Top Stories
ప్రధాన వార్తలు
![YS Jagan Receives Grand Welcome At Pulivendula](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/YS-Jagan.jpg.webp?itok=zJqqoDjU)
అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు.
![Exercise of revision of registration values of lands and properties is over](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/24/TG-REGISTRATION-HIKE-2_0.jpg.webp?itok=FAAK6Sja)
ఎకరం రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్గా జరిగేలా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్ డోర్ నంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది.
![Conspiracy Of Chandrababu Govt To Demolish Another Ysrcp Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/Audio_YSRCP.jpg.webp?itok=gqx85jwl)
మరో వైఎస్సార్సీపీ ఆఫీస్ కూల్చివేతకు టీడీపీ కుట్ర.. బయటపడ్డ సంచలన ఆడియో
సాక్షి, విజయవాడ: టీడీపీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరో వైఎస్సార్సీపీ కార్యాలయం కూల్చివేతకు కుట్రకు తెరతీశారు. సంచలన ఆడియో బయటపడింది. పాత తేదీలతో నోటీసులు ఇవ్వటానికి వస్తున్నట్టు కార్పొరేషన్ సిబ్బంది చెప్పిన ఆడియో వెలుగులోకి వచ్చింది.ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. తాజాగా విజయవాడ ఆఫీస్నీ కూల్చివేసేందుకు కుట్రలు చేస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. పాత తేదీ వేసి నోటీసులు జారీచేస్తామని, తీసుకోవాలంటూ పార్టీ ఆఫీసు నిర్మాణ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు.కాగా, తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది.దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. “విజయవాడ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న మరొక వైయస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేత కుట్రపై బయటపడ్డ సంచలన ఆడియో”తాడేపల్లిలో నిర్మాణం పూర్తికావొచ్చిన వైయస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేసిన తర్వాత ఇప్పడు ఈ పార్టీ ఆఫీసునీ కూల్చివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు. ఈ మేరకు కార్పొరేషన్… pic.twitter.com/HOj5nlm3Fx— YSR Congress Party (@YSRCParty) June 23, 2024
![Ys Jagan Trending Continue After Election On Social Media](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/YS-Jagan-02.jpg.webp?itok=-xaTUVkB)
‘ఓటమి తాత్కాలికమే.. ఎప్పటికీ నువ్వే మా కింగ్’
సాక్షి, గుంటూరు: గత ఐదేళ్ల పాటు ప్రజలకు అన్నీ తానై అండదండగా నిలిచారు వైఎస్ జగన్. ‘ఓటమి తాత్కాలికమే.. ఎప్పటికీ నువ్వే మా కింగ్’.. మీపై అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదు అంటూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వైఎస్ జగన్కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రెండింగ్లో నిలుస్తున్నారు.‘ఎక్కడ వున్న రాజు రాజే గెలుపు ఓటములు సహజం.. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీకే అవకాశం. మా హృదయాల్లో ఎప్పటికీ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఎక్స్(ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్, పేజీలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. కాగా, ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019లో పోలిస్తే 10 శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేసింది. రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్పై అనుమానాలు, పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు తగ్గినా వైఎస్సార్సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఎంతో ఉంది. View this post on Instagram A post shared by Vara Nuzvid (@vara_nuzvid) View this post on Instagram A post shared by 𝗬𝗦𝗝𝗔𝗚𝗔𝗡 𝗢𝗙𝗙𝗜𝗖𝗜𝗔𝗟 🌀 (@ys_jagan.official)
![INDW VS SAW 3rd ODI: Smriti Mandhana Narrowly Missed Hat Trick Of Centuries, Team India Clean Sweep Series](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/Untitled-16_1.jpg.webp?itok=7YhXclzf)
హ్యాట్రిక్ సెంచరీలు మిస్ అయిన టీమిండియా వైస్ కెప్టెన్.. అయినా రికార్డే..!
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 23) జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయగా.. భారత్ 40.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. Smriti Mandhana smashed 3rd consecutive fifty plus score. 💯pic.twitter.com/mjYpYckhy6— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024హ్యాట్రిక్ సెంచరీలు మిస్ఈ మ్యాచ్లో 90 పరుగుల వద్ద ఔటైన భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధన హ్యాట్రిక్ సెంచరీలు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఈ సిరీస్ మొత్తంలో (3 మ్యాచ్ల్లో) 343 పరుగులు (117. 136, 90) చేసిన స్మృతి.. మహిళల మూడు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు సృష్టించింది. స్మృతి ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేసుంటే, హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి ఆసియా మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కేది.మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ లారా వొల్వార్డ్ట్ (61) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ ఓ మోస్తరు స్కోర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో తంజిమ్ బ్రిట్స్ (38), డి క్లెర్క్ (26), డి రిడ్డర్ (26 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. దీప్తి శర్మ (10-0-27-2) దక్షిణాఫ్రికాను కట్టడి చేయగా.. అరుంధతి రెడ్డి 2, శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్ తలో వికెట్ పడగొట్టారు.నామమాత్రపు లక్ష్య ఛేదనలో భారత్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో మంధనతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ (42) రాణించగా.. షఫాలీ వర్మ (25), ప్రియా పూనియా (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఖాకా, తుమి సెకుఖునే, మ్లాబా తలో వికెట్ పడగొట్టారు.
![YS Jagan Meets Party Activists And Normal People At Pulivendula](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/YS-Jagan-Pulivendula-Main.jpg.webp?itok=xRwhqh0b)
పులివెందుల క్యాంపు ఆఫీసులో ప్రజలు, అభిమానులతో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్ జగన్ స్పీకరిస్తున్నారు.ఇక, ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఆఫీసుకు కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో క్యాంప్ కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇక ఆయన్ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు తప్పక గమనిస్తారని దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని అభిమానులు అంటున్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు.
![YS Jagan Fires On Chandrababu Govt For Demolishing YSRCP Party Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/Jagan-Sir_2-final.jpg.webp?itok=KpQQImDl)
మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఒక నియంత బుల్డోజర్లతో కూల్చి వేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు. వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలకు తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నా’ అంటూ శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు.
![Chitral Rangaswamy Says She Received Bad Messages from Renukaswamy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/chitral-rangaswamy-01.jpg.webp?itok=kNcryAzR)
రేణుకాస్వామి.. నాక్కూడా అసభ్య సందేశాలు పంపాడు: నటి
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో దర్శన్, అతడి గ్యాంగ్ రేణుకాస్వామిని దారుణంగా కొట్టి చంపారు. అశ్లీల ఫోటోలు పంపడం రేణుకాస్వామి చేసిన తప్పయితే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అతడి ప్రాణాలు తీయడం దర్శన్ గ్యాంగ్ చేసిన ఘోర తప్పిదం.ఎవరికీ సపోర్ట్ చేయడం లేదుఅయితే రేణుకాస్వామి తనక్కూడా అసభ్య ఫోటోలు పంపాడంటోంది కన్నడ నటి చిత్రల్ రంగస్వామి. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియోలో నటి మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దేని గురించి చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే! ఆ విషయంలో అంతా బాధగానే ఉన్నారు. రేణుకాస్వామి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. కానీ రేణుకాస్వామి చాలామందికి అశ్లీల మెసేజ్లు పంపాడన్నది మాత్రం వాస్తవం. పోలీస్ స్టేషన్లోనూ తనపై కేసు నమోదైంది.పనికిమాలిన మెసేజ్లుఅలాగే అతడు గౌతమ్ అనే ఫేక్ అకౌంట్తో చాలామందికి పనికిమాలిన మెసేజ్లు చేసేవాడు. ఆ స్క్రీన్షాట్లను నేనిప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తే బాగోదు. కాబట్టి అవి పోస్ట్ చేయడం లేదు. దుస్తుల్లేకుండా ఫోటో లేదా అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుంటే నేనైతే బ్లాక్ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే.. నా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసిన లిస్టులో ఆల్రెడీ ఇతడి అకౌంట్ కూడా ఉంది. చాలారోజులుగా మౌనంగానే ఉన్నాను. జరుగుతున్న పరిణామాలను చూసి పెదవి విప్పాలనుకున్నాను' అని చిత్రల్ పేర్కొంది. కాగా చిత్రల్ రంగస్వామి బాడీ బిల్డర్. పలు సినిమాల్లో నటించింది. కన్నడ బిగ్బాస్ 10వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: థర్డ్ హ్యాండ్ కారు.. వర్షం వస్తే కారులో వాటర్ లీకేజీ..
![Do You Know Who is Singer Shreya Ghoshal Husband and His Job](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/ShreyaGoshal-01.jpg.webp?itok=cau2Xqon)
సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలుసా? ట్రూ కాలర్ కంపెనీ..
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం మొదలైన భాషల్లో పాటలు పాడి పాన్ ఇండియా సింగర్గా పేరు తెచ్చుకున్న 'శ్రేయా ఘోషల్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులోనే సుమారు 200 కంటే ఎక్కువ పాటలు పాడిన ఈమె పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. సింగర్గా మాత్రమే తెలిసిన చాలా మందికి శ్రేయా ఘోషల్.. వ్యక్తిగత జీవితం గురించి తెలియదు. ఈమె భర్త ఓ ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నట్లు బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. ఈ కథనంలో శ్రేయా ఘోషల్ భర్త ఎవరు?, ఏ సంస్థలో పనిచేస్తారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..సింగర్ శ్రేయా ఘోషల్ భర్త పేరు 'శిలాదిత్య ముఖోపాధ్యాయ' (Shiladitya Mukhopadhyaya). ఈయన సుమారుగా రూ. 1400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన ప్రముఖ ట్రూకాలర్ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్ 2022 నుంచి ట్రూకాలర్లో బిజినెస్ గ్లోబల్ హెడ్గా సేవలందిస్తున్న ముఖోపాధ్యాయ కంపెనీని సక్సెస్ వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు.ట్రూకాలర్ సంస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న శిలాదిత్య ముఖోపాధ్యాయ.. శ్రేయా ఘోషల్ చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు సుమారు తొమ్మిదేళ్లు ప్రేమించుకుని 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించాడు. ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రానిక్స్లో బీఈ పట్టా పొందాడు.భారతీయ సినిమా నేపథ్య సంగీతానికి శ్రేయా ఘోషల్ రాణి అయితే, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార ప్రపంచంలో పాపులర్ పర్సన్. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఈయన గతంలో కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ కంపెనీలో కూడా పనిచేసినట్లు సమాచారం.ఇక శ్రేయా ఘోషల్ విషయానికి వస్తే.. భారతదేశంలో ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకునే సింగర్లలో ఒకరైన ఈమె, ఇప్పటికే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకుంది. ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 180 నుంచి రూ. 185 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. అయితే శిలాదిత్య ముఖోపాధ్యాయ మొత్తం ఆస్తికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో వెల్లడికాలేదు.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి
- ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
- దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్బీఐ
- హైదరాబాద్లో భారీ వర్షం
- బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
- శంషాబాద్లో మరోసారి చిరుత కలకలం!
- అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు!
- పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కుమారుడు.. ఫోటో వైరల్
- ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
- World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
- నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్ చేశారు: కస్తూరి
సినిమా
![Devoleena Bhattacharjee SLAMS Bigg Boss OTT 3 Armaan Malik with His Wives](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/devoleena-bhattacharjee.jpg.webp?itok=tAOxvpl0)
బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ ఉన్న క్రేజే వేరు. ఏ భాషలో అయినా ఈ షో సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. తాజాగా హిందీలో బిగ్బాస్ ఓటీటీ సీజన్ -3 ప్రారంభమైంది. ఈ షోలోకి పలువురు కంటెస్టెంట్స్ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రముఖ యూట్యూబర్ ఆర్మాన్ మాలిక్పైనే అందరిదృష్టి పడింది. ఎందుకంటే అతను తన ఇద్దరు భార్యలు పాయల్, కృతికతో కలిసి హౌస్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆర్మాన్తో వారి ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అయితే ఇది చూసిన మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్ దేవోలీనా భట్టాచార్జీ విమర్శలు గుప్పించింది. వీరిని చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. అసలు ఇది వినోదం కోసం తీసుకొచ్చిన షోలా లేదని మండిపడింది. రియాలిటీ షో ద్వారా బహుభార్యత్వాన్ని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె తన ట్విటర్లో రాసుకొచ్చింది.దేవోలీనా తన ట్విటర్లో రాస్తూ..' ఇదేంటి వినోదం అని మీరు అనుకుంటున్నారా? దీన్ని ఎలా పిలుస్తారో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాటి గురించి వినగానే నాకు అసహ్యం అనిపిస్తోంది. బిగ్ బాస్ మీకేమైంది? బహుభార్యత్వంతో మీరు వినోదాన్ని పంచాలనుకుంటున్నారా? ఈ షోను చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరు వీక్షిస్తున్నారు. ఇలాంటి వాటితో మీరు కొత్త తరానికి ఏమి నేర్పించాలనుకుంటున్నారు? వీరిని చూసిన అందరూ 2, 3, 4 వివాహాలు చేసుకోవచ్చా? అందరూ కలిసి సంతోషంగా జీవించగలరా? రోజు ఇలాంటి సంఘటనలతో బాధపడుతూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారిని వెళ్లి అడగండి.' అని చురకలు అంటించింది.'అందుకే దేశంలో ప్రత్యేక వివాహ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి. చట్టం అందరికీ ఒకటే. అప్పుడే ఈ సమాజం ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది. మొదటి భార్య ఉండగా రెండో భార్య. ఒకవేళ భార్యలు కూడా ఇద్దరు భర్తలను కలిగి ఉంటే.. మీరు చూస్తూ కాలక్షేపం చేస్తారా? అని ప్రశ్నించింది. ఇలాంటి వాళ్లను ఏ కారణంతో ఫాలో అవుతారు? కొత్త తరానికి బహుళ వివాహాలు చేసుకోవాలని ఈ షో ద్వారా నేర్పిస్తున్నారా? ఇది తలచుకుంటేనే భయమేస్తోంది. ' అని రాసుకొచ్చింది.అంతేకాకుండా.. 'మీకు 2-3 పెళ్లిళ్లు చేసుకోవడం అంత అవసరం అయితే చేసుకుని ఇంట్లోనే ఉండండి. మీ నీచమైన మనస్తత్వాన్ని ప్రపంచానికి చూపకండి. ఇలాంటి వాటితో సమాజం విధ్వంసం వైపు వెళ్తుంది. మరి బిగ్ బాస్.. మీకు ఏమైందో నాకు తెలియడం లేదు' అంటూ ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చూసిన నెటిజన్స్ దేవోలీనాను ప్రశంసిస్తున్నారు. ఆ ముగ్గురిని రియాల్టీ షోలోకి తీసుకొచ్చినందుకు బిగ్ బాస్పై దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా.. ఈ రియాలీటి షోకు అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఓటీటీ సీజన్-3 జియో సినిమాలో ప్రసారమవుతోంది.Do you think this is entertainment? This is not entertainment, it's filth. Don't make the mistake of taking this lightly because it's not just a reel, it's real. I mean, I can't even understand how anyone can call this shamelessness entertainment ? I feel disgusted just hearing… https://t.co/BVeVjGrTm2— Devoleena Bhattacharjee (@Devoleena_23) June 22, 2024
![Hollywood Movie Lou Review In Telugu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/Lou-Movie.jpg.webp?itok=JXpNS5uD)
సుత్తి లేకుండా సాగే థ్రిల్లర్ సినిమా.. లూ మూవీ రివ్యూ
థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని సినీప్రేక్షకులు ఉండరు. అలాంటివారి కోసం ఏ యేటికాయేడు కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో చాలా చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కొన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబడతాయి. మరికొన్ని మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా అవార్డులు అందుకుంటాయి. అలాంటి చిత్రమే లూ. 2022లో వచ్చిన ఈ సినిమా గతేడాది రీఫ్రేమ్ స్టాంప్ అవార్డు అందుకుంది. మరి లూ మూవీ ఎలా ఉందో చూసేద్దాం..లూ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. ఓ రోజు తన బ్యాంక్లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకుని ఇంటికి వస్తుంది. అలాగే పెంపుడు కుక్కకు కొన్ని వారాలపాటు అవసరమయ్యే మాంసాన్ని ఫ్రిజ్లో భద్రపరుస్తుంది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, పేపర్లను మంటల్లో తగలబెట్టి కుర్చీలో కూలబడుతుంది. పెద్ద తుపాకీ అందుకుని చనిపోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా ట్రిగర్ నొక్కే సమయంలో హన్నా అనే మహిళ తన ఇంట్లోకి పరుగు పరుగున వస్తుంది. తన కూతురు వీ తప్పిపోయిందని చెప్తుంది. ఆ చిన్నారిని క్షేమంగా తీసుకొస్తానని మాటిచ్చిన లూ ఆత్మహత్య ఆలోచన విరమించుకుంటుంది. మరి లూ మాట మీద నిలబడిందా? చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు? తనను కాపాడిందా? లేదా? అసలు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!లూ మహిళ విచిత్రంగా ప్రవర్తించినప్పుడే తన వెనుక ఏదో ఫ్లాష్బ్యాక్ ఉందని అర్థమైపోతుంది. భీకరమైన వర్షం రాబోతోంది.. అప్రమత్తంగా ఉండండి అన్న ప్రకటనతో ఏదో ఘోరం జరగబోతుందని ముందుగానే హింటిచ్చాడు డైరెక్టర్ అన్నా ఫోరెస్టర్. పొరుగింట్లో ఉండే చిన్నారి వీని కనీసం ఒక్కసారైనా పలకరించని లూ.. ఆమె కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ప్రయత్నించడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.లూగా అలిసన్ జానీ నటన అద్భుతంగా ఉంది. హన్నాగా జుర్నీ స్మోలెట్, వీగా రైడ్లీ ఆషా నటన పర్వాలేదు. ప్రీక్లైమాక్స్ బాగుంది. కథను మలుపు తిప్పే ట్విస్టు బాగుంటుంది. కానీ కొన్ని సన్నివేశాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. డైరెక్టర్ కథకు ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే లూ అద్భుతాలు సృష్టించేదనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారైతే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూసేయొచ్చు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో తెలుగులో అందుబాటులో ఉంది.
![Richa Chadha: Older Ladies Saying They are Natural After 10 Surgeries](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/Richa-Chadha.jpg.webp?itok=eYzeLuU8)
అక్కా.. నీ సర్జరీల కథ నాకు తెలుసు.. ఎందుకు మరి బిల్డప్? నటి కౌంటర్
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ అందంగా కనిపించేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఎంచుకుంటారు. సహజసిద్ధంగా మార్చలేని వాటి కోసం సర్జరీలను ఆశ్రయిస్తారు. అలా ఎందరో భామలు ముక్కు, పెదాలు.. ఇలా శరీర అవయవాలను తమకు నచ్చిన రీతిలో మార్చుకున్నారు. అయితే అలా సర్జరీలు చేయించుకున్నవారెవరో బాలీవుడ్ నటి రిచా చద్దాను విమర్శించినట్లున్నారు.అక్కా.. నాకు చెప్పకుఇంకేముంది సోషల్ మీడియా వేదికగా మండిపడింది. 'మరేం లేదు.. కొందరికి ఒంటినిండా విషమే! వయసు పైబడ్డా టీనేజర్లుగా ముస్తాబవుతున్నారు. పది సర్జరీలు చేయించుకుని కూడా మేము సహజంగానే అందంగా ఉంటామని పోజులిస్తున్నారు. అక్కా.. మీరు ఎన్ని సర్జరీలు చేయించుకున్నారో అవన్నీ తెలిసినవారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పడం? మాకు కళ్లున్నాయి. అన్నీ చూస్తున్నాం.. కాబట్టి ప్రత్యేకంగా ఏదీ చెప్పాల్సిన పని లేదు' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.అదితి గురించేనా?ఇది చూసిన నెటిజన్లు రిచా ఎవరి గురించి మాట్లాడి ఉంటుందా? అని బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నటి గురించి ఆమె మాట్లాడుతోందని అర్థమవుతోంది. కానీ ఆ అక్క ఎవరై ఉంటారు? అని చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం ఇంకెవరు? అదితి రావు హైదరినే తిడుతోంది అని కామెంట్లు చేస్తున్నారు.ఆన్స్క్రీన్.. ఆఫ్స్క్రీన్.. అదే డ్రామా'హీరామండి వెబ్ సిరీస్లో ఎంత డ్రామా జరిగిందో ఆఫ్ స్క్రీన్లో అంతే డ్రామా నడుస్తోంది. రిచా చద్దా.. షర్మిన్ సెగల్ను ట్రోల్ చేసింది. షర్మిన్.. సంజీదా షైఖ్ను అవుట్సైడర్ అని మాట్లాడింది. ఇప్పుడు రిచా.. అదితిరావు మీద సెటైర్లు వేస్తోంది' అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. 'అదితినే అంటోందని క్లియర్గా తెలుస్తోంది.. అయినా రిచా ఏంటి? రోజురోజుకీ కంగనా రనౌత్లా మారుతోంది' అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రస్తుతం గర్భిణి అయిన రిచా చద్దా జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.చదవండి: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు!
![Jackky Bhagnani production house Pooja Entertainments Mumbai office sold out](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/RakulPreetSingh-01.jpg.webp?itok=me5-3rny)
ఒక్క సినిమా దెబ్బకు కార్యాలయం అమ్మేసిన స్టార్ హీరోయిన్ భర్త!
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ను పెళ్లాడారు. నిర్మాతగా, నటుడిగా జాకీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బ్యానర్ను నడుపుతున్నారు. ఇటీవల ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన పూజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ముంబయిలోని ఏడంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది.దీంతో ఈ నిర్మాణ సంస్థకు దాదాపు రూ.250 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. అందువల్లే జాకీ భగ్నానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ముంబయిలోని ఓ ప్రముఖ బిల్డర్కు ఈ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకానికి ఒక్క రోజు ముందే జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ పలువురు సిబ్బంది ఆరోపించారు.అయితే కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యాలే అమ్మకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జీతాలు ఇవ్వలేక దాదాపు 80 శాతం సిబ్బందిని తొలగించి.. తాత్కాలికంగా జుహులోని ఫ్లాట్కు కార్యాలయాన్ని తరలించారని ఓ నివేదిక వెల్లడించింది. కాగా.. పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో కూలీ నెం.1, బీవీ నెం.1, రంగేజ్, షాదీ నెం.1, జవానీ జానేమాన్ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్లో చివరిసారిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ రూపొందించారు.
క్రీడలు
![Hardik Pandya goes past MS Dhoni to achieve this T20 World Cup record for India](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/hardhik_0.jpg.webp?itok=juSQFanY)
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. 17 ఏళ్ల ధోని రికార్డు బద్దలు
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సత్తాచాటుతున్నాడు. తన ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టుకు అద్బుతమైన విజయాలు అందిస్తున్నాడు.తాజాగా ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాటింగ్లో ఆజేయ అర్ధశతకం సాధించిన పాండ్యా.. బౌలింగ్లో ఓ కీలక వికెట్ పడగొట్టాడు. ఈ క్రమంలో హార్దిక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.హార్దిక్ సాధించిన రికార్డులు ఇవే..→టీ20 ప్రపంచకప్ చరిత్రలో 300 పరుగులు, 20+ వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్గా హార్దిక్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్కప్లో ఇప్పటివరకు 21 మ్యాచ్లు ఆడిన హార్దిక్ .. 137.89 స్ట్రైక్రేట్తో 302 పరుగులు చేశాడు. అటు బౌలింగ్లోనూ 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన జాబితాలో పాండ్యా ఐదో స్ధానంలో నిలిచాడు.షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 853 పరుగులు, 50 వికెట్లుషాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)- 546 పరుగులు, 39 వికెట్లుషేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా)- 537 పరుగులు, 22 వికెట్లుడ్వేన్ బ్రావో (వెస్టిండీస్)- 530 పరుగులు, 27 వికెట్లు→టీ20 ప్రపంచకప్లో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక స్కోర్ సాధించిన తొలి భారత ప్లేయర్గా పాండ్యా రికార్డు సృష్టించాడు.ఇప్పటివరకు ఈ రికార్డు సురేశ్ రైనా (45 పరుగులు), ధోనీ (45) పేరిట ఉండేది. 2007 టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు.2012 టీ20 ప్రపంచకప్లో సౌతాఫ్రికాతోనే జరిగిన మ్యాచ్లో ఆరోస్థానంలో బ్యాటింగ్ చేసిన సురేశ్ రైనా 34 బంతుల్లో 45 పరుగులే చేశాడు. కాగా తాజా మ్యాచ్లో 50 పరుగులు చేసిన పాండ్యా వారిద్దరి రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్పై టీమిండియా 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
![Rashid Khan super proud of Afghanistan after Australia heist](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/Rashidkhan.jpg.webp?itok=Rw3w-7jX)
ఇది మా దేశం గర్వించదగ్గ విజయం.. అతడొక అద్బుతం: రషీద్ ఖాన్
టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా జైత్ర యాత్రకు అఫ్గానిస్తాన్ బ్రేక్లు వేసింది. కింగ్స్టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్ను 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. దీంతో 2023 వన్డే ప్రపంచకప్లో ఓటమికి అఫ్గాన్ బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో అఫ్గాన్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 150 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని అఫ్గాన్ బౌలర్లు కాపాడుకున్నారు. లక్ష్య చేధనలో అఫ్గాన్ బౌలర్ల దాటికి ఆసీస్ 127 పరుగులకే చాపచుట్టేసింది. అఫ్గాన్ మీడియం పేసర్ గుల్బాదిన్ నైబ్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. నవీన్ ఉల్హక్ మూడు వికెట్లు, ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నబీ ఒక్క వికెట్ సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఈ విజయంతో అఫ్గాన్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రషీద్ తెలిపాడు."ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయం. ఆసీస్ వంటి పెద్ద జట్టుపై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా దేశం గర్వించదగ్గ సందర్భం. మాకు కూడా ఒక జట్టుగా చాలా గర్వంగా ఉంది. ప్రత్యర్ది బౌలింగ్ లైనప్ను బట్టి మా ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేస్తున్నాము. అందుకే ప్రతీ మ్యాచ్లోనూ ఒకే ప్లేయింగ్ ఎలెవన్తో ఆడలేకపోతున్నాము. కింగ్స్ టౌన్ పిచ్పై 140 పరుగులు మంచి స్కోర్గా భావించవచ్చు. మాకు బ్యాటింగ్లో మంచి ఆరంభం వచ్చింది. కానీ మేము ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేకపోయాం. ఆఖరికి ప్రత్యర్ధి ముందు 150 పరుగుల లక్ష్యాన్ని ఉంచాము. ఈ టార్గెట్ను ఎలాగైనా డిఫెండ్ చేసుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగాం. అందుకు తగ్గట్టే మా బాయ్స్ అదరగొట్టారు. మా జట్టు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎక్కువ మంది ఆల్రౌండర్లను కలిగి ఉండటం జట్టుకు కలిసొచ్చింది. ఇక నైబ్ ఒక అద్బుతం. అతడి వల్లే ఇదింతా. నైబ్కు ఉన్న అనుభవాన్ని మొత్తం ఈ మ్యాచ్లో చూపించాడు. అదే విధంగా నవీన్,నబీ కూడా అద్బుమైన ప్రదర్శన కనబరిచారు. మా తదుపరి మ్యాచ్లో ఇదే జోరును కొనసాగిస్తామని పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
![T20 WC 2024: Afghanistan Beat australia By 21 runs](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/Australia.jpg.webp?itok=t9VkKddr)
టీ20 వరల్డ్కప్లో సంచలనం.. ఆసీస్ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్
టీ20 వరల్డ్కప్-2024లో పెను సంచలనం నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సూపర్-8 మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను అఫ్గానిస్తాన్ చిత్తు చేసింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆసీస్పై 21 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది.ఈ విజయంతో తమ సెమీస్ ఆశలను అఫ్గానిస్తాన్ సజీవంగా ఉంచుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. అఫ్గానిస్తాన్ బౌలర్ల దాటికి 127 పరుగులకే కుప్పకూలింది. ఓ దశలో క్రీజులో మాక్స్వెల్ ఉన్నప్పుడు ఆసీస్దే విజయమని అంతా భావించారు. కానీ అఫ్గాన్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నైబ్.. మాక్సీని ఔట్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో నైబ్ తన 4 ఓవర్ల కోటాలో 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. నైబ్తో పాటు నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మాక్స్వెల్(59) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్(60), ఇబ్రహీం జద్రాన్(51) పరుగులతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. జంపా రెండు, స్టోయినిష్ ఒక్క వికెట్ సాధించారు.
![Rohit Sharmas stump mic gem as Kuldeep Yadav frustrates him with his bowling](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/rohit_0.jpg.webp?itok=_CoCMtzN)
ఏమి చేస్తున్నావు కుల్దీప్.. రోహిత్ శర్మ సీరియస్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్-2024లో సెమీఫైనల్కు చేరేందుకు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. గ్రూపు-1 నుంచి సెమీస్ బెర్త్ను దాదాపు ఖారారు చేసుకుంది.ఈ మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్లో 196 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్లో ప్రత్యర్ధిని 146 పరుగులకే కట్టడి చేసింది. బ్యాటింగ్లో హార్దిక్ పాండ్యా(50), విరాట్ కోహ్లి(37), రిషబ్ పంత్(36), శివమ్ దూబే(34) పరుగులతో రాణించగా.. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ మూడు, బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్పై రోహిత్ అసహనం..ఇక ఈ మ్యాచ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో తొలి బంతిని షకీబ్ అల్ హసన్ భారీ సిక్స్ బాదాడు. ఆ తర్వాత రెండో బంతికి షకీబ్ రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన మహ్ముదుల్లాకు కుల్దీప్ గుగ్లీగా సంధించాడు. అయితే మహ్ముదుల్లాకు గుగ్లీ వేయడం రోహిత్కు నచ్చలేదు. వెంటనే రోహిత్.. ఏమి చేస్తున్నావు కుల్దీప్, అతడికి స్వీప్ ఆడనివ్వు. ఒకరు స్వీప్ ఆడి ఇప్పుడే ఔటయ్యాడు. కాబట్టి అతడు స్వీప్ ఆడేట్లు బౌలింగ్ చేయు అని చెప్పాడు. ఇదింతా స్టంప్ మైక్లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Rohit Sharma and Stump Mic😂🫶🏻 pic.twitter.com/cSUrBnLJHJ— Kuljot⁴⁵ (@Ro45Kuljot) June 22, 2024
బిజినెస్
![Govt to roll out pan-India biometric authentication to curb fake invoicing](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/biometric.jpg.webp?itok=OVvA1Tsg)
నకిలీ ఇన్వాయిస్ల కట్టడికి బయోమెట్రిక్ అథెంటికేషన్
నకిలీ ఇన్వాయిసింగ్ కేసులను అరికట్టడానికి దేశవ్యాప్తంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ విధానాన్ని అమలు చేయనున్నట్లు 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మోసపూరిత ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ లను ఎదుర్కోవడానికి ఆధార్ ఆథెంటికేషన్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.మోదీ ప్రభుత్వం 3.0 ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇదే కావడం గమనార్హం. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.ఆలిండియా ప్రాతిపదికన బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ అథెంటికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేస్తామని, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలను అరికట్టడంలో సహాయపడటంతో పాటు, జీఎస్టీలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
![Elon Musk and Shivon Zilis secretly welcome third kid: Report](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/elon-musk_1.jpg.webp?itok=rkjX0c87)
ఇప్పటికే 11 మంది పిల్లలు.. ఇప్పుడు మరొకరు!
టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ తన సంతానం సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 11 మంది పిల్లలకు తండ్రైన ఎలాన్ మస్క్ ఈ ఏడాది ప్రారంభంలో న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్తో మూడవ బిడ్డకు త్రండ్రి అయినట్ల బ్లూమ్బర్గ్ తాజా నివేదికలు చెబుతున్నాయి.టెక్నాలజీ, వ్యాపారంలో నూతన ఆవిష్కరణలకు పేరుగాంచిన ఈ జంట తమ కొత్త కుటుంబ సభ్యుల రాకను గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. మస్క్ ఇప్పటికే 2021 నవంబర్లో జిలిస్తో కవలలకు తండ్రి అయ్యారు. తన పిల్లల సంఖ్యను అధికారికంగా వెల్లడించనప్పటికీ ఆయనకు ఇప్పటివరకు 11 మంది పిల్లలు ఉన్నారన్నది బహిరంగంగా తెలిసిన విషయం.తాజా నివేదికపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జిలిస్ స్పందించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఎలన్ మస్క్కు ఇప్పుడు కలిగిన సంతానంతో మొత్తం పిల్లల సంఖ్య 12కు చేరుతుంది. మస్క్కు సంగీతకారిణి గ్రిమ్స్తో ముగ్గురు, మాజీ భార్య, రచయిత జస్టిన్తో ఐదుగురు పిల్లలు ఉన్నారు. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్తో ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
![Top 10 most expensive houses in the world](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/1_12.jpg.webp?itok=pK6A_TPc)
కళ్లు చెదిరే ఖరీదైన ఇళ్లు ఇవే..
కళ్లు చెదిరే ఖరీదైన ఇళ్లు ఇవే..
![Today Gold and Silver Price Today 14 June 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/gold-rate_0.jpg.webp?itok=qFC876pc)
బంగారం, వెండి తగ్గిందా.. పెరిగిందా? నేటి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. క్రితం రోజున రూ.800 మేర తగ్గిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 23) స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ పెరగక ముందే బంగారం కొనాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.66,350 లగా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా ఉంది.ఇతర నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.73,400 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,350, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా కొనసాగుతోంది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 వద్ద కొనుసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.66,950 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.73,970 లుగా ఉంది.వెండి రేటు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరల్లో కూడా ఈరోజు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
వీడియోలు
![Bandi Sanjay Visits Choppadandi MLA Medipally Satyam House](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/32.png.webp?itok=QHRSO9-b)
![Bandi Sanjay Visits Choppadandi MLA Medipally Satyam House](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/32.png.webp?itok=QHRSO9-b)
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన బండి సంజయ్
![Nara Lokesh Red Book Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/31.png.webp?itok=gM6RuUFI)
![Nara Lokesh Red Book Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/31.png.webp?itok=gM6RuUFI)
అధికార మదంతో రెచ్చిపోతున్న టిడిపి నేతలు, కార్యకర్తలు
![Margani Bharat About Chandrababu Mistakes](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/29.png.webp?itok=NvbJ02K4)
![Margani Bharat About Chandrababu Mistakes](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/29.png.webp?itok=NvbJ02K4)
చంద్రబాబుకు మార్గని భరత్ స్ట్రాంగ్ కౌంటర్
![Diarrhea Disease Cases Increasing In Jaggayyapeta NTR District](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/28.png.webp?itok=nbASV96n)
![Diarrhea Disease Cases Increasing In Jaggayyapeta NTR District](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/28.png.webp?itok=nbASV96n)
ఏపీలో డయేరియా కలకలం.. 10 మంది మృతి
![MP Etela Rajender VS MLA Raja Singh Words War](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/27.png.webp?itok=wGkYHnry)
![MP Etela Rajender VS MLA Raja Singh Words War](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/27.png.webp?itok=wGkYHnry)
తెలంగాణ బీజేపీలో ఈటల వర్సెస్ రాజాసింగ్
![YS Jagan Mohan Reddy At Pulivendula Camp Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/26.png.webp?itok=l-_1fOyp)
![YS Jagan Mohan Reddy At Pulivendula Camp Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/26.png.webp?itok=l-_1fOyp)
మా కట్టే కాలేంతవరకు జగనన్నతోనే ఉంటాం
![Cyberabad CP Avinash Mahanthi Review On Miyapur HMDA Govt Land Issue](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/25.png.webp?itok=gHvDmpsE)
![Cyberabad CP Avinash Mahanthi Review On Miyapur HMDA Govt Land Issue](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/25.png.webp?itok=gHvDmpsE)
మియాపూర్ పరిస్థితులపై సైబరాబాద్ సీపీ సమీక్ష
![Union Minister Kishan Reddy About Singareni Privatisation](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/24.png.webp?itok=d1vVe9B2)
![Union Minister Kishan Reddy About Singareni Privatisation](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/24.png.webp?itok=d1vVe9B2)
సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం
![Pocharam Srinivas Reddy About Congress Party](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/23.png.webp?itok=JsoMWx6E)
![Pocharam Srinivas Reddy About Congress Party](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/23.png.webp?itok=JsoMWx6E)
నేను కాంగ్రెస్ లో చేరటానికి ప్రధాన కారణం ఇదే
![APPSC Members Are Under Pressure To Resign](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/22.png.webp?itok=o9i_puiu)
![APPSC Members Are Under Pressure To Resign](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/22.png.webp?itok=o9i_puiu)
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయ దాడి..
ఫ్యామిలీ
![Digital Creator Shares 64-Year-Old Mom's Secret](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/creator.jpg.webp?itok=88baPXyl)
60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్మెంట్, జిమ్ వంటి వర్కౌట్లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్గా ఉంచుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. (చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్లు..ఒక్కో జీన్స్కి ఏకంగా..!)
![Beautiful Flowers Which Elivate And Refresh Your Mood](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/23/Indoor-Flowering-Plants.jpg.webp?itok=WHYWMI9f)
మీ మూడ్ ని మార్చేసే పూ బాలలు.. (ఫొటోలు)
![Delhi Boy Turns Blue Jeans Into Sleeping Bags For Homeless](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/jean1_0.jpg.webp?itok=wRG9jycT)
పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్లు..ఒక్కో జీన్స్కి ఏకంగా..!
మన ఉపయోగించే బట్టల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలుసా..!. ఏటా వేల బట్టలు చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడుతుంది. అవి మట్టిలో కలిసిపోయేందుకు చాలా టైం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణవేత్తలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా జీన్స్ లాంటి దుస్తులు అంతతేలిగ్గా మట్టిలో కలిసిపోవు. పైగా దీని తయారీ కోసం ఎన్ని నీళ్లు ఖర్చుఅవుతాయో వింటే షాకవ్వుతారు. అలాంటి పాత జీన్స్ రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చక్కగా రూపాందిస్తున్నాడు 16 ఏళ్ల యువకుడు. అంతేగాదు పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ అందిరిచేత శెభాష్ అని ప్రశంలందుకుంటున్నాడు. అతనెవరంటే..ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల నిర్వాన్ సోమనీ మన ఇంట్లో ఉండే దుస్తులు, వాటికి ఉపయోగించే రంగులు వల్ల ఎంత కాలుష్యం ఏర్పడతుందో తెలుసుకున్నాడు. అదీగాక ఏటా ఈ దుస్తులు వ్యర్థాలు ఎంతలా కుప్పలుగా పేరుకుపోతున్నాయో గమనించాడు. పర్యావరణ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా అతడి దృష్టి జీన్స్ దుస్తులపై పడింది. అప్పుడే.. ఒక్కో జీన్స్ తయారీకి ఏకంగా పదివేల లీటర్లు అవుతుందని, తెలుసుకుని షాక్ అవ్వుతాడు. ఐదు జతల జీన్స్కి ఏకంగా 50 వేల లీటర్ల అవుతాయా అని విస్తుపోయాడు. అంత నీటిని ఖర్చు చేస్తున్న ఈ జీన్స్లు సౌకర్యవంతంగా వినియోగించేలా రీ సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్ జీన్స్ పేరుతో స్లీపింగ్ బ్యాగ్లు తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు సహాయంతో నిర్వాణ్ వేల జతలు జీన్స్లు సేకరించాడు నిర్వాన్. వాటితో దాదాపు 900 స్లీపింగ్ బ్యాగ్లను రూపొందించాడు. అవి ఎవరికీ ఇస్తారంటే..ఢిల్లీలో చలికాలంలో రోడ్లపై నిద్రించే నిరాశ్రయులకు స్లిపింగ్ బ్యాగ్లు అందిస్తున్నాడు నిర్వాన్. సాధారణంగా మనం వారికి దుప్పట్లు ఇస్తుంటాం. అయితే అది పరిష్కారం కాదు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి. నిద్రపోయేలా పరుచుకుని పడుకోవడం కుదరదు కూడా. దీంతో ఈవిషయమై లోతుగా ఆలోచించి మరీ ఇలా స్లీపింగ్ బ్యాగ్లు రూపొందించాడు. అవి బెడ్ మాదిరిగా ఉండి..దాని లోపల పడుకోవచ్చు. ఎలా అంటే.. పడుకునే బెడ్ కమ్ దుప్పటిగా ఉంటుంది. ఇది వారికి సౌకర్యవంతంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మిగతా దుస్తులు కంటే జీన్స్ చాలా దృఢంగా ఉంటుంది. అంత ఈజీగా చీరగదు కాబట్టి నిరాశ్రయులకు, అభాగ్యులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు నిర్వాన్. తనకు ఈ ఆలోచన రావడానికి కారణం వాళ్లమ్మ దుస్తుల దుకాణమేనని చెబుతున్నాడు. అక్కడ చాలా మెటీరియల్లు కుట్టగా చాలా దుస్తుల వేస్టేజ్ వస్తుంది. వాటిలో కొంత మేర ఏదో రకంగా ఉపయోగిస్తాం. మిగతా చాలా వరకు వేస్ట్ అయ్యేది. దాన్ని ఉపయోగిస్తూ ఏదైనా చేయగలనా అనుకున్నాను అలా ఈ స్లీపింగ్ బ్యాగ్లు తయారు చేసినట్లు వివరించాడు. గతేడాది టర్కీలో భూకంపం వచ్చి నిరాశ్రయులుగా మారిన ప్రజల కోసం దాదాపు 400 స్లీపింగ్ బ్యాగ్లను అందజేశాడు నిర్వాన్. మన అలమార్లో వృధాగా పడి ఉన్న జీన్స్ని అతడి కంపెనీకి అందజేస్తే మన వంతుగా పర్యావరణ సంరక్షణలో బాధ్యత తీసుకున్నట్లే అవుతుంది. ఈ పర్యావరణ కోసం అందరూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేసి మన పుడమతల్లిని కాలుష్యం కోరల నుంచి కాపాడుకుందాం!.(చదవండి: ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..)
![The hidden dangers of protein powders](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/588_3.jpg.webp?itok=K81-iBMF)
హై ప్రోటీన్.. వాడటం మంచిది కాదు
ఇన్స్టంట్.. ఈ మాట వినగానే ఏదో కొత్త ఊపు వచ్చేస్తుంది మనకు...ఏ పనైనా త్వరగా పూర్తవ్వడమే ఇందులోని ప్రత్యేకత.. రకరకాల అడ్వరై్టజ్మెంట్ల ప్రేరణతో.. మనం దీనికి బాగానే అలవాటుపడిపోయాం.. అయితే ఇప్పుడీ అలవాటే కొంపముంచుతోంది.. ఆహారానికే కాదు.. దాని నుంచి అందే ప్రొటీన్లు ఇన్స్టంట్గా తీసుకోవాలనుకోవడం.. ఇన్స్టంట్గా కండలు పెంచేయాలనుకోవడం పొరపాటే అంటున్నారు నిపుణులు.. సప్లిమెంట్లు, అధిక ప్రొటీన్ వినియోగం ప్రయోజనాల కంటే ప్రమాదాలను ఎక్కువ కలిగిస్తుందని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) స్పష్టం చేసింది. దీని వల్ల కండరాల క్షీణత సహా అనేక రకాల అనారోగ్యాలు తప్పవని తేలి్చంది. దీనిపై ఒక పరిశోధన ఆధారిత నివేదికను ఇటీవలే విడుదల చేసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... ఒకప్పుడు విపరీతమైన శ్రమ చేసే క్రీడాకారులు లేదా సిక్స్ప్యాక్ వంటివి సాధన చేసే వ్యాయామ ప్రియులకు మాత్రమే పరిచయమున్న ప్రొటీన్ సప్లిమెంట్స్ నగరంలో ప్రతి ఒక్కరికీ చిరపరిచితంగా మారాయి. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అయితే ప్రొటీన్ సప్లిమెంట్ల వినియోగంపై నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తాజాగా నిర్వహించిన పరిశోధన ఆశ్చర్యాన్ని కలిగింది.. అందులోని కొన్ని అంశాలు.. ఆహారం ద్వారా ప్రొటీన్ అందడం లేదనే ఆలోచనతో వే ప్రొటీన్ తదితర పౌడర్లను విచ్చలవిడిగా వాడేస్తున్నారు.ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రోటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు.👉అదనంగా జత చేసిన చక్కెరలు, కృత్రిమ స్వీట్నర్లతో పాటు ప్రొటీన్ పౌడర్లలో సాధారణంగా ఉండే ఫ్లేవర్ల ప్రొటీన్ పౌడర్స్ను రెగ్యులర్గా తీసుకోవడం హానికరం. 👉ఈ సప్లిమెంట్లలో సాధారణ ముడిపదార్థమైన వే ప్రొటీన్, బ్రాంచ్డ్–చైన్ అమైనో ఆమ్లాలను (బీసీఎఎఎస్) అధికంగా కలిగి ఉంటుంది. అధిక బీసీఎఎఎస్లు నాన్–కమ్యూనికబుల్ (అంటువ్యాధులు కాని) వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 👉 సప్లిమెంట్లను తీసుకోవడం కండరాల బలాన్ని పెంచదు. అయితే ఆరోగ్యకరమైన వ్యక్తులు దీర్ఘకాలిక కఠిన వ్యాయామ సమయంలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంటేషన్ కండర పరిమాణాన్ని కొద్దిగా మెరుగుపరుస్తుంది. 👉 రోజుకు 1.6 గ్రా కంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం ఏ విధమైన అదనపు ప్రయోజనాలను అందించదు. 👉 మన శరీరానికి ప్రొటీన్ అవసరాలు మనం అంచనా వేసుకున్నంత ఎక్కువగా ఉండవు. 👉 క్రీడాకారులు సైతం సప్లిమెంట్లపైనే ఆధారపడకుండా ఆహారం నుంచి తగిన మొత్తంలో ప్రొటీన్ పొందడం మేలు. 👉దీర్ఘకాలం పెద్ద మొత్తంలో ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఎముక, కణజాలానికి నష్టం కలిగించవచ్చు. అలాగే మూత్రపిండాల సమస్యకు దారితీసే అవకాశం ఉంది. 👉 శాకాహారం లేదా మాంసాహారం నుంచి ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలను సులభంగా అందుకోవచ్చు. 👉 తృణధాన్యాలు, పప్పుధాన్యాలను 3:1 నిష్పత్తిలో లేదా 30 గ్రాముల వరకూ పప్పులతోనో, రోజుకు 80గ్రా మాంసంతోనో ప్రొటీన్ స్థాయిల్ని భర్తీ చేయవచ్చు. ఇది సాధారణ వ్యక్తుల ప్రొటీన్ అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. 👉కేవలం ప్రొటీన్ వినియోగం మాత్రమే కండరాల నిర్మాణంలో ఉపకరిస్తుందనేది అపోహ మాత్రమే. ఆహారంలో తగినంత కార్బోహైడ్రేట్లు కొవ్వులు లేకుండా నాణ్యత కలిగిన అధిక ప్రొటీన్లను తీసుకున్నప్పటికీ అది సరిపోదు. ఆహారపు అమైనో ఆమ్లాలు (ప్రొటీన్లు) ద్వారా కండర శ్రేణి నిర్మాణానికి శరీరంలో అమైనో–యాసిడ్ సంబంధిత విధులకు కార్బోహైడ్రేట్లు కొవ్వుల నుంచి కూడా తగినంత శక్తి అందాల్సిన అవసరం ఉంది. 👉 తగినంత శారీరక శ్రమ లేకుండా, కండరాల నిర్మాణానికి ప్రొటీన్లు ఉపకరించవు. సహజ ప్రొటీన్లతో మేలు..మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్డు, పాలు ప్రొటీన్లు శరీరంలో కొత్త ప్రొటీన్లను తయారు చేయడానికి అవసరమైన ఇరవై అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. పప్పులు, పచ్చి శెనగలు, గుర్రపు శెనగలు, నల్ల శనగలు, చిక్పీస్, సోయాబీన్, పచ్చి బఠానీలు వంటి పప్పుధాన్యాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్లు, హాజెల్నట్లు, సోయా గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు గణనీయమైన పరిమాణంలో ప్రొటీన్లను కలిగి ఉంటాయి. పప్పులను తృణ ధాన్యాలతో కలిపి లేదా తృణధాన్యాలు మాంసం ఆహారం, గుడ్లు/ పాలతో కలిపి తిన్నప్పుడు ఆహారంలో ప్రొటీన్ నాణ్యత మెరుగుపడుతుంది. తక్కువ కొవ్వు అధిక ఫైబర్ కలిగిన పప్పులు ఇనుము, పొటాషియం, జింక్, మెగ్నషియంవంటి ముఖ్యమైన విటమిన్లు, ఇతర ఖనిజాలను కలిగి ఉంటాయి. శాఖాహార ఆహారాలు 70%–85% వరకూ ప్రొటీన్ను జీర్ణం చేస్తాయి. మితిమీరితే యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదం... తీసుకున్న ఆహారం ద్వారా గానీ, ఇతరత్రా గానీ శరీర బరువు కిలోకి 1.5 గ్రాముల్ని మించి ప్రొటీన్ తీసుకోకూడదు. అతిగా ప్రొటీన్ తీసుకుంటే కిడ్నీ సమస్యలతో పాటు యూరిక్ యాసిడ్ పెరిగే ప్రమాదాలున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉండే సప్లిమెంట్స్లో కొన్నింటిలో స్టెరాయిడ్స్ కలుస్తున్నాయని సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ప్రొటీన్ సప్లిమెంట్స్ వినియోగించాలి. –డా.కిషోర్రెడ్డి, అమోర్ హాస్పిటల్స్
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ఒకే దఫా రైతుల పంట రుణాల మాఫీ... రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 47 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్యాలెట్టే బెటర్. ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకోనున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయొచ్చు, ఎన్నికల్లో వీటిని ఉపయోగించొద్దు... స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టీకరణ... ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివేనన్న రాహుల్ గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
విలువలు, విశ్వసనీయతతో ముందడుగు వేద్దాం... వైఎస్సార్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రజాప్రతినిధులకు బిగుస్తున్న ఉచ్చు... ఏసీబీతో పాటు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/411.jpg.webp?itok=q0fFnSlk)
చదువుకోమన్నందుకు చంపేశాడు!
సాక్షి, చైన్నె: దేశం గాని దేశానికి వెళ్లి బిడ్డల కోసం కార్మికుడిగా రేయింబవళ్లు తండ్రి శ్రమిస్తుంటే, ప్రయోజకుడై ఆయనకు తోడు ఉండాల్సిన పెద్ద కుమారుడు ఉన్మాది అయ్యాడు. చదువుకోమని పదేపదే వేధిస్తున్నారనే ఆగ్రహంతో కని పెంచిన తల్లిని, తోడ పుట్టిన తమ్ముడిని హతమార్చాడు. తానూ ఆత్మహత్యాయ త్నం చేసినా ధైర్యం చాలక పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తర చైన్నె పరిధిలోని తిరువొత్తియూరులో ఈ దా రుణ ఘటన శనివారం వెలుగు చూసింది. వివరాలు.. తిరువొత్తియూరు తిరునగర్ మొదటి వీధికి చెందిన మురుగన్(50) ప్రొక్లయినర్ ఆపరేటర్. ఓమన్ దేశంలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య పద్మ(45), కు మారులు నితీష్(21), సంజయ్(15) ఉన్నారు. పద్మ అన్నాసాలైలోని ఓ అక్కుపంచర్ క్లినిక్లో పనిచేయగా, నితీష్ వేళచ్చేరిలోని ఓ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సంజయ్ స్థానికంగా పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన ప్లస్–1లో చేరడానికి సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితులలో శుక్రవారం తన పెద్దమ్మ మహాలక్ష్మి కుమార్తె ప్రియ ఇంటికి నితీష్ వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి ముందు ఓ బ్యాగ్ ఉంచి వెళ్లాడు. ప్రియ వాట్సాప్కు ఈ సమాచారం చేర వేశాడు. ఇంటికి వచ్చినానంతరం రాత్రి సమయంలో ఈ మెసేజ్ చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనకు లోనైంది.ఇంటికి వెళ్లి చూడగా...నితీష్పెట్టిన మెసేజ్లను వాట్సాప్లో చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనతో తన తల్లి మహాలక్ష్మికి సమాచారం అందించింది. తన మెసేజ్లో అమ్మ, తమ్ముడి ని చంపేశా? అని ఉన్మాదంతో నితీష్ వ్యాఖ్యలు చేసి ఉండటం కలవరాన్ని రేపింది. హుటాహుటిన మహాలక్ష్మి , ప్రియ పద్మ ఇంటికి వెళ్లి చూశారు. ఇంటిలో రెండు మూటలలో గొంతులు తెగిన స్థితిలో పద్మ, సంజయ్ మృతదేహాలు బయట పడ్డాయి. దీంతో పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అర్ధరా త్రి వేళ ఈ హత్యల సమాచారం తిరువొత్తియూరులో కలకలాన్ని సృష్టించింది. నితీష్ కోసం పోలీసులు తీవ్ర వేట మొదలెట్టారు. పలగై తొట్టి కుప్పం బస్టాండ్లో నిద్రపోతున్న నితీష్ను వేకువ జామున పోలీసు లు పట్టుకున్నారు. అతడిని విచారించగా ఉన్మాదం బయట పడింది.చదువుకోమన్నందుకే..వేళచ్చేరిలోని ఓ కళాశాలలో చదువుతున్న నితీష్ చదువుపై దృష్టి పెట్టడం మానేశాడు. దీంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తల్లి పదే పదే చదువుకోవాలని, విదేశాలలో తండ్రి పడుతున్న కష్టాలను గుర్తు చేస్తూ, మందలిస్తూ వచ్చింది. తమ్ముడు సంజయ్ సైతం ఇదే విషయాన్ని తనకు గుర్తుచేస్తూ రావడంతో నితీష్ ఉన్మాదిగా మారాడు. తనను చదువుకో మని పదేపదే హెచ్చరించడాన్ని తీవ్రంగా పరిగణించి మనో వేదనకు లోనయ్యాడు. ఆత్మహత్య చేసుకోవా లని నిర్ణయించుకున్నాడు. అయితే అంతుకు ముందు గా తన తల్లి, తమ్ముడిని చంపేయాలన్న ఉన్మాద నిర్ణయానికి వచ్చేశాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న తల్లి గొంతుపై విచక్షణా రహితంగా కత్తితో పొడి చి చంపేశాడు. ఆ తర్వాత తమ్ముడు సంజయ్ను కూ డా అలాగే చంపేశాడు. తాను ఉపయోగించి న కత్తిని అక్కడే ఓ కవర్లో ప్యాక్ చేసి పెట్టి, మృత దేహాలను మూట కట్టి పడేసి బయటకు వెళ్లిపోయాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని తొలుత నిర్ణయించి, ధైర్యం చాలక వెనక్కి వచ్చేశాడు. తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అనంతరం అక్కడి థియేటర్లో నైట్ షో చూశాడు. చివరకు ఇంటి తాళం, సెల్ఫోన్ ప్రియ ఇంటి వద్ద ఉంచి సముద్రంలో దూకి ఆత్మహత్యా ప్ర యత్నం చేసి ధైర్యం చాలక, ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్కు వచ్చి పడుకుని నిద్ర పో యాడు. నితీష్ను అరెస్టు చేసిన పోలీసులు కట కటాల్లోకి నెట్టారు. కాగా ఈ హత్య సమాచారంతో ఒమన్ నుంచి తండ్రి చైన్నెకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
![Destruction of monuments continued](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/attacks.jpg.webp?itok=HYrn9gEw)
కొనసాగిన శిలాఫలకాల ధ్వంసం
తెనాలి అర్బన్/భీమవరం (ప్రకాశం చౌక్)/నాగులుప్పలపాడు: అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం యథేచ్ఛగా గత ప్రభుత్వంలో ఏర్పాటైన అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అలాగే దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని పగులకొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తెనాలి 13వ వార్డులో రూ.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాన్ని తాజాగా టీడీపీ కార్యకర్తలు పగులకొట్టారు. అలాగే ఐదో వార్డులో కౌన్సిలర్ తోట రఘురామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. భీమవరంలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శిలాఫలకాలను జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నాటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం టూటౌన్లో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను జనసేన, టీడీపీకి చెందిన అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ప్రశాంతమైన భీమవరంలో ఈ దుశ్చర్య దారుణమని స్థానికులు మండిపడ్డారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని నడిరోడ్డులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద బండరాయితో తొలుత మెడ భాగంలో పగలగొట్టి తల భాగం తీసేయాలని ప్రయత్నించారు. అయితే వీలుకాకపోవడంతో ఎడమ చేతిని బండరాయితో బలంగా కొట్టడంతో ఆ భాగం పూర్తిగా విరిగిపోయింది. వైఎస్సార్సీపీ శ్రేణుల ఫిర్యాదు మేరకు నాగులుప్పలపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఇంటిపై రాళ్ల దాడికొమ్మాది (విశాఖ): గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 4వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు పగిలిపోయాయి. చేపలుప్పాడలో కొండబాబు నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఎలివేషన్ అద్దాలు పగిలిపోయాయి. రాత్రి పెద్ద శబ్దాలు రావడంతో బయటకు వచ్చి చూశానని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కొండబాబు తెలిపారు. అదే సమయంలో కరెంటు లేకపోవడంతో ఎవరు దాడి చేశారో కనబడలేదన్నారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారమివ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారని, వారిని చూసి గుర్తు తెలియని వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. శనివారం భీమిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అండగా ఉంటామని తెలిపారు. దాడులు చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాడిపత్రిలో టీడీపీ నాయకుల బరితెగింపుతాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతూపొంతూ ఉండటం లేదు. శనివారం తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకుడు, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సజ్జలదిన్నె రాజు అనుచరుడు వేణుగోపాల్రెడ్డికి చెందిన నాపరాళ్ల ఫ్యాక్టరీలో బండలను ధ్వంసం చేశారు.దాదాపు 20 చదరాల బండలు ధ్వంసం అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ వారే ధ్వంసం చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రవీంద్రారెడ్డి తన రెండెకరాల పొలంలో నెల క్రితం సాగు చేసిన పత్తి పంటను టీడీపీ వర్గీయులు శనివారం దున్నేసి నాశనం చేశారు. అదే గ్రామానికి చెందిన ఆలూరు రామాంజులరెడ్డి, జూటూరు రామాంజులరెడ్డి ట్రాక్టర్తో తన పంటను దున్నేసినట్లు బాధితుడు వాపోయాడు. దాదాపు రూ.30 వేలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు స్వీకరించలేదు.
![JDS MLC Suraj Revanna quizzed on molestation abuse charge](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/23/suraj.jpg.webp?itok=WZgYhLR7)
సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు
బనశంకరి: జేడీఎస్కు చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దాడి, నగ్న వీడియోల కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా ప్ర జ్వల్ తమ్ముడు డాక్టర్ సూరజ్ రేవణ్ణ (36)పై కూడా లైంగిక వేధింపుల కే సు నమోదైంది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారని చేతన్ కే.ఎస్. అనే జేడీఎస్ కార్యకర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హాసన్ జిల్లా అరకలగూడుకు చెందిన చేతన్ వీడియోల ను కూడా విడుదల చేయడంతో కన్నడ రాజకీయాల్లో మరోసారి సంచల నం చెలరేగింది. లోక్సభ ఎన్నికల సమయంలో పరిచయమైన సూరజ్ ఫాంహౌస్కు పిలిచి లైంగిక దాడికి యతి్నంచాడని చేతన్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేతన్, అతని బంధువు డబ్బులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే లైంగిక వేధింపుల కేసు పెడతామని బ్లాక్మెయిల్ చేశారని సూరజ్ రేవణ్ణ ముఖ్య అనుచరుడైన శివకుమార్ సైతం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో స్నేహం చేసిన చేతన్.. సూరజ్ రేవణ్ణ బ్రిగేడ్కు పనిచేయడం ప్రారంభించాడని, కుటుంబ ఖర్చులకు డబ్బు ఇవ్వాలని కోరగా తాను నిరాకరించడంతో సూరజ్ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసు పెడతామని బెదిరింపులకు దిగారని శివకుమార్ పేర్కొన్నారు. మొదట రూ. 5 కోట్లు తర్వాత దాన్ని తగ్గించి రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నా రు. శివకుమార్ ఫిర్యాదుతో చేతన్, అతని బంధువుపై కేసు నమోదైంది.
![Anti Dacoity Operations In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/22/ts%20police.jpg.webp?itok=N_fgQ9nq)
యాంటీ డెకాయిట్ ఆపరేషన్.. దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : యాంటీ డెకాయిట్ ఆపరేషన్లో దొంగలకు హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. ధార్ భావరియా గ్యాంగ్లే లక్ష్యంగా నగరంలో పలు పప్రాంతాల్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై పోలీసులు కన్నేశారు. పలు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ తరుణంలో హైదరాబాద్ అసిఫ్ నగర్, చిలకలగూడా, సికింద్రాబాద్లో చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సమయంలో కళ్లుగప్పి దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసుల ఫైరింగ్ చేశారు. ఇక యాంటీ డెకాయిట్ ఆపరేషన్లో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు చైనా స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.