Top Stories
ప్రధాన వార్తలు
‘సడలింపు’ని సరిదిద్దండి
సాక్షి, అమరావతి: పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను ఏపీలో సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా ఈనెల 25న జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని గుర్తుచేసింది. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్. నిరంజన్రెడ్డి బుధవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా నిబంధనలను సడలిస్తూ జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా..నిజానికి.. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం చేసి, స్టాంప్ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు (స్పెసిమెన్) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్ అధికారి సంతకం (స్పెసిమెన్)తో సరిపోల్చుకుని పోస్టల్ బ్యాలెట్ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇచ్చారు.గోప్యతకు.. శాంతిభద్రతలకు విఘాతం..ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో స్పెసిమెన్ సంతకంపై రాజకీయ పక్షాల ఏజెంట్ల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఇది చినికిచినికి పెను వివాదంగా మారి శాంతిభద్రతల సమస్యగా పరిణమించే ప్రమాదం ఉంది. ఈ నిబంధనలవల్ల ఓటు గోప్యత ఉండదని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగానే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా ఉత్తర్వులు జారీచేయడంపై నివ్వెరపోతున్నారు.నిబంధనల సడలింపుపై న్యాయపోరాటం..ఇదిలా ఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా జారీచేసిన ఉత్తర్వులపై దుమారం రేగుతోంది. వాటిని సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం సముచిత నిర్ణయం తీసుకోని పక్షంలో.. మీనా సడలింపు ఉత్తర్వులపై న్యాయపోరాటం చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది.
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు సీఎం వైఎస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సువర్ణాక్షరాలతో లిఖించేలా గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటిగుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.మంచి చేసిన ప్రభుత్వానికి దన్నుగా..ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ.. ఏటా అమ్మఒడి పథకం కింద ఇస్తున్న సొమ్మును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని.. రైతుభరోసా కింద ఇస్తున్న రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామంటూ కొత్తగా హామీలిచ్చిన సీఎం జగన్.. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు.. రాష్ట్రం రూపురేఖలను మరింతగా గొప్పగా మార్చేందుకు వైఎస్సార్సీపీకి ప్రజలు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు.
తెలంగాణ పదేళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ల హడావుడి 'దశాబ్ది దంగల్'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ రగడ ప్రారంభమైంది. దశాబ్ది ఉత్సవాలపై తమ ముద్ర వేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ హడావుడి చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉండటంతో పూర్తిగా తమ మార్క్ కనిపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందిస్తోంది. మరోవైపు అధికారంలో ఉండగానే (గత ఏడాది జూన్లోనే) దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వపరంగా నిర్వహించిన బీఆర్ఎస్.. ఇప్పుడు పార్టీపరంగా దశాబ్ది ముగింపు ఉత్సవాలకు సిద్ధమవుతోంది. మరోవైపు దశాబ్ది ఉత్సవాలకు కొనసాగింపుగా పలు అంశాలపై కసరత్తు చేపట్టిన సీఎం రేవంత్రెడ్డి.. తెలంగాణ అధికారిక గేయాన్ని ఖరారు చేశారు. అధికారిక చిహ్నంలోనూ మార్పులపై దృష్టిపెట్టారు. ఈ మార్పులను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. గన్ పార్క్ నుంచి మొదలు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే ప్రధాన కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరుకానున్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సోనియా గాం«దీని ఆహ్వానించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నాయకురాలిగా ఆమెను సత్కరించాలని నిర్ణయించింది. 2న అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అరి్పంచడంతో దశాబ్ది ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్రెడ్డి అక్కడి నుంచి పరేడ్ గ్రౌండ్కు వెళ్లి ప్రసంగిస్తారు. ఇక సాయంత్రం ట్యాంక్బండ్పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కారి్నవాల్, లేజర్ షో, శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అధికారిక గేయమైన ‘జయజయహే తెలంగాణ’కు జాతీయ జెండాలతో మార్చ్ఫాస్ట్ నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది జూన్లోనే ఉత్సవాలు చేపట్టి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పదో ఏట అడుగుపెడుతున్న సందర్భంలోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ప్రారంభ ఉత్సవాలను చేపట్టింది. 2023 జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు గ్రామగ్రామాన ఈ వేడుకలను నిర్వహించింది. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పోరాటంతోనే రాష్ట్ర సాధన జరిగిందని చెప్పుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగపడేలా కార్యక్రమాలను నిర్వహించింది. ఇప్పుడు దశాబ్ది ముగింపు ఉత్సవాల పేరుతో మూడు రోజుల కార్యక్రమాలకు బీఆర్ఎస్ సిద్ధమైంది. జూన్ 1వ తేదీనే గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి అమరజ్యోతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. 2న కేసీఆర్ అధ్యక్షతన సభ నిర్వహించనున్నారు. 3వ తేదీన జిల్లాల్లో బీఆర్ఎస్ జెండా, జాతీయ పతాకం ఆవిష్కరణ, హాస్పిటళ్లు, అనాథ శరణాలయాల్లో పండ్లు, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. అధికార చిహ్నం మార్పులపై విమర్శలు దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్ఎస్ తీవ్రంగా విరుచుకుపడుతోంది. తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రం ఇచ్చిన దేవతగా సోనియా ఈ కార్యక్రమానికి వస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రతిస్పందిస్తుండటంతో.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గేయంగా ప్రకటించిన ప్రభుత్వం.. దానికి తుదిరూపునిచ్చే క్రమంలో ఏపీకి చెందిన సంగీత దర్శకుడు కీరవాణిని ఎంచుకోవడంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కళాకారులకు ప్రాంతీయ హద్దులేమిటని.. అయినా బీఆర్ఎస్ హయాంలో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారికి లభించిన గౌరవం మాటేమిటంటూ కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. మొత్తంగా దశాబ్ది ఉత్సవాలతో రాష్ట్రంలో రాజకీయ దంగల్ జరుగుతోంది.
Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
బీజేపీ, అధికార బీజేడీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతున్న ఒడిశాలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుతోంది. 15 లోక్సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చివరి దశలో భాగంగా మిగతా 6 లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. వీటిలో 4 బీజేడీ, 2 బీజేపీ సిట్టింగ్ స్థానాలు. వాటిపై ఫోకస్...జగత్సింగ్పూర్ ఇక్కడ రెండు దశాబ్దాలుగా బీజేడీ చక్రం తిప్పుతోంది. బీజేపీ ఖాతా తెరవలేదు. 2019లో భారీ మెజారిటీతో నెగ్గిన రాజశ్రీ మల్లిక్ బీజేడీ నుంచి, ఆయన చేతిలో ఓడిన బిబూ ప్రసాద్ తరాయ్ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. తరాయ్ 2009లో ïసీపీఐ నుంచి, 2014లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. ఆయన ఓటు బ్యాంకును చూసి బీజేపీ మరోసారి చాన్సిచి్చనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రవీంద్ర కుమార్ సేథీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేడీలోకి చేరడం ఆ పారీ్టకి అనుకూలించే అంశం.కేంద్రపర ఇదీ బీజేడీ కంచుకోటే. ఈసారి మాత్రం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2009, 2014ల్లో బీజేడీ నుంచి గెలిచిన బైజయంత్ పాండా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి బీజేడీ నేత, సినీ నటుడు అనుభవ్ మహంతి చేతిలో ఓటమి చవిచూశారు. ఒకప్పుడు సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడైన బైజయంత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుని హోదాలో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అనుభవ్ మహంతి కూడా బీజేపీలో చేరడంతో బీజేడీ సంకట స్థితిలో పడింది. అన్షుమన్ మహంతిని పోటీకి దింపింది. మయూర్భంజ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్థానంలో ఎమ్మెల్యే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్నిహితుడు నాబా చరణ్ మఝికి ఈసారి బీజేపీ టికెటిచ్చింది. ద్రౌపది ముర్ము 2009లో ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన విద్యా శాఖ మంత్రి సుదమ్ మరాండీని బీజేడీ బరిలో దింపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజని సోరెన్ జేఎంఎం తరఫున పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.భద్రక్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ భద్రక్ లోక్సభ స్థానం పరిధిలోని చాంద్బలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. దాంతో భద్రక్లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చరణ్ సేథీ కుమారుడు అవిమన్యు సేథీ పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ మంజులతా మండల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అనంత ప్రసాద్ సేథీ బరిలో ఉన్నారు.జజ్పూర్ బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ శరి్మష్ఠ సేథీ మళ్లీ బరిలో ఉన్నారు. రవీంద్ర నారాయణ బెహరాకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఆంచల్ దాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఇక్కడ జనతాదళ్ నుంచి గెలిచారు. గత ఐదేళ్లలో బీజేపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి బెహరా స్థానికులకు పరిచయస్తుడే అయినా రాజకీయాలకు కొత్త.బాలాసోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మాజీ బీజేపీ నేత లేఖశ్రీ సమంత సింగార్ పోటీ చేస్తున్నారు. పార్టీని అస్తమానం విమర్శించే లేఖశ్రీకి టికెటివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి కందమాల్ నుంచి బీజేపీ తరఫున పోటీకి లేఖశ్రీ ఆసక్తి చూపారు. నీలగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంతో బీజేడీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ కుమార్ జెనా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన కరబేల స్వైన్ స్వతంత్ర అభ్యర్థిగా రెండు పారీ్టలకూ సవాలు విసురుతున్నారు.బరిలో కోటీశ్వరులు ఒడిశాలో తుది విడత బరిలో ఉన్న 66 మంది అభ్యర్థుల్లో 20 మంది కోటీశ్వరులే. కేంద్రపర బీజేపీ అభ్యర్థి బైజయంత్ పాండాకు అత్యధికంగా రూ.148 కోట్లున్నాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్ పాండే రూ.18.23 కోట్లు, భద్రక్ బీజేపీ ఎంపీ మంజులత మండల్కు రూ.14.86 కోట్ల ఆస్తులున్నాయి. 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 10 మంది తీవ్ర కేసుల్లో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) పేర్కొంది.
‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
సాక్షి, న్యూఢిల్లీ: పసికందుల విక్రయానికి అంతర్రాష్ట్రముఠా కోడ్ భాష వినియోగించినట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. పాపను ‘స్కూటీ’గా, బాబును ‘బైక్’గా పిలుస్తూ ఇలా కోడ్ భాష ఎంచుకున్నట్లు స్పష్టమైంది. చిన్నారులను రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న అంతర్రాష్ట్రముఠా గుట్టును రాచకొండ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో పోలీసులు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. బుధవారం ఢిల్లీతోపాటు పుణే, యూపీ, నోయిడా, హరియాణాల్లోని పలు సిటీల్లో రాచకొండ పోలీసులు బృందాలుగా తనిఖీలు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది.వాట్సాప్లో మెసేజ్లు పాప కావాలి అంటే ‘స్కూటీ’ కావాలా?, బాబు కావాలి అంటే మీకు ‘బైక్’ కావాలా అని ముఠా సభ్యులు వాట్సాప్లో పిల్లలు లేని దంపతులకు మెసేజ్లు పంపేవారు. డైరెక్టుగా పాప కావాలా లేదా బాబు కావాలా అని మెసేజ్లు చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముఠాసభ్యులు ఈ కోడ్ భాషను వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.ఎవరైనా తెలియక పాప లేదా బాబు కావాలి అని మెసేజ్ చేస్తే వారికి వాట్సాప్ కాల్ చేసి మరీ ఈ కోడ్ భాష గురించి చెప్పేవారని, అనంతరం పిల్లలు లేని దంపతులు కూడా కోడ్ భాషను వినియోగించే వారని తెలిసింది. ఈరకంగా పలు ప్రాంతాల్లో పసికందులను విక్రయించినట్టు సమాచారం. ప్రస్తుతం రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపిన వారి వివరాలతోపాటు వీరికి సంబంధించిన ప్రతి ఒక్క కదలికలపై నిఘా పెంచారు. కొంతకాలంగా వీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు. వీటితో పాటు వాట్సాప్/టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా చాట్ చేసిన వివరాలు సేకరించారు. ఈ చాటింగ్లలో పోలీసులకు క్లూ లభించినట్టు తెలుస్తోంది. ఈ క్లూతోనే ఢిల్లీ, ఫుణే, హర్యానా వంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కొందరికి నోటీసులు కూడా జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.ఆ చిన్నారులు మా వద్ద క్షేమంగా ఉన్నారు.పెంపుడు తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేది లేదు: కాంతి వెస్లీవెంగళరావునగర్(హైదరాబాద్): రాచకొండ పోలీసులు 11 మంది చిన్నారులను శిశువిహార్కు అప్పగించారని, వారంతా తమ వద్ద క్షేమంగా ఉన్నారని మహిళ,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ చెప్పారు. బుధవారం కొందరు తల్లిదండ్రులు, మీడియా మహిళ, శిశు సంక్షేమశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూసినా ఎవరినీ లోపలకు అనుమతించలేదు. ఆ తర్వాత కాంతి వెస్లీ బయటకు వచ్చి మీడియాకు పలు విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం.. వారికి కఠినశిక్షలు పడతాయని హెచ్చరించారు. ఆ విధంగా తీసుకొని పెంచుకోవడం కూడా తప్పేనన్నారు. చిన్నారులను కొని పెంచిన వారు ఇప్పుడు వచ్చి మా పిల్లలను మాకివ్వండి అని అడుగుతున్నారని, వారికి పిల్లలను ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తేల్చిచెప్పారు. అలాంటి తల్లిదండ్రులు ఎవరూ ఇక్కడకు రావొద్దని పేర్కొన్నారు. సంతానం లేనివారు ఎవరైనా పిల్లలు కావాలంటే మా వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకుంటే విచారణ అనంతరం దత్తత ఇస్తామన్నారు. పెంపుడు తల్లిదండ్రులు దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ పిల్లలను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి
సాక్షి, అమరావతి: వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 175 శాసన సభ నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లోపు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్లు లెక్కింపు జరుగుతుందని, వీటి ఫలితాలు సాయంత్రం 4 గంటల్లోపు వస్తాయన్నారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరుగుతుందని, సాయంత్రం 6.00 గంటల్లోపు వీటి ఫలితాలు రావొచ్చని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు టేబుళ్లను పెంచి సకాలంలో పూర్తి చేస్తామన్నారు. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ బుధవారం రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై సమీక్షించారు. లెక్కింపు ప్రక్రియలో అనుసరించాల్సిన విధానాలు, శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో కౌంటింగ్కు చేపట్టిన ఏర్పాట్లను సీఈవో మీనా వివరించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు రోజు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 144 సెక్షన్ అమలుతో పాటు ఆ జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. డిజీపీతో పాటు తాను కూడా పల్నాడు జిల్లాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించామని, అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపులో లోపాలు జరగకూడదు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనలో ఎటువంటి లోపాలు, జాప్యం జరగడానికి వీల్లేదని, అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరితగతిన కచ్చితమైన ఫలితాలను ప్రకటించాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ రాష్ట్ర అధికారులకు చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపును విజయవంతంగా పూర్తి చేయాలని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం–21 సీ, 21ఈలను అదే రోజు ఫ్లైట్లో ఈసీకి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా లెక్కింపు ప్రక్రియపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల్లో కూలీల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులను ఎవ్వరినీ అందుకు వినియోగించొద్దని చెప్పారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. ఎన్నికల అనంతరం పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగినందున, ఈ జిల్లా అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్ బాగ్చీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేశామని, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లు, త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు చేపడుతున్న చర్యలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేస్తున్న బందోబస్తు ఏర్పాట్లను ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు నితీష్ వ్యాస్కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో హరేంధిర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తదితరులు వారి నియోజకవర్గాల నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
డీఎస్పీ ప్రణీత్రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలోని బృందం 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ కస్టడీలో ప్రణీత్రావు అనేక కీలకాంశాలు వెల్లడించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాదీనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రణీత్ ప్రవర్తనపై ఫిర్యాదులు వరంగల్ జిల్లా మేడేపల్లికి చెందిన ప్రణీత్ 2008లో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశారు. ఐపీఎస్ అధికారి రాజేష్ కుమార్ నల్లగొండ ఎస్పీగా ఉండగా ప్రణీత్రావు ప్రవర్తన సరిగ్గా లేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా ఆయన ప్రణీత్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు నల్లగొండ ఎస్పీగా బదిలీపై రావడంతో ప్రణీత్రావు ఆయనతో పరిచయం పెంచుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ప్రణీత్ను బీబీనగర్ ఎస్సైగా ప్రభాకర్రావు నియమించారు. 2016లో ప్రభాకర్రావు నిఘా విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో ఆయన్ను సంప్రదించిన ప్రణీత్ కూడా అందులోకే వచ్చారు. ప్రణీత్కు సీనియారిటీ ప్రాతిపదికన 2017లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి వచ్చింది. అదే సమయంలో ప్రభాకర్రావు సైతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబీ చీఫ్గా మారారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ వేణుగోపాల్ రావు వద్ద పని చేయాలని ప్రణీత్కు ప్రభాకర్రావు సూచించారు. అప్పటి నుంచి ప్రణీత్ నేరుగా వీరిద్దరికి మాత్రమే రిపోర్ట్ చేసేవారు. ఎవరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలనే వివరాలు వీరిద్దరి నుంచి ప్రణీత్కు అందేవి. అక్రమ ట్యాపింగే ప్రధాన విధిగా... ప్రభాకర్రావు చొరవతోనే ప్రణీత్కు 2023లో యాక్సిలేటరీ పదోన్నతి వచ్చింది. ప్రభాకర్రావు ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేసుకున్న ప్రణీత్కు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఎస్ఐబీ కార్యాలయం మొదటి అంతస్తులో వీరి కోసం రెండు గదులు కేటాయించారు. వాటిలోనే లాగర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ 17 కంప్యూటర్లు, ల్యాప్టాప్తో అక్రమ ఫోన్ ట్యాపింగ్ల కథ నడిపారు. బీఆర్ఎస్లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్కు పాల్పడటమే ఎస్ఓటీ ప్రధాన విధిగా పని చేసింది. ప్రభాకర్రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్ 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని బయటపెట్టారు. వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ప్రణీత్ వద్ద 8 ఫోన్లు ఎస్ఓటీ పనిని పర్యవేక్షించడానికి, టీమ్లోని వారితో సంప్రదింపులు జరపడానికి ప్రణీత్రావు 8 ఫోన్లు నిర్వహించారు. వీటిలో 3 అధికారిక నంబర్లు కాగా, మిగిలినవి వ్యక్తిగతమైనవి. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ టీమ్ ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. వీరి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు అందించేది. ఆ బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వా«దీనం చేసుకునేవి. అయితే ప్రతిపక్షాలతోపాటు ఎన్నికల సంఘాన్నీ తప్పుదోవ పట్టించిన ప్రణీత్ టీమ్ ఈ నగదుకు హవాలా రంగు పూసింది. ట్యాపింగ్, నిఘాకు వినియోగించిన ఉపకరణాల్లో కొన్నింటిని నగరానికి చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనే సంస్థ నుంచి సమీకరించుకున్నారు. బీఆర్ఎస్ ఓడిపోతోందని రావడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని గత నవంబర్ 30న ఎగ్జిట్ పోల్స్లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్రావు ఆదేశించారు. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడటంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్రావు ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్కు సూచించారు. దీంతో ప్రణీత్ అదే రోజు రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు చెందిన శ్రీనివాస్, అనంత్ సహకారంతో హార్డ్డిస్క్లు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. సర్వర్లు తదితరాలను వారిద్దరికీ అప్పగించి... 50 హార్డ్డిస్క్ల్ని ఆర్ఎస్సై హరికృష్ణతో కలిసి ధ్వంసం చేశారు. హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణ ద్వారా ఈ హార్డ్లిస్క్ల్ని ఎలక్ట్రిక్ కట్టర్తో ముక్కలు చేయించారు. కంప్యూటర్లను ఫార్మాట్ చేసి, పత్రాలను ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్రావు హార్డ్డిస్క్ ముక్కల్ని మాత్రం నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పారేశారు. ఫార్మాట్ చేసిన సెల్ఫోన్లు, పెన్డ్రైవ్స్ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో పంజగుట్టలో కేసు నమోదై అరెస్టులు చోటు చేసుకున్నాయి.
రాష్ట్ర గేయం.. 2.30 నిమిషాలు!
సాక్షి, హైదరాబాద్: రెండున్నర నిమిషాల నిడివికి కుదించిన ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర అధికారిక గేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ‘జయజయహే తెలంగాణ’ గేయం ఒరిజినల్ వెర్షన్లోని ఒకట్రెండు పదాలను తొలగించి.. స్వల్ప మార్పులు, చేర్పులు చేసి పదమూడున్నర నిమిషాల పూర్తి నిడివితో మరో వెర్షన్ను ఖరారు చేసింది. గేయ రచయిత అందెశ్రీ మార్గదర్శకత్వంలో, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించగా.. ప్రముఖ గాయ నీ గాయకులతో రికార్డు చేసిన రెండు వెర్షన్ల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి బుధవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో గాయనీగాయ కులు ఈ రెండు వెర్షన్ల గేయాన్ని లైవ్గా పాడి వినిపించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజలను ఉర్రూతలూగించిన జయజయహే తెలంగాణ గేయాన్ని సరికొత్త స్వరాలు, సంగీత బాణీలతో అద్భుతంగా తీర్చిదిద్దారని, మరోసారి ప్రజలను ఉర్రూతలూగించడం ఖాయమని ఆ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఇందులో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ కె.రఘు, తెలంగాణ అధికారిక చిహ్నం రూపొందిస్తున్న చిత్రకారుడు రుద్ర రాజేశం, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాంచంద్రు నాయక్, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.అధికారిక చిహ్నంలో మార్పులపైనా..తెలంగాణ తొలిదశ ఉద్యమం, అశోక చక్రం, వ్యవ సాయం, రాజ్యాంగాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఈ భేటీలో సూచించారు. చిత్రకారుడు రుద్ర రాజేశం రూపొందించిన పలు నమూనా చిహ్నాలను పరిశీలించి వాటిలో ఒకదానిని ఎంపిక చేశారని.. అందులో కొన్ని మార్పులను సూచించారని తెలిసింది.అయితే ఇదే అధికారిక చిహ్నమంటూ.. మూడు నమూనా చిహ్నాలు బుధవారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో దేనిని కూడా ఎంపిక చేయలేదని సీఎంఓ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర గేయం, తెలంగాణ అధికారిక చిహ్నాన్ని జూన్ 2న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగ సభలో ఆవిష్కరించనున్నారు.అమరవీరులు, ఉద్యమకారులకు అండగత బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్రెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. అమరవీ రుల కుటుంబాలు, ఉద్యమకారులకు తమ ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. వారి విషయంలో స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పా రు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులు, అమరవీ రుల కుటుంబాలకు ఇచ్చిన హామీ అమలుకు చర్య లు చేపట్టామని వెల్లడించారు. జూన్ 2న ఉదయం పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే దశాబ్ది వేడుకలకు తెలంగాణ తొలి, మలి విడత ఉద్యమకారులను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు.నేడు మిత్రపక్షాలతో సమావేశంతెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, రాష్ట్ర గేయం, అధికారిక చిహ్నం రూపకల్పన అంశాలపై చర్చించేందుకు గురువారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో మిత్రపక్షాలు సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలతో సీఎం రేవంత్రెడ్డి సమా వేశం కానున్నారు. మిత్రపక్షాల నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణ యాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను ఆహ్వానించలేదు.
కసరత్తులు షురూ!
న్యూయార్క్: టి20 ప్రపంచకప్ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రయినింగ్ సెషన్ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్ నైట్ మ్యాచ్లే ఆడారు. కానీ వరల్డ్ కప్ లీగ్ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్ సెషన్లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్తో పాటు కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు.‘టైమ్ జోన్కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్నెస్ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్ 5న అసలు పోరులో ఐర్లాండ్తో భారత్ ఆడుతుంది. ‘నంబర్వన్’ ర్యాంక్తో ప్రపంచకప్లోకి... టి20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా నంబర్వన్ ర్యాంకర్గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్లో భారత్ 264 రేటింగ్ పాయింట్లతో తమ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను వెస్టిండీస్ 3–0తో క్లీన్స్వీప్ చేయడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్లో నిలిచింది.
మండిపోయిన ఢిల్లీ.. దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ఢిల్లీ వాసులకు హీట్వేవ్ సెగ తలుగుతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాజధాని వాసులు బెంబేలెత్తుతున్నారు.భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ మంగేశ్పూర్ బుధవారం (మే29) మధ్యాహ్నం 2.30 గంటలకు రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశచరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. మరోపక్క ఎండ వేడిమి తట్టుకోలేక ఉపశమనం కోసం ఢిల్లీ వాసులు కూలర్లు, ఏసీలు రికార్డుస్థాయిలో వినియోగిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్ వినియోగం 8302 మెగావాట్లకు చేరింది. ఢిల్లీతో పాటు రాజస్థాన్లోనూ 50 డిగ్రీల ఉష్ణోగ్రత రియల్ ఫీల్ పరిస్థితులు నెలకొన్నాయి.అంతలోనే వర్షం...ఓ పక్క దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన కొద్ది సేపటికే ఢిల్లీలో అకస్మాత్తుగా వర్షం పడింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం, పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొద్దిసేపు ఢిల్లీలో చిరు జల్లులు కురిశాయి.
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: బెంగాల్లోకి అక్రమ వలసలు
- ధ్యానం చేస్తూ ఎవరైనా కెమెరా తీసుకెళ్తారా?: మమత
- ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- 3 నుంచి బడిబాట
- భారత్ లో ఏఐ జోరు
- సర్వాంగ సుందరంగా ట్యాంక్బండ్
- పత్తి విత్తనాల కొరత లేదు
- Lok Sabha Election 2024: మహిళలకు బీజేడీ సముచిత స్థానం!
- Lok Sabha Election 2024: పాటలీపుత్ర లాలుకు లిట్మస్ టెస్టు
- లోక్సభ అభ్యర్థుల్లో31% సంపన్నులు... 20% నేరచరితులు
సినిమా
బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్.. ఆర్జీవీ పోస్ట్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఆయనే. టాలీవుడ్లో తనదైన మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆర్జీవీ. నాగార్జునతో కలిసి తెలుగు ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రం అప్పట్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో జేడీ చక్రవర్తి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో అమలా హీరోయిన్గా నటించింది.అయితే ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. శివ మూవీని త్వరలోనే రీ రిలీజ్ చేయనున్నట్లు ట్విటర్లో(ఎక్స్) పోస్ట్ చేశారు. నాగార్జున స్టైల్లో సైకిల్ చైన్ తెంచుతున్న వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్కు ఆర్జీవీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు. Rgv in and as SHIVA ..Re releasing VERY SOON pic.twitter.com/F8Pg9zzGQb— Ram Gopal Varma (@RGVzoomin) May 29, 2024
హిమాలయాలకు బయల్దేరిన రజనీకాంత్.. ఎన్నికలపై కామెంట్
సౌత్ ఇండియా సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాటపట్టారు. బుధవారం చెన్నై నుంచి విమానంలో ఆయన బయల్దేరారు. హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయనున్నారు. చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యం.. హిమాలయాలకు వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. అందుకే తాను ప్రతి ఏటా వెళ్తున్నట్లు అన్నారు.ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని రజనీకాంత్ అన్నారు. ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు. అంతకుముందు ఇంటి నుంచి బయలు దేరిన రజనీ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళతానని.. ఇప్పుడు కూడా బద్రీనాథ్, కేదార్నాథ్లను సందర్శించేందుకు వెళ్తున్నానని అన్నారు. గతేడాది జైలర్ సినిమా విడుదలకు ముందు కూడా హిమాలయాలకు రజనీకాంత్ వెళ్లిన విషయం తెలిసిందే.ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీ తప్పుకున్నారు. అలాగే, రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్, కేదార్నాథ్, బాబాజీ గుహతో సహా పలు పవిత్ర స్థలాలను సందర్శించిన అనంతరం జూన్ 4న చెన్నైకి తిరిగి రానున్నట్లు సమాచారం. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వేట్టయాన్’ సినిమాలో తన భాగం చిత్రీకరణని పూర్తి చేశారు రజనీ. ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చిందని రజనీ తెలిపారు. ఇదే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.
చివరి శ్వాస వరకు సినిమాల్లో ఉంటా.. కానీ నన్ను గుర్తుంచుకోరు: మమ్ముట్టి
మలయాళ స్టార్, మెగాస్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు మమ్ముట్టి. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల యాక్షన్-థ్రిల్లర్ 'టర్బో'చిత్రంలో కనిపించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి, సునీల్, అంజనా జయప్రకాష్, కబీర్ దుహన్ సింగ్, సిద్ధిక్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూకు హాజరైన మమ్ముట్టి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.మమ్ముట్టి మాట్లాడుతూ..'నా చివరి శ్వాస వరకు నటనను విడిచిపెట్టే ఆలోచనే లేదు. నా మరణం తర్వాత ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారని ఆశించడం లేదు. ఎందుకంటే కాలక్రమేణా గొప్ప వ్యక్తులను కూడా ఎవరైనా మరచిపోతారనే విషయాన్ని గట్టిగా నమ్ముతా. అయినా ప్రజలు నన్ను ఎంతకాలం గుర్తుంచుకుంటారు? ఒక సంవత్సరం? పదేళ్లు? అంతకంటే చాలా తక్కువ. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వేలమంది నటీనటుల్లో నేను ఒక్కడిని." అని అన్నారు.వారు నన్ను ఏడాది కంటే ఎక్కువ కాలం ఎలా గుర్తుంచుకోగలరు? మనం ఈ ప్రపంచంలో లేనప్పుడు మన గురించి ఎలా తెలుస్తుంది? ప్రపంచం అంతం అయ్యే వరకు అందరూ గుర్తుంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ జరగదు' అని అన్నారు. కాగా.. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. 1971లో ఇండస్ట్రీలో ప్రవేశించిన మమ్ముట్టి 400కు పైగా చిత్రాలలో నటించారు. 1973లో వచ్చిన ‘కాలచక్రం’లో సినిమాతో గుర్తింపు పొందారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గ్యాంగ్ స్టర్ మూవీ కాదు: దర్శకుడు
‘గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిన కథే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అని దర్శకుడు కృష్ణ చైతన్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కంటే ముందే నేను దర్శకత్వం వహించాల్సిన సినిమాలు ఉన్నా.. అనివార్య కారణాల వల్ల అవి అలస్యం అయ్యాయి. చాలా గ్యాప్ రావడంతో నాలో భయం మొదలైంది. ఇదే విషయాన్ని త్రివిక్రమ్తో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ సేన్కి కథ చెప్పగా.. అది ఆయనకు నచ్చడంతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది.⇒ ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.⇒ విశ్వక్ సేన్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.⇒ మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.⇒ యువన్ శంకర్ రాజా లాంటి ప్రముఖ సంగీత దర్శకుడితో పని చేయాలంటే మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నా. కానీ ఆయన మాత్రం తన అనుభవంతో.. నేను కోరుకున్నట్టుగా, సినిమాకి కావాల్సిన అద్భుతమైన సంగీతాన్ని అందించారు.⇒ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన కథ. ఆ ఇష్టంతోనే ఈ సినిమా చేశాను. నేను అనుకున్న భావోద్వేగాలు తెరమీద చక్కగా పలికాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి.⇒ మహా భారతంలోని "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. "నా అనేవాడే నీ మొదటి శత్రువు" అనే మాటే చెబుతాను.
ఫొటోలు
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్.. నా భర్త అడిగేవాడన్న హీరోయిన్!(ఫొటోలు)
ఈ స్టన్నింగ్ బ్యూటీ.. టీమిండియా స్టార్ భార్య! గుర్తుపట్టారా? (ఫొటోలు)
టీ20 వరల్డ్కప్-2024కు ముందు భార్య అనుష్కతో కోహ్లి చక్కర్లు.. ఫొటోలు వైరల్
Cannes 2024: ఊర్వశి రౌతేలా స్టన్నింగ్ లుక్స్ (ఫోటోలు)
ప్రాక్టీస్ షురూ చేసిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్పే లక్ష్యంగా..(ఫొటోలు)
క్రీడలు
వైశాలి చేతిలో హంపి ఓటమి
స్టావెంజర్: నార్వే చెస్ మహిళల టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత స్టార్ కోనేరు హంపి తొలి ఓటమిని చవిచూసింది. భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ వైశాలితో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్లో హంపి 44 ఎత్తుల్లో ఓడిపోయింది. క్లాసికల్ గేమ్లో నెగ్గినందుకు వైశాలికి మూడు పాయింట్లు లభించాయి. ఆరుగురు మేటి గ్రాండ్మాస్టర్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత వైశాలి నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో వైశాలి తమ్ముడు ప్రజ్ఞానందకు రెండో రౌండ్ అర్మగెడాన్ గేమ్లో ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్తో జరిగిన రెండో రౌండ్ క్లాసికల్ గేమ్ను ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఇద్దరి మధ్య విజేతను నిర్ణయించడానికి అర్మగెడాన్ గేమ్ నిర్వహించగా తెల్ల పావులతో ఆడిన డింగ్ లిరెన్ 51 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించాడు.
పారిస్ ఒలింపిక్స్కువిజయం దూరంలో...
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్ బెర్త్లను ఖరారు చేసుకోవడానికి భారత బాక్సర్లు అంకుశిత బోరో (60 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) విజయం దూరంలో నిలిచారు. వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో వీరిద్దరూ తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ యూత్ మాజీ చాంపియన్ అంకుశిత 4–1తో ఆసియా చాంపియన్ రిమా వొలోసెంకో (కజకిస్తాన్)పై నెగ్గగా... నిశాంత్ 5–0తో పీరాపట్ యెసుంగ్నోయెన్ (థాయ్లాండ్)ను చిత్తు చేశాడు. మహిళల 66 కేజీల విభాగంలో అరుంధతి 5–0తో స్టెఫానీ పీనీరో (ప్యూర్టోరికో)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. అయితే పురుషుల ప్లస్ 92 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో నరేందర్ 2–3తో గిల్మర్ కాంగో (ఈక్వడోర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే పురుషుల 57 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో బతుహాన్ సిఫ్టిసి (టర్కీ)తో సచిన్ సివాచ్... 51 కేజీల రెండో రౌండ్లో రూయిజ్ (మెక్సికో)తో అమిత్.. 92 కేజీల రెండో రౌండ్లో లూయిస్ (వెనిజులా)తో సంజీత్... మహిళల 57 కేజీల రెండో రౌండ్లో మసాతి (అజర్బైజాన్)తో జైస్మిన్ తలపడతారు.
టైటిల్ వేట మొదలైంది...
పారిస్: కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్ను దాటాడు. ప్రపంచ 142వ ర్యాంకర్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో జొకోవిచ్ 2 గంటల 31 నిమిషాల్లో 6–4, 7–6 (7/3), 6–4తో గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ప్రత్యర్థి సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ నెట్ వద్ద 19 పాయింట్లు గెలిచాడు. మరోవైపు మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్), ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో అల్కరాజ్, సిట్సిపాస్లకు తమ ప్రత్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురుకాగా... రుబ్లెవ్ వరుస సెట్లలో విజయాన్ని అందుకున్నాడు. అల్కరాజ్ 3 గంటల 9 నిమిషాల్లో 6–3, 6–4, 2–6, 6–2తో జెస్పర్ డి జాంగ్ (నెదర్లాండ్స్)పై, సిట్సిపాస్ 2 గంటల 43 నిమిషాల్లో 6–3, 6–2, 6–7 (2/7), 6–4తో అల్టమెయిర్ (జర్మనీ)పై, రుబ్లెవ్ 2 గంటల 1 నిమిషంలో 6–3, 6–4, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలుపొందారు. జాంగ్తో జరిగిన మ్యాచ్లో అల్కరాజ్ తన సర్వీస్ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి స ర్వి స్ను ఎనిమిదిసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన ఈ స్పెయిన్ స్టార్ ఏకంగా 47 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మహిళల సింగిల్స్లో 2020 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ (అమెరికా), ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీ షియా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో సోఫియా 6–3, 6–3తో 21వ సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, ఎనిమిదో సీడ్ ఆన్స్ జబర్ (ట్యునీషియా) 6–3, 1–6, 6–3తో కామిలా ఒసోరియో (కొలంబియా)పై గెలుపొందారు. భారీ వర్షాల కారణంగా బుధవారం ఏకంగా 23 సింగిల్స్ మ్యాచ్లను వాయిదా వేశారు.
T20 WC: ఆసీస్ కాదు.. ఆ జట్టు: ఊహించని పేరు చెప్పిన దిగ్గజం
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలుకానుంది.అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్కప్లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్-8 జట్ల మధ్యే ఉండనుంది.ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లుటీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ టైటిల్ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.ఊహించని పేరు చెప్పిన లారామెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పేర్లు చెప్పగా.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ జట్టుకు తన టాప్-4లో స్థానమిచ్చాడు.గావస్కర్ టాప్-4 జట్లు ఇవేఅండర్డాగ్స్గా టీ20 ప్రపంచకప్-2024లో అడుగుపెట్టే అఫ్గన్.. ఈసారి కచ్చితంగా సెమీస్ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్ సునిల్ గావస్కర్ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఈసారి సెమీస్ చేరతాయని జోస్యం చెప్పాడు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
బిజినెస్
థాయ్లాండ్ వీసా నిబంధనల్లో మార్పులు
పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.ఈ సందర్భంగా థాయ్లాండ్ ప్రభుత్వ ప్రతినిధి చాయ్ వాచరోంకే మాట్లాడుతూ..‘పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ వీసా గడువు పెంచాం. దాంతోపాటు ఇతర దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవీవిరమణ పొందిన వారికి సంబంధించి వీసాలో మార్పులు చేశాం. జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. గతంలో థాయ్లాంట్ వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 93కు పెంచాం. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలి. ఆన్-అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించాం. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను సడలించాం. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఒక సంవత్సరం అదనంగా ఉండవచ్చు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేకవీసాలు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదుఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్లాండ్ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 పూర్తి ఏడాదికిగాను రికార్డు స్థాయిలో 40 మిలియన్ల విదేశీ రాకపోకలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9లక్షల కోట్లు) దేశఖజానాకు చేరుతుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో థాయ్లాండ్కు 39.9 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు.
ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఇందుకోసం ఇన్ఆర్గానిక్ అవకాశాలను (వేరే సంస్థను కొనుగోలు చేయడం వంటివి) పరిశీలిస్తామని సంస్థ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలి పారు. ప్రస్తుతం దీనిపై అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని వివరించారు.అగ్ని ప్రమాద బీమా వంటి జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఎల్ఐసీకి నైపుణ్యాలు లేవని, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ మా త్రం చేయగలదని మొహంతి తెలిపారు. ఇన్సూరెన్స్ చట్టాన్ని సవరించి ఒకే గొడుగు కింద లైఫ్, జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ను ఆఫర్ చేసే విధంగా బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సులు జారీ చేయొచ్చనే అంచనాల నేపథ్యంలో మొహంతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆర్బీఐ మొబైల్ యాప్
ముంబై: రిటైల్ మదుపుదార్లు ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడాన్ని సులభతరం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. దీనితో పాటు నియంత్రణపరమైన అనుమతులకు సంబంధించి ప్రవాహ్ పోర్టల్, ఫిన్టెక్ సంస్థల డేటా కోసం ఫిన్టెక్ రిపాజిటరీని ప్రారంభించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఈ మూడింటిని ఆవిష్కరించారు. ప్రస్తు తం చిన్న ఇన్వెస్టర్లు రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా గవర్నమెంట్ సెక్యూరిటీస్ (జీ–సెక్)లో ఇన్వెస్ట్ చేయడానికి వీలుంది. ఇందుకోసం రిటైల్ డైరెక్ట్ స్కీము కింద ఆర్బీఐ వద్ద రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంటును తెరవాల్సి ఉంటోంది. దీన్ని ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి, ఐవోఎస్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 60 ఫారంలతో ప్రవాహ్.. నియంత్రణ సంస్థపరమైన వివిధ రకాల అనుమతులకు సంస్థలు, వ్యక్తులు దర ఖాస్తు చేసుకునేందుకు ప్రవాహ్ పోర్టల్ ఉపయోగపడుతుంది. వివిధ విభాగాలకు సంబంధించి ఇందులో 60 అప్లికేషన్ ఫారంలు ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. అప్లై చేసుకున్న వారు నిర్దిష్ట దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు, అలాగే దానిపై తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణీత వ్యవదిలో దరఖాస్తుదారుకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఫిన్టెక్ రిపాజిటరీ.. ఫిన్టెక్ సంస్థలు, వాటి కార్యకలాపాలు, టెక్నాలజీపరంగా చేకూరే ప్రయోజనాలు మొదలైన డేటాకి ఈ రిపాజిటరీ కేంద్రంగా ఉంటుంది. ఫిన్టెక్ కంపెనీలను నియంత్రణ సంస్థ కోణంలో మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, వాటికి తగిన విధానాలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడగలదు. నియంత్రిత సంస్థలు, ఆర్బీఐ నియంత్రణలో లేని ఫిన్టెక్లు కూడా ఈ రిపాజిటరీకి సమాచారం సమరి్పంచవచ్చు.మరోవైపు, ఆర్బీఐ నియంత్రణలో మాత్రమే ఉన్న సంస్థలు (బ్యాంకు లు, బ్యాంకింగ్యే తర ఆర్థిక సంస్థలు) వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి సంబంధించిన వివరాల కోసం ఎంటెక్ (ఈఎంటెక్) రిపాజిటరీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఫిన్టెక్, ఎంటెక్ రిపాజిటరీలను ఆర్బీఐ అనుబంధ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ (ఆర్బీఐహెచ్) నిర్వహిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
ప్రభుత్వం జీవిత బీమా రంగ సంస్థ ఎల్ఐసీ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో దేశంలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అందుకోసం పలు ఇన్సూరెన్స్ సేవల్ని అందిస్తున్న సంస్థల్ని కొనుగోలు చేసే అంశంపై ఎల్ఐసీ ప్రయత్నాలు చేస్తోందంటూ పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఎల్ఐసీ క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ ఛైర్మన్ సిద్ధార్థ్ మొహంతీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం పట్ల ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే, సాధారణ బీమాలో తమకు పెద్దగా అనుభవం లేదని అందుకే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు.ప్రస్తుతం జీవిత బీమా కంపెనీలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను అందించడానికి వీల్లేదు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్లకు కాంపోజిట్ లైసెన్స్ను మంజూరు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తద్వారా దీనివల్ల ఆయా సంస్థలకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆయా సంస్థలపై నియంత్రణపరమైన భారాలు తగ్గుతాయని సూచించింది. ఇందుకోసం బీమా చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది.
వీడియోలు
రాజసింగ్కు బెదిరింపు కాల్స్
12 లక్షల విలువైన వజ్రాలు ఈ నెలలో 20 లభ్యం
ప్రగతి భవన్ కు బాంబు బెదిరింపు నిందితుడు అరెస్ట్
తప్పుడు పనుల కోసమే బీజేపీతో టీడీపీ పొత్తు
ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్..
పిల్లలను కొన్న వారి పై కేసులు బయటపడ్డ ముఠా ఆడియో
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ తిరస్కరించిన సుప్రీం
1200 వందల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ నిజాలు ఒప్పుకున్నా ప్రణీత్ రావు
మళ్లీ జగనే.. నో డౌట్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై కేంద్ర ఈసీకి ఫిర్యాదు చేసిన YSRCP నేతలు
ఫ్యామిలీ
అనుష్క శర్మ బుడ్డి హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే..నోరెళ్లబెట్టడం ఖాయం!
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి, అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ఇప్పటికే అమెరికాకు చేరుకుంది. అందులో విరాట్ కోహ్లీ మినహా.. మిగతా ప్లేయర్లంతా ఉన్నారు. విరాట్ మాత్రం వ్యక్తిగత పనుల నిమిత్తం ఇంకా భారత్లోనే ఉండిపోయారు. ఆయన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే రెండోసారి తండ్రైన విరాట్ కోహ్లీ ప్రస్తుతం ముంబైలో తన భార్య అనుష్క శర్మ, పిల్లలతో సరదాగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న కోహ్లీ.. మంగళవారం రాత్రి కుటుంబంతో కలిసి డిన్నర్ డేట్కు వెళ్లాడు. ఇందులో తన భార్య అనుష్క శర్మతో పాటు.. టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, అతడి భార్య సాగరిక ఘట్గే, క్రికెట్ ప్రెజెంటర్ గౌరవ్ కపూర్, తదితరులు ఉన్నారు. వారందరితో విరుష్క దంపతులు సరదాగా గడిపారు. అందుకు సంబంధించిన వీడియోలు, పోటోలు నెట్టింట తెగ చక్కెర్లు కొడుతున్నాయి. అయితే ఇక్కడ ఆ అనుష్క పట్టుకున్న హ్యాడ్బ్యాగ్ హాట్టాపిక్గా మారింది. చెప్పాలంటే డిన్నర్ డేట్లో ఆ హ్యాండ్బ్యాగ్ హైలెట్గా నిలిచింది. ఇది గాబ్రియేలా హర్స్ట్ నినా బ్రాండ్కి చెందిన లగ్జీరియస్ బ్యాగ్. దీన్ని ఎక్కువగా బ్రిటీష్ రాజవంశస్తులు, కొందరూ హాలీవుడ్ ప్రముఖులు ఉపయోగిస్తారు. అచ్చం ఇదే మాదిరి బ్యాగ్ని ప్రిన్స్ హ్యరీ భార్య మేఘనా మార్కిల్ ధరించింది. ప్రఖాత్య హాలీవుడ్ ప్రముఖులు, ధనవంతులు ఉపయోగించే ఫేమస్ బ్రాండ్ లెదర్ బ్యాగ్ ఇది. అలాంటి లగ్జరీయస్ బ్యాగ్ అనుష్కా ధరించడం అందర్నీ షాక్కి గురిచేసింది. ఈ బుడ్డి బ్యాగ్ ధర ఏకంగా రూ. 2.3 లక్షలు పైనే పలుకుతుందట. దీన్ని ఎక్కువగా రాజవంవస్తులు, ధనవంతుల దర్పాన్ని ప్రదర్శించే రేంజ్లో ఉండే లగ్జరీయస్ హ్యాండ్ బ్యాగ్ అని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రముఖులు. సినీ సెలబ్రెటీలు ధరించే దుస్తుల నుంచి హ్యాండ్ బ్యాగ్లు వరకు అన్ని కళ్లు చెదిరిపోయేంత ఆకర్షణీయంగా ఉండటమేగాక అత్యంత విలావంతమైన వస్తువులుగా ఉంటాయి. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?)
మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అవార్డు!ఎవరీమె..?
భారత ఆర్మీ అధికారిణికి యూఎన్ అత్యున్నత గౌరవం లభించింది. యూఎన్ ఆమెను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించి గౌరవించింది. ఇంతకీ ఎవరా అధికారిణి?. ఆమెకు ఎందుకు యూఎన్ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది అంటే.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకురాలిగా పనిచేసినందుకుగానూ భారత ఆర్మీ అధికారిణి మేజర్ రాధికా సేన్కి 2023 ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆమె యూఎన్ శాంతి పరిరక్షకురాలిగా మహిళలు, బాలికల హక్కుల కోసం చేసిన విశేషమైన కృషికి గానూ యూన్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డుతో సత్కరించి గౌరవించింది.ఇవాళ (మే 29) యూఎన్ శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సం పురస్కరించుకుని భారత ఆర్మీ అధికారిణి రాధికా సేన్ని ఇలా అవార్డుతో సత్కరించి గౌరవించింది యూఎన్. ముఖ్యంగా 2000లో భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగా సంఘర్షణ, లైంగిక హింసలకు గురవ్వుతున్న బాలికలను రక్షించేందుకు ఆమె చేసిన విశేషమైన కృషిని ఇలా అవార్డుతో గుర్తించింది. ఎవరీ రాధిక సేన్..?⇒హిమచల్ప్రదేశ్లో జన్మించిన రాధికా సేన్ తొలుత బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్లో వృత్తిలో కొనసాగించారు. అయితే ఆమె బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తుండగానే ఇండియన్ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది. అలా సేన్ 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి శాంతి పరిరక్షకురాలిగా నియమితులయ్యారు. ఆతర్వాత ఆమె ఏప్రిల్ 20024 వరకు ఇండియన్ రాపిడ్ డిప్లాయ్మెంట్ బెటాలియన్తో ఎంగేజ్మెంట్ ప్లాటూన్ కమాండర్గా పనిచేశారు.⇒మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు రాధికా సేన్ నిలిచారు. సేన్ కంటే ముందు, మేజర్ సుమన్ గవానీ దక్షిణ సూడాన్లోని UN మిషన్తో ఆమె చేసిన సేవకు ఇలాంటి గుర్తింపునే పొందారు. 2019లో మేజర్ సుమన్కి ఈ అత్యున్నత గౌరవం లభించింది. ⇒యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాల్లో మోహరించిన దాదాపు 6,603 మంది భారతీయ సిబ్బందిలో సేన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్ ఇన్ ది డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తరుఫున దాదాపు 1,954 మంది వ్యక్తులతో కలిసి పనిచేశారు. వారిలో 32 మందికి పైగా మహిళలు ఉండటం విశేషం. ఆమె పని మహిళలు ఏకం చేసేలా..సమస్యలు చర్చించడం, సురక్షితమైన ప్రదేశాలుగా మార్చడం. ⇒యూఎన్ ప్రకారం.. సేన్ లింగ సమానత్వంపై దృష్టి సారించి తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్సీ)లో శాంతి పరిరక్షక ప్రయత్నాలకు నాయకత్వం వహించారు. ఆమె కమ్యూనిటీలకు సహాయం చేస్తpూ..కమ్యూనిటీ అలర్ట్ నెట్వర్క్లను కూడా స్థాపించారు. (చదవండి: మామిడి తొక్కే కదా అని తీసిపారేయకండి..ఎన్ని లాభాలో తెలుసా..!)
వామ్మో ఈ దారా? ప్రాణం పోయినంత పనైపాయె!!
మనం తెలియని ప్రదేశాలలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు మనలో మనకే చిన్నగా భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయం మరింత రెట్టింపవుతుంది. ప్రయాణించే దారిలో ఎలాంటి సంఘటనలు తారసపడుతాయో అనే సందేహం మనసులో ఏదో మూలన ఉండకమానదు. అదేవిధంగా ఈ వీడియోలో ఎదురైన ఈ సొరంగమార్గం కూడా అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి!వామ్మో ఇది పాతాళమేనా అన్నట్లుగా..ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా తనకు ఓ కొండ ఎదురైంది. ఆ కొండ దాటడానికి సొరంగ మార్గం ఒక్కటే దిక్కు. చేసేదేమిలేక కారుని ముందుకు నడిపాడు. కారు ఆ గుహ మార్గంలోకి ప్రయాణించింది. అంతా చీకటిమయం. ఎదురుగా ఏముందో కనిపించే వీలులేదు. కారుకు ఉన్న లైట్లే అతని ధైర్యం. ఆ మార్గం కైలాసం ఆడుతున్నట్లుగా అన్నీ వంక మలుపులే. అక్కడక్కడా మనసు కుదుటపడేలా.. లెఫ్ట్, రైట్ టర్నింగ్ సంకేతాలు. ఇవేగానీ లేకపోతే ముందుకు సాగకపోవడమో, ప్రమాదం జరగడమో ఖాయం.వెళ్తున్నా కొద్ది సొరంగ మార్గం తనకు తానే దారి పొడవు పెంచుతున్నట్లుగా సాగుతూనే ఉంది. ఆ గుహలోంచి బయట ఎప్పుడు పడాల్లా అనేవిధంగా భయంతో కూడిన ఆతృత. కారు పైభాగం గుహకు తాకుతున్నట్లుగా ఆలోచన. చిమ్మని చీకటి... మరోసారి మళ్లీ ఈ దారిలోకి వద్దామా? బయటికి మార్గం ఉందా? లేక ఎక్కడైనా ఇరుక్కుపోతానా? వెనక్కి వెళ్లలేం! ముందుకే తప్ప మరేదిక్కులేదు! ఇప్పుడెలా? వెళ్తున్నానుగా... అనే ఆలోచనలు లోలోనే దిగమింగుతూ తేరుకునేలోపు సొరంగమార్గం ముగిసిపోయి.., బయటిదారి ఎదురయ్యేసరికి ప్రాణం గుప్పిట్లో దాచుకుని హమ్మయ్య!! అనుకున్నాడు ఆ డ్రైవర్. View this post on Instagram A post shared by Usha Vardhan (@usha.vardhan.96) ఇవి చదవండి: ట్రోలర్స్కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
న్యూస్ పాడ్కాస్ట్
ప్రతిపక్ష నాయకులు చల్లే బురదలోనే కమలాలు విరగబూస్తాయి.. ప్రధాని మోదీ ధీమా.. ఇంకా ఇతర అప్డేట్స్
మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్నికల్లో విపక్ష ‘ఇండియా’ కూటమి గెలిస్తే హిందువులు రెండో తరగతి పౌరులే.. ప్రధాని మోదీ ఆందోళన.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో 61.11 శాతం ఓటింగ్ నమోదు.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వీడియో లీక్తో ఎన్నికల సంఘానికి సంబంధం లేదు... ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేష్ కుమార్ మీనా స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
విపక్షాలది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి.. ప్రధాని మోదీ విమర్శలు.. ఇంకా ఇతర అప్డేట్స్
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
డీఎస్పీ ప్రణీత్రావు వాంగ్మూలం.. 1,000 నుంచి 1,200 ఫోన్లు ట్యాపింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్రావు నేతృత్వంలోని బృందం 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ కస్టడీలో ప్రణీత్రావు అనేక కీలకాంశాలు వెల్లడించినట్లు కోర్టుకు తెలిపారు. ప్రతిపక్షాలకు నిధులు ఇస్తున్న సంస్థల డబ్బును స్వాదీనం చేసుకోవడం కోసం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు నాంపల్లి కోర్టుకు నేరాంగీకార వాంగ్మూలాన్ని సమర్పించారు. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రణీత్ ప్రవర్తనపై ఫిర్యాదులు వరంగల్ జిల్లా మేడేపల్లికి చెందిన ప్రణీత్ 2008లో శిక్షణ పూర్తి చేసుకుని ఎస్సైగా బయటకు వచ్చారు. నల్లగొండ జిల్లా మోత్కూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశారు. ఐపీఎస్ అధికారి రాజేష్ కుమార్ నల్లగొండ ఎస్పీగా ఉండగా ప్రణీత్రావు ప్రవర్తన సరిగ్గా లేదంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా ఆయన ప్రణీత్పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్రావు నల్లగొండ ఎస్పీగా బదిలీపై రావడంతో ప్రణీత్రావు ఆయనతో పరిచయం పెంచుకున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దీంతో ప్రణీత్ను బీబీనగర్ ఎస్సైగా ప్రభాకర్రావు నియమించారు. 2016లో ప్రభాకర్రావు నిఘా విభాగానికి బదిలీ అయ్యారు. దీంతో ఆయన్ను సంప్రదించిన ప్రణీత్ కూడా అందులోకే వచ్చారు. ప్రణీత్కు సీనియారిటీ ప్రాతిపదికన 2017లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి వచ్చింది. అదే సమయంలో ప్రభాకర్రావు సైతం డీఐజీ నుంచి ఐజీగా పదోన్నతి పొంది ఎస్ఐబీ చీఫ్గా మారారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్పీ వేణుగోపాల్ రావు వద్ద పని చేయాలని ప్రణీత్కు ప్రభాకర్రావు సూచించారు. అప్పటి నుంచి ప్రణీత్ నేరుగా వీరిద్దరికి మాత్రమే రిపోర్ట్ చేసేవారు. ఎవరిపై నిఘా ఉంచాలి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలనే వివరాలు వీరిద్దరి నుంచి ప్రణీత్కు అందేవి. అక్రమ ట్యాపింగే ప్రధాన విధిగా... ప్రభాకర్రావు చొరవతోనే ప్రణీత్కు 2023లో యాక్సిలేటరీ పదోన్నతి వచ్చింది. ప్రభాకర్రావు ఆదేశాల మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) ఏర్పాటు చేసుకున్న ప్రణీత్కు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, మరో ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఎస్ఐబీ కార్యాలయం మొదటి అంతస్తులో వీరి కోసం రెండు గదులు కేటాయించారు. వాటిలోనే లాగర్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్న ప్రణీత్ 17 కంప్యూటర్లు, ల్యాప్టాప్తో అక్రమ ఫోన్ ట్యాపింగ్ల కథ నడిపారు. బీఆర్ఎస్లోని అసమ్మతి నేతలు, అసంతృప్తులతో పాటు ప్రతిపక్షాలపై నిఘా పెట్టడం కోసం అక్రమ ట్యాపింగ్కు పాల్పడటమే ఎస్ఓటీ ప్రధాన విధిగా పని చేసింది. ప్రభాకర్రావు ఆదేశాలతో చేసిన అనేక ఆపరేషన్ల వివరాలు దర్యాప్తు అధికారుల వద్ద వెల్లడించడానికి నిరాకరించిన ప్రణీత్ 1,000 నుంచి 1,200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని బయటపెట్టారు. వారి వివరాలను సైతం బయటకు చెప్పనంటూ పోలీసులకు స్పష్టం చేశారు. ప్రణీత్ వద్ద 8 ఫోన్లు ఎస్ఓటీ పనిని పర్యవేక్షించడానికి, టీమ్లోని వారితో సంప్రదింపులు జరపడానికి ప్రణీత్రావు 8 ఫోన్లు నిర్వహించారు. వీటిలో 3 అధికారిక నంబర్లు కాగా, మిగిలినవి వ్యక్తిగతమైనవి. ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిన ప్రణీత్ టీమ్ ప్రధానంగా నగదు రవాణాపై దృష్టి పెట్టింది. ఎస్ఓటీ నిఘాలో ఉన్న వారిలో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక సహాయం చేస్తున్న వ్యాపారులు, ఫైనాన్షియర్లు కూడా ఉన్నారు. వీరి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కదలికల్ని పసిగట్టిన ప్రణీత్ బృందం ఆ సమాచారాన్ని ఆయా జిల్లాలకు చెందిన పోలీసులు అందించేది. ఆ బృందాలు వాళ్లు రవాణా చేస్తున్న నగదును స్వా«దీనం చేసుకునేవి. అయితే ప్రతిపక్షాలతోపాటు ఎన్నికల సంఘాన్నీ తప్పుదోవ పట్టించిన ప్రణీత్ టీమ్ ఈ నగదుకు హవాలా రంగు పూసింది. ట్యాపింగ్, నిఘాకు వినియోగించిన ఉపకరణాల్లో కొన్నింటిని నగరానికి చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ అనే సంస్థ నుంచి సమీకరించుకున్నారు. బీఆర్ఎస్ ఓడిపోతోందని రావడంతో... అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని గత నవంబర్ 30న ఎగ్జిట్ పోల్స్లో రావడంతో ఆ రోజు నుంచి ట్యాపింగ్ కార్యకలాపాలు ఆపేయాలని ప్రభాకర్రావు ఆదేశించారు. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడటంతోనే తన పోస్టుకు రాజీనామా చేసిన ప్రభాకర్రావు ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేయాలని ప్రణీత్కు సూచించారు. దీంతో ప్రణీత్ అదే రోజు రాత్రి 7.30 నుంచి 8.15 గంటల వరకు సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కన్వర్జెన్స్ ఇన్నోవేషన్స్ ల్యాబ్ సంస్థకు చెందిన శ్రీనివాస్, అనంత్ సహకారంతో హార్డ్డిస్క్లు, డాక్యుమెంట్లు బయటకు తీశారు. సర్వర్లు తదితరాలను వారిద్దరికీ అప్పగించి... 50 హార్డ్డిస్క్ల్ని ఆర్ఎస్సై హరికృష్ణతో కలిసి ధ్వంసం చేశారు. హెడ్ కానిస్టేబుల్ కె.కృష్ణ ద్వారా ఈ హార్డ్లిస్క్ల్ని ఎలక్ట్రిక్ కట్టర్తో ముక్కలు చేయించారు. కంప్యూటర్లను ఫార్మాట్ చేసి, పత్రాలను ఎస్ఐబీ కార్యాలయం ఆవరణలోనే కాల్చేసిన ప్రణీత్రావు హార్డ్డిస్క్ ముక్కల్ని మాత్రం నాగోల్, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పారేశారు. ఫార్మాట్ చేసిన సెల్ఫోన్లు, పెన్డ్రైవ్స్ని బేగంపేట నాలాలో విసిరేశారు. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో పంజగుట్టలో కేసు నమోదై అరెస్టులు చోటు చేసుకున్నాయి.
పోలీసుల అదుపులో ముగ్గురు తహసీల్దార్లు!
నల్లగొండ క్రైం/నిడమనూరు: అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంతో నల్లగొండ జిల్లాలో ము గ్గురు తహసీల్దార్లు, ఒక వీఆర్వోను టాస్్కఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిడమనూరు మండలం తుమ్మడం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను మార్తివారిగూడేనికి చెందిన మార్తి సురేందర్రెడ్డి, అతని కుటుంబసభ్యులు అక్రమ మార్గాల్లో పట్టా చేయించుకున్నారని, అదే గ్రామానికి చెందిన మార్తి వెంకట్రెడ్డి 2022లో విజిలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని సురేందర్రెడ్డితోపాటు ఆయన భార్య, తల్లిపేరుతో పట్టా చేశారని, అంతేగాక వీఆర్వో వద్ద అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి కూడా తన పేరుతోపాటు భార్య, తండ్రి పేరుతో ఏడు ఎకరాలు పట్టా చేయించుకున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు, అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో విచారణ ముందుకు సాగించలేకపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా పట్టా చేసుకున్న వారిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఒక తహసీల్దార్ ఫైల్ పె ట్టగా, మరొక తహసీల్దార్ ప్రభుత్వానికి, అసైన్డ్ కమిటీకి ఫా ర్వర్డ్ చేయగా, ఇంకో తహసీల్దార్ పట్టా జారీ చేసినట్టు తెలిసింది. ఈ విషయంపై హైకోర్టులో కేసు వేయగా, కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కేసు వేసిన వ్యక్తు లు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ధిక్కరణ కింద అధికారులు, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలీసులు బుధవారం ఆయా రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు.కొన్నిసార్లు వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్ వెల్లడించారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్లో అన్వేషించి సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నందున సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ వెల్లడించారు.
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో బుధవారం(మే29) ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ప్రజ్వల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గురువారమే బెయిల్ పిటిషన్పై విచారణ జరపాల్సిందిగా ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరగా కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ సమయం కోరింది. దీంతో జడ్జి సంతోష్ గజానన్ విచారణను మే 31కి వాయిదా వేశారు. లైంగిక దౌర్జన్యం వీడియోలు వెలుగు చూసిన తర్వాత ఏప్రిల్లో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ మే31న భారత్ వస్తానని ఇప్పటికే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను 31కే వాయిదా వేయడంతో ఆయన ఆరోజు వస్తారా మళ్లీ ఏదైనా తేదీ ప్రకటిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి తరపున జేడీఎస్ పార్టీ నుంచి హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ ముగిసింది.