Top Stories
ప్రధాన వార్తలు
![Speaker Election: 7 MPs Yet To Take Oath What It Means For Opposition](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/india-allaince.jpg.webp?itok=7oWg3alm)
స్పీకర్ ఎన్నిక: ఓటింగ్కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?
ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. ఓటింగ్పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది.
![Prabhas Kalki 2898 AD Movie Records Latest](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Kalki-2898-AD.jpg.webp?itok=ggobbL8s)
ప్రభాస్ 'కల్కి' సరికొత్త రికార్డులు.. ఆ సినిమాల్ని దాటేసి ఏకంగా!
డార్లింగ్ ప్రభాస్ మరికొన్ని గంటల్లో 'కల్కి'తో రాబోతున్నాడు. మూవీ లవర్స్ మధ్య ఇప్పుడంతా దీని గురించే డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు టికెట్స్ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సరిగా ప్రమోషన్ చేయనప్పటికీ మూవీపై హైప్ ఉహించిన దానికంటే బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే 'కల్కి'తో ప్రభాస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.(ఇదీ చదవండి: 'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో!)'కల్కి' సినిమాకి మన దగ్గర ఫుల్ క్రేజ్ ఉందని తెలిసిందే. అమెరికాలోనూ ఈ మూవీకి మామూలు డిమాండ్ లేదు. ఎందుకంటే ఇప్పటికే లక్ష 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. అలానే 3 మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ జరిగింది. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అమెరికాలో 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' వసూళ్ల రికార్డులు కొట్టుకుపోవడం గ్యారంటీ.ఇక మన దగ్గర కూడా టికెట్స్ బాగానే సేల్ అవుతున్నాయి. అలానే తొలిరోజు వసూళ్లలో 'ఆర్ఆర్ఆర్' అందుకున్న రూ.223 కోట్ల వసూళ్లని 'కల్కి' బ్రేక్ చేయడం కచ్చితం అనిపిస్తోంది. ఎందుకంటే షోల దగ్గర నుంచి టికెట్ రేట్ల వరకు అన్ని పెంచారు. ఇలా విడుదలకు ముందే పలు రికార్డుల్ని సాధిస్తున్న 'కల్కి'.. థియేటర్లకి వచ్చిన తర్వాత ఇంకెన్ని ఘనతలు సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' మిడ్ నైట్ షోలు వేయకపోవడానికి కారణం అదేనా?)
![Eenadu false writings on YS Jagan security](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Jagan_Security_Factcheck.jpg.webp?itok=WX08gM8L)
Fack Check: భద్రతపైనా తప్పుడు రాతలా?
సాక్షి, అమరావతి: అవాస్తవాలు, అభూత కల్పనలే ఆసరాగా బతికేస్తున్న పచ్చ మీడియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై ఈనాడు పత్రిక అభూత కల్పనలతో అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆయనకు 983 మందితో భారీ భద్రత కల్పించినట్లు అబద్ధాలతో కథనాన్ని వండింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లకు ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, ఆ కమిటీ నిర్ణయం మేరకే ఏర్పాట్లు జరుగుతాయన్న కనీస జ్ఞానం ఆ పత్రికకు లేకపోయింది. వాస్తవంగా వైఎస్ జగన్కు ఉన్న భద్రతా సిబ్బంది ఎందరు అన్న విషయాన్ని పరిశీలించాలన్న నైతిక విలువలకూ తిలోదకాలిచ్చి నోటికొచ్చిన సంఖ్యలతో ఉద్దేశపూర్వకంగా దు్రష్పచారం చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద ఈనాడు చెప్పినట్లుగా 983 మంది భద్రతా సిబ్బంది లేరు. కాన్వాయ్ కాంపొనెంట్తో కలిపి కేవలం 196 మందే విధుల్లో ఉన్నారు. అదీ షిఫ్ట్లులవారీగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశం కాకుండానే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లను ఉన్నత స్థాయిలోని సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ కమిటీ సూచనల మేరకే భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రీ తనకు ఇంత భద్రత కావాలని అడగరు. సెక్యూరిటీ రివిజన్ కమిటీయే అన్ని అంశాలను విశ్లేíÙంచి ఎంత మేర భద్రత కల్పించాలన్నది ఖరారు చేస్తుంది. ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు తదితర అంశాలను కూడా ఈ కమిటీ ఆదేశాల మేరకే చేపడతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం మేరకే చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇంకా సమావేశమవ్వనే లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లపై సమీక్షించనే లేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమే. నాడు బాబు మనవడికి కూడా భద్రత2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మనవడు దేవాన్‡్షకు కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారనే వాస్తవాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్‡్షకు ప్రత్యేకంగా భద్రత కల్పించారు.ఉండవల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసంతోపాటు హైదరాబాద్లోని వారి నివాసం, చివరకు ఫామ్ హౌస్ వద్ద కూడా భారీ భద్రత కల్పించడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కల్పించిన భద్రతకంటే ఎన్నో రెట్లు అధికంగా భద్రత కల్పించారు. ఈ అధికార దురి్వనియోగంపై ఏనాడూ పట్టించుకోని ఈనాడు.. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు నిబంధనల ప్రకారం వైఎస్ జగన్కు కల్పించిన భద్రతపై అభూత కల్పనలు ప్రచురించింది. వివిధ విభాగాల నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలు సివిల్ పోలీసులు: సీఐ–1, ఎస్సైలు–4, హెడ్ కానిస్టేబుల్–1, కానిస్టేబుళ్లు –12 , మహిళా కానిస్టేబుల్ –1. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు: ఆర్ఎస్సైలు – 2, ఏఆర్ఎస్సై –1, కానిస్టేబుళ్లు – 28 ఏపీఎస్పీ: డీఎస్పీ –1, ఆర్ఎస్సై – 3, ఏఆర్ఎస్సై–2, హెడ్ కానిస్టేబుళ్లు – 14, కానిస్టేబుళ్లు – 69 ఆక్టోపస్: ఆర్ఐ –1, ఆర్ఎస్సైలు –2, కానిస్టేబుళ్లు–10 మొత్తం: 152 మంది ఐసోలేషన్లో: అదనపు ఎస్సీ – 1, ఆర్ఐ – 2, ఆర్ఎస్సై – 3, కానిస్టేబుళ్లు – 17 మొత్తం: 23 మంది కాన్వాయ్ విభాగంలో: సీఐ – 1, ఎస్సై – 3, హెడ్ కానిస్టేబుల్ – 1, కానిస్టేబుళ్లు – 16 మొత్తం: 21 మంది.
![ICC names Chris Gaffaney And Rod Tucker as umpires for India vs England semifinal](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/india_0.jpg.webp?itok=mtVn777i)
భారత్- ఇంగ్లండ్ సెమీఫైనల్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు
టీ20 వరల్డ్కప్-2024లో ఆసాధరణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా.. ఇప్పుడు రసవత్తర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సెకెండ్ సెమీఫైనల్లో భాగంగా గురువారం(జూన్ 27) గయనా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి గత వరల్డ్కప్లో సెమీస్ ఓటమికి భారత్ బదులు తీర్చుకోనుంది. కాగా ఈ మ్యాచ్ కోసం ఐసీసీ తాజాగా అంపైర్లు జాబితాను ప్రకటించింది. భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, రాడ్ టక్కర్ వ్యవహరించనున్నారు. అదేవిధంగా థర్డ్ అంపైర్గా జోయెల్ విల్సన్, ఫోర్త్ అంపైర్గా పాల్ రీఫిల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మ్యాచ్ రిఫరీగా జెఫ్రీ క్రోవ్ వ్యవహరించనున్నాడు. ఈ జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో లేకపోవడం భారత అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 2014 నుంచి అతడు అంపైర్గా ఉన్న ఏ నకౌట్ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించలేదు. దీంతో ఫ్యాన్స్ రిచర్డ్ కెటిల్బరోను ఐరెన్ లెగ్ అంపైర్గా పిలుస్తుంటారు. మరోవైపు అఫ్గానిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి సెమీఫైనల్కు రిచర్డ్ ఇల్లింగ్వర్త్, నితిన్ మీనన్లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. అయితే రిచర్డ్ కెటిల్బరో మాత్రం తొలి సెమీఫైనల్లో భాగమయ్యాడు. ఈ మ్యాచ్కు థర్డ్ అంపైర్గా కెటిల్బరో పనిచేయనున్నాడు. అహ్సన్ రజా నాల్గవ అంపైర్గా వ్యవహరించనున్నాడు.
![Junior doctors temporarily ends strike in telangana](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/juda.jpg.webp?itok=sFl8nl5b)
TG: తాత్కాలికంగా సమ్మె విరమించిన జూడాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే తెలుస్తోంది. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించినట్లు తెలుస్తోంది. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు.. ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే.. రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు.మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు. స్టైఫండ్స్, విద్యార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం వెంటనే చేపట్టాలనే ఎనిమిది ప్రధాన డిమాండ్లతో జూన్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు సమ్మె ప్రారంభించారు. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉంటూనే.. ఆస్పత్రుల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
![Daily Horoscope On June 26, 2024 In Telugu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/144.jpg.webp?itok=aNmn7BFQ)
జూన్ 26 దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: బ.పంచమి రా.10.48 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ధనిష్ట ప.3.27 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: రా.10.14 నుండి 11.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.37 నుండి 12.29 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.34. మేషం....ఇంటాబయటా అనుకూలం..పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటి నిర్మాణయత్నాలు. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృషభం...పనులు సకాలంలో పూర్తి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.మిథునం...పనులలో స్వల్ప ఆటంకాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.కర్కాటకం...పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.సింహం...పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. దైవదర్శనాలు.కన్య...వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.తుల...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.వృశ్చికం.....కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు.ధనుస్సు....ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం.మకరం....ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం...సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి.మీనం...కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.
![YS Jagan letter to AP Assembly Speaker Ayyannapatrudu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/Jagan-Sir_2-final.jpg.webp?itok=k3ZsC91A)
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా.
![Delhi High Court stays trial court order granting bail to Arvind Kejriwal in Excise policy case](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/KEJRIWAL.jpg.webp?itok=F_REiYX8)
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సుధీర్కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
![Adani To Invest RS 2 Lakh Crore In Renewable Energy Capacity Growth By 2030](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/ADANI%20GREEN%20ENERGY.jpg.webp?itok=KrdJ2P6Q)
భారీ పెట్టుబడులకు అదానీ రెడీ
అహ్మదాబాద్: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ పునరుత్పాదక (రెన్యువబుల్స్ౖ) విద్యుదుత్పత్తిపై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. 2030కల్లా 40 గిగావాట్ల (జీడబ్ల్యూ) పునరుత్పాదక సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తద్వారా 2050కల్లా వివిధ బిజినెస్లలో నికరంగా కర్బనరహితం(నెట్ జీరో)గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం గ్రూప్ పునరుత్పాదక(సౌర, పవన) విద్యుత్లో 10 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది.ఇకపై ప్రతీ ఏడాది 6–7 జీడబ్ల్యూను జత చేసుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా 50 గిగావాట్లకు చేరుకునే లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక్కో మెగావాట్కు రూ. 5 కోట్ల పెట్టుబడుల అంచనాతో మదింపు చేస్తే 2030కల్లా రూ. 2 లక్షల కోట్లను వెచ్చించవలసి ఉంటుందని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ వెల్లడించారు. వీటితోపాటు 5 జీడబ్ల్యూ పంప్ స్టోరేజీ సామర్థ్యా న్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ సీఈవో అమిత్ సింగ్ తెలిపారు. విద్యుత్కు అధిక డిమాండ్ నెలకొనే రాత్రి వేళల్లో విద్యుదుత్పత్తికి వీలుగా స్టోరేజీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. కార్బన్ క్రెడిట్స్.. రెన్యువబుల్ సామర్థ్యాల వినియోగం ద్వారా లభించే కార్బన్ క్రెడిట్స్కుతోడు మరికొన్ని ఇతర చర్యల ద్వారా 2050కల్లా అదానీ గ్రూప్ నెట్ జీరోకు చేరనున్నట్లు అమిత్ పేర్కొన్నారు. గతేడాది(2023–24) అదానీ గ్రీన్ ఎనర్జీ 2.8 జీడబ్ల్యూ సామర్థ్యాలను జత చేసుకున్నట్లు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 6 జీడబ్ల్యూ సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కాగా, అదానీ గ్రూప్ ఈ ఏడాది (2024–25) వివిధ విభాగాలపై భారీ పెట్టుబడుల ప్రణాళికలు ప్రకటించింది. వివిధ కంపెనీలలో రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చించనుంది.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి
- అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
- హీరోయిన్ సోనాక్షికి లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?
- ప్రాణం తీసిన ‘లవ్ ప్రపోజల్’
- కాజీపేట-బల్లార్ష రూట్లో పనులు.. పలు రైళ్లు రద్దు
- ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి
- నాడు కారుకూతలు.. నేడు పథకాల్లో కోతలు
- రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
- 'మాన్సాస్' కౌలు కిరికిరి
- ‘విద్యుత్’ కమిషన్ విచారణ నిలిపేయండి
- ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి
సినిమా
![Janhvi Kapoor And Sunny Leone Latest Pics And News](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/janhvi-kapoor-sunny-leone.jpg.webp?itok=mMVddoYO)
జాన్వీ గ్లామర్ ఫ్యూజులు ఔట్.. సన్నీ లియోన్ సొగసులు!
జాన్వీ కపూర్ జిగేలు.. హాట్నెస్ మామూలుగా లేదుగాటైట్ డ్రస్సులో తమన్నా వయ్యారాలు.. చూస్తే మెంటలేహాట్ బ్యూటీ సన్నీ లియోన్ సొగసులు చూడతరమాసంప్రదాయ చీరకట్టులో రష్మిక.. ఇలా ఎప్పుడూ చూసుండరు'పొలిమేర' బ్యూటీ అందాల జాతర.. ఇలా ఉందేంట్రా బాబుపూనమ్ పరువాల విందు.. చీరలో బొద్దుగుమ్మలాపూల్లో గ్లామర్ చూపించి మరీ రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియానా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555)
![Salaar Hero Super Hit Movie Release In Ott On This Date](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/malayalm.jpg.webp?itok=tPTtLQig)
ఓటీటీకి సలార్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. #GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024
![Actor Tamayo Perry Shark Incident In Hawaii Beach](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/tamayo-perry.jpg.webp?itok=o9DcaYKA)
సొరచేప వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటుడు
హాలీవుడ్ హిట్ సినిమా 'పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్' మూవీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో నటించిన తమయో పెర్రీ (49) అనే నటుడు ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనితో పాటు పలు చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు. ఇప్పుడు ఇతడు ఊహించని విధంగా షార్క్ చేప దాడిలో మరణించాడు. హువాయి బీచ్లో సర్ఫింగ్ చేస్తుండగా, ఈ సంఘటన చోటు చేసుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)స్వతహాగా నటుడు అయినప్పటికీ తమయో పెర్రీ.. గతంలో ఓషన్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. లైఫ్ గార్డ్గానూ విధులు నిర్వర్తించాడు. అలానే సర్ఫింగ్లోనూ మంచి ఎక్స్పెర్ట్. కానీ హవాయి బీచ్లో అదే సర్ఫింగ్ చేస్తుండగా ఇతడిపై సొరచేప దాడి చేసింది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి, అధికారులకు సమాచారం ఇవ్వగా ఇతడిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కానీ అప్పటికే గాయాలు తీవ్రంగా ఉండేసరికి ప్రాణాలు వదిలేశాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో జయం రవి విడాకుల రూమర్స్.. హింట్ ఇచ్చిన భార్య?)
![Tollywood Actress Sreeleela Visits Tirumala Video Goes Viral](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sreelea.jpg.webp?itok=fVjVRBj8)
శ్రీలీల బుగ్గ గిల్లిన తమన్.. అంత పని చేశాడేంటి?
టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. పెళ్లిసందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ తర్వాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం లాంటి చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం ఆమె నితిన్ సరసన రాబిన్ హుడ్ చిత్రంలో కనిపించనున్నారు. అంతేకాకుండా రవితేజతో మరోసారి జతకట్టేందుకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తాజాగా హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న శ్రీలీలను అప్యాయంగా పలకరించారు. సరదాగా ఆమె బుగ్గలు గిల్లి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. శ్రీలీల నటించిన స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం సినిమాలకి తమన్ సంగీతమందించారు.திருப்பதியில் நடிகை ஸ்ரீலீலா..கூட்டத்தில் சிக்கிய நடிகை..பதறி போன பௌன்சர்ஸ்..! #thirupathi #sreeleela #thanthitv pic.twitter.com/SoCnn3jCE8— Thanthi TV (@ThanthiTV) June 25, 2024
ఫొటోలు
![Rishab Shetty joins promotions of Kalki 2898 AD goes for a ride with Bujji Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Rishab%20Shetty%20joins%20promotions%20of%20Kalki%202898%20AD%20goes%20for%20a%20ride%20with%20Bujji%20Photos%20%2814%29.jpg.webp?itok=t_FSlH5I)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Rishab%20Shetty%20joins%20promotions%20of%20Kalki%202898%20AD%20goes%20for%20a%20ride%20with%20Bujji%20Photos%20%2814%29.jpg.webp?itok=t_FSlH5I)
పవర్ కపుల్ స్వీట్ మెమరీస్ : రిషబ్ శెట్టి చేతికి కల్కి ‘బుజ్జి’ (ఫొటోలు)
![Afghanistan erupts in celebration as team reaches T20 World Cup semifinal Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Afghanistan%20erupts%20in%20celebration%20as%20team%20reaches%20T20%20World%20Cup%20semifinal%20Photos%20%2813%29.jpg.webp?itok=oJ91adHt)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Afghanistan%20erupts%20in%20celebration%20as%20team%20reaches%20T20%20World%20Cup%20semifinal%20Photos%20%2813%29.jpg.webp?itok=oJ91adHt)
తొలిసారి వరల్డ్కప్ సెమీస్లో.. అఫ్గన్లో అంబరాన్నంటిన సంబరాలు (ఫొటోలు)
![Nita Ambani Visit Kashi Vishwanath Temple Viral Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Nita%20Ambani%20Visit%20Kashi%20Vishwanath%20Temple%20Viral%20Photos%20%2811%29.jpg.webp?itok=jj_FFqYF)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Nita%20Ambani%20Visit%20Kashi%20Vishwanath%20Temple%20Viral%20Photos%20%2811%29.jpg.webp?itok=jj_FFqYF)
త్వరలో కొడుకు పెళ్లి.. కాశీలో సందడి చేసిన 'నీతా అంబానీ' (ఫొటోలు)
![David Warner Retires International Cricket After Australia T20 World Cup Exit.. Have you seen the beautiful family? Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/David%20Warner%20Goodbye..%20Have%20you%20seen%20the%20beautiful%20family%20Photos%20%2829%29.jpg.webp?itok=YOVC8zEo)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/David%20Warner%20Goodbye..%20Have%20you%20seen%20the%20beautiful%20family%20Photos%20%2829%29.jpg.webp?itok=YOVC8zEo)
డేవిడ్ వార్నర్ గుడ్ బై.. అందమైన కుటుంబాన్ని చూశారా?(ఫొటోలు)
![Dancers Start practising For The Olympics opening Show Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Dancers%20Start%20practising%20For%20The%20Olympics%20opening%20Show%20Photos%20%2817%29.jpg.webp?itok=wSICSK3V)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Dancers%20Start%20practising%20For%20The%20Olympics%20opening%20Show%20Photos%20%2817%29.jpg.webp?itok=wSICSK3V)
పారిస్ ఒలింపిక్స్ 2024: సన్నాహకాలు.. ఓ లుక్కేయండి (ఫొటోలు)
క్రీడలు
![The Spanish team registered a hat trick victory](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/26/spain.jpg.webp?itok=8Hfb8lio)
స్పెయిన్ ‘హ్యాట్రిక్’
డసెల్డార్ఫ్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ స్పెయిన్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయం నమోదు చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా అల్బేనియాతో జరిగిన లీగ్ మ్యాచ్ లో స్పెయిన్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 13వ నిమిషంలో స్పెయిన్ జట్టుకు ఫెరాన్ టోరెస్ ఏకైక గోల్ అందించాడు. మూడు విజయాలతో స్పెయిన్ తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘బి’ టాపర్గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. గ్రూప్ ‘బి’లో భాగంగా క్రొయేషియా జట్టుతో జరిగిన మ్యాచ్ను డిఫెండింగ్ చాంపియన్ ఇటలీ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. క్రొయేíÙయా తరఫున లూకా మోడ్రిచ్ (55వ ని.లో), ఇటలీ తరఫున జకాగ్ని (90+8వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. యూరో టోర్నీ చరిత్రలో గోల్ చేసిన అతి పెద్ద వయస్కుడిగా మోడ్రిచ్ (38 ఏళ్ల 289 రోజులు) గుర్తింపు పొందాడు. నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన ఇటలీ జట్టు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్ ‘డి’లో జరిగిన మ్యాచ్ల్లో ఆస్ట్రియా 3–2తో నెదర్లాండ్స్ను ఓడించగా... ఫ్రాన్స్, పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ‘డి’ గ్రూప్ నుంచి ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ ప్రిక్వార్టర్స్కు చేరుకున్నాయి.
![If South Africa Beat Afghanistan in Semis They Will Win T20 WC Title: Brad Hogg](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sa1_0.jpg.webp?itok=hEdLnc3a)
అఫ్గనిస్తాన్ను ఓడిస్తే టైటిల్ సౌతాఫ్రికాదే: ఆసీస్ దిగ్గజం
టీ20 ప్రపంచకప్లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. దర్జాగా సెమీస్లోకాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించి దర్జాగా సెమీస్లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్కు చేరాయి.మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు.వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయంరోవ్మన్ పావెల్ (1), రూథర్ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్ను ఓడించి తొలిసారి వరల్డ్కప్లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.అఫ్గనిస్తాన్ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో అతడు అదరగొట్టి ఫైనల్కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.సౌతాఫ్రికా సెమీస్లో గనుక అఫ్గనిస్తాన్ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.చదవండి: ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్
![Sehwag Comments On Gill Being Appointed India Captain For Zimbabwe Series](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/gill2.jpg.webp?itok=9UH6fETG)
టీమిండియా కెప్టెన్గా అతడే సరైనోడు: సెహ్వాగ్
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.జూలై 6, 7, 10, 13, 14వ తేదీల్లో హరారే వేదికగా జరుగనున్న ఈ సిరీస్కు టీమిండియా సీనియర్లంతా దూరంగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ గైర్హాజరీ కారణంగా.. తొలిసారిగా ఈ పంజాబీ బ్యాటర్కు టీమిండియా కెప్టెన్గా వ్యవహరించే సువర్ణావకాశం లభించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ శర్మ తర్వాత అతడేరోహిత్ శర్మ వారసుడిగా శుబ్మన్ గిల్ సరైన ఎంపిక అంటూ సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని సమర్థించాడు. ఈ మేరకు క్రిక్బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘శుబ్మన్ గిల్కు ఎంతో భవిష్యత్తు ఉంది.మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడగల సత్తా అతడికి ఉంది. గతేడాది తనకు గొప్పగా గడిచింది. అయితే, దురదృష్టవశాత్తూ టీ20 ప్రపంచకప్-2024 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.సరైన నిర్ణయంనా అభిప్రాయం ప్రకారం.. గిల్ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయం. రోహిత్ శర్మ వెళ్లిన తర్వాత శుబ్మన్ గిల్ మాత్రమే కెప్టెన్సీకి పూర్తి న్యాయం చేయగలుగుతాడు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ గిల్ నైపుణ్యాలపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు.అదే విధంగా.. జింబాబ్వేతో సిరీస్కు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్పాండే, రియాన్ పరాగ్ వంటి ఐపీఎల్ హీరోలను ఎంపిక చేయడం పట్ల సెహ్వాగ్ స్పందించాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదన్నాడు.జింబాబ్వే టూర్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ , తుషార్ దేశ్పాండే.
![Rohit Deserves To Lift Trophy: Akhtar Wants India to Win T20 WC 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/wc1.jpg.webp?itok=w0olsTqW)
ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. లీగ్, సూపర్-8 దశలో ఓటమన్నదే ఎరుగక రోహిత్ సేన సెమీ ఫైనల్ చేరుకుంది. కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్లో అడుగుపెట్టేందుకు.. ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది.సెయింట్ లూసియా వేదికగా గురువారం(జూన్ 27) ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2023లోనే రోహిత్ ట్రోఫీ గెలవాల్సిందని.. ఈసారి కూడా టీమిండియాకే గెలిచే అర్హత ఉందని పేర్కొన్నాడు.‘‘ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్కప్. ఈసారి మీరు కచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచకప్ ట్రోఫీ ఉండాలి.ఇటీవలే మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. ఈసారి మాత్రం వందకు వంద శాతం మీకే టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే. రోహిత్ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు అతడు అర్హుడు.వన్డే వరల్డ్కప్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సారి బదులు తీర్చుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బకొట్టింది’’ అని షోయబ్ అక్తర్ భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తాడు.కాగా సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన మ్యాచ్లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్(41 బంతుల్లో 92)తో జట్టుకు విజయం అందించాడు.మరోవైపు.. దాయాది పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్-ఏలో అమెరికా, టీమిండియా చేతిలో ఓడిపోయి.. సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్ ఆజం బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. India's perfect revenge on a big stage pic.twitter.com/bcuK19Bbzz— Shoaib Akhtar (@shoaib100mph) June 24, 2024
బిజినెస్
![Anand Mahindra Says Never Underestimate Your self](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/anand-mahindra.jpg.webp?itok=AlDG4SaO)
మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకోకండి.. ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల మండే మోటివేషన్ పేరుతో మరో ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు.ఆనంద్ మహీంద్రా వీడియోను షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కండబలం మీకు ఉండవచ్చు'' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరాల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. బలంగా కండలు కలిగిన వ్యక్తి ఆస్ట్రేలియా అని, అతై ముందు ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అని చూడవచ్చు. ఈ వీడియో చూస్తే ఎవరైనా ఆస్ట్రేలియా వ్యక్తి గెలుస్తాడని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆఫ్గనిస్తాన్ వ్యక్తి గెలుస్తారు. దీన్ని ఉదాహరణగా చెబుతూ.. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అని పేర్కొన్నారు.Never underestimate yourself. You may have more muscles than you imagine…#MondayMotivationpic.twitter.com/vKiC23jJCU— anand mahindra (@anandmahindra) June 24, 2024
![Elon Musk Welcomes His 12th Child He Says That is Not Secret](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/elon-musk_1.jpg.webp?itok=tFzJMJTG)
మరో బిడ్డకు తండ్రైన మస్క్.. ఇదేమీ సీక్రెట్ కాదు
టెస్లా బాస్ ఇలాన్ మస్క్ (Elon Musk).. న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్తో మరో బిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మస్క్ స్పందింస్తూ.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు.మా స్నేహితులకు, కుటుంబ సభ్యులందరికీ తెలుసు. పత్రికా ప్రకటనను విడుదల చేయకాపోతే.. అదేమీ సీక్రెట్ కాదని అన్నారు. అయితే పుట్టిన బిడ్డ ఆడబిడ్డ, మగబిడ్డ అనే విషయాన్ని మస్క్ స్పష్టం చేయలేదు.ఇప్పటికే ఇలాన్ మస్క్కు ఇప్పటికే తన మొదటి భార్య జస్టిన్ మస్క్ ద్వారా ఐదుమంది, రెండో భార్య గ్రిమెస్ ద్వారా ముగ్గురు, షివోన్ జిలిస్ ద్వారా నలుగురు (ఈమెకు 2021లో కవలలు జన్మించారు).. ఇలా మొత్తం 12మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా ఇలాన్ మస్క్ 2022 జులైలో పెద్ద కుటుంబాలకే తన సపోర్ట్ తెలుపుతూ.. బ్రేవో టు బిగ్ ఫ్యామిలీస్ అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి ఎంతమంది పిల్లలతో సమయం గడపగలిగితే.. అంతమంది పిల్లలను కలిగి ఉండాలని, మంచి తండ్రిగా కూడా ఉండాలని గతంలో మస్క్ వెల్లడించారు. నాగరికత ఎదుర్కొంటున్న అతి పెద్ద ప్రమాదం.. తగ్గుతున్న జనన రేటు మస్క్ అప్పట్లోనే ట్వీట్ చేశారు.
![Anant Ambani In Ajay Devgan Bungalow Viral Video](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/ananth-ambani-in-ajay-devgan-house.jpg.webp?itok=mEuE5jDf)
అజయ్ దేవగన్ నివాసంలో అనంత్ అంబానీ - వీడియో
అనంత్ అంబానీ వచ్చే నెలలో రాధికా మర్చంట్ను వివాహం చేసుకోనున్నారు. వివాహ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తమ పెళ్ళికి ఆహ్వానించడానికి అనంత్ అంబానీ స్వయంగా అజయ్ దేవగన్, కాజోల్ నివాసానికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అనంత్ అంబానీ.. అజయ్ దేవగన్ ఇంటి నుంచి బయటకు వచ్చి తన రోల్స్ రాయిస్ కారులోకి వెళ్లడం చూడవచ్చు. ఆ తరువాత తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఇదిలా ఉండగా అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి కార్డును దేవుని చెంత ఉంచడానికి, దేవుని ఆశీర్వాదం పొందటానికి అక్కడకు వెళ్లినట్లు నీతా అంబానీ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జూలై 12న పెళ్లి2024 జులై 12న వీరి పెళ్లి జరుగుతుందని ఇప్పటికే వారిరువురి కుటుంబాలు పేర్కొన్నాయి. అనంత్ & రాధికల పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజులు జరగనుంది. జులై 12న వివాహం, 13న శుభ్ ఆశీర్వాద్, 14న మంగళ ఉత్సవ్ లేదా రిసెప్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్ళికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు.ముకేశ్ & నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్ఫారమ్లు, రిలయన్స్ రిటైల్ వెంచర్స్, రిలయన్స్ న్యూ ఎనర్జీ, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీతో సహా పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీల బోర్డులలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. View this post on Instagram A post shared by Voompla (@voompla)
![Stock Market Rally On Today Closing](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/outlook.jpg.webp?itok=9d8Fi7km)
జీవితకాల గరిష్ఠాలను చేరిన స్టాక్మార్కెట్లు.. సెన్సెక్స్@78,000
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం ఆల్టైమ్హై చేరాయి. బ్యాంకింగ్ రంగ స్టాక్లు భారీగా పెరగడంతో మార్కెట్ సూచీలు లాభాలతో దూసుకుపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 184 పాయింట్లు పెరిగి 23,722 వద్దకు చేరింది. సెన్సెక్స్ 720 పాయింట్లు ఎగబాకి 78,061 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ఫార్మా, ఆల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి.పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, హెచ్యూఎల్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
వీడియోలు
![Unfortunate Fire Incident In Software Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/fi.jpg.webp?itok=Q8IkmrYH)
![Unfortunate Fire Incident In Software Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/fi.jpg.webp?itok=Q8IkmrYH)
జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో చెలరేగిన మంటలు
![Asaduddin Owaisi Oath Taking Speech In Parliament Got Controversy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/os_0.jpg.webp?itok=_usrzlcS)
![Asaduddin Owaisi Oath Taking Speech In Parliament Got Controversy](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/os_0.jpg.webp?itok=_usrzlcS)
అసదుద్దీన్ ప్రమాణస్వీకారం పై లోక్ సభ లో దుమారం
![MLC Jeevan Reddy Resignation](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/st.jpg.webp?itok=e1Bd37za)
![MLC Jeevan Reddy Resignation](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/st.jpg.webp?itok=e1Bd37za)
శాంతించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
![Telangana High Court Big Relief to Former CM KCR](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/cr_0.jpg.webp?itok=kOzS8Y1j)
![Telangana High Court Big Relief to Former CM KCR](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/cr_0.jpg.webp?itok=kOzS8Y1j)
హైకోర్టులో మాజీ సీఎం సీఎం కేసీఆర్కు ఊరట...
![Delhi Government Big Shock to TDP Government](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/b_2_0.jpg.webp?itok=YYuxvuuP)
![Delhi Government Big Shock to TDP Government](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/b_2_0.jpg.webp?itok=YYuxvuuP)
టీడీపీ ప్రభుత్వానికి ఢిల్లీ హై కోర్టు షాక్
![YS Jagan Open Letter to Speaker Ayyannapatrudu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/ja_1.jpg.webp?itok=S4ERHD_u)
![YS Jagan Open Letter to Speaker Ayyannapatrudu](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/ja_1.jpg.webp?itok=S4ERHD_u)
అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి లేదు.. స్పీకర్ కు జగన్ బహిరంగ లేఖ
![Election For Lok Sabha Speaker For First Time In India History](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sr_1.jpg.webp?itok=844mQrCy)
![Election For Lok Sabha Speaker For First Time In India History](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sr_1.jpg.webp?itok=844mQrCy)
స్పీకర్ పదవికి తొలిసారి ఎన్నిక
![NDA Picks Om Birla For Speaker](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/tw.jpg.webp?itok=B9hUjc0m)
![NDA Picks Om Birla For Speaker](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/tw.jpg.webp?itok=B9hUjc0m)
స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్
![Government Employees Impatience against TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/t_0.jpg.webp?itok=60FSdXjl)
![Government Employees Impatience against TDP Leaders](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/t_0.jpg.webp?itok=60FSdXjl)
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు ప్రభుత్వోద్యోగుల వార్నింగ్..
![Clashes In AP Congress Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sh_0.jpg.webp?itok=_kIHI9uG)
![Clashes In AP Congress Politics](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/sh_0.jpg.webp?itok=_kIHI9uG)
షర్మిల ఒంటెత్తు పోకడలు..
ఫ్యామిలీ
![Celebrity Mehendi Artist Veena Nagda Who Charges Much For One Design](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/Design.jpg.webp?itok=kiBsvjX4)
సెలబ్రిటీ మెహందీ ఆర్టిస్ట్ వీణా నగ్దా..ఒక్కో డిజైన్కి ఎంత ఛార్జ్ చేస్తారంటే..
పెళ్లిళ్లు, పండుగలు, ఇతర వేడుకల్లో కచ్చితంగా అమ్మాయిల చేతికి ఉండేది మెహిందీ. ఇది లేకుంటే పండుగే లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంది. కొందరూ మాత్రం ఈ రంగంలో మంచి అందె వేసిన చేయిలా నైపుణ్యం సంపాదిస్తున్నారు. సెలబ్రెటీ స్థాయి మెహిందీ డిజైనర్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు వీణ నగ్దా. ఆమె ముంబైలో ప్రముఖ మెహిందీ డిజైనర్లో ఒకరుగా పేరు ప్రఖ్యాతులు గాంచారుఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు అభిమానులు. తన సృజనాత్మకతో కూడిన కళా నైపుణ్యంతో వేలకొద్దీ అభిమానులను సంపాదించుకున్నారు వీణా. ఆమె వేసే మెహిందీ డిజైన్లు అన్ని చాలా క్లిష్టమైనవే. అదే ఆమె ప్రత్యేకత. మరొకరు అనుకరించడం కూడా కష్టమే. ప్రతీ డిజైన్ను విభిన్న కళానైపుణ్యంతో వేస్తారామె. అంతేగాదు ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్-రాధికల ప్రీ వివాహ వేడుకలో కూడా ఆమెనే మెహిందీ డిజైనర్. ముఖేష్, నీతా అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్గా పెట్టుకున్నారు. ఆ వేడుకకు హాజరైన అతిధులకు మెహందీలు పెట్టే బాధ్యత ఈమెదే. అయితే ఇలా డిజైన్ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఛార్జ్ చేస్తారట. సాధారణంగా ఒక్కో డిజైన్కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. సాధారణ మెహిందీ ప్రారంభ డిజైనే ఏకంగా రూ. 5,500 నుంచి మొదలవుతుందట. దీపిక పడుకోన్-రణవీర్ సింగ్, కృతి ఖర్బందా-పుల్కిత్ సామ్రాట్ వంటి ప్రముఖల వివాహాల్లో మెహిందీ డిజైనర్ వీణ నగ్దానే. ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకలో ఆమె కచ్చితంగా ఉంటారు. వీణ మెహిందీ డిజైన్లలోని మ్యాజిక్ అలాంటిది మరి.
![how to make tasty Potato Rice or Aloo Rice](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/aloorice_raita_recipe.jpg.webp?itok=1npZraVS)
Potato Rice ఆలూ రైస్.. పిల్లలు భలే తింటారు!
దుంపకూరల్లో దాదాపు అందరికీ ఇష్టమైంది బంగాళదుంప, ఆలూ లేదా పొటాటో. బంగాళదుంపతో చేసిన వంటకాలంటే పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఆలూ కూర, ఫ్రై ఎలా చేసినా దాని రుచే వేరు. చిన్న ముక్కలుగా కోసి, నూనెల సింపుల్గా వేయించి ఉప్పు, కారం కాస్త జీలకర్ర చల్లినా కూడా టేస్ట్ అదిరి పోతుంది. బంగాళా దుంపతో ఆలూ ఫ్రై, కూర్మా, ఇంకా వివిధ కూరగాయలతోపాటు మిక్స్డ్ కర్రీగా.. ఇలా చాలా రకాలుగా వండుకోవచ్చు. ఇపుడు మాత్రం వెరైటీగా ఆలూ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చేసుకోవడం తేలిక, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.కావలసిన పదార్థాలుబాస్మతి బియ్య రెండు కప్పులు (మామూలు రైస్ అయినా పరవాలేదు) చిన్నముక్కలుగా తరిగిన బంగాళా దుంప ముక్కలు అరకప్పుతరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీరతయారీబియ్యాన్నిశుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టి, తరువాత పొడి పొడిగా ఉండేలా వండి పక్కన పెట్టుకోవాలి.ప్యాన్లో కొద్దిగా నూనె వేయాలి. బాగా వేడెక్కిన తరువాత జీలకర్ర వేసి, అవి చిటపట మన్నాక కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి మరి కొద్దిసేపు వేయించాలి. ఇవి వేగాక తరిగిన బంగాళదుంపలు, ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి. స్పైసీ రుచి కావాలంటే కొద్దిగా మిరియాలుగానీ, కొద్దిగా మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు.బాగా వేగిన తరువాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకొని బాగా కలపాలి. పైన రెండు స్పూన్ల వేస్తే రైస్ పొడిగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని, చక్రాల్లా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడిగా వేడిగా ఆరగించడమే. కీరా కలిపిన రైతాతో తింటే ఇంకా బావుంటుంది.
![Dasara Beauty Keerthy Suresh In Ultra Stylish Looks Photos Goes Viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Keerthy-Suresh-Latest-Photos.jpg.webp?itok=WjyWDoMt)
అల్ట్రా స్టైలిష్ లుక్స్లో దసరా బ్యూటీ (ఫొటోలు)
![Tollywood Actress Raashii Khannas In Different Fashion Looks](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/06/25/Raashii_Khanna.jpg.webp?itok=_vtNPaC0)
డిఫరెంట్ లుక్స్లో రాశి ఖన్నా.. అందిరిందన్నా.. (ఫోటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ముఖ్యమంత్రి అంటే ‘కటింగ్ మాస్టరా’?.. తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ఒకే దఫా రైతుల పంట రుణాల మాఫీ... రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 47 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్యాలెట్టే బెటర్. ‘ఎక్స్’లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానాన్ని వదులుకోనున్న రాహుల్ గాంధీ.. వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయొచ్చు, ఎన్నికల్లో వీటిని ఉపయోగించొద్దు... స్పేస్ ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పష్టీకరణ... ఈవీఎంలు బ్లాక్బాక్సుల్లాంటివేనన్న రాహుల్ గాంధీ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![young woman missing in hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/688_1.jpg.webp?itok=5gf8l4co)
Hyderabad: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
వెంగళరావునగర్: తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు నామవరపు జ్యోత్స్న శ్రీ (17) భద్రాచలంలో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివింది. అనంతరం ఆమెను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ తల్లి రజిని భద్రాచలంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో బైపీసీలో వేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న జ్యోత్స్నశ్రీ తనకు ఇంగ్లిష్ పాఠాలు అర్థం కావడం లేదంటూ చదువు మానేసి హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలోని తన పిన్ని స్వరూప ఇంటికి వచి్చంది. భర్తతో విభేదాలు రావడంతో గత ఏడాది నుంచి జ్యోత్స్నశ్రీ తల్లి కూడా స్వరూప ఇంట్లోనే ఉంటుంది. నాలుగురోజులుగా ఆ యువతి అమీర్పేటలోని ఓ షోరూంలో పని చేస్తుంది. ఆమె సరిగ్గా పని చేయకపోవడంతో షాపు ఓనర్ నాగమణి యువతి తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఇటీవల యువతి తల్లి భద్రాచలం వెళ్లింది. అక్కడ నుంచి తన కుమార్తెకు ఫోన్ చేసి అటు చదువుకోకపోగా పని కూడా సరిగ్గా చేయకపోతే ఎలా అంటూ మందలించింది. దాంతో ఆ యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేకని సమయంలో ఆ యువతి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచి్చన స్వరూప తలుపు గడియకూడా పెట్టకుండా ఉండటంతో లోపలకు వెళ్లింది. స్వరూపకు జ్యోత్న్స ఉరేసుకుని ఉండటం చూసి 108కి ఫోన్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మృతురాలి పిన్ని మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![A Man Arrested For Murder Of Indian Man Dasari Gopikrishna In US](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/Dasari%20Gopikrishna-us.jpg.webp?itok=7Z29OBP7)
అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్
అమెరికాలోని డల్లాస్లో భారతీయ యువకుడిని కాల్చి చంపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక దుకాంలో చోరీకి పాల్పడి, దాసరి గోపీకృష్ణను కాల్చి చంపిన కేసులో మాథిస్పై అభియోగాలు నమోదు చేశారు. ఇతనిపై ఇంతకుముందు కూడా హత్యా నేరం అభియోగాలున్నాయని పోలీసులు వెల్లడించారు.జూన్ 21న, గోపీకృష్ణ పనిచేస్తున్న స్థానిక కన్వీనియన్స్ స్టోర్లో దుకాణంలో చోరీకి తెగబడిన మాథిస్ కౌంటర్ వద్ద ఉన్న గోపీకృష్ణపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, స్నేహితులు కాన్సులేట్ సహకారంతో గోపీకృష్ణ మృతదేహాన్ని బాపట్లలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు.
![ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగుడు](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/24srl110-180049_mr-1719253627-0.jpg.webp?itok=WY0T1vJG)
ఏటీఎంను ధ్వంసం చేసి.. చివరికి..
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలోని సీసీ పుటేజీల ఆధారంగా గుర్తుతెలియని దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీసీ పుటేజీ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సదరు వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏటీఎం పై కప్పును తొలగించి అందులోంచి డబ్బులు తీయడానికి విఫలయత్నం చేశాడు. గంట సేపు ప్రయత్నించి వెళ్లిపోయాడు. క్లూస్ టీం పోలీసులు రంగంలోకి దిగి నిందితుని వేలిముద్రలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎస్సై రమాకాంత్ కోరారు.
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/25/akshaya.jpg.webp?itok=17K-Rdrr)
క్షణికావేశం.. నర్సింగ్ విద్యార్థిని విషాదం!
కరీంనగర్: కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో నర్సింగ్ విద్యార్థిని బానోత్ అక్షయ(19) సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునింది. స్థానిక సంతోష్నగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సింగరేణిలో ప్రైవేట్ ఓల్వో డ్రైవర్గా పనిచేస్తున్న బానోత్ రాజేశం– అమృతలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.చిన్నకుమార్తె అక్షయ కరీంనగర్లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతోంది. పరీక్షలు ముగిశాక మూడు నెలల క్రితం వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చింది. అయితే, సెలవులు ముగిశాయయని, కాలేజీకి వెళ్తానని తన తండ్రికి చెప్పింది. తనకు వేతనం ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత కాలేజీ ఫీజు చెల్లించి పంపిస్తానని తండ్రి చెప్పాడు. తనను కాలేజీకి పంపించడం లేదనే మనస్తాపంతో తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న అక్షయ.. గంట సమయం గడిచినా బయటకు రాలేదు.కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు, తోబుట్టువులు బోరున విలపించారు. చిన్నవిషయాలకే అలిగిన తమ కుమార్తె చనిపోతుందని తాము ఉహించలేదని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతురాలి సోదరి అనిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సనత్కుమార్రెడ్డి తెలిపారు.