవేశ్ 1; మరుమని (సి) దూబే (బి) ఖలీల్ 13; బెన్నెట్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 4; మైర్స్ (నాటౌట్) 65; రజా (సి) రింకూ (బి) సుందర్ 15; క్యాంప్బెల్ (సి) (సబ్) పరాగ్ (బి) సుందర్ 1; మదాండె (సి) రింకూ (బి) సుందర్ 37; మసకద్జా (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–19, 4–37, 5–39, 6–116. బౌలింగ్: ఖలీల్ 4–0–15–1, అవేశ్ 4–0–39–2, రవి బిష్ణోయ్ 4–0–37–0, వాషింగ్టన్ సుందర్ 4–0–15–3, అభిషేక్ 2–0–23–0, దూబే 2–0–27–0. 150 అంతర్జాతీయ టి20ల్లో భారత్ సాధించిన విజయాల సంఖ్య. ఇప్పటి వరకు 230 టి20 మ్యాచ్లు ఆడిన టీమిండియా 150 మ్యాచ్ల్లో గెలిచి ఈ మైలురాయి అందుకున్న తొలి జట్టుగా నిలిచింది. పాకిస్తాన్ (142), న్యూజిలాండ్ (111), ఆ్రస్టేలియా (105), దక్షిణాఫ్రికా (104), ఇంగ్లండ్ (100) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
గౌతముడే శిక్షకుడు.. బీసీసీఐ అధికారిక ప్రకటన
ముంబై: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇకపై కొత్త పాత్రలో టీమిండియాతో కలిసి పని చేయనున్నాడు. 43 ఏళ్ల గంభీర్ను భారత హెడ్ కోచ్గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అన్ని దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూల అనంతరం గంభీర్ను కోచ్గా ఎంపిక చేసింది. ఈ నెల 27 నుంచి శ్రీలంక గడ్డపై భారత జట్టు 3 వన్డేలు, 3 టి20లు ఆడుతుంది. ఇదే సిరీస్ నుంచి గంభీర్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తాడు. డిసెంబర్ 2027 వరకు అతని పదవీ కాలం ఉంటుంది. కొత్త కోచ్ కోసం మే 13 నుంచి బీసీసీఐ దరఖాస్తులు కోరింది. అంతకుముందే కోచ్ పదవిని స్వీకరించమంటూ మరో మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ కోరినా... అతను తిరస్కరించాడు.తన ఆసక్తిని బహిరంగంగానే ప్రకటిస్తూ గంభీర్ కూడా దరఖాస్తు చేసుకోగా, ఒక్క డబ్ల్యూవీ రామన్ మాత్రమే అతనితో పోటీ పడ్డాడు. ఎలాగూ ముందే నిర్ణయించేశారనే భావన వల్ల కావచ్చు, విదేశీ కోచ్లు ఎవరూ ఆసక్తి చూపించలేదు. చివరకు ఊహించినట్లుగా గంభీర్కు పగ్గాలు లభించాయి. ఆటగాడిగా ఘనమైన రికార్డు... 2004–2012 మధ్య కాలంలో మూడు ఫార్మాట్లలో గంభీర్ ఓపెనర్గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 58 టెస్టుల్లో 41.95 సగటుతో 4154 పరుగులు చేసిన అతను 9 సెంచరీలు, 22 అర్ధసెంచరీలు చేశాడు. 147 వన్డేల్లో 39.68 సగటుతో 5238 పరుగులు సాధించాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 37 అంతర్జాతీయ టి20ల్లో 119.02 స్ట్రయిక్ రేట్, 7 హాఫ్ సెంచరీలతో 932 పరుగులు పరుగులు సాధించాడు. అన్నింటికి మించి చిరకాలం గుర్తుంచుకునే గంభీర్ రెండు అత్యుత్తమ ప్రదర్శనలు ప్రపంచ కప్ ఫైనల్స్లో వచ్చాయి. పాకిస్తాన్తో 2007 టి20 వరల్డ్ కప్ ఫైనల్లో 75 పరుగులతో, శ్రీలంకతో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో 97 పరుగులతో అతను టాప్ స్కోరర్గా నిలిచాడు. నేపియర్లో న్యూజిలాండ్తో 11 గంటల పాటు క్రీజ్లో నిలిచి 436 బంతుల్లో 137 పరుగులు చేసి భారత్ను ఓటమి నుంచి కాపాడటం టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్లో ముందుగా ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహించిన గంభీర్ ఆ తర్వాత కోల్కతా నైట్రైడర్స్కు మారాడు. 2012, 2014లలో కెపె్టన్గా కేకేఆర్కు ఐపీఎల్ టైటిల్ అందించాడు. కోచ్గా తొలిసారి... రిటైర్మెంట్ తర్వాత చాలామందిలాగే గంభీర్ కూడా కామెంటేటర్గా, విశ్లేషకుడిగా పని చేశాడు. 2019లో బీజేపీ తరఫున ఈస్ట్ ఢిల్లీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయిన అతను పదవీకాలం ముగిసిన తర్వాత ఈ ఏడాది ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే అధికారికంగా కోచ్ హోదాలో పని చేయడం గంభీర్కు ఇదే తొలిసారి. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్కు 2022, 2023 సీజన్లలో మెంటార్గా వ్యవహరించగా, రెండుసార్లు కూడా లక్నో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. అయితే 2024 సీజన్లో కోల్కతాకు మెంటార్గా వెళ్లిన అతను టీమ్ను విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సాఫల్యమే అతడిని భారత జట్టు కోచ్ రేసులో ముందంజలో నిలిపింది. మరోవైపు టి20 వరల్డ్ కప్ వరకు జట్టుతో పని చేసిన విక్రమ్ రాథోడ్ (బ్యాటింగ్ కోచ్ ), పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) పదవీ కాలం కూడా ముగిసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వీరి స్థానాల్లో తన ఆలోచనలకు అనుగుణంగా కొత్త బృందాన్ని ఎంచుకునే అధికారం గంభీర్కు ఉంది. -
అభిషేక్ అదరహో...
హరారే: అంతర్జాతీయ వేదికపై తన ఆగమనాన్ని అదరగొట్టే ఇన్నింగ్స్తో అభిషేక్ శర్మ చాటుకున్నాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. శనివారం జరిగిన తొలి టి20లో ‘సున్నా’కే అవుటైన ఈ పంజాబ్ బ్యాటర్ రెండో టి20లో మాత్రం ‘శత’క్కొట్టాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో చెలరేగిపోయిన అభిõÙక్ సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ (47 బంతుల్లో 77; 11 ఫోర్లు, 1 సిక్స్), రింకూ సింగ్ (22 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్లు) కూడా మెరిపించడంతో భారత జట్టు 100 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. టి20ల్లో జింబాబ్వేపై ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. మధెవెరె (39 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోంగ్వి (26 బంతుల్లో 33; 4 ఫోర్లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ (3/37), అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11) రాణించారు. అభిõÙక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ శుబ్మన్ గిల్ (2) వరుసగా రెండో మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. గిల్ అవుటయ్యాక అభిõÙక్, రుతురాజ్ భారత ఇన్నింగ్స్ను నడిపించారు. వ్యక్తిగత స్కోరు 27 పరుగులవద్ద అభిõÙక్ ఇచ్చిన క్యాచ్ను మసకద్జా వదిలేశాడు. ఆ తర్వాత అభిõÙక్ చెలరేగిపోయాడు. మైర్స్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో అభిషేక్ 2,4,6,4,6,4తో 28 పరుగులు సాధించాడు. దాంతో భారత స్కోరు 100 పరుగులు దాటింది.మసకద్జా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అభిõÙక్ వరుసగా 3 సిక్స్లు కొట్టి 46 బంతుల్లోనే తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే మైర్స్కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పెవిలియన్ చేరుకన్నాడు. రుతురాజ్తో కలిసి అభిõÙక్ రెండో వికెట్కు 137 పరుగులు జోడించాడు. అభిషేక్ నిష్క్రమించాక వచ్చిన రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడటంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. భారత్ చివరి 10 ఓవర్లలో 160 పరుగులు చేయడం విశేషం. ఐదు మ్యాచ్ల సిరీస్లో రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో మ్యాచ్ బుధవారం జరుగుతుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: శుబ్మన్ గిల్ (సి) బెనెట్ (బి) ముజరబాని 2; అభిషేక్ శర్మ (సి) మైర్స్ (బి) మసకద్జా 100; రుతురాజ్ గైక్వాడ్ (నాటౌట్) 77; రింకూ సింగ్ (నాటౌట్) 48; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 234. వికెట్ల పతనం: 1–10, 2–147. బౌలింగ్: బెనెట్ 2–0–22–0, ముజరబాని 4–1–30–1, చటారా 4–0–38–0, సికందర్ రజా 3–0–34–0, జోంగ్వి 4–0–53–0, మైర్స్ 1–0–28–0, మసకద్జా 2–0–29–1. జింబాబ్వే ఇన్నింగ్స్: ఇన్నోసెంట్ కాయా (బి) ముకేశ్ కుమార్ 4; మధెవెరె (బి) రవి బిష్ణోయ్ 43; బెనెట్ (బి) ముకేశ్ కుమార్ 26; మైర్స్ (సి) రింకూ సింగ్ (బి) అవేశ్ ఖాన్ 0; సికందర్ రజా (సి) ధ్రువ్ జురేల్ (బి) అవేశ్ ఖాన్ 4; క్యాంప్బెల్ (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 10; మదాండె (ఎల్బీడబ్ల్యూ) (బి) రవి బిష్ణోయ్ 0; మసకద్జా (రనౌట్) 1; జోంగ్వి (సి) రుతురాజ్ (బి) ముకేశ్ కుమార్ 33; ముజరబాని (సి) సుందర్ (బి) అవేశ్ ఖాన్ 2; చటారా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 11; మొత్తం (18.4 ఓవర్లలో ఆలౌట్) 134. వికెట్ల పతనం: 1–4, 2–40, 3–41, 4–46, 5–72, 6–73, 7–76, 8–117, 9–123, 10–134. బౌలింగ్: ముకేశ్ 3.4–0– 37–3, అభిషేక్ శర్మ 3–0–36–0, అవేశ్ 3–0– 15–3, రవి బిష్ణోయ్ 4–0–11–2, వాషింగ్టన్ సుందర్ 4–0– 28–1, పరాగ్ 1–0–5–0. -
కుర్రాళ్లు నిలవలేకపోయారు...
ఐపీఎల్ అనుభవంతో జింబాబ్వే గడ్డపై అడుగు పెట్టిన భారత యువ బృందం అంతర్జాతీయ వేదికపై ఆ మెరుపులు చూపించలేకపోయింది. తమతో పోలిస్తే టి20 క్రికెట్లో తక్కువ అనుభవం ఉన్న బలహీన ప్రత్యర్థిని నిలువరించడంలో విఫలమైంది. తమ ప్రధాన ఆటగాళ్లతో బరిలోకి దిగిన జింబాబ్వే ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాపై విజయాన్ని నమోదు చేసింది. తక్కువ స్కోర్ల మ్యాచ్లో స్ఫూర్తిదాయక ఆటతో సొంత అభిమానుల్లో ఆనందం పంచింది. వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన టీమ్లోని ఒక్క ఆటగాడు కూడా ఈ మ్యాచ్లో ఆడకపోయినా... అధికారిక రికార్డుల ప్రకారం వరల్డ్ చాంపియన్ అయిన తర్వాత భారత్కు ఇది ఓటమి! హరారే: సొంత గడ్డపై ఐదు టి20 మ్యాచ్ల సిరీస్లో జింబాబ్వే శుభారంభం చేసింది. శనివారం జరిగిన పోరులో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. క్లైవ్ మదాందె (25 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా...మైర్స్ (23), బెన్నెట్ (22), మదివెరె (21) స్కోరులో తలా ఓ చేయి వేశారు. రవి బిష్ణోయ్ (4/13) అంతర్జాతీయ టి20ల్లో తన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేయగా, సుందర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్మన్ గిల్ (29 బంతుల్లో 31; 5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (24 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సికందర్ రజా (3/25), చటారా చెరో 3 వికెట్లతో భారత్ను దెబ్బ తీశారు. రెండో టి20 నేడు ఇక్కడే జరుగుతుంది. ఈ మ్యాచ్తో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ భారత్ తరఫున అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. రవి బిష్ణోయ్కు 4 వికెట్లు... రెండో ఓవర్లోనే కయా (0) అవుటైనా...ఖలీల్ ఓవర్లో 4 ఫోర్లతో జింబాబ్వే బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాత ఈ జోరుకు బ్రేక్ పడింది. బిష్ణోయ్ తన తొలి రెండు ఓవర్లలో 2 వికెట్లతో జింబాబ్వేను దెబ్బ తీశాడు. 10 ఓవర్లలో స్కోరు 69/3కి చేరింది. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద రెండు వికెట్లు కోల్పోయిన జట్టు 74/5 వద్ద నిలిచింది. కొద్ది సేపటికే సుందర్ కూడా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని పూర్తిగా నిలువరించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన బిష్ణోయ్ కూడా మరో 2 వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 100 లోపే ఆలౌట్ అయ్యేలా అనిపించింది. అయితే చటారా, మదాందె కలిసి తర్వాతి 27 బంతులను జాగ్రత్తగా ఆడి అభేద్యంగా 25 పరుగులు జోడించారు. 90/9 నుంచి స్కోరు 115 వరకు చేరింది. మ్యాచ్ తుది ఫలితంతో ఈ చివరి పరుగులే కీలకంగా మారాయి. టపటపా... తొలి అంతర్జాతీయ మ్యాచ్లో అభిషేక్ శర్మ (0) నాలుగు బంతులు ఆడితే, రియాన్ పరాగ్ (2) ఆట మూడు బంతుల్లో ముగిసింది. రుతురాజ్ (7) విఫలం కాగా, రింకూ సింగ్ (0) పేలవంగా నిష్క్రమించాడు. దాంతో స్కోరు 22/4. మరో అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురేల్ (6) విఫలం కావడంతో 9.5 ఓవర్లలో సగం టీమ్ పెవిలియన్కు! ఇదీ భారత జట్టు పరిస్థితి. మరో వైపు జాగ్రత్తగా ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. అయితే రజా బౌలింగ్లో అతను వెనుదిరగడంతో 47/6 వద్ద భారత్ ఆశలు ఆవిరయ్యాయి. చివర్లో సుందర్ పోరాడినా లాభం లేకపోయింది. ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా 5 బంతుల్లో 2 పరుగులే చేసిన జట్టు చివరి వికెట్ కోల్పోయింది. స్కోరు వివరాలు: జింబాబ్వే ఇన్నింగ్స్: మదెవెరె (బి) బిష్ణోయ్ 21; కయా (బి) ముకేశ్ 0; బెన్నెట్ (బి) బిష్ణోయ్ 22; రజా (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 17; మయర్స్ (సి) అండ్ (బి) సుందర్ 23; క్యాంప్బెల్ (రనౌట్) 0; మదాందె (నాటౌట్) 29; మసకద్జ (స్టంప్డ్) జురేల్ (బి) సుందర్ 0; జాంగ్వే (ఎల్బీ) (బి) బిష్ణోయ్ 1; ముజరబాని (బి) బిష్ణోయ్ 0; చటారా (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 115. వికెట్ల పతనం: 1–6, 2–40, 3–51, 4–74, 5–74, 6–89, 7–89, 8–90, 9–90. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, ముకేశ్ 3–0–16–1, రవి బిష్ణోయ్ 4–2–13–4, అభిõÙక్ 2–0–17–0, అవేశ్ 4–0–29–1, సుందర్ 4–0–11–2. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మసకద్జ (బి) బెన్నెట్ 0; గిల్ (బి) రజా 31; రుతురాజ్ (సి) కయా (బి) ముజరబాని 7; పరాగ్ (సి) (సబ్) మవుతా (బి) చటారా 2; రింకూ సింగ్ (సి) బెన్నెట్ (బి) చటారా 0; జురేల్ (సి) మదెవెరె (బి) జాంగ్వే 6; సుందర్ (సి) ముజరబాని (బి) చటారా 27; బిష్ణోయ్ (ఎల్బీ) (బి) రజా 9; అవేశ్ (సి) రజా (బి) మసకద్జా 16; ముకేశ్ (బి) రజా 0; ఖలీల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 102. వికెట్ల పతనం: 1–0, 2–15, 3–22, 4–22, 5–43, 6–47, 7–61, 8–84, 9–86, 10–102. బౌలింగ్: బెన్నెట్ 1–1–0–1, మసకద్జ 3–0–15–1, చటారా 3.5–1–16–3, ముజరబాని 4–0–17–1, జాంగ్వే 4–0–28–1, రజా 4–0–25–3. -
Ind vs Zim: గిల్ కెప్టెన్సీలో కుర్రాళ్లతో కొత్తగా...
టి20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలిచింది...ఇంకా దేశంలో సంబరాలు, వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు టీమిండియా మరో టి20 పోరుకు రంగం సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఆటతో పోలిస్తే ఇది కాస్త భిన్నమైంది. రోహిత్, కోహ్లి, జడేజాల రిటైర్మెంట్ తర్వాత జట్టు కాస్త కొత్తగా కనపడబోతోంది.తమ అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చిన యువ ఆటగాళ్ల సత్తాను ప్రదర్శించేందుకు ఇది సరైన వేదిక కానుంది. వరల్డ్ కప్ టీమ్లో అవకాశం దక్కించుకోలేకపోయిన గిల్ నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్ష కానుండగా... సొంతగడ్డపై జింబాబ్వేవిజయాన్ని అందుకోవాలని ఆశిస్తోంది. హరారే: పేరుకే ఇది భారత్కు చెందిన ద్వితీయ శ్రేణి జట్టు కావచ్చు. కానీ అగ్రశ్రేణి ఆటగాళ్లందరితో కలిసి ఆడిన, ఎదుర్కొన్న అపార ఐపీఎల్ అనుభవంతో యువ ఆటగాళ్లంతా కూడా అన్ని రకాలుగా సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు జరిగే తొలి టి20 మ్యాచ్లో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. వరల్డ్ కప్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు స్వదేశానికి వచ్చిన సామ్సన్, యశస్వి, దూబే తొలి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. మూడో టి20 సమయానికి వీరు జట్టుతో చేరతారు. 2026 టి20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని భారత సెలక్టర్లు సిద్ధం చేయదలిచే బృందంలో కొందరి ప్రదర్శనపై ఇక్కడినుంచే ఒక అంచనాకు రావచ్చు. గిల్ కెప్టెన్సీలో... ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహించి సరైన ఫలితాలు రాబట్టలేకపోయిన శుబ్మన్ గిల్ తొలి సారి జాతీయ జట్టుకు కెప్టెన్గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనర్గా అతనితో పాటు అతని బాల్య మిత్రుడు, అండర్–19 వరల్డ్ కప్ సహచరుడు అభిషేక్ శర్మ ఆడటం ఖాయమైంది. అభిషేక్ కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది.ఇటీవల ఐపీఎల్లో భీకర ఫామ్తో అదరగొట్టిన అభిõÙక్ ఇక్కడ ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం. మూడో స్థానంలో రుతురాజ్ ఖాయం కాగా, రియాన్ పరాగ్ కూడా అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వరల్డ్ కప్లో రిజర్వ్గా ఉండి ఆడే అవకాశం రాని రింకూ సింగ్పై కూడా అందరి దృష్టీ నిలిచింది. తన దూకుడును ప్రదర్శించేందుకు రింకూకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. బౌలింగ్లో కూడా ఐపీఎల్లో ఆకట్టుకున్న ఖలీల్, అవేశ్, బిష్ణోయ్లపై జట్టు ఆధారపడుతోంది. ప్రతిభ ఉన్నా...వరుస గాయాలతో పదే పదే సీనియర్ జట్టుకు దూరమైన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కీపర్గా తొలి ప్రాధాన్యత జురేల్కు దక్కవచ్చు. ఈ మ్యాచ్లో భారత్నుంచి ఎంత మంది అరంగేట్రం చేస్తారనేది ఆసక్తికరం. రజాపైనే భారం... జింబాబ్వే కూడా కొత్త కుర్రాళ్లపైనే దృష్టి పెట్టింది. అందుకే సీనియర్లలో ర్యాన్ బర్ల్పై వేటు వేసిన జట్టు సీన్ విలియమ్స్, క్రెయిగ్ ఇర్విన్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేయకుండా విశ్రాంతినిచ్చి0ది. డ్రగ్స్ వాడిన ఆరోపణలతో నాలుగు నెలలు సస్పెన్షన్కు గురైన మదవెర్, మవుతా తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే కెప్టెన్ సికందర్ రజాపైనే జింబాబ్వే ప్రధానంగా ఆధారపడుతోంది. ఇటీవల వైటాలిటీ బ్లాస్ట్లో చెలరేగిన అతను మంచి ఫామ్లో ఉన్నాడు. మసకద్జ, ముజరబానిలనుంచి అతనికి సహకారం అందాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), అభిషేక్, రుతురాజ్, పరాగ్, రింకూ, జురేల్, సుందర్, బిష్ణోయ్, అవేశ్, తుషార్, ఖలీల్ జింబాబ్వే: రజా (కెప్టెన్ ), బెనెట్, మరుమని, క్యాంప్బెల్, నక్వి, మదాందే, మదవెర్, జాంగ్వే, ఫరాజ్, మసకద్జ, ముజరబాని పిచ్, వాతావరణం నెమ్మదైన పిచ్. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 మ్యాచ్లలో 5 సార్లు మాత్రమే స్కోరు 150 పరుగులు దాటింది. పొడి వాతావరణం. వర్ష సూచన లేదు. 8 భారత్, జింబాబ్వే మధ్య 8 టి20లు జరిగాయి. 6 భారత్ గెలవగా, 2 జింబాబ్వే గెలిచింది. -
టీమిండియా బాటలో పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమిండియా బాటలో అడుగులేస్తుంది. ఆర్దికంగా వెనుకబడిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు చేయూతనిచ్చేందుకు పాక్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. పెద్ద జట్లు స్వదేశంలో మ్యాచ్లు ఆడితే జింబాబ్వే క్రికెట్ బోర్డును లబ్ది చేకూరుతుంది. అందుకే భారత్ జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు ముందుకువచ్చింది. రేపటి నుంచే (జులై 6) భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్లో మొత్తం ఐదు టీ20లు జరుగనున్నాయి. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుతాయి. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటనలో యంగ్ ఇండియాకు శుభ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.పాక్ షెడ్యూల్ ఇలా..పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే ఈ పర్యటనలో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత వన్డే సిరీస్ (నవంబర్ 24, 26, 28).. అనంతరం టీ20 సిరీస్ (డిసెంబర్ 1, 3, 5) జరుగనున్నాయి. మ్యాచ్లన్నీ బులవయోలోని క్లీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగతాయి. కాగా, పాక్ స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జింబాబ్వే సిరీస్ను భావిస్తుంది. -
జులై 6 నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటన.. షెడ్యూల్ వివరాలు
టీ20 వరల్డ్కప్ 2024 ముగిసిన వారం రోజుల్లోనే టీమిండియా మరో సిరీస్కు సిద్దమైంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఈ పర్యటన ఈ నెల (జులై) 6 నుంచి మొదలుకానుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి.ఈ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు సీనియర్లు హార్దిక్, సూర్యకుమార్, పంత్, అక్షర్ పటేల్కు విశ్రాంతి కల్పించారు. రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి వారిని పరిగణలోకి తీసుకోలేదు. సీనియర్ల గైర్హాజరీలో శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. వరల్డ్కప్ ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లలోని రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఈ సిరీస్కు ఎంపికయ్యారు. వరల్డ్కప్ జట్టులోని సభ్యులు యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనకు ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండే కొత్తగా జట్టులోకి వచ్చారు. ఈ సిరీస్ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 (హిందీ) SD & HD, సోనీ స్పోర్ట్స్ టెన్ 4 (తమిళం/తెలుగు), మరియు సోనీ స్పోర్ట్స్ టెన్ 5 SD & HD ఛానల్లలొ ప్రత్యక్ష ప్రసారం కానుంది.జింబాబ్వే సిరీస్కు భారత జట్టు..శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, దృవ్ జురెల్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, తుషార్ దేశ్పాండే -
శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్కు ఐపీఎల్ హీరోలు
ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్ (కేకేఆర్) శ్రేయస్ అయ్యర్ జులై, ఆగస్ట్ నెలల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది. వివిధ కారణాల చేత టీ20 వరల్డ్కప్ జట్టుకు ఎంపిక కాని శ్రేయస్.. లంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు అందుబాటులో ఉంటాడని సమాచారం.మరోవైపు ఐపీఎల్ 2024 హీరోలు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీశ్ రెడ్డి, విజయ్కుమార్ వైశాఖ్, యశ్ దయాల్ జులై 6 నుంచి జింబాబ్వేతో జరుగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఎంపికయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీరందరూ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.వీరితో పాటు టీ20 వరల్డ్కప్కు ట్రావెలింగ్ రిజర్వ్లుగా ఎంపికైన శుభ్మన్ గిల్, ఆవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ కూడా జింబాబ్వే సిరీస్కు ఎంపికవుతారని తెలుస్తుంది. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా ఎంపికవుతారని ప్రచారం జరుగుతుంది. జింబాబ్వే సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతినిస్తారని సమాచారం. జింబాబ్వే పర్యటన కోసం భారత జట్టును వచ్చే వారంలో ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024తో బిజీగా ఉంది. మెగా టోర్నీలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. సూపర్-8లో టీమిండియా.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్లతో తలపడనుంది. -
BAN Vs ZIM: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పసికూన జింబాబ్వే ఊహించని షాకిచ్చింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. దీంతో క్లీన్స్వీప్ నుంచి జింబాబ్వే తప్పించుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా(54) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ షాంటో(36) పరుగులతో రాణించాడు.జింబాబ్వే బౌలర్లలో ముజాబ్రానీ, బెన్నెట్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాంగ్వే, మసకజ్డా చెరో వికెట్ సాధించారు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ బెన్నెట్(70 ), సికిందర్ రజా(72 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్హసన్, సైఫుద్దీన్ తలా వికెట్ పడగొట్టారు. ఇక తొలి నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. -
బంగ్లాదేశ్దే టి20 సిరీస్
జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ జట్టు 3–0తో సొంతం చేసుకుంది. చట్టోగ్రామ్లో మంగళవారం జరిగిన మూడో మ్యాచ్లో బంగ్లాదేశ్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బంగ్లాదేశ్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తౌహిద్ హృదయ్ (38 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్లు), జాకిర్ అలీ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడిపోయింది. -
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన మాజీ స్టార్ క్రికెటర్
జింబాబ్వే మాజీ స్టార్ క్రికెటర్ గై విట్టల్ చిరుత పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. విట్టల్ తల, చేతి భాగంపై చిరుత తీవ్రమైన గాయాలు చేసింది. విట్టల్ను హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అతనికి మరిన్ని శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విట్టల్ పరిస్థితి నిలకడగా ఉందని అతని భార్య హన్నా ఫేస్బుక్ ద్వారా తెలిపింది. 51 ఏళ్ల గై విట్టల్ కుటుంబంతో కలిసి హ్యూమని అనే అటవీ ప్రాంతంలో సఫారీ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. గత మంగళవారం విట్టల్ తన పెంపుడు శునకం చికారాతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో చిరుత అమాంతం విట్టల్పై దాడికి దిగింది. ఇది గమనించిన చికారా చిరుతతో కలబడింది. చికారా ప్రతిఘటించడంతో చిరుత మెత్తబడి పారిపోయింది.చికారా లేకుంటే విట్టల్ ప్రాణాలతో బయటపడేవాడు కాదని అతని భార్య హన్నా తెలిపింది. సఫారీలో విట్టల్కు ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. పదేళ్ల క్రితం ఓ భారీ మొసలి తన గేమ్ రిజర్వ్లోని బెడ్రూమ్లోకి ప్రవేశించి, రాత్రి అక్కడే గడిపింది. ఈ విషయం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉండింది. గై జేమ్స్ విట్టల్ 1993-2003 మధ్యలో జింబాబ్వే తరఫున 46 టెస్ట్లు, 147 వన్డేలు ఆడాడు.టెస్ట్ల్లో ఓ డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 2207 పరుగులు చేసిన విట్టల్.. 51 వికెట్లు కూడా పడగొట్టాడు. వన్డేల్లో 11 హాఫ్ సెంచరీల సాయంతో 2705 పరుగులు చేసిన విట్టల్.. 88 వికెట్లు పడగొట్టాడు.రైట్ ఆర్మ్ మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన విట్టల్.. 21వ శతాబ్దం ఆరంభంలో ఫ్లవర్, స్ట్రాంగ్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్లతో కలిసి జింబాబ్వే క్రికెట్లో ఓ వెలుగు వెలిగాడు. గై విట్టల్ కజిన్ ఆండీ విట్టల్ కూడా అదే సమయంలో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. -
టీ20 క్రికెట్లో సంచలనం.. కేవలం 16 పరుగలకే ఆలౌట్
జింబాబ్వే దేశవాళీ టీ20 టోర్నీ-2024లో సంచలనం నమోదైంది. శనివారం డర్హామ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో ఈగల్స్ కేవలం 16 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీ20 చరిత్రలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన రెండో జట్టుగా ఈగల్స్ చెత్త రికార్డును నెలకొల్పింది. ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో బిగ్బాష్ లీగ్ ఫ్రాంచైజీ సిడ్నీ థండర్స్ అగ్రస్ధానంలో ఉంది. బిగ్బాష్ లీగ్-2022లో సిడ్నీ థండర్స్ కేవలం 15 పరుగులకే ఆలౌటైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన డర్హామ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోర్ సాధిచింది. డర్హామ్ బ్యాటర్లలో బాస్ డి లీడ్(58) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. మస్టర్డ్(46), రాబిన్సన్(49) పరుగులతో అదరగొట్టారు. అనంతరం 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఈగల్స్ కేవలం 16 పరుగులకే కుప్పకూలింది. డర్హామ్ బౌలర్లలో కాఫ్లీన్, పార్కిన్సన్, లూక్ రాబిన్సన్ తలా రెండు వికెట్లతో డర్హామ్ పతనాన్ని శాసించగా.. బాస్ డీ లీడ్, సౌటర్ తలా వికెట్ సాధించారు. మిగితా రెండు వికెట్లు రనౌట్ రూపంలో దక్కాయి. ఈగల్స్ బ్యాటర్లలో చిబావా(4) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: IPL 2024: 'చెన్నై, ముంబై, సన్రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే' -
జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్ల సిరీస్.. షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్కప్ 2024 ముగిసిన అనంతరం భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భారత్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ పర్యటన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు కొద్ది సేపటి క్రితం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం ఈ సిరీస్ ఖరారైనట్లు తెలుస్తుంది. జింబాబ్వే క్రికెట్ చైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్వీట్ చేశాడు. మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అంటూ తవెంగ్వా ట్వీట్లో పేర్కొన్నాడు. కాగా, టీమిండియాకు ఆతిథ్యమివ్వడం వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు ఆర్ధిక స్థితిగతుల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ దేశంలో భారత ద్వితియ శ్రేణి జట్టు పర్యటించినా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురువడం ఖాయం. భారత్లో క్రికెట్కు ఉన్న ప్రజాధరణ వల్ల జింబాబ్వే క్రికెట్ బోర్డు దశ మారిపోతుంది. తమ క్రికెటర్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో జింబాబ్వే బోర్డుకు భారత పర్యటన ద్వారా భారీ లబ్ది చేకూరనుంది. -
SL Vs ZIM, 3rd T20I: హసరంగ మ్యాజిక్.. చిత్తుగా ఓడిన జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 శ్రీలంక స్పిన్ సెన్సేషన్, ఆ జట్టు కెప్టెన్ వనిందు హసరంగ (4-0-15-4) మ్యాజిక్ చేశాడు. ఫలితంగా శ్రీలంక 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. హసరంగ, తీక్షణ (3.1-0-14-2), ఏంజెలో మాథ్యూస్ (2-0-15-2), ధనంజయ డిసిల్వ (1-0-1-1), మధుషంక (2-0-22-1) ధాటికి 14.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో కమున్హుకామ్వే (12), బ్రియన్ బెన్నెట్ (29), సీన్ విలియమ్స్ (15), కెప్టెన్ సికందర్ రజా (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. 10.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. పథుమ్ నిస్సంక (39 నాటౌట్), కుశాల్ మెండిస్ (33) రాణించగా.. ధనంజయ డిసిల్వ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్ వికెట్ సీన్ విలియమ్స్కు దక్కింది. ఈ సిరీస్లో తొలి టీ20లో శ్రీలంక గెలువగా.. రెండో మ్యాచ్ జింబాబ్వే, ఇప్పుడు మూడో మ్యాచ్ మళ్లీ శ్రీలంకనే గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. -
ఏంజెలో మాథ్యూస్ చెత్త బౌలింగ్.. శ్రీలంకకు ఊహించని పరాభవం
కొలొంబో: పసికూన జింబాబ్వే.. తమకంటే చాలా రెట్లు మెరుగైన శ్రీలంకకు ఊహించని షాకిచ్చింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నిన్న (జనవరి 16) జరిగిన రెండో మ్యాచ్లో లంకేయులు ఓ మోస్తరు స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. అనుభవజ్ఞుడైన ఏంజెలో మాథ్యూస్ (1.5-0-35-0) చివరి ఓవర్లో 24 పరుగులిచ్చి లంక ఓటమికి కారకుడయ్యాడు. లూక్ జాంగ్వే.. మాథ్యూస్ వేసిన చివరి ఓవర్లో 2 సిక్సర్లు, బౌండరీ బాది జింబాబ్వేకు అద్భుత విజయాన్నందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే 1-1తో సిరీస్ను సమం చేసింది. తొలి మ్యాచ్లో శ్రీలంక గెలువగా.. నిర్ణయాత్మక మూడో టీ20 జనవరి 18న జరుగనుంది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (39 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (51 బంతుల్లో 66 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో అసలంక, మాథ్యూస్ మినహా అంతా విఫలమయ్యారు. నిస్సంక 1, కుశాల్ మెండిస్ 4, కుశాల్ పెరీరా 0, సమరవిక్రమ 16, షనక 9 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ, లూక్ జాంగ్వే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నగరవ, మసకద్జ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జింబాబ్వే.. ఆఖరి ఓవర్లో జాంగ్వే మెరుపులు (12 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. అంతకుముందు క్రెయిగ్ ఎర్విన్ (70) జింబాబ్వే ఇన్నింగ్స్కు పునాది వేయగా.. బ్రియాన్ బెన్నెట్ (25) పర్వాలేదనిపించాడు. వరుస హాఫ్ సెంచరీలతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సికందర్ రజా (8) ఐదు మ్యాచ్ల తర్వాత తొలిసారి విఫలమయ్యాడు. ఆఖర్లో జాంగ్వే.. క్లైవ్ మదండే (15 నాటౌట్) సాయంతో జింబాబ్వేను గెలిపించాడు. లంక బౌలర్లలో తీక్షణ, చమీరా తలో 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హసరంగ భారీ పరుగులు (4 ఓవర్లలో 41) సమర్పించుకుని ఓ వికెట్ తీశాడు. -
రాణించిన మాథ్యూస్, హసరంగ.. సికందర్ రజా ఆల్రౌండ్ షో వృధా
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జింబాబ్వేతో (కొలొంబో వేదికగా) జరిగిన తొలి టీ20లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. సికందర్ రజా (62) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. సికందర్ రజా మినహా జింబాబ్వే ఇన్నింగ్స్లో అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. కమున్హుకంవే 26, క్రెయిగ్ ఎర్విన్ 10, సీన్ విలియమ్స్ 14, ర్యాన్ బర్ల్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. బ్రియాన్ బెన్నెట్ 10, జోంగ్వే 13 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో తీక్షణ (4-0-16-2), హసరంగ (4-0-19-2), చమీరా (4-0-38-1) వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రీలంక సైతం తడబడింది. ఆ జట్టు అతి కష్టం మీద చివరి బంతికి విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో ఏంజెలో మాథ్యూస్ (38 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) వరుసగా రెండు బౌండరీలు బాది లంక విజయాన్ని ఖరారు చేశాడు. ఆతర్వాత చమీరా ఐదు, ఆరు బంతులకు ఆరు పరుగులు (4, 2) సాధించి లంకను విజయతీరాలకు చేర్చాడు. లంక ఇన్నింగ్స్లో మాథ్యూస్, షనక (18 బంతుల్లో 26 నాటౌట్; 4 ఫోర్లు) రాణించగా.. జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా (4-0-13-3) బంతితోనూ సత్తా చాటాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 2, రిచర్డ్ నగరవ, వెల్లింగ్టన్ మసకద్జ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 ఇదే వేదికపై జనవరి 16న జరుగనుంది. -
హసరంగ 7/19
కొలంబో: గాయం నుంచి కోలుకున్నాక శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఘనంగా పునరాగమనం చేశాడు. జింబాబ్వేతో గురువారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో హసరంగ బంతితో మాయ చేశాడు. 5.5 ఓవర్లు వేసిన హసరంగ కేవలం 19 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వన్డే క్రికెట్లో ఇవి ఐదో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం విశేషం. వర్షం కారణంగా 27 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే జట్టు హసరంగ ధాటికి 22.5 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. వన్డే మ్యాచ్లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్గా... చమిందా వాస్ (8/19; జింబాబ్వేపై 2001లో), ముత్తయ్య మురళీధరన్ (7/30; భారత్పై 2000లో) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో శ్రీలంక బౌలర్గా హసరంగ గుర్తింపు పొందాడు. జింబాబ్వే నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. ఈ గెలుపుతో శ్రీలంక సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షంతో రద్దయింది. -
SL vs ZIM, 2nd ODI: రసవత్తర సమరం.. అంతిమంగా శ్రీలంకదే విజయం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో శ్రీలంక మరో ఓవర్ మాత్రమే మిగిలి ఉండగా విజయతీరాలకు చేరింది. జనిత్ లియనగే (95) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ ఐదు వికెట్ల ఘనతతో (5/32) శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు. అయినా అంతిమంగా శ్రీలంకనే విజయం వరించింది. కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నగరవ రికార్డు స్థాయిలో వరుసగా 28వ పరిమిత ఓవర్ల మ్యాచ్లో వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తీక్షణ (4/31), చమీరా (2/44), వాండర్సే (2/47), మధుషంక (1/24) ధాటికి 44.4 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (82) మాత్రమే రాణించాడు. జాయ్లార్డ్ గుంబీ (30), మిల్టన్ షుంబ (26), ర్యాన్ బర్ల్ (31), క్లైవ్ మదాండే (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు నగరవ ముచ్చెమటలు పట్టించాడు. నగరవ ధాటికి శ్రీలంక ఓ దశలో ఓడిపోయేలా కనిపించింది. అయితే లియనగే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తన జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఆఖర్లో సహన్ అరచ్చిగే (21), తీక్షణ (18), చమీరా (18 నాటౌట్), వాండర్సే (19 నాటౌట్) తలో చేయి వేయడంతో శ్రీలంక విజయతీరాలకు చేరింది. జింబాబ్వే బౌలర్లలో నగరవతో పాటు సికందర్ రజా (2/32), ముజరబానీ (1/41) వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 11న జరుగుతుంది. వర్షం కారణంగా తొలి వన్డే తుడిచిపెట్టుకపోయిన విషయం తెలిసిందే. -
లంక, జింబాబ్వే వన్డే రద్దు..
కొలంబో: శ్రీలంక, జింబాబ్వే మధ్య శనివారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది. ముందుగా లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. చరిత్ అసలంక (95 బంతుల్లో 101; 5 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ సాధించగా...కుశాల్ మెండిస్ (46), సమరవిక్రమ (41) రాణించారు. అనంతరం జింబాబ్వే 4 ఓవర్లలో 2 వికెట్లకు 12 పరుగులు చేసింది. వర్షం రాగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జనవరి 8న కొలంబో వేదికగా జనవరి 8న జరగనుంది. చదవండి: T20 WC: రోహిత్ ఒక్కడే రీఎంట్రీ.. కోహ్లికి నో ఛాన్స్? అగార్కర్ అంతటి సాహసం చేస్తాడా? -
శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన
జనవరి 6 నుంచి శ్రీలంకతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం జింబాబ్వే జట్టును ఇవాళ (జనవరి 1) ప్రకటించారు. వన్డే, టీ20లకు వేర్వేరు జట్లను ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు.. వన్డే సారధిగా క్రెయిగ్ ఎర్విన్ను, టీ20 కెప్టెన్గా సికందర్ రజాను ఎంపిక చేసింది. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఎర్విన్.. తిరిగి జట్టులో చేరడంతో పాటు వన్డే జట్టు పగ్గాలు చేపట్టాడు. మరోవైపు ఈ సిరీస్ల కోసం శ్రీలంక సైతం ప్రిలిమినరీ జట్లను ప్రకటించింది. లంక జట్టు సైతం రెండు ఫార్మాట్లలో కెప్టెన్లను మార్చింది. వన్డే జట్టుకు కుశాల్ మెండిస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. టీ20 జట్టుకు హసరంగ సారధిగా ఎంపికయ్యాడు. ఈ సిరీస్లలో తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20లు జరుగనున్నాయి. జనవరి 6, 8, 11 తేదీల్లో వన్డేలు.. 14, 16, 18 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్లకు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం వేదిక కానుంది. జింబాబ్వే వన్డే జట్టు: క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), ఫరాజ్ అక్రన్, ర్యాన్ బర్ల్, జాయ్లార్డ్ గుంబీ, ల్యూక్ జోంగ్వే, తకుద్జ్వనషే కైతానో, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, టాపివా ముఫుద్జా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవ, సికందర్ రజా, మిల్టన్ షుంభ జింబాబ్వే టీ20 జట్టు: సికందర్ రాజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, క్రెయిగ్ ఎర్విన్, జాయిలార్డ్ గుంబీ, ల్యూక్ జాంగ్వే, టినాషే కమున్హుకమ్వే, క్లైవ్ మదండే, వెల్లింగ్టన్ మసకద్జ, కార్ల్ ముంబా, టోనీ మున్యోంగా, బ్లెస్సింగ్ ముజరబానీ, ఐన్స్లీ ఎండిలోవు. రిచర్డ్ నగరవ, మిల్టన్ షుంభ శ్రీలంక వన్డే ప్రిలిమినరీ స్క్వాడ్: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సాహన్ అరాచ్చిగే, నువనిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియనాగే, వనిందు హసరంగ, మషీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్, అషిత ఫెర్నాండో, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమికా గుణశేఖర శ్రీలంక టీ20 ప్రిలిమినరీ స్క్వాడ్: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పథుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, సధీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వ, మహీశ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భానుక రాజపక్ష, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, దిల్షన్ మధుషంక, బినుర ఫెర్నాండో, నుదాన్ తుషార, ప్రమోద్ మధుషన్, మతీష పతిరణ -
షనకపై వేటు.. శ్రీలంక కొత్త కెప్టెన్లుగా వాళ్లిద్దరు! లంక బోర్డు ప్రకటన
Zimbabwe Tour of Sri Lanka 2024: Preliminary Squads: పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక కెప్టెన్గా దసున్ షనక ప్రస్థానం ముగిసింది. ఇకపై అతడు జట్టులో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్లకు ప్రాథమిక జట్టును ప్రకటించిన సందర్భంగా లంక క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. దసున్ షనక స్థానంలో ఆయా ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమిస్తున్నట్లు తెలిపింది. వన్డే పగ్గాలను కుశాల్ మెండిస్కు, టీ20 జట్టు సారథ్య బాధ్యతలను వనిందు హసరంగకు అప్పగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వన్డే వరల్డ్కప్లో చెత్త ప్రదర్శన కాగా దసున్ షనక కెప్టెన్సీలో పలు అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా యాభై ఓవర్ల ఫార్మాట్లో సారథిగా అతడి గెలుపు శాతం యాభైకి పైగానే ఉంది. అయితే, ఆసియా కప్-2023 తర్వాత సీన్ మారింది. ఈ టోర్నీలో ఆటగాడిగా పూర్తిగా విఫలమైన షనక.. టీమిండియాతో ఫైనల్లో జట్టును ఘోర ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఆ తర్వాత భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో అతడి నాయకత్వంలోని శ్రీలంక పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. ఈ టోర్నీలో మధ్యలోనే గాయం కారణంగా షనక వైదొలగగా.. కుశాల్ మెండిస్ అతడి స్థానంలో కెప్టెన్ అయ్యాడు. అయితే, ఆ తర్వాత లంక ఆట మరింత తేలిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్గా దసున్ షనకపై వేటు తప్పదని వార్తలు రాగా.. తాజాగా లంక బోర్డు ప్రకటనతో అవి నిజమని తేలాయి. కాగా సొంతగడ్డపై జింబాబ్వేతో వన్డే సిరీస్కు 21 మంది సభ్యుల జట్టును ప్రకటించిన లంక సెలక్షన్ కమిటీ.. టీ20లకు 22 మందితో కూడిన ప్రాథమిక జట్లను ఎంపిక చేసింది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక ప్రాథమిక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండో, సదీరా సమరవిక్రమ, సహన్ అరచ్చిగె, నువానిదు ఫెర్నాండో, దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, జనిత్ లియానగే, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుశంక, దుష్మంత చమీరా, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషాన్, అసితా ఫెర్నాండో, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక గుణశేఖర. జింబాబ్వేతో టీ20లకు శ్రీలంక ప్రాథమిక జట్టు: వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సాంకా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, దసున్ షనక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహీశ్ తీక్షణ, కుశాల్ జనిత్ పెరీరా, భనుక రాజపక్స, కమిందు మెండిస్, దునిత్ వెల్లలగే, అకిల ధనంజయ, జాఫ్రే వాండెర్సే, చమిక కరుణరత్నె, దుష్మంత మచీర, దిల్షాన్ మదుశంక, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ప్రమోద్ మదుషాన్, మతీశ పతిరణ. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
డోపింగ్ టెస్ట్లో పట్టుబడ్డ ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్ల సస్పెన్షన్
డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించారని రుజువు కావడంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు (ZC) ఇద్దరు అంతర్జాతీయ క్రికెటర్లను సస్పెండ్ చేసింది. వెస్లీ మధేవెరె, బ్రాండన్ మవుటా బ్లడ్ శాంపిల్స్లో మాదకద్రవ్యాలు వినియోగించినట్లు తేలడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. మధేవెరె, మవుటాలపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ZC ప్రకటించింది. విచారణ పూర్తయ్యే వరకు వీరిద్దరూ ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనరని పేర్కొంది. 26 ఏళ్ల మవుటా ఇటీవలే ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించగా.. మధేవెరె గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. లెగ్ బ్రేక్ బౌలర్ అయిన మవుటా జింబాబ్వే తరఫున 4 టెస్ట్లు, 12 వన్డేలు, 10 టీ20లు ఆడి ఓవరాల్గా 26 వికెట్లు పడగొట్టాడు. మవుటా టెస్ట్ల్లో ఓ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. మధేవెరె విషయానికొస్తే.. 23 ఏళ్ల ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ జింబాబ్వే తరఫున 2 టెస్ట్లు, 36 వన్డేలు, 60 టీ20లు ఆడి 26 వికెట్లు, 1100 పైగా పరుగులు సాధించాడు. అసలే వరుస పరాజయాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. ఇటీవలే ఆ జట్టు హెడ్ కోచ్ డేవ్ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. తాత్కాలిక హెడ్ కోచ్గా వాల్టర్ చాగుటా నియమితుడయ్యాడు. -
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జింబాబ్వేకు మరో భారీ షాక్
వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్లకు అర్హత సాధించలేకపోవడంతో పాటు స్వదేశంలో నమీబియా, ఐర్లాండ్ లాంటి చిన్న జట్ల చేతిలో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న జింబాబ్వే జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నించిన ప్రధాన కోచ్ డేవ్ హటన్ తప్పనిసరి పరిస్థితుల్లో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని జింబాబ్వే క్రికెట్ బోర్డు ఇవాళ అధికారికంగా ప్రకటించింది. డేవ్ హటన్ కెప్టెన్గా, కోచ్గా ఉన్న కాలంలో జింబాబ్వే స్వర్ణ యుగాన్ని చవిచూసింది. ఒక సమయంలో డేవ్తో కూడాని జింబాబ్వే.. ఆస్ట్రేలియా, భారత్ లాంటి జట్లను సైతం గడగడలాడించింది. అలాంటి జట్టు ప్రస్తుతం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుండటంతో హటన్ తన గట్టెక్కించేందుకు విఫలయత్నం చేసి చేత కాక తప్పుకున్నాడు. జింబాబ్వే జట్టులో కొత్తగా కెప్టెన్గా నియమితుడైన సికందర్ రజా ఒక్కడే రాణిస్తుండగా, మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తున్నారు. పరాయి దేశస్తుడిని తీసుకు వచ్చి కెప్టెన్గా చేయడం వల్లే, జట్టులోని మిగతా ఆటగాళ్లు అతనికి సహకరించడం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హటన్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో జింబాబ్వే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం.. రెండు సిరీస్లలోనూ గెలుపు
అంతర్జాతీయ వన్డేల్లో ఐర్లాండ్ చరిత్రాత్మక విజయం సాధించింది. జింబాబ్వే గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ గెలిచింది. అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-0 తేడాతో జయభేరి మోగించింది. కాగా మూడు టీ20, మూడు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఐరిష్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా.. డిసెంబరు 7న మొదలైన టీ20 సిరీస్ను 2-0తో సొంతం చేసుకున్న ఐర్లాండ్.. వన్డేల్లోనూ సత్తా చాటింది. బుధవారం (డిసెంబరు 13) నాటి తొలి మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో జింబాబ్వేపై నెగ్గిన ఐర్లాండ్.. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుత విజయం సాధించింది. హరారే వేదికగా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాల్ స్టిర్లింగ్ బృందం జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఐరిష్ పేసర్లు గ్రాహం హ్యూమ్, కర్టిస్ కాంఫర్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో 40 ఓవర్లలోనే జింబాబ్వే కథ ముగిసింది. కేవలం 197 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ జాయ్లార్డ్ గుంబీ 72 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద, వన్డౌన్ బ్యాటర్ కైటానో 13 పరుగుల వద్ద రనౌట్గా వెనుదిరిగారు. అయితే, వర్షం ఆటంకం కలిగించడంతో డీఎల్ఎస్ పద్ధతిలో ఐర్లాండ్ టార్గెట్ను 201గా నిర్దేశించారు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐరిష్ జట్టుకు ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ అదిరిపోయే ఆరంభం అందించాడు. మొత్తంగా 102 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(8) నిరాశపరచగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన కర్టిస్ కాంఫర్ 40, హ్యారీ టెక్టార్ 33 పరుగులు సాధించారు. బల్బిర్నీతో కలిసి లోర్కాన్ టకర్ 29 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఐర్లాండ్ 2-0తో సొంతం చేసుకుంది. బల్బిర్నీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. కర్టిస్ కాంఫర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. చదవండి: IPL 2024: ఐపీఎల్ వేలానికి సర్వం సిద్దం.. కొత్త ఆక్షనీర్ ప్రకటన! ఎవరీ మల్లికా సాగర్? -
ఆరేసిన జాషువ లిటిల్.. జింబాబ్వేకు మరో షాకిచ్చిన ఐర్లాండ్
ఐర్లాండ్ జట్టు తమ కంటే కాస్త మెరుగైన జింబాబ్వేకు షాక్ల మీద షాక్లు ఇస్తుంది. 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న ఐరిష్ టీమ్.. తొలుత జరిగిన టీ20 సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని తాజాగా ఆతిథ్య జట్టుకు మరో షాకిచ్చింది. వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన రెండో వన్డేలో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. జాషువ లిటిల్ ఆరు వికెట్లు (10-2-36-6) తీసి జింబాబ్వేను ఒంటిచేత్తో ఓడించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. లిటిల్ ధాటికి 42.5 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్లో మసకద్జ (40), ర్యాన్ బర్ల్ (38), క్లైయివ్ మదాండే (33), ముజరబానీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. లిటిల్కు జతగా మార్క్ అడైర్ (1/23), క్రెయిగ్ యంగ్ (1/30), ఆండీ మెక్బ్రెయిన్ (1/34), హ్యారీ టెక్టార్ (1/5) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్.. 40.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్టిస్ క్యాంఫర్ (66) అర్ధసెంచరీతో రాణించగా.. లోర్కాన్ టక్కర్ (28), మార్క్ అడైర్ (25 నాటౌట్), హ్యారీ టెక్టార్ (21) ఒ మోస్తరు స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాండన్ మవుటా, ముజరబానీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ నగరవ, చివంగ తలో వికెట్ దక్కించుకున్నారు. సిరీస్లో నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 17న జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.