Top Stories
ప్రధాన వార్తలు
కుండపోత వానతో ఢిల్లీ జలమయం.. కూలిన ఎయిర్పోర్ట్ రూఫ్
న్యూఢిల్లీ, సాక్షి: విపరీతమైన ఉష్ణోగ్రతలు.. తీవ్ర ఉక్కపోతతో అల్లలాడిపోతున్న దేశ రాజధానిని.. వరుసగా రెండో రోజు వరుణుడు కరుణించాడు. గురువారం రాత్రి నుంచి నగరంలో వర్షం కురుస్తోంది. అయితే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నగరం జలమయంగా మారింది. పొద్దుపొద్దున్నే ట్రాఫిక్జామ్ కావడం, పలు కాలనీల్లో కార్లు, బైకులు నీట మునగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరో రెండు గంటలపాటు భారీ వర్షం కొనసాగుతుందని, అత్యవరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ చెబుతోంది.#WATCH | People wade through water as incessant rainfall causes waterlogging in parts of Delhi; visuals from Mehrauli Badarpur Road pic.twitter.com/pcMa0eTQzC— ANI (@ANI) June 28, 2024#WATCH | Roads in several parts of Delhi inundated after heavy rainfall overnight(Visuals from Shanti Path) pic.twitter.com/mIBlFtJnGw— ANI (@ANI) June 28, 2024#WATCH | Waterlogging witnessed at several parts of Delhi following heavy rain(Visuals from Moti Bagh) pic.twitter.com/XLV1xs7YyW— ANI (@ANI) June 28, 2024 #WATCH | Heavy overnight rainfall leaves several parts of Delhi waterlogged. Visuals from Mandawali area. pic.twitter.com/UBUCidfoOS— ANI (@ANI) June 28, 2024#WATCH | A truck submerged as incessant rainfall causes severe waterlogging in parts of Delhi. (Visuals from Minto Road) pic.twitter.com/tc2DJQpSVX— ANI (@ANI) June 28, 2024మరోవైపు ఈదురు గాలుల ధాటికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో కొన్ని కార్లు ధ్వంసం కాగా, ఆరుగురికి గాయాలైనట్లు ఢిల్లీ ఫైర్ సిబ్బంది తెలిపారు. ఉదయం 5.30గం. ప్రాంతంలో ఘటన జరిగిందని సమాచారం వచ్చిందని, వాళ్లను రక్షించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించామని ఫైర్ విభాగం డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందక్కడ. #WATCH | Latest visuals from Terminal-1 of Delhi airport, where a roof collapsed amid heavy rainfall, leaving 6 people injured pic.twitter.com/KzxvkVHRGG— ANI (@ANI) June 28, 2024 #UPDATE | 6 people injured after a roof collapsed at Terminal-1 of Delhi airport: Atul Garg, Fire Director https://t.co/r0ikZqMq9N— ANI (@ANI) June 28, 2024మరోవైపు ఈ ఘటనసహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎక్స్ ద్వారా తెలియజేశారు. Personally monitoring the roof collapse incident at T1 Delhi Airport. First responders are working at site. Also advised the airlines to assist all affected passengers at T1. The injured have been evacuated to hospital. Rescue operations are still ongoing.— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 28, 2024
Watch: బైడెన్ Vs ట్రంప్ వాడీవేడీ చర్చ..
Live Updates..👉ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం, పాలస్తీనా స్వతంత్ర దేశానికి మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నపై ట్రంప్ స్పందిస్తూ.. దానిపై ఆలోచిస్తాం అని చెప్పుకొచ్చారు.బైడెన్ బలహీనుడు. అతను ఇప్పుడు పాలస్తీనియన్ వ్యక్తిగా మారిపోయాడు. అయినప్పటికీ బైడెన్ను వారు ఇష్టపడటం లేదు. Donald Trump to Joe Biden during the Presidential debate:“He’s become like a Palestinian. They don’t like him because he’s a very bad Palestinian. He’s a weak one.” pic.twitter.com/pi9leLCmS8— Pop Base (@PopBase) June 28, 2024 👉అమెరికాలో చరిత్రలో బైడెన్ వంటి అసమర్థ నాయకుడిని ఎన్నడూ చూడలేదు: ట్రంప్ Donald Trump and Joe Biden get into an argument over golfing skills during the Presidential debate. pic.twitter.com/guuYjcLUSn— Pop Base (@PopBase) June 28, 2024 👉 ఉక్రెయిన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారు. 👉 చర్చ సందర్భంగా ఇరువురూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్ లూసర్ అంటూ బైడెన్ అన్నారు. Joe Biden calls Donald Trump a ‘sucker’ and ‘loser’ during the Presidential debate while defending his son. pic.twitter.com/ZpvyZv1DlM— Pop Base (@PopBase) June 28, 2024 👉ఆప్ఘనిస్థాన్ విషయంలో బైడెన్ తీసుకున్న చర్యల కారణంగా 13 మంది అమెరికా భద్రతా సిబ్బంది అమరులయ్యారని ట్రంప్ ఆరోపించారు. అమెరిక్లను కాపాడటంలో బైడెన్ దారుణంగా విఫలమయ్యారు. I can’t believe Joe Biden is actually BOASTING about his Afghanistan withdrawal. 13 servicemembers were kiIIed during his disastrous withdrawal!REMEMBER THEIR NAMES!Johanny Rosario PichardoNicole L. GeeDarin T. HooverHunter LopezDaegan W. PageHumberto A. SanchezDavid L.… pic.twitter.com/uQPHRrghPv— Libs of TikTok (@libsoftiktok) June 28, 2024 👉 ట్రంప్నకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనన్న జో బైడెన్. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు. Joe Biden just declared that every single person who votes for Trump is voting against American democracy. He just vilified well over half the country. This is the most disgraceful thing he has said on the stage tonight. pic.twitter.com/KoEOqP9Z6U— Riley Gaines (@Riley_Gaines_) June 28, 2024 👉ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చ మొదలైంది.👉ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ఫ్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15%కి పెరిగింది, ఇది భయంకరమైనది అన్నారు. 👉దీనికి ప్రతిగా ట్రంప్ మాట్లాడుతూ.. చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్ పరిపాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమవలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్భణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. 👉చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. 👉అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాడీవేడి చర్చా కార్యక్రమం జరుగుతోంది. ఇరువురు నేతలు ముఖాముఖి డిబెట్లో పాల్గొన్నారు.👉అమెరికా చర్రితలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు.
పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?
డార్లింగ్ ప్రభాస్ హిట్ కొట్టేశాడు. 'కల్కి'తో వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్కి ముందు అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వస్తున్న టాక్ చూస్తుంటే తొలిరోజు వసూళ్లతో పాటు ఓవరాల్ కలెక్షన్స్లోనూ సరికొత్త రికార్డులు నమోదు కావడం గ్యారంటీ అనిపిస్తుంది. సినిమా సూపర్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ తన కామెడీ టైమింగ్ ప్లస్ యాక్షన్తో అదరగొట్టాడు. కానీ చాలామంది మూవీలో ఓ విషయం మాత్రం సరిగా గమనించలేదేమో!(ఇదీ చదవండి: ‘కల్కి 2898 ఏడీ’ మూవీ రివ్యూ)ప్రభాస్ పేరులో చిన్న మార్పు చోటు చేసుకుంది. అవును మీరు విన్నది నిజమే. 'కల్కి' సినిమా చూడాలనే ఆత్రుత వల్లో ఏమో గానీ ఇటు ప్రేక్షకులు అటు ఫ్యాన్స్ దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ టైటిల్స్లో ప్రభాస్ బదులు 'శ్రీ ప్రభాస్' అని పడింది. అయితే దీన్ని గౌరవ సూచకంగా పెట్టారా? లేదంటే న్యూమరాలజీ ప్రకారం పేరుకి ముందు శ్రీ అని జోడీంచుకున్నాడా అనేది మరో మూవీ వస్తే క్లారిటీ వచ్చేస్తుంది.ఏ పేరు మార్చినా సరే ఫ్యాన్స్కి మాత్రం ప్రభాస్ ఎప్పుడూ ప్రభాస్ డార్లింగే. ఇకపోతే మూవీలో మహాభారతం ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. టైటిల్స్ పడేటప్పుడు వచ్చే సీన్స్తో పాటు చివర్లో వచ్చే సన్నివేశాలు వావ్ అనిపించాయి. 3 గంటల సినిమాలో దాదాపు 30 నిమిషాలు మహాభారతం ట్రాక్ పెట్టారు. ఇందులో అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ, ప్రభాస్ కనిపించారు. వీళ్ల గెటప్స్ అయితే అలా అందరికీ నచ్చేసేయంతే!(ఇదీ చదవండి: 'కల్కి' గెస్ట్ రోల్స్లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు)
కోహ్లి ఫైనల్లో ఫామ్లోకి వస్తాడు.. టైటిల్ గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం: రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సహచర ఓపెనర్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత వరల్డ్కప్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్న నేపథ్యంలో హిట్మ్యాన్ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. కోహ్లి నాణ్యమైన ప్లేయర్ అని రోహిత్ కితాబునిచ్చాడు. కోహ్లి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసని అన్నాడు. ఫామ్ కోల్పోవడం తాత్కాలికమని తెలిపాడు. 15 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడిన వ్యక్తికి ఫామ్ను తిరిగి దొరకబుచ్చుకోవడం పెద్ద సమస్య కాదని అన్నాడు. ఫైనల్ కోసం కోహ్లి తన ఫామ్ను దాచిపెట్టుకున్నాడని పేర్కొన్నాడు.ఇంగ్లండ్ను మట్టికరిపించి ఫైనల్కు అర్హత సాధించిన అనంతరం రోహిత్ మరిన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్ సెర్మనీ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ గెలుపు చాలా సంతృప్తినిచ్చింది. ఈ మ్యాచ్ను ఇలా (ఏకపక్షంగా) గెలవడానికి ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఛాలెంజింగ్గా ఉన్న పరిస్థితులను మేము స్వీకరించాము. టోర్నీ ఆరంభం నుంచి ఇదే మా విజయ రహస్యం. బౌలర్లు, బ్యాటర్లు పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి అందుకు అనుగుణంగా ఆడారు. ఓ దశలో 140-150 స్కోర్కే పరిమితమవుతానుకున్నాం. నేను, సూర్య మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో 170 పరుగుల మార్కును తాకగలిగాం. ఈ పిచ్పై ఇది చాలా మంచి స్కోర్. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అక్షర్, కుల్దీప్ మా గన్ స్పిన్నర్స్. వీరిద్దరు ప్రత్యర్దిపై ఒత్తిడి తెచ్చారు. బుమ్రా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అతను మా మ్యాచ్ విన్నర్. మ్యాచ్ మొత్తంలో మేము చాలా కామ్గా ఉన్నాం.ఇలా ఉంటే మంచి నిర్ణయాలు తీసుకోగలం. మేమె ఏ దశలోనూ ఆందోళన చెందలేదు. ఇదే మమ్మల్ని గెలిపించింది. ఫైనల్లో ఇదే తరహాలో నాణ్యమైన క్రికెట్ ఆడాలని అనుకుంటున్నాం. అందు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తాం. ప్రస్తుతం జట్టు మంచి షేప్లో ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఫైనల్లోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నానని రోహిత్ అన్నాడు.కాగా, ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం, ఆప్తుల నుంచి ధనలాభం
మేషం: నూతనోత్సాహం. పనులలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖుల పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.మిథునం: శ్రమకు ఫలితం కనిపించదు. వ్యవహారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.కర్కాటకం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కొత్త బాధ్యతలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం.సింహం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు.తుల: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో మార్పులు.వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అదనపు బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం.ధనుస్సు: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపార వృద్ధి.మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం: కొత్త ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. శుభవార్తలు.మీనం: శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన రో'హిట్'మ్యాన్ శర్మ.. రికార్డులు బద్దలు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్తో నిన్న (జూన్ 27) జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో తాను చేసిన 57 పరుగుల్లో 6 ఫోర్లు బాదిన హిట్మ్యాన్.. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలు బాదిన (43 మ్యాచ్ల్లో 113) ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే (111) రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్లో రెండు సిక్సర్లు కూడా బాదిన రోహిత్.. క్రిస్ గేల్ (63) తర్వాత టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో 50 సిక్సర్లు మార్కు తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మరో రెండు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక సిక్సర్లు (22) బాదిన ఆటగాడిగా.. భారత కెప్టెన్గా 5000 పరుగుల మైలురాయిని దాటిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సిక్సర్లుక్రిస్ గేల్- 63రోహిత్ శర్మ- 50జోస్ బట్లర్- 43డేవిడ్ వార్నర్- 40యువరాజ్ సింగ్- 33విరాట్ కోహ్లి- 33టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక బౌండరీలురోహిత్ శర్మ- 113జయవర్దనే- 111విరాట్- 105వార్నర్- 103తిలకరత్నే దిల్షన్- 101భారత కెప్టెన్గా అత్యధిక పరుగులువిరాట్- 12883ధోని- 11207అజహారుద్దీన్- 8095గంగూలీ- 7643రోహిత్- 5012ఐసీసీ నాకౌట్స్లో అత్యధిక సిక్సర్లురోహిత్ శర్మ- 22క్రిస్ గేల్- 21ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్కు చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (57), సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ యాదవ్ (4-0-19-3), అక్షర్ పటేల్ (4-0-23-3), బుమ్రా (2.4-0-12-2) భారత విజయంలో కీలకపాత్రలు పోషించారు. భారతకాలమానం రేపు (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
ఆగని టీడీపీ అరాచకం
సాక్షి నెట్వర్క్: టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి ఘర్షణల్ని కొనసాగిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది దౌర్జన్యం చేయడానికే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై 20 రోజులు దాటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు విధ్వంసకాండ ఆపకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. బుధవారం రాత్రి, గురువారం సైతం శిలాఫలకాల ధ్వంసం వంటి ఘటనలు కొనసాగాయి. తిరుపతిలో ఆగని విధ్వంసం తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు శిలాఫలకాన్ని బుధవారం రాత్రి టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటి మేయర్ భూమన అభినయ్రెడ్డి తిరుపతి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్లో భాగంగా 22 రోడ్లను నిర్మించారు. ప్రతి మాస్టర్ ప్లాన్ రోడ్డుకు కవులు, మహానీయుల పేర్లు పెట్టారు. అందులో భాగంగానే తిరుపతి జీవకోన ప్రధాన మార్గంలోని సత్యనారాయణపురం మాస్టర్ ప్లాన్ రోడ్డుకు ‘విరజా మార్గం’గా నామకరణం చేసి అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు రెచ్చిపోయి అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన టీడీసీ నేతలు ఇలా కక్ష సాధింపులకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ చర్యతో ఇరువాడలో ఉద్రిక్తత సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలను ఎందుకు పెట్టలేదంటూ సచివాలయ సిబ్బందిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటన అచ్యుతాపురం మండలం ఇరువాడలో గురువారం చోటుచేసుకొంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గునపాలతో శిలాఫలకాలు ధ్వంసం చేసి పెకలించడంతో సచివాలయ సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ ఘటనకు పాల్పడంతో వీడియోల ఆధారంగా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.వైఎస్ జగన్ ఫొటో ధ్వంసం వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె రైతు భరోసా కేంద్రం భవనంపై నవరత్నాలు పేరుతో ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఫొటోను రాళ్లతో పగులగొట్టారు. కావాలనే టీడీపీ కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ యువనేతపై హత్యాయత్నంబీరు సీసాలు, మారణాయుధాలతో దాడి పాకాలలో చిత్తూరు రౌడీ గ్యాంగ్ బీభత్సం చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ అరాచకాలు పాకాల: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో చిత్తూరు నుంచి దిగుమతి అయిన రౌడీమూకల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం రాత్రి పాకాల మండల వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు (చంటి)పై చిత్తూరు నుంచి బైకులపై వచ్చిన ఐదుగురు సభ్యుల రౌడీ గ్యాంగ్ బీరు సీసాలు, మారణాయుధాలతో దాడిచేసి అతడిని హతమార్చేందుకు యత్నించారు. యుగంధర్ తలను బీరు బాటిల్తో పగులగొట్టారు. మారణాయుధాలతో ఒళ్లంతా గాయాలు చేశారు. ‘మా అన్న పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీకి పనిచేస్తావా.. నిన్ను చంపితే దిక్కెవరు’ అంటూ ఇష్టారాజ్యంగా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నుగారిపల్లి సమీపంలోని తన మామిడి తోటలో ఉండగా.. గుర్తు తెలియని ఐదుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై తోటలోకి చొరబడి హతాయత్నం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడి తోటలోని తన గెస్ట్హౌస్లో ఉన్న గృహోపకరణాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగితే ప్రాణాలతో ఉంచబోమని బెదిరించారని తెలిపారు. చిత్తూరు నుంచి కిరాయి మూకలను రప్పించి వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేయించి ఓ నేత పైశాచిక ఆనందం పొందుతున్నాడని బాధితుడు మండిపడ్డాడు.ఇది ప్రజాస్వామ్యమా .. అరాచకమా?దాడులపై హ్యూమన్రైట్స్ కమిషన్ స్పందించాలి మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు సాక్షి,అమరావతి/ రైల్వేకోడూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 25 రోజులుగా కొనసాగిస్తున్న అరాచకాలు, విధ్వంసాలు, దాడులు, దాషీ్టకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక అరాచక రాజ్యంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు. తమకు ఊహ వచి్చనప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదని తెలిపారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఇలా ప్రజలపై జరుగుతున్న దాడులపై హ్యూమన్రైట్స్ కమిషన్ తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని కోరారు. పేదల ఇళ్లు కూల్చివేత దుర్మార్గం.. ఎస్టీ కాలనీ వాసుల ఇళ్లను రెవెన్యూ, ఏపీఎండీసీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం దుర్మార్గమని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓబులవారిపల్లె మండలం మంగంపేటకాపుపల్లె ఎస్టీ కాలనీ వాసుల గృహాలను బుధవారం జేసీబీతో అధికారులు కూల్చి వేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లల్లో బాలింతలు, వృద్ధులు, చిన్నపిల్లలున్నారని చూడకుండా తెల్లవారుజామున జేసీబీలతో నేలమట్టం చేయడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం
చివరి దశకు ‘పీసీసీ’ కసరత్తు!
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు.. పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు గురువారం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఢిల్లీలో విస్తృతంగా చర్చలు.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో మూడు రోజులుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా చర్చలు జరిగాయి. తొలుత రాçష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబులతోపాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేశ్గౌడ్, బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, సురేశ్ షెట్కార్, సంపత్కుమార్ తదితరులు కూడా మున్షీతో భేటీ అయి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ నేతలంతా ఢిల్లీలో రేవంత్తో కూడా భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాం«దీని మహేశ్గౌడ్, మధుయాష్కీ విడివిడిగా కలసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కలవాలని ఆమె సూచించడంతో.. ఈ ఇద్దరు నేతలు అక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తోనూ చర్చించారు. తెలంగాణ భవన్లో భట్టి, ఉత్తమ్, శ్రీధర్బాబు సైతం ఏ అభ్యరి్థకి మద్దతివ్వాలన్న దానిపై చర్చించారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైనా..పొద్దంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షీ, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒకపేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్ చేసినట్టు తెలిసింది. వారు మహేశ్ గౌడ్, బలరాం నాయక్ అయి ఉంటారని.. వీరిలోంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నేపథ్యంలో ఆశావహుల పేర్లపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.తొలి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం: భట్టి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యవహారాలతోపాటు కేబినెట్ విస్తరణపై కేసీ వేణుగోపాల్తో చర్చించామని చెప్పారు. కాంగ్రెస్లో చేరికల అంశంపైనా చర్చ జరిగిందని.. అయితే కాంగ్రెస్లో మొదటి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరామని వివరించారు.
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి
- జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్గా టాలీవుడ్ హీరో
- మెదక్లో రోడ్డు ఘోర ప్రమాదం
- మూడు రోజులు వర్షాలే!
- T20 WC: బాధలో విరాట్ కోహ్లి.. ఓదార్చిన ద్రవిడ్! వీడియో వైరల్
- వైఎస్సార్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి
- రాష్ట్రంలో పేట్రేగిపోతున్న వ్యక్తిత్వ హంతకులు
- ఐఎస్ఎస్ను కూల్చేయనున్న స్పేస్ఎక్స్
- కూల్చివేతలపై ముగిసిన వాదనలు
- జాబ్ కేలండర్ ఏమైంది?
- T20 WC 2024: సెమీస్లో ఇంగ్లండ్ చిత్తు.. ఫైనల్కు టీమిండియా
సినిమా
ప్రభాస్ కల్కి మూవీ.. ఈ పోస్ట్ చూస్తే చాలు.. ఆయన ఎంత కష్టపడ్డాడో!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్, విజువల్ వండర్ 'కల్కి 2898 ఏడీ. అత్యంత భారీ బడ్జెట్తో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం రిలీజైంది. ఉదయం నుంచే ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ సందడి మొదలైంది. మొదటి రోజే కల్కి సినిమా పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.అయితే కల్కి సినిమాకు తెరెకెక్కించేందుకు దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడ్డారు. ఇప్పటికే ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డామని.. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మూవీ కోసం తాను కష్టపడ్డాడో అది చూస్తేనే అర్థమవుతోంది.తాజాగా తన అరిగిపోయిన చెప్పులను ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశారు. ఇది ఒక సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణం అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. కాగా.. కల్కి చిత్రంలో అగ్రతారలైన కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశాపటానీ లాంటి స్టార్స్ నటించారు. రాజమౌళి, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిశారు. View this post on Instagram A post shared by nagi (@nag_ashwin)
దసరా రేస్లో నిలిచిన భారీ బడ్జెట్ చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. ఈ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు సూర్య ట్వీట్ చేశారు. కాగా.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు టాక్ వినిపించింది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ను తెరకెక్కించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. Dear all It’s 10th October 2024#KanguvaFromOct10 @directorsiva @DishPatani @thedeol @ThisIsDSP @vetrivisuals #MilanArtDir @GnanavelrajaKe @StudioGreen2 @UV_Creations @KvnProductions @PenMovies #PenMarudhar @jayantilalgada @NehaGnanavel @saregamasouth pic.twitter.com/qPkwuSOJmS— Suriya Sivakumar (@Suriya_offl) June 27, 2024
ప్రభాస్ను ఇలా ఎప్పుడు చూడలేదు: కల్కిపై ఆర్జీవీ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది. దీంతో ప్రభాస్ సక్సెస్ను థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీపై సంచలన డైరెక్టర్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ను కొనియాడారు. నీ ఆశయం, ఊహలకు నా అభినందనలు. ఇందులో అమితాబ్ బచ్చన్ వందరెట్లు ఎక్కువగా కనిపించారు. ప్రభాస్ను ఇంతకు ముందెప్పుడు ఇలాంటి లుక్లో చూడలేదు. అదేవిధంగా తొలిసారి నాకు నటించేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ఇవాళ రిలీజైన కల్కి చిత్రంలో ఆర్జీవీ అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ స్టార్స్ సైతం ఈ సినిమాలో మెరిశారు.Hey @nagashwin7 KUDOS to ur AMBITION and IMAGINATION .. @srbachchan is a 100 times more dynamic than ever and #prabhas is in a never before seen avatar and AHEM 😌also THANKS for giving me my acting DEBUT 😌#Kalki2898— Ram Gopal Varma (@RGVzoomin) June 27, 2024
ప్రభాస్ అంటే వేరే లెవెల్.. ఇక మాటల్లేవ్: కృష్ణం రాజు భార్య క్రేజీ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది.తొలి రోజే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి(కృష్ణంరాజు భార్య) హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో కల్కి మూవీని వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె కల్కి సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఫైట్స్ వేరే లెవెల్.. ఇక మాటల్లేవ్ అంటూ థియేటర్ వెలుపల మాట్లాడారు. ప్రభాస్ 1000 రెబల్ స్టార్స్తో సమానమని ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న బుజ్జి కారుపై కూర్చొని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఫొటోలు
స్వీట్ రివెంజ్.. ఇంగ్లండ్ చిత్తు.. టీ20 ఫైనల్కు భారత్ (ఫొటోలు)
Anna Ben: కల్కి బ్యూటీ టాప్ లుక్స్.. ఓసారి చూసేయండి (ఫోటోలు)
యూత్కి పిచ్చిగా నచ్చేసిన 'కల్కి' బుజ్జి.. ఐమాక్స్లో స్పెషల్ అట్రాక్షన్..(ఫోటోలు)
లండన్లో మహేష్ ఫ్యామిలీ మేజికల్ మూమెంట్స్ (ఫోటోలు)
బిగ్బాస్లో నటి లవ్.. పెళ్లయిన 8 ఏళ్లకు పేరెంట్స్గా ప్రమోషన్! (ఫోటోలు)
క్రీడలు
ఎనిమిదేళ్ల తర్వాత...
లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నీలో ఈక్వెడార్ జట్టు ఎనిమిదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‘బి’లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్లో ఈక్వెడార్ 3–1తో నెగ్గింది. 13వ నిమిషంలో జమైకా ప్లేయర్ కేసీ పాల్మెర్ సెల్ఫ్ గోల్తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది. కెండ్రీ పెజ్ (45+4వ ని.లో) గోల్తో ఈక్వెడార్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 54వ నిమిషంలో ఆంటోనియో జమైకాకు తొలి గోల్ అందించాడు. అలాన్ మిండా (90+1వ ని.లో) గోల్తో ఈక్వెడార్ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్లో వెనిజులా 1–0తో మెక్సికోను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది.
T20 WC 2024: సెమీస్లో ఇంగ్లండ్ చిత్తు.. ఫైనల్కు టీమిండియా
టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో టీమిండియా అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఈ విజయంతో గత టీ20 వరల్డ్కప్ సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఆరంభంలోనే ఔటైనప్పటికి కెప్టెన్ రోహిత్ శర్మ(57), సూర్యకుమార్ యాదవ్(47) అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ఆఖరిలో హార్దిక్ పాండ్యా(23), జడేజా(17), అక్షర్ పటేల్(10) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టగా.. రషీద్, అర్చర్, టాప్లీ, కుర్రాన్ తలా వికెట్ సాధించారు.తిప్పేసిన స్పిన్నర్లు..అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బౌలర్ల దాటికి 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తిప్పేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరితో పాటు జస్ప్రీత్ బుమ్రా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(25) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక జూన్ 29న బార్బోడస్ వేదికగా జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది.జ
వారెవ్వా బుమ్రా.. ఏమైనా బాల్ వేశాడా! దెబ్బకు సాల్ట్ ఫ్యూజ్లు ఔట్(వీడియో)
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తాజాగా ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లండ్తో సెకెండ్ సెమీఫైనల్లో బుమ్రా కళ్లు చెదిరే బంతితో మెరిశాడు. ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ను బుమ్రా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన బుమ్రా బ్యాటర్లతో మైండ్ గేమ్స్ ఆడాడు. బుమ్రా తొలి రెండు బంతులను మొయిన్ అలీకి స్లో డెలివరీలగా సంధించాడు. మొయిన్ రెండో బంతికి సింగిల్ తీసి సాల్ట్కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని ఫుల్ పేస్తో బౌల్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో బంతి స్లో డెలివరీగా వస్తుందని భావించిన సాల్ట్కు బుమ్రా ఊహించని షాకిచ్చాడు. బుమ్రా నాలుగో డెలివరీని ఫుల్ పేస్తో పర్ఫెక్ట్ ఆఫ్-కట్టర్గా బుమ్రా సంధించాడు.దీంతో సాల్ట్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా కట్ అయి లెగ్స్టంప్ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా సాల్ట్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia)
T20 WC: బాధలో విరాట్ కోహ్లి.. ఓదార్చిన ద్రవిడ్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. టీ20 వరల్డ్కప్ సెమీఫైనల్స్లో విరాట్కు మంచి రికార్డు ఉండడంతో ఈ ఏడాది కూడా సత్తాచాటుతాడని అభిమానులు భావించారు. కానీ గయనా వేదికగా ఇంగ్లండ్తో సెమీఫైనల్లో కోహ్లి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో నిరాశతో కోహ్లి తన బ్యాట్ను పంచ్ చేస్తూ పెవిలియన్కు చేరాడు. అనంతరం డ్రెస్సింగ్ రూమ్లో కూడా కోహ్లి తన సహచరులతో దిగులుగా కూర్చోన్నాడు. ఊబికి వస్తున్న కన్నీరును ఆపునకుంటూ విరాట్ మ్యాచ్ను వీక్షించాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ వద్దకు వెళ్లి భుజం తట్టి ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లి 75 పరుగులు మాత్రమే చేశాడు. అందులో రెండు డక్లు కూడా ఉన్నాయి. Rahul dravid went to Virat as he was looking broken after that dismissal, can't see him like this man 💔 #INDvsENG pic.twitter.com/X0nPoSdF5s— a v i (@973Kohli) June 27, 2024
బిజినెస్
యూజర్లకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్
భారతీయ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ జియో తన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఈ ప్లాన్స్ జులై 3నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్లతో పోలిస్తే కొత్తగా అమలులోకి వచ్చే ప్లాన్స్ ధరలు 20శాతం ఎక్కువ.కంపెనీ వెల్లడించిన డేటా ప్రకారం.. జులై 3నుంచి 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరుతుంది. దీనికి సంబంధించిన వివరాలను జియో అధికారికంగా వెల్లడించింది.జియో మొత్తం మీద 2 పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు, 17 ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఒక్కసారిగా పెంచుతూ ప్రకటించింది. జియో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఉంది. కొత్త రీఛార్జ్ ధరలు తప్పకుండా యూజర్ల మీద భారం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r— ANI (@ANI) June 27, 2024
మంచిమాట చెప్పిన నితిన్ గడ్కరీ: రోడ్లు బాగుంటేనే..
టోల్ గేట్ వద్ద వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్ట్యాగ్ విధానం ప్రవేశపెట్టారు. ఈ విధానానికి కేంద్రం త్వరలోనే మంగళం పాడనుంది. ఫాస్ట్ట్యాగ్ స్థానంలో శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. అంతే కాకుండా.. రోడ్లు సరిగా లేకుంటే హైవే ఏజెన్సీలు టోల్ వసూలు చేయకూడదని గడ్కరీ ఇటీవల స్పష్టం చేశారు.నాణ్యమైన సేవలు అందించని పక్షంలో మీరు టోల్ వసూలు చేయకూడదని గ్లోబల్ వర్క్షాపులో నితిన్ గడ్కరీ హైవే ఏజెన్సీలకు క్లారిటీ ఇచ్చారు. నాణ్యమైన రోడ్లు లేకుండానే టోల్ వసూలు చేస్తే.. ప్రభుత్వం మీద ప్రజలకు కోపం వస్తుంది. నాణ్యమైన సేవలను అందించినప్పుడే టోల్ వసూలు చేయాలని పేర్కొన్నారు.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ట్యాగ్ వ్యవస్థను గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తోంది. ప్రారంభంలో ఈ విధానం కొంత దూరానికి మాత్రమే పరిమితం చేసి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత అన్ని హైవేల మీద ఇదే వ్యవస్థను అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఆరేళ్లుగా అందని డెలివరీ.. ఇన్నాళ్లకు స్పందించిన ఫ్లిప్కార్ట్
ఏదైనా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. రెండు మూడు రోజులు లేదా ఓ పది రోజులలో డెలివరీ అయిపోతుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రమే వింత అనుభవం ఎదురైంది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. దీంతో యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి 2018 మే 16న ఫ్లిప్కార్ట్లో ఓ జత చెప్పులు ఆర్డర్ చేశారు. వీటి ధర 485 రూపాయలు. ఆర్డర్ చేసిన తరువాత మూడు రోజుల్లో షిప్పింగ్ అని స్టేటస్లో కనిపించింది. 20వ తేదీన డెలివరీ చేస్తామని వెబ్సైట్లో కనిపించింది. అయితే యూజర్ ఇప్పటి వరకు డెలివరీ పొందలేదు. ప్రతో రోజూ అరైవింగ్ టుడే అని మాత్రం కనిపించేది. మొత్తానికి ఇలా ఆరేళ్ళు గడిచిపోయింది.After 6 yrs @Flipkart called me for this order 😂Asking me what issue I was facing pic.twitter.com/WLHFrFW8FV— Ahsan (@AHSANKHARBAI) June 25, 2024ఆర్డర్ పెట్టిన ఆరు సంవత్సరాలకు అహ్సన్ ఖర్బాయికు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. సమస్య ఏంటని ఆరా తీసింది. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.అహ్సన్ ఖర్బాయి ఆర్డర్ పెట్టినప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారు. కాబట్టి డెలివరీ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆలస్యమైందని క్యాన్సిల్ కూడా చేయలేదు. దీనికి ఫ్లిప్కార్ట్ రిప్లై ఇస్తూ.. మీకు ఎదురైన ఈ అనుభవానికి క్షమించండి, ఇన్ని రోజులు ఎదురు చూటడం గొప్ప విషయం అని పేర్కొంది.I'm really sorry for this experience. Our team has already gotten in touch with you on this and they are looking into your concern related to the recent order. Please be assured that you'll hear from us. Appreciate your patience.— FlipkartSupport (@flipkartsupport) June 26, 2024
లగేజ్ మోసే బాధ లేదు.. ఎంచక్కా అదే వస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనిషి అన్ని పనులను సునాయాసంగా చేసుకోవడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, విమాశ్రయాలలో పైకి ఎక్కడానికి లేదా కిందికి దిగటానికి ఎస్కలేటర్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాడు. లగేజ్ తీసుకెళ్లడానికి కూడా బెల్ట్ కన్వేయర్స్ ఉపయోగిస్తున్నాడు. అయితే ఇవన్నీ చిన్న దూరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అదే ఒక నగరం నుంచి మరో నగరానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లగేజ్ తీసుకెళ్లే అవకాశం ఉంటే? నిజంగా ఇది వినటానికే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదూ..! దీన్ని నిజం చేయడానికే జపాన్.. సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది.జపాన్ గవర్నమెంట్ ప్రధాన నగరాల్లో ఆటోమేటెడ్ జీరో ఎమిషన్స్ లాజిస్టిక్స్ లింక్లను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది అమలులోకి వస్తే.. ఒక వ్యక్తి తన లగేజిని ప్రత్యేకంగా తనతోపాటే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్ట్ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయన్నమాట.ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే లగేజీని మనతో పాటు తీసుకెళ్లాలి. కానీ కన్వేయర్ బెల్ట్ ఉంటే.. లగేజ్ అక్కడ ఇచ్చేసి మీరు హ్యాపీగా విజయవాడ వెళ్లిపోవచ్చు. లగేజీని దొంగలు తీసుకెళ్లారని భయంగానీ.. ఎక్కడైనా మరచిపోతామేమో అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ నిర్వాహకులు లేదా అధికారులు ఆ లగేజీని గమ్యానికి చేరుస్తారు. మీరు మళ్ళీ అక్కడ తీసుకుంటే సరిపోతుంది.జపాన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి గత ఫిబ్రవరి నుంచి చర్చలు జరుపుతోంది. ఇది 2034 నాటికి అమలులోకి వస్తుందని సమాచారం. మొదటి లింక్ టోక్యో నుంచి ఒకసా మధ్య ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చిన తరువాత లక్షల టన్నుల బరువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు.టోక్యో నుంచి ఒకసా నగరాల మధ్య సుమారు 500 కిమీ దూరాన్ని కవర్ చేయడానికి భారీ కన్వేయర్ బెల్ట్లను ఏర్పటు చేస్తారు. ఈ బెల్ట్ కన్వేయర్స్ హైవేల పక్కన, సొరంగాలు మార్గాల్లో కొనసాగుతుంది. ఇది మొత్తం డ్రైవర్లెస్ టెక్నాలజీతో రూపొందుతుంది. ఇందులో కార్గోలు లగేజీని సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తాయి. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా డ్రైవర్స్ అవసరం లేదు.ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చడానికి మంత్రిత్వ శాఖ ప్రైవేట్ కంపెనీలకు పిలుపునిచ్చింది. ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని రవాణా & పర్యాటక మంత్రి టెట్సువో సైటో పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇది అద్భుతమైన టెక్నాలజీ అనే చెప్పాలి. ఇలాంటి సదుపాయాన్ని మన దేశంలో కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది.
వీడియోలు
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పిన్నెల్లి అరెస్ట్ పై గోపిరెడ్డి రియాక్షన్
చంద్రబాబుపై అంబటి రాంబాబు సంచలన కామెంట్స్
వివాహిత మహిళలకు నో జాబ్..
మూడు రోజులు భారీ వర్షాలు
బాబు భద్రత కోసం 1800 మంది సిబ్బందా..!
హరీష్ రావు ట్రాప్ లో కేసీఆర్..
అప్పు కష్టాలు: పెట్టుబడి ఖర్చుల కోసం అన్నదాత అగచాట్లు
భారీగా పెరుగుతున్న డయేరియా కేసులు
రామోజీ బ్రతికుండగానే సమాధి కట్టుకున్నాడు.. ఎందుకంటే ?
ఫ్యామిలీ
లండన్లో మహేష్ ఫ్యామిలీ మేజికల్ మూమెంట్స్ (ఫోటోలు)
భారతీయుల్లో సగంమంది అన్ఫిట్టే! 60 ఏళ్లు పైబడినవారు బెటర్!
మన దేశంలో దాదాపు సగంమంది ఫిజికల్గా ఫిట్గా లేరట. భారతీయుల్లో 50 శాతం మంది శారీర శ్రమ అన్న ఊసే ఎత్తడం లేదని తేలింది. గ్లోబల్ హెల్త్ జర్నల్ లాన్సెట్ నిర్వహించిన స్టడీలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, 2022లో భారతదేశంలోని దాదాపు 50శాతం మంది తగినంత వ్యాయామం చేయడం లేదు. కనీసం వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదని తేలింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సూచనల ప్రకారం, పద్దెనిమిదేళ్లు పైబడిన వారు(అడల్ట్స్) వారానికి 150 నిమిషాలు మోస్తరు ఫిజికల్ యాక్టివిటీ లేదంటే 75 నిమిషాలు తీవ్రమైన ఫిజికల్యాక్టివిటీ చేయాలి. దీన్ని ఆధారంగా చేసుకుని 2000-2022 మధ్యకాలంలో 197 దేశాల్లో లాన్సెట్ సర్వే చేసింది. దక్షిణాసియా ప్రాంతంలో మహిళల్లో తగినంత శారీరక శ్రమ లేకపోవడం పురుషుల కంటే సగటున 14శాతం ఎక్కువ. 42 శాతంగా పురుషులతో పోలిస్తే, తగిన శారీరక శ్రమ చేయని మహిళల సంఖ్య 57శాతంగా ఉంది.అంతేకాదు 2000 సంవత్సరంలో 22శాతం భారతీయులు శారీరంగా దృఢంగా ఉండగా, 2010 నాటికి ఇది 34 శాతానికి, 2022 నాటికి 50 శాతానికి పెరిగిందని తెలిపింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 60 శాతం దాటుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా, 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న స్త్రీపురుషులిరువురిలోనూ శారీరక శ్రమ పెరగడం గమనార్హం.కాగా, ప్రపంచవ్యాప్తంగా 31.3 శాతం మంది పెద్దలు (18 ఏళ్లు పైబడిన వారు) ఫిజికల్లీ అన్ ఫిట్గా ఉన్నారని స్టడీలో తేలింది. ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఆసియా పసిఫిక్ రీజియన్, రెండో స్థానంలో దక్షిణాసియా ఉందని లాన్సెట్ పరిశోధకులువెల్లడించారు.
అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
మనిషి ఆరోగ్య జీవనానికి నిద్ర చాలా అవసరం. ఆహారంతో పాటు రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి. లేదంటే అనేక ప్రమాదకరమైన అనారోగ్యాల్ని కొని తెచ్చుకున్నట్టే ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే అర్థరాత్రి దాకా మెలకువతో ఉండటం మాత్రమే కాదు, ఎక్కువ వెలుగులో ఉన్నా ప్రమాదమేనని తాజా అధ్యయనం చెబుతోంది.85వేల మంది వ్యక్తులపై జరిపిన భారీ అధ్యయనంలో, ఫ్లిండర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రాత్రిపూట కాంతికి ఎక్స్పోజ్ కావడం మూలంగా (పగటిపూట కార్యకలాపాలతో సంబంధం లేకుండా) టైప్-2 మధుమేహం ముప్పును పెంచుతుందని గుర్తించారు.రాత్రి ఆలస్యంగా నిద్రకుపక్రమించడం వల్ల సిర్కాడియన్ రిథమ్ దెబ్బతింటుందని ఇది జీవక్రియలో మార్పులకు దారితీస్తుందని కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత ఆండ్రూ ఫిలిప్స్ తెలిపారు. ఇన్సులిన్ స్రావం, గ్లూకోజ్ జీవక్రియ మార్పుల కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ఇది ప్రభావితం చేస్తుందని, చివరికి టైప్-2 డయాబెటిస్కి దారి తీస్తుందని తెలిపారు. 2013 -2016 మధ్య కాలంలో యూకే బయెబ్యాంకు డాటాతో, ఒక వారం పాటు మణికట్టు కాంతి సెన్సార్లను ధరించి 84,790 మంది ఈ స్టడీలో పాల్గొన్నారు. తొమ్మిదేళ్ల తర్వాత అంచనాల ప్రకారం 13 మిలియన్ గంటల లైట్-సెన్సర్ డేటాతో తరువాతి జీవితంలో మధుమేహం వచ్చే ప్రమాదం 67శాతంఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జీవనశైలి, షిఫ్ట్ డ్యూటీలు, సమయానికి నిద్రపోకపోవడం లాంటివి షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయన్న విషయాన్ని పరిగణనలో తీసుకున్న పరిశోధకులు, అర్థరాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువ కాంతికి ప్రభావితమవ్వడం కూడా అనారోగ్య సమస్యల్ని మరింత పెంచుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఎక్కువ లైట్కు ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలని, తద్వారా టైప్-2 మధుమేహం ముప్పు నుంచి తప్పించు కోవచ్చని సూచించారు.రాత్రి సమయంలో ప్రకాశవంతమైన వెలుగులో ఉండటం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువని ఫిలిప్స్ తెలిపారు. లైట్ ఎక్ప్పోజర్కి, మధుమేహం ముప్పుకు ఉన్న సంబంధాన్ని తమ పరిశోధనలో గుర్తించామన్నారు. సో.. ఈ తరహా డయాబెటిస్ నుంచి తప్పించు కోవాలంటే రాత్రిపూట పని చేసేటపుడు, ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవడం లేదా సాధ్యమైనంత చీకటి వాతావరణాన్ని సృష్టించుకోవడం సులభమైన మార్గమని సూచించారు.
వెంటాడి వేటాడేసింది.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
విశ్వాసానికి పెట్టింది పేరు శునకం. పెంపుడు జంతువుల్లో బాగా పాపులర్ అయింది కూడా కుక్క. ఇంటి యజమాని, కుటుంబం ఏదైనా అనుకోని ప్రమాదంలో పడినపుడు చాకచక్యంగా వ్యవహరించి కాపాడుతుంది. ఒక్కోసారి ప్రాణాలకు తెగించి మరీ విశ్వాసాన్ని చాటుకుని హ్యాట్సాఫ్ అనిపించుకున్న ఘటనలు చాలానే చూశాం. అయితే పగబట్టి, వెంటాడి వేటాడిన ఘటనలు చాలా అరుదు కదా. ఇలాంటి ఘటన ఒకటి అట్లాంటాలో చోటు చేసుకుంది.వివరాలను పరిశీలిస్తే..తన యజమాని కుటుంబానికి చెందిన గొర్రెలు, మేకల మందకు కాపలాగా ఉంది ఒక కుక్క. దాని పేరు కాస్పర్. ఒకరోజు గొర్రెలమందపై ఒక్కసారిగా 13 తోడేళ్ల గుంపు (కొయెట్, అమెరికన్ జాకల్) దాడి చేసింది దీంతో అక్కడే ఉన్న కుక్క వాటిపై ఎటాక్ చేసింది. ఎనిమిదింటిని అక్కడికక్కడే చంపేసింది.Atlanta Dog fights 13 coyotes attacking his sheep. Kills 8 on the spot. Goes missing 4 days. Comes home after killing the remaining 5. Salute 🫡 pic.twitter.com/OYDKhuzscW— trader (@TicTocTick) June 25, 2024ఇంతటితో దాని కోపం చల్లారలేదు. నాలుగు రోజులు అదృశ్యమై, వాటిని వెదికి పట్టుకొని మరీ వేటాడి, మిగిలిన ఐదు తోడేళ్ల పని కూడా పట్టింది. ఆ తర్వాత మాత్రమే ఇంటికి చేరింది. తీవ్ర గాయాలతో ఇంటికి చేరిన దాన్ని చూసి, ఇక బతకదని భావించారట దాని యజమాని వీర్విల్లే. ఆ తరువాత కొంతకాలం లైఫ్లైన్ యానిమల్ ప్రాజెక్ట్ సంరక్షణలో కోలుకుంది హీరో కాస్పర్. గత ఏడాది చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్స్టా,, ఎక్స్లో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
న్యూస్ పాడ్కాస్ట్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
ముఖ్యమంత్రి అంటే ‘కటింగ్ మాస్టరా’?.. తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో ఒకే దఫా రైతుల పంట రుణాల మాఫీ... రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 47 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
బ్యాలెట్టే బెటర్. ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య
సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్పూర్కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
నర్సింహులపేట: తన పేరున భూమి పట్టా మార్పిడి కావడం లేదని, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మహ బూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం హజ తండాకు చెందిన భూక్య బాలు అనే రైతు గురువారం పురుగు మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. తండాలోని 498 సర్వేనంబర్లో తనకు 6 ఎకరాల భూమి ఉందని, అయితే ఆ భూమి భూక్య బాలు, భూక్య భద్రు పేరిట ఉన్నట్లు రికా ర్డులో చూపిస్తోందని, దానిని తన పేరిట పట్టాచేయాలని 6 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాలు అవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పెళ్లి కోసం ఆ భూమి ని అమ్మానని, అయితే తన పేర పట్టాకాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా బాలుకు సంబంధించిన వ్యక్తులు కార్యాలయంలో మా ట్లాడుతుండగానే ఆయన పురుగుమందు డబ్బాతో చెట్టు ఎక్కాడు. సమస్య పరిష్కరి స్తామని తహసీల్దార్ నాగరాజు హమీ ఇవ్వడంతో కిందికి దిగాడు. ›ఈ అంశంపై తహసీల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నమ్మించి నట్టేట ముంచిన ఎన్ఆర్ఐ జంటకు జైలు, భారీ జరిమానా
భారతీయ అమెరికన్ జంటకు అమెరికా కోర్టు భారీ షాకిచ్చింది. పైచదువులు చెప్పిస్తామనిమభ్యపెట్టి అమెరికాకు తీసుకొచ్చి, మైనర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన నేరానికి జైలు శిక్ష విధించింది. అలాగే బాధితుడికి రూ.1.8 కోట్ల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.అమెరికా అటార్నీ తెలిపిన వివరాల ప్రకారం, 2018లో హర్మన్ ప్రీత్ సింగ్, అతడి భార్య కుల్బీర్ కౌర్ దంపతులు బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని తమ బంధువైన కుర్రాడిని, మంచి చదువు , మంచి జీవితం అని తప్పుడు వాగ్దానం చేసి అమెరికాకు తీసుకొచ్చారు. మూడేళ్లపాటు అక్రమంగా నిర్బంధించారు. అతడి డాక్యుమెంట్లను లాగేసుకుని వేధింపులకు పాల్పడ్డారు. వర్జీనియాలోని తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్లో తక్కువ జీతానికి వెట్టి చాకిరీ చేయించు కున్నారు. ఇంటిపని, వంటపని, షాపులో నగదు రిజిస్టర్లు, స్టోర్ రికార్డుల పని ఇలా రోజుకు దాదాపు 12 - 17 గంటల పని. దీనికితోడు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా వేధించారు. వీసా గడువు ముగిసినా ఇండియాకు తిరిగి వెళ్లకుండా అడ్డుకున్నారు. తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను ఇవ్వమని అడిగినప్పుడల్లా జుట్టు పట్టుకొని కొడుతూ దాడికి దిగడమే కాకుండా సెలవడిగితే తుపాకీతో చంపేస్తామని బెదిరించారు. చివరకు కుటుంబ ఆస్తులను లాగేసు కుంటామని, తప్పుడు కేసు పెడతామని కూడా బెదిరించారు.కావాలనే నమ్మించి, యుఎస్కు రప్పించి, ఇమ్మిగ్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకుని, తక్కువ వేతనంతో ఎక్కువ గంటలు పని చేసేలా శారీరక, మానసిక వేధింపులకు గురిచేశారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ వ్యాఖ్యానించారు. తద్వారా బాధితుడి ప్రాథమిక మానవ అవసరాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ అనంతరం హర్మన్ ప్రీత్ సింగ్ కు 11.25 ఏళ్లు, భార్యకు 7.25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితుడికి భారీ పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.
మత్తులో.. చిత్తు కావొద్దు
ఖమ్మం: దేశాభివృద్ధిలో కీలకమైన యువత మాదకద్రవ్యాల బారిన పడుతోంది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఎక్కడ పడితే అక్కడ లభిస్తుండడంతో పదిహేనేళ్ల లోపు పిల్లలు మొదలు యువత వరకు పలువురు మాదకద్రవ్యాలకు బానిసలవుతున్నారని తెలుస్తోంది. మత్తు పదార్థాలు వివిధ రూపాల్లో లభిస్తుండడంతో ధూమపానం, మద్యపానం వంటివి క్రమంగా జీవితంలో భాగమై పలువురు విచక్షణ మరిచి నేరాలకు పాల్పడుతున్నారు.అంతేకాక ఈ అలవాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పడు మారుమూల పల్లెలకు సైతం పాకింది. ఈనేపథ్యాన నేడు(బుధవారం) అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల అధికారులు సిద్ధమవుతున్నారు.విద్యాసంస్థలే లక్ష్యంగా దందా..యువతే టార్గెట్గా ఉమ్మడి జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. కౌమారదశలో ఉన్న విద్యార్ధులు మంచి, చెడు గుర్తించలేక త్వరగా అలవాటయ్యే అవకాశముండడంతో సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న వ్యాపారుల కన్ను వారిపై పడింది. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతించడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇన్నాళ్లు పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో మాదకద్రవ్యాల అమ్మకం, వాడకం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రతిరోజు గంజాయి పట్టుబడుతుండడం.. ప్రతీ పాన్షాపు, కిరాణ షాపుల్లోనూ లభిస్తున్నట్లు తెలుస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.సరదాగా మొదలు.. ఆపై వ్యసనంయుక్తవయస్సు పిల్లల్లో విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. సాహసాలు చేయాలని మనసు ఆరాటపడుతుంటుంది. దీంతో ఇలాంటి వారిని మత్తు పదార్థాలు ఆకర్షించే అవకాశముంది. ధూమపానం, మద్యపానం ఇతర మత్తుపదార్థాలు తొలినాళ్లలో సరదాగా అలవాటవుతున్నా ఆ తర్వాత వ్యసనంలా మారి జీవితాలను నాశనం చేస్తున్నాయి. గంజాయిలో ఉండే టెట్రా హైడ్రోకెనబినాయిడ్(టీహెచ్సీ) రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది.అది మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీయడమే కాక చురుకుదనాన్ని తగ్గిస్తుంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించిన తర్వాత వ్యక్తుల్లో భ్రమలు మొదలై నేరప్రవృత్తి పెరగడంతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు సైతం వస్తుంటాయి. దీంతో తమను తాము గాయపర్చుకోవడమే కాక దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదముంది.తల్లిదండ్రులు గమనించాలి..పిల్లలు, యువత మత్తు పదార్ధాలకు బానిసలు కాకుండా అడ్డుకోవడంలో తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం లేదంటే మౌనంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. ఇలాంటి వారిని నిత్యం పర్యవేక్షిస్తూ వారి గదులు, బ్యాగులను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. అంతేకాక ఎవరిరెవరితో తిరుగుతున్నారో పరిశీలిస్తే అవసరానికి మించి డబ్బు ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని చెబుతున్నారు.మెదడుపై తీవ్ర ప్రభావం..మత్తుపదార్థాల వాడకం సరదాగా ప్రారంభమైనా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. మత్తుపదార్థాలు తీసుకున్న వారి మెదడులో డోపమైన్, సెరటోనిన్ అనే ఉత్ప్రేరకాలు విడుదలవుతాయి. తద్వారా శరీరం ఉత్తేజంగా ఉన్నట్లు అనిపించి.. కాసేపటికి మళ్లీమళ్లీ తీసుకోవాలనిపిస్తుంది. క్రమంగా తీవ్రమైన మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. – డాక్టర్ అప్పారావు ఎండీ, డీఎం (న్యూరాలజీ)అందరూ భాగస్వాములు కావాలి : సీపీ సునీల్ దత్ఖమ్మంక్రైం: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో బుధవారం మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నివర్గాల ప్రజలు యాంటీ డ్రగ్స్ కమిటీల్లో సభ్యులుగా చేరాలని కోరారు.ఈమేరకు వారం పాటు మాదకద్రవ్యాల వినియోగం, దుష్పలితాలపై విద్యాసంస్థల్లో అవగాహన కల్పించడమే కాక ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీపీ తెలిపారు. అలాగే, ఐసీడీఎస్, పోలీస్ శాఖలోని యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యాన బుధవారం ఉదయం 7గంటలకు సర్ధార్ పటేల్ స్టేడియం నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నారు.