Top Stories
ప్రధాన వార్తలు
![Neet Pg Exam Held In August 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/neetpg%20exam_0.jpg.webp?itok=Us8G3ONo)
నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్పై కీలక ప్రకటన
సాక్షి న్యూ ఢిల్లీ : నీట్-పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. వాయిదా పడ్డ నీట్-పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ను ఆగస్ట్ 11న నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రెండు షిప్ట్లలో ఆ పరీక్ష జరగనుంది. కటాఫ్ తేదీ, ఇతర వివరాల్ని ఆగస్ట్ 15న వెల్లడిస్తామని పేర్కొంది. ‘ఎన్బీఈఎంఎస్ 22-06-2024న వాయిదా వేసిన నీట్ పీజీ ఆగస్ట్ 11న నిర్వహిస్తున్నాం. రెండు షిఫ్ట్లలో ఈ పరీక్ష జరగనుంది’ అని విడుదల చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో..ఇటీవల నీట్ యూజీ-2024 పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా తర్వలో జరగనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రం ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో జరగనుంది. పరీక్షను ఎన్బీఈఎంఎస్ జరుపుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నీట్ పీజీ పరీక్ష నిమిత్తం అవసరమయ్యే టెక్నికల్ సపోర్ట్ను ఎన్బీఈఎంఎస్తో కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ అందించనుంది.
![Mudragada Padmanabham And Many Other Leaders Meet Ys Jagan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/ysjagan-meeting1.jpg.webp?itok=v3NfutIc)
వైఎస్ జగన్ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ నేతలు శుక్రవారం కలిశారు. వైఎస్ జగన్ని కలిసిన వారిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సహా పలువురు నేతలు ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ దిశనిర్దేశం చేశారు.కాగా, వైఎస్ జగన్ మరోసారి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి(శనివారం) నుంచి మూడు రోజులపాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ తన పర్యటనకు బయల్దేరతారు. తొలుత గన్నవరం నుంచి కడప ఎయిర్పోర్టు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వెళ్తారు. ఈ నెల 8వ తేదీన మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి 75వ జయంతి వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
![World First CNG Bike Bajaj Freedom 125 Launches in India](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/cng-bike-launch.jpg.webp?itok=nVqW-msW)
వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ దేశీయ విఫణిలో లాంచ్ అయింది. బజాజ్ ఫ్రీడమ్ 125 పేరుతో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ బైక్ ప్రతిభ ధర రూ. 95000 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్థుంది. కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.కొత్త బజాజ్ ఫ్రీడమ్ 125 బైకులో 2 కేజీల కెపాసిటీ కలిగిన సీఎన్జీ ట్యాంక్, అదే పరిమాణంలో పెట్రోల్ ట్యాంక్ ఉంటారు. పెట్రోల్, సీఎన్జీ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే బైక్ మైలేజ్ 330 కిమీ వరకు ఉంటుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 8000 rpm వద్ద 9.5 Bhp పవర్, 6000 rpm వద్ద 9.7 Nm టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది.బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ డిజైన్.. మార్కెట్లోని ఇతర కమ్యూటర్ మోటార్సైకిళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్లైట్, డర్ట్ బైక్ స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సింగిల్ పీస్ సీటు వంటివి ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.World‘s first #CNG motorcycle has been launched! Meet the Bajaj #Freedom125. 🏍️That’s a good looker, eh? Kinda has to be for the kind of premium over a regular petrol 125cc bike. Initially launching only in Maha/Guj; phased pan India launch to follow. Prices: ₹ 95-110k. SVP pic.twitter.com/9V9KGKLxrZ— Siddharth Vinayak Patankar (@sidpatankar) July 5, 2024
![Seven BRS MLAs Not Attended Party Meeting At Telangana Bhavan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/kcr_11_1.jpg.webp?itok=0eEmXeUM)
బీఆర్ఎస్ సమావేశానికి ఏడుగురు ఎమ్మెల్యేలు డుమ్మా.. వారంతా ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, వారంతా పార్టీ మారుతున్నారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ కార్పోరేటర్లు రెడీ అయ్యారు.కాగా, తెలంగాణ భవన్లో నేడు హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మినహా కార్పొరేటర్లు అందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రేపటి కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరుకావాలని అధిష్టానం ఆదేశించింది. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు వినిపించనున్నారు. ఈ క్రమంలోనే మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు రెడీ అయ్యారు.అయితే, రేపటి సమావేశంలో కౌన్సిల్ హాల్లోనే బైఠాయించాలని వారు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. సంఖ్యా బలం చూసుకుంటే తమకే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు దక్కుతాయని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెబుతున్నారు. దీంతో, రేపటి సమావేశం ఆసక్తిగా మారే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఈరోజు జరిగిన సమావేశానికి హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో హాట్ టాపిక్గా మారింది. ఈ సమావేశానికి మాధవరం కృష్ణారావు, అరికేపూడి గాంధీ, కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, గూడెం మహిపాల్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో, వీరు పార్టీ మారుతున్నారా? అనే చర్చ మొదలైంది.
![Tollywood Hero Raj Tarun Reacts On His Girlfriend Lavanya Allegations](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/1_12_1.jpg.webp?itok=aqJNF9A-)
మూడేళ్లు కలిసున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకోలేదు: రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ను బుట్టలో వేసుకుందని, తన ప్రియుడిని తనకు కాకుండా చేసిందని ఆరోపించింది. అతడిని వదిలేయకపోతే తనను చంపేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ఈ ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించాడు.డ్రగ్స్ అలవాటు'లావణ్య.. మొదట్లో నాతో కలిసున్న మాట వాస్తవమే! నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో నన్ను గైడ్ చేసింది. మేము రెండుమూడేళ్లు కలిసున్నాం. అయితే తనకు డ్రగ్స్ అలవాటు ఉంది. డ్రగ్స్ తీసుకోవద్దని ఎన్నోసార్లు చెప్పినా వినలేదు. నాకేమో డ్రగ్స్ వంటివి నచ్చవు. తన అలవాట్లు నచ్చక నేనే బయటకు వెళ్లిపోయాను. తనను అసలు పెళ్లే చేసుకోలేదు. నేను బయటకు వచ్చేశాక అదే గదిలో మస్తాన్ సాయి అనే వ్యక్తితో కలిసుంది.మరొకరితో రిలేషన్ప్రస్తుతం అతడితోనే రిలేషన్లో ఉంది. కానీ డబ్బు కోసం నాతో పని చేసేవారందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తోంది. అలా మాల్వీ మల్హోత్రాకు ఫోన్ చేసి బెదిరించింది, బూతులు మాట్లాడింది. కొన్నేళ్ల క్రితమే నన్ను వదిలేసిన ఆమె ఇప్పుడు నేను కావాలని కోరుకోవడమేంటో అర్థం కావడం లేదు. నన్ను ఎంతగానో వేధించింది. పరువు పోతుందని ఇన్నాళ్లూ సైలెంట్గా ఉన్నాను. నేను కూడా తనపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను' అని చెప్పుకొచ్చాడు.చదవండి: హీరో రాజ్ తరుణ్పై ప్రియురాలు సంచలన ఆరోపణలు
![The intriguing real life story of Keir Starmer UK next prime minister](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/steve.jpg.webp?itok=IHMs--EH)
బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆసక్తికర నేపథ్యం
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది. 650 సీట్లున్న పార్లమెంట్లో లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెల్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. దీంతో లేబర్ పార్టీకి చెందిన నేత కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.కీర్ స్టార్మర్ మాజీ మానవ హక్కుల న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మ్యూజీషియన్ కూడా. ఆయన వయసు ప్రస్తుతం 61 ఏళ్లు. గత 50 ఏళ్లలో ఈ వయసులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా స్టార్మర్ నిలిచారు. అంతేగాక పార్లమెంట్కు ఎన్నికైన తొమ్మిదేళ్లలోనే ప్రధానమంత్రి పదవి చేపడుతుండటం మరో విశేషం.సెప్టెంబరు 2, 1962న జన్మించిన కీర్.. రోడ్నీ స్టార్మర్, లండన్ శివార్లలో ఒక ఇరుకైన ఇంట్లో బాల్యాన్ని గడిపాడు. అతనికి ముగ్గురు తోబుట్టువులు. లీడ్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలలో న్యాయ విద్యను అభ్యసించాడు. అనంతరం వామపక్ష కారణాలు, డిఫెండింగ్ ట్రేడ్ యూనియన్లు, మెక్డొనాల్డ్స్ వ్యతిరేక కార్యకర్తలు, విదేశాల్లోని ఖైదీల మరణ శిక్షలు వంటి వాటిపై దృష్టి సారించాడు. అనంతరం మానవ హక్కుల న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించాడుతొలుత 2003లో ఉత్తర ఐర్లాండ్లోని పోలీసులు మానవ హక్కుల చట్టంలో చిన్న ఉద్యోగంలో చేరాడు. అయిదేళ్ల తర్వాత లేబర్ పార్టీకి చెందిన గోర్డాన్ బ్రౌన్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్కు పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్గా నియమితుడయ్యాడు.2008 నుంచి 2013 మధ్య వరకు ఎంపీలు తమ ఖర్చులను దుర్వినియోగం చేయడం, జర్నలిస్టుల ఫోన్ హ్యాకింగ్, గ్లండ్లో యువత అల్లర్ల వంటి విచారణలను ఆయన పర్యవేక్షించాడు. తన పనితనంతో క్వీన్ ఎలిజబెత్ 2 చేత నైట్ ర్యాంక్ బిరుదు పొందారు. 50 ఏళ్ల వయసులో కీర్ స్టామర్ రాజకీయాల్లోకి రావడం గమనార్హం. 2015 నార్త్ లండన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.స్టార్మర్కు వివాహం కాగా భార్య పేరు విక్టోరియా. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లల ఉన్నారు. శుక్రవారం వరకు పనిలో నిమగ్నమయ్యే కీర్.. శని, ఆదివారాలు మాత్రం పూర్తిగా కుటుంబానికి కేటాయిస్తాడు.రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాద వృత్తిలో సుధీర్ఘకాలం కొనసాగారు. ఆయన ఆధునిక రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటారనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో బ్రిటన్లో రాజకీయాలను తిరిగి సేవలోకి తీసుకురావాలి.. పార్టీ కంటే దేశం ముందు అనే ప్రధాన నినాదాలతో ప్రచారంలో ముందుకు సాగారు. గత 14 ఏళ్లలో కన్జర్వేటివ్ పార్టీ అయిదుగురు ప్రధానులను మార్చిన ఉద్దేశంలో ఆయన ఈ నినాదాలను నడిపించారు.ప్రజలు మార్పును కోరుకుంటే వారు లేబర్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికలకు ముందు స్పష్టంగా చెప్పారు. దేశాన్ని గడ్డు పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావడానికి మా పార్టీ ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలి.2019 తర్వాత లేబర్ పార్టీ ప్రధాన నాయకుడిగా అవతరించిన కీర్.. తమ ప్రభుత్వం మొత్తం దృష్టి దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ ఆరోగ్య సేవపైనే ఉంటుందని చెప్పారు.కాగా యూకే పార్లమెంట్లో మొత్తం 650 సీట్లు ఉండగా 400కు పైగా మెజార్టీ స్థానాల్లో లేబర్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. ఆపార్టీ చీఫ్ కీర్ స్టార్మర్ తన నియోజకవర్గం లండన్లోని హోల్బోర్న్ అండ్ సెయింట్ పాన్క్రాస్లో 18,884 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాను గెలిపించినందుకు నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తానంటూ ఈ సందర్భంగా స్టార్మర్ ప్రకటించారు.ఇక రిషి సునక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 112 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. దీంతో 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతుంది. భారత్- బ్రిటన్ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి..లేబర్ పార్టీ అధినేత కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత్-యూకే సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. యూకే- భారత్ సంబంధాలను బలోపేత చేయడం తన విదేశాంగ విధానం ఎజెండాలో కీలక అంశమని గతంలో స్టార్మర్ పేర్కొన్నాడు. కశ్మీర్ వంటి సమస్యలపై లేబర్ పార్టీ వైఖరిని కూడా తెలియజేస్తూ.. భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA), సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్తో సంబంధాలను పెంచుకోవాలనే ఆశయంతో ఉన్నట్లు నొక్కిచెప్పారు. ఇక భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్ధతతో ఉన్నట్లు అతని మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. కాగా గత రెండు ఏళ్లుగా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై భారతదేశం, బ్రిటన్ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
![Ksr Comments On TDP's Violent Rule](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/Chandrababu_Rebbook_Psycho_.jpg.webp?itok=f1-RThFo)
ఏపీలో అందుకేనా టీడీపీ సైకో చర్యలు!
ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పాలన సాగుతోంది? గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు సొంత కారణాలతో ఘర్షణపడినా అందులో ఒకరికి వైఎస్సార్సీపీ రంగు పులిమి సైకో పాలన అంటూ విపరీతంగా దుష్ప్రచారం చేసేవారు. ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెలరోజులు అవుతున్నా రాష్ట్రంలో హింసాకాండ ఆగడం లేదు. వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో సైతం ఒక వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఒక వైఎస్సార్సీపీ నేత భవనం కూల్చివేత జరిగింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులను టీడీపీ వారు వేధిస్తూనే ఉన్నారు. విధ్వంసం, దహనాలు జరిగిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఇష్టారాజ్యంగా దగ్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సైకో ప్రభుత్వం నడుస్తోందని, ఏపీలో ఆటవిక రాజ్యం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోందని అనిపించడం లేదా! ఇదేనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం కలిగి, మరోసారి సీఎం అయిన చంద్రబాబు నుంచి ప్రజలు ఆశించింది!ఆయన రాజ్యంలో పోలీసులు బాధితులపై కేసులు పెడుతున్నారు. బాధితులపై దాడులు చేస్తున్నవారికి అండగా నిలుస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల సమావేశాలు పెట్టుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇదంతా ప్రజాస్వామ్య స్పూర్తిగా తీసుకోవాలన్నమాట. రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తన నియోజకవర్గమైన పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటే అక్కడకు వెళ్లకూడదని పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేసిన తీరు పోలీసుల అసమర్ధతకు అద్దం పడుతుందని అనుకోవాలి.గతంలో చంద్రబాబు నాయుడు తాను చెప్పిన మార్గంలో కాకుండా మరో రూట్లో పుంగనూరు వెళ్లి అక్కడ అరాచకానీకి కారకులయ్యారు. టీడీపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారు. ఒక పోలీస్ కానీస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ సందర్భంగా కేసులు నమోదు అయ్యాయి. టీడీపీ నేత చల్లా బాబుపై కూడా కేసు పెట్టి అరెస్టు చేశారు. బహుశా అది టీడీపీ వర్గీయులకు కోప కారణం అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆ నియోజకవర్గంలో పర్యటించడానికి వీలు లేదంటూ టీడీపీ వారు అడ్డుపడితే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ ప్రాంతంలో దౌర్జన్యాలకు గురైన వైఎస్సార్సీపీ వారిని, ఇతర బాధితులను పరామర్శించడానికి వెళ్లడానికి వీలులేదని పోలీసులు ఆదేశించారు.ఇదీ చదవండి: కార్యాలయాల కూల్చివేతలపై సర్కారుకు ముకుతాడురామచంద్రారెడ్డి పర్యటన వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనుకుంటే టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయాలి కానీ, పెద్దిరెడ్డిని పుంగనూరు నుంచి వెనక్కి పంపించడం ఏమిటి? పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఏ టీడీపీ నేత పర్యటనలనైనా ఎవరైనా అడ్డుకున్నారా? కుప్పంలో చంద్రబాబు పర్యటించే క్రమంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడు సైతం పోలీసులు ఎంతో సంయమనం పాటించి, అన్నీ జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటన పూర్తి అయ్యేలా చేశారే! అయినా ఆ రోజుల్లో చంద్రబాబు వైఎస్సార్సీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతుండేవారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యాక, వైఎస్సార్సీపీ వారిని ఎవరిని కదలనివ్వడం లేదు. టీడీపీ వారు ప్రత్యర్ధుల పొలాలలోని తోటలను నరికి వేస్తున్నారు. పుంగనూరులో అయితే వైఎస్సార్సీపీ అనుకూలురైన పేదల ఇళ్లలోని ఆవులను కూడా తోలుకుపోతున్నారట.రాష్ట్రంలో అనేక చోట్ల పేదల ఇళ్లను కూల్చుతున్నారు. ఎక్కడో మణిపూర్, ఆస్సోం వంటి రాష్ట్రాలలో నెలల తరబడి హింసాకాండ జరుగుతుంటే ప్రజలు ఎలా భరిస్తున్నారా అని అంతా బాధపడుతుండేవాళ్లం. అలాంటిది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన సాగుతున్నా అందులో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కానీ, బీజేపీ కానీ నోరు విప్పడం లేదు. కొన్ని చోట్ల జనసేన కూడా ఈ విధ్వంసంలో భాగస్వామి అవుతోంది. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. కూటమి నేతలు కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పుంగనూరుకు ప్రతిష్టాత్మకమైన విద్యుత్ బస్ల తయారీ కర్మాగారాన్ని తీసుకు వస్తే, కూటమి నేతలు దానిని చెడగొట్టి పెట్టుబడులు రాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమి చేయాలా? అని సందిగ్ధంలో పడిందట.విశేషం ఏమిటంటే మిథున్ రెడ్డి తిరుపతిలో ఉన్నప్పటికీ, అక్కడకు వచ్చిన పుంగనూరు పార్టీ కార్యకర్తలు, నేతలు ఎవరిని ఆయనను కలవనివ్వలేదట. పోలీసులు నిజంగానే లోకేష్ ఎర్రబుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. తాను ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్దమని, ప్రభుత్వ అరచాకాలను అడ్డుకుంటానని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు మిథున్ రెడ్డి మాదిరి స్పందించడం ఆరంభించవలసిన అవసరం ఉంది. టీడీపీ వారు కానీ, పోలీసులు కానీ ఎన్నాళ్లు దాడులు చేస్తారు! ఎన్ని కేసులు పెడతారు?గతంలో ఒకసారి పల్నాడులోని ఒక గ్రామంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. వెంటనే దానిని రాజకీయం చేయడానికి చంద్రబాబు పర్యటనకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారు. దానిని చంద్రబాబు ఎంతగా విమర్శించింది అందరికి తెలుసు. అదే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్సార్సీపీ వారిపై అంతకన్నా దారుణంగా అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టీడీపీ వారు చేస్తున్న క్రిమినల్ చర్యలకు ప్రోత్సాహం ఇస్తోంది. హోం మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం పాయకరావు పేటలో సైతం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలని కూడా చూడకుండా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆటవిక చర్యలను ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ప్రతిఘటించికపోతే ఏపీలో ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమవుతుంది. ఏపీ ఒక ఆటవిక రాజ్యంగా మిగులుతుంది.ఈ సందర్భంలో వేమూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జీ వి. అశోక్ బాబు గట్టిగా సమాధానం ఇచ్చిన వైనం ప్రస్తావనార్హం. భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వారు దగ్ధం చేశారు. దానికి నిరసనగా అశోక్ బాబు అక్కడకు వెళ్లబోతే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో ఆయన మౌన దీక్ష చేశారు. ఫలితంగా పోలీసులు వెనక్కి తగ్గకతప్పలేదు. అంతేకాక మరో కొత్త విగ్రహాన్ని తెప్పించి ఆయన అదే స్థానంలో ఆవిష్కరించారు. ఇలా ప్రతిచోట టీడీపీ వారి దుండగాలను ఎదుర్కోకపోతే అప్రతిహతంగా ఇలాంటి వాటినే కొనసాగిస్తారు. కేవలం వైఎస్సార్సీపీవారిని భయభ్రాంతులను చేసి టీడీపీ హామీలు ఎగవేసినా ఎవరూ ప్రశ్నించకుండా ఉండడం కోసం కూడా ఈ హింసాకాండ సాగిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కేంద్ర నాయకత్వం కూడా క్రియాశీలకం అయి నిరసనలకు దిగి కార్యకర్తలలో ఆత్మస్థైర్యాన్ని నింపవలసిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా నలభై ఆరేళ్ళ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏలుబడి ఇంత అధ్వాన్నంగా ఉందన్న విమర్శలు ప్రజలలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో చంద్రబాబుకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు టీడీపీ వారి అరాచకాలను ఆపుతారని, పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేసేలా ఆదేశాలు ఇస్తారని ఆశిద్దాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
![UK Polls Indian Origin Suella Braverman Wins](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/UKpolls-Suella%20Braverman.jpg.webp?itok=cCs3LVnV)
యూకే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రేవర్మాన్ సంచలనం
2024 యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన, మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ సంచలనం రేపారు. కన్జర్వేటివ్ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫేర్హామ్ అండ్ వాటర్లూవిల్లే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. లేబర్కు చెందిన గెమ్మా ఫర్నివాల్పై 6,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2015 నుండి ఆమె ఫారెహామ్కు ఎంపీగా ఉన్నారు . అక్టోబర్ 2022-నవంబర్ 2023 వరకు హోం సెక్రటరీగా పనిచేశారు.తన విజయం గత 14 సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ పనితీరుపై ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పారు. వాగ్దానాలను నిలబెట్టు కోలేకపోయిందనీ, కన్సర్వేటివ్ పార్టీ ప్రజల్ని నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. పార్టీ తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.తాజా ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారాన్నిచేజిక్కించుకుంది. 10 లక్షల మందికి పైగా భారత సంతతి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 107 మంది బ్రిటీష్ ఇండియన్లు పోటీ చేశారు. 2019లో ఈ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది నెగ్గారు.
![Hero Raj Tarun Lover Lavanya Case File Against Him](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/Hero-Raj-Tarun-Lover-Lavanya.jpg3__0.jpg.webp?itok=YhXruG9q)
హీరో రాజ్ తరుణ్పై ప్రియురాలు సంచలన ఆరోపణలు..
హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై పోలీసు కేసు నమోదైంది. తనను నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైనా ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని , గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది. మూడు నెలల క్రితమే..హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికంతటికీ మాల్వీ మల్హోత్రా కారణమంది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది. డ్రగ్స్ కేసులోఅంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించడంతో మూడు నెలలపాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. రాజ్ తరుణే తన ప్రపంచమని, అతడు తిరిగి తన దగ్గరకు వచ్చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా తిరగబడరా సామీ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ..
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
అనంత్, రాధిక సంగీత్.. ముంబై చేరుకున్న పాప్ సింగర్
సమంత పోస్ట్పై వివాదం.. మద్దతుగా నిలిచిన నటుడు!
రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?
రిటైర్మెంట్పై స్పందించిన జస్ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే?
రేపు ప్రజాభవన్లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం..!
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు..
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@24,314
కిడ్నీ మార్పిడి కేసు: విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగ్గుస్తున్న ఉచ్చు
మూడేళ్లు కలిసున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకోలేదు: రాజ్ తరుణ్
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
అనంత్, రాధిక సంగీత్.. ముంబై చేరుకున్న పాప్ సింగర్
సమంత పోస్ట్పై వివాదం.. మద్దతుగా నిలిచిన నటుడు!
రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?
రిటైర్మెంట్పై స్పందించిన జస్ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే?
రేపు ప్రజాభవన్లో ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
'సింప్లిసిటీకి కేరాఫ్ సుధామూర్తి'..30 ఏళ్ల క్రితం..!
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు..
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@24,314
కిడ్నీ మార్పిడి కేసు: విశాఖ ఎన్ఆర్ఐ ఆసుపత్రికి బిగ్గుస్తున్న ఉచ్చు
మూడేళ్లు కలిసున్నాం.. పెళ్లి చేసుకోవాలనుకోలేదు: రాజ్ తరుణ్
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
సినిమా
![Samantha Explanation On Nebulizer Treatment](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/samantha_3.jpg.webp?itok=_OIChW-S)
'నన్ను జైల్లో వేయాలట! నేనేం డబ్బు కోసం ఆ పని చేయలేదు'
వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత సిఫార్సు చేసింది. దీనిని డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా "ది లివర్ డాక్" తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదుని ఆయన హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని ఆయన అన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశాడు. తాజాగా ఈ అంశం గురించి సమంత ఒక సుదీర్ఘమైన లేఖను రాసింది."గత రెండు సంవత్సరాలుగా, నేను అనేక రకాల ఔషధాలను తీసుకోవలసి వచ్చింది. నేను తీసుకోవాలని గట్టిగా సూచించిన ప్రతిదాన్ని ప్రయత్నించాను. పేరు పొందిన నిపుణులు పరిశోధన చేసిన తర్వాత వారు సూచించినట్లుగా ఉపయోగించాను. ఈ చికిత్సలు చాలా చాలా ఖరీదైనవి కూడా. నేను దానిని భరించగలిగినందుకు నేను ఎంత అదృష్టవంతురాలిని. ఇంతటి ఖర్చును భరించలేని వారి గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. సాంప్రదాయ చికిత్సలు నా ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం లేదు. కానీ, ఇవి ఇతరలకు బాగా పనిచేసి ఉంటాయని నేను ఖచ్చితంగా భావిస్తాను.చికిత్సా విధానాన్ని గట్టిగా వాదించేంత అమాయకురాలిని కాదు. గత రెండు సంవత్సరాలలో నేను ఎదుర్కొన్న, నేర్చుకున్న వాటిని మంచి ఉద్దేశ్యంతోనే సూచించాను. ముఖ్యంగా చికిత్సలన్నీ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవే.. కాబట్టి వాటిని అందరూ పాటించకపోవచ్చు. అలాంటి వారికి మార్గనిర్దేశం చేయడానికి మనమందరం విద్యావంతులైన వైద్యులపై ఆధారపడతాము. ఈ చికిత్స గురించి నాకు పేరుపొందిన డాక్టరే సూచించారు. ఆయన 25 సంవత్సరాలుగా DRDOలో సేవలందించిన ఒక ఉన్నతమైన వైద్యుడు.'ఒక పెద్దమనిషి నా పోస్ట్పై, నా ఉద్దేశాలపై బలమైన పదాలతో దాడి చేశాడు. పెద్దమనిషి కూడా వైద్యుడేనని అన్నారు. అతనికి నాకంటే ఎక్కువ తెలుసు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నా గురించి మాట్లాడిన అతని ఉద్దేశాలు గొప్పవని నాకు ఖచ్చితంగా తెలుసు. అతను తన మాటలతో రెచ్చగొట్టకుండా ఉంటే అది అతని పట్ల గౌరవాన్ని పెంచేది. ముఖ్యంగా నన్ను జైలులో వేయాలని ఆయన సూచించాడు. పర్వాలేదు. నేను సెలబ్రిటీ అనే కోణంలో ఆయన అన్నారని అనుకుంటున్నాను. నేను సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వారికోసం ఒక వ్యక్తిగా పోస్ట్ చేశాను. నేను ఖచ్చితంగా ఈ పోస్ట్ నుండి డబ్బు సంపాదించడం లేదు.. ఇదే చేయండి అని నేను ఆమోదించడం లేదు. సాంప్రదాయ ఔషధం పని చేయని వారు మరోదారి కోసం వెతుకుతారు. అలాంటి వారి కోసం నేను ఈ చికిత్స ఒక ఎంపికగా సూచించాను.'లివర్ డాక్ తనను టార్గెట్ చేయడం కంటే తన డాక్టర్తో ఇదే చర్చ జరిపి ఉంటే బాగుండేదని సమంత అన్నారు. 'నేను ట్యాగ్ చేసిన డాక్టర్ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి చర్చ జరిపితే బాగుంటుంది. ఇద్దరు అధిక అర్హత కలిగిన నిపుణుల మధ్య చర్చ జరిగితే దాని నుంచి నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను.నా ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి ఉన్న సమాచారాన్ని ఇతరులతో పంచుకుని వారికి సహాయం చేయడమే నా ఉద్దేశం.. ఎవరికీ హానీ కలిగించడానికి కాదు. ఇక నుంచి నేను కూడా మరింత జాగ్రత్తగా ఉంటాను. ఆయుర్వేదం, హోమియోపతి, ఆక్యుపంక్చర్, టిబెటన్ మెడిసిన్, ప్రాణిక్ హీలింగ్ మొదలైనవాటిని సూచిస్తున్న వ్యక్తులు నాకు చాలా మంది ఉన్నారు. నేను వాటన్నింటినీ విన్నాను. కానీ, నేను మాత్రం దీనినే పాటిస్తున్నాను.' అని సమంతప్పింది. కొందరి అనారోగ్య ప్రొఫైల్ బట్టి చికిత్సలు ఉంటాయి కాబట్టి.. ఎవరైనా దీనిని పాటించాలంటే సంబంధించిన వైద్యుల సలహాలు తీసుకున్న తర్వాతే అనుసరించడం మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)
![Aarambham Movie Streaming On This OTT Platform](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/aarambham.jpg.webp?itok=ul5GS-8Q)
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ..
థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. అందుకే చాలామంది ఆ జానర్లో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే ఆరంభం. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.సినిమా కథేంటంటే?ఓ గ్రామానికి చెందిన మిగిల్ (మోహన్ భగత్).. హత్య కేసులో రెండున్నరేళ్లుగా శిక్ష అనుభవిస్తుంటాడు. అతడిని ఉరి తీసేందుకు సిద్ధమయ్యే సమయంలో అతడు జైలు నుంచి అదృశ్యమవుతాడు. సెల్కు వేసిన తాళం వేసినట్లే ఉంటుంది. గోడలు బద్ధకొట్టలేదు, ఊచలు వంచలేదు.. అయినా ఎలా తప్పించుకున్నాడనేది అర్థం కాక జైలు అధికారులు తల పట్టుకుంటారు. ఓ డిటెక్టివ్ సాయం కోరతారు. డిటెక్టివ్ సాయంతో మిగిల్ను పట్టుకున్నారా? అసలు మిగిల్ ఎవరిని హత్య చేసి జైలుకు వచ్చాడు? తర్వాత ఎలా తప్పించుకోగలిగాడు? వంటివి తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!ఎవరెవరు?ఆరంభం చిత్రంలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీతో అజయ్ నాగ్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. సిన్జిత్ యర్రంమిల్లి సంగీతం అందించిన ఈ మూవీ మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: తండ్రికి కారు గిఫ్టిచ్చిన బిగ్బాస్ బ్యూటీ.. నీలాంటి కూతురుండాలి!
![Indian 2 Movie Censor And Runtime Final](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/indian2.jpg.webp?itok=FpgC5kFj)
భారతీయుడు 2 సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతో తెలుసా..?
అవినీతిపై సమరశంఖాన్ని పూరించే కథతో 1996లో భారతీయుడు చిత్రం విడుదలైంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్లో మళ్లీ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉన్నాయి. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్ను మరోసారి వెండితెరపై శంకర్ చూపించనున్నాడు. అయితే తాజాగా భారతీయుడు 2 సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.భారీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రానికి U/A సర్టిఫికెట్ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. అయితే, ఈ సినిమా రన్టైమ్ ఏకంగా 3.04 గంటల పాటు నిడివి ఉంది. ఈ చిత్రం నుంచి కొన్ని అభ్యంతకరమైన సీన్లును తొలగించినట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివి ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఇంత నిడివి ఉన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలంటే కథ ప్రధాన బలంగా ఉండాలి. ఈ విషయంలో శంకర్ విజయం సాధిస్తాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.రంగస్థలం నుంచి ఈ మధ్య వచ్చిన యానిమల్, సలార్, కల్కి వంటి చిత్రాలు మూడు గంటల నిడివితో వచ్చినవే కావడం విశేషం. ఇప్పుడు తాజాగా భారతీయుడు 2 కూడా ఎక్కువ రన్టైమ్ ఉన్న లిస్ట్లో చేరిపోయింది. భారీ అంచనాలతో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్మురేపిన కమల్ ఇప్పుడు భారతీయుడు చిత్రంతో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తాడని ఫ్యాన్స్ ఉన్నారు.
![Manisha Rani Gifts Car to Her Father, Cost Details Inside](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/manisha1.jpg.webp?itok=dKcGXikX)
తండ్రికి కారు గిఫ్టిచ్చిన బిగ్బాస్ బ్యూటీ.. నీలాంటి కూతురుండాలి!
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, డ్యాన్సర్ మనీషారాణి బిగ్బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. హిందీ బిగ్బాస్.. ఓటీటీ రెండో సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిక్లాజా 11వ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా పాల్గొని ఏకంగా ట్రోఫీ అందుకుంది. ప్రైవేట్ ఆల్బమ్స్లోనూ కనిపించి కనువిందు చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా తండ్రికి ఊహించని బహుమతిచ్చింది.అవన్నీ నా కలలు కూడా..మహీంద్రా కారు కొనిచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అందులో తన తండ్రికి కొత్త కారు తాళాన్ని అందిస్తూమురిసిపోయింది. మా నాన్న కొత్త కారు. ఆయన కోరిక నెరవేర్చుతూ కారు గిఫ్ట్గా ఒచ్చాను. ఆయన కన్న కలలన్నీ తనవి మాత్రమే కావు, నావి కూడా! అవన్నీ నెరవేరుస్తాను అని క్యాప్షన్లో రాసుకొచ్చింది. దీని ధర దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. గర్వంగా ఉందిఈ వీడియో చూసిన అభిమానులు.. నిన్ను చూస్తే గర్వంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ నీలాంటి కూతురు ఉండాలి, మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి కష్టంతో పైకి ఎదిగి తండ్రి కలల్ని నెరవేరుస్తుంటే అంతకన్నా ఇన్స్పిరేషన్ ఇంకేముంటుంది? మధ్యతరగతి నుంచి వచ్చే అమ్మాయిలకు నువ్వొక రోల్ మోడల్.. అంటూ నెటిజన్లు ఆమెను ఆకాశానికెత్తుతున్నారు. View this post on Instagram A post shared by Manisha Rani (@manisharani002)చదవండి: దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్
ఫొటోలు
![Actress Priyamani Shared Closeup Photos In Social Media](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Priya-Mani-Raj.jpg.webp?itok=5VJS33bC)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Priya-Mani-Raj.jpg.webp?itok=5VJS33bC)
ప్రియమణికి వయసుతో పాటు అందం పెరుగుతుందా ఏంటి? (ఫొటోలు)
![Devara Heroine Janhvi Kapoors Beautiful Photos In Latest Style](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Janhvi-Kapoor.jpg.webp?itok=r3hY5HE5)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Janhvi-Kapoor.jpg.webp?itok=r3hY5HE5)
‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ స్టయిల్ చూశారా?
![USA Independence Day Celebration Photos Goes Viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/USA_Independence-Day-1.jpg.webp?itok=MI19fzge)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/USA_Independence-Day-1.jpg.webp?itok=MI19fzge)
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
![TV Actress Tejaswini Gowda Reminisces Sita Ramams Heroine Photos viral](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Tejaswini-Gowda_0.jpg.webp?itok=3hz72E_9)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Tejaswini-Gowda_0.jpg.webp?itok=3hz72E_9)
Tejaswini Gowda: సీతామహాలక్ష్మిలా మురిపిస్తోన్న బుల్లితెర నటి (ఫోటోలు)
![Tollywood Beauty Queen Trisha Krishnan Stunning Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Trisha-Krishnan.jpg.webp?itok=4Tgum_9L)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Trisha-Krishnan.jpg.webp?itok=4Tgum_9L)
అందానికే అసూయ పుట్టించే బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
క్రీడలు
![PM Modi Interacts With Indian Contingent For Paris Olympics 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/PM-Modi_0.jpg.webp?itok=nv3a2Gv4)
భారత ఒలింపిక్స్ బృందంతో ప్రధాని మోదీ సమావేశం
పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (జులై 4) రాత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ అథ్లెట్లతో సుదీర్ఘంగా సంభాషించారు. అథ్లెట్లు కూడా తమ లక్ష్యాలను ప్రధానికి వివరించారు. అనంతరం అథ్లెట్లు మోదీతో ఫోటోలు దిగారు. Interacted with our contingent heading to Paris for the @Olympics. I am confident our athletes will give their best and make India proud. Their life journeys and success give hope to 140 crore Indians. pic.twitter.com/OOoipJpfUb— Narendra Modi (@narendramodi) July 4, 2024ఈ ఫోటోలను మోదీ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి భారత అథ్లెట్లకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. మోదీ ట్వీట్లో ఇలా రాసుకొచ్చారు. పారిస్ ఒలింపిక్స్లో పాల్గొంటున్న మా బృందంతో పరస్పద చర్చ జరిగింది. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని నమ్మకం ఉంది. వారి జీవిత ప్రయాణాలు, వారు సాధించిన విజయాలు 140 కోట్ల భారతీయులకు ఆశను కలిగిస్తున్నాయి.కాగా, పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్ట్ 11 నుంచి ఆగస్ట్ 11 వరకు జరుగనున్నాయి. విశ్వక్రీడల్లో భారత్ నుంచి 28 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. భారత బృందానికి జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. భారత బృందంలో 17 మంది పురుషులు, 11 మంది మహిళలు ఉన్నారు.పారిస్ 2024 ఒలింపిక్స్లో పాల్గొనే భారత అథ్లెట్లు..నీరజ్ చోప్రా (పురుషుల జావెలిన్ త్రో)అవినాష్ సాబ్లే (పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్)కిషోర్ జెనా (పురుషుల జావెలిన్ త్రో)తజిందర్పాల్ సింగ్ తూర్ (పురుషుల షాట్పుట్)ప్రవీణ్ చిత్రవేల్ (పురుషుల ట్రిపుల్ జంప్)అబ్దుల్లా అబూబకర్ (పురుషుల ట్రిపుల్ జంప్)సర్వేష్ కుషారే (పురుషుల హైజంప్)అక్షదీప్ సింగ్ (పురుషుల 20 కి.మీ రేసు నడక)వికాష్ సింగ్ (పురుషుల 20 కి.మీ రేసు నడక)పరమజీత్ సింగ్ బిష్త్ (పురుషుల 20 కి.మీ రేసు నడక)మహమ్మద్ అనాస్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)మహ్మద్ అజ్మల్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)అమోజ్ జాకబ్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)సంతోష్ కుమార్ తమిళరసన్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)రాజేష్ రమేష్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)మిజో చాకో కురియన్ (పురుషుల 4x400 మీటర్ల రిలే)సూరజ్ పన్వర్ (రేస్ వాక్ మిక్స్డ్ మారథాన్)కిరణ్ పహల్ (మహిళల 400 మీ)పారుల్ చౌదరి (మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ మరియు 5,000 మీ)జ్యోతి యర్రాజి (మహిళల 100 మీటర్ల హర్డిల్స్)అన్నూ రాణి (మహిళల జావెలిన్ త్రో)అభా ఖతువా (మహిళల షాట్పుట్)జ్యోతిక శ్రీ దండి (మహిళల 4x400 మీటర్ల రిలే)శుభా వెంకటేశన్ (మహిళల 4x400 మీటర్ల రిలే)విత్యా రాంరాజ్ (మహిళల 4x400 మీటర్ల రిలే)ఎంఆర్ పూవమ్మ (మహిళల 4x400 మీటర్ల రిలే)ప్రాచి (మహిళల 4x400 మీటర్ల రిలే)ప్రియాంక గోస్వామి (మహిళల 20 కి.మీ రేస్ వాక్ మరియు రేస్ వాక్ మిక్స్డ్ మారథాన్)
![Indian Badminton Player P V Sindhu Birthday Special Gallery](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/P.V.Sindhu-Birthday-Special_0.jpg.webp?itok=1kZ_bac1)
భారత బ్యాడ్మింటన్ రారాణికి జన్మదిన శుభాకాంక్షలు (ఫొటోలు)
![Pakistan Schedule To Play White Ball Series In Zimbabwe](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/Pakistan-Schedule.jpg.webp?itok=GYI7wpei)
టీమిండియా బాటలో పాకిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీమిండియా బాటలో అడుగులేస్తుంది. ఆర్దికంగా వెనుకబడిన జింబాబ్వే క్రికెట్ బోర్డుకు చేయూతనిచ్చేందుకు పాక్ జింబాబ్వేలో పర్యటిస్తుంది. పెద్ద జట్లు స్వదేశంలో మ్యాచ్లు ఆడితే జింబాబ్వే క్రికెట్ బోర్డును లబ్ది చేకూరుతుంది. అందుకే భారత్ జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు ముందుకువచ్చింది. రేపటి నుంచే (జులై 6) భారత్-జింబాబ్వే మధ్య టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ సిరీస్లో మొత్తం ఐదు టీ20లు జరుగనున్నాయి. హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్లు జరుతాయి. ఈ పర్యటన కోసం భారత సెలెక్టర్లు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ జట్టును ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటనలో యంగ్ ఇండియాకు శుభ్మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు.పాక్ షెడ్యూల్ ఇలా..పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో జరిగే ఈ పర్యటనలో పాకిస్తాన్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలుత వన్డే సిరీస్ (నవంబర్ 24, 26, 28).. అనంతరం టీ20 సిరీస్ (డిసెంబర్ 1, 3, 5) జరుగనున్నాయి. మ్యాచ్లన్నీ బులవయోలోని క్లీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగతాయి. కాగా, పాక్ స్వదేశంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా జింబాబ్వే సిరీస్ను భావిస్తుంది.
![T20 World Cup Victory Parade: Goosebumps Guaranteed While Team India Singing Vande Mataram With Wankhede Crowd](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/sw.jpg.webp?itok=4EPBUvEy)
భారత క్రికెటర్ల వందేమాతర గీతాలాపన.. గూస్ బంప్స్ రావాల్సిందే..!
టీమిండియా టీ20 వరల్డ్కప్ 2024 సాధించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబురాలు జరుగుతున్నాయి. ఊరూ వాడా భారత క్రికెట్ జట్టు సాధించిన విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమిండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్కప్ సాధించడంతో అభిమానులతో పాటు భారత క్రికెటర్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. GOOSEBUMPS GUARANTEED...!!!! 😍- Team India singing 'Vande Maataram' with Wankhede crowd. 🇮🇳pic.twitter.com/SfrFgWr4x9— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024నిన్న (జులై 4) జరిగిన వరల్డ్కప్ విన్నింగ్ పెరేడ్లో భారత ఆటగాళ్లు తమనుతాము మైమరిచిపోయి సంబురాల్లో మునిగిపోయారు. డ్యాన్స్లు, పాటలతో తెగ సందడి చేశారు. వాంఖడేలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లను పట్టడానికి వీల్లేకుండా పోయింది. ప్రతి ఒక్క ఆటగాడు చిన్న పిల్లాడిలా మారిపోయి ఆనందంలో మునిగి తేలారు. వందేమాతర గీతాలపన సందర్భంగా భారత క్రికెటర్లు అభిమానులతో గొంతు కలపడం చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే. ఈ సందర్భంగా కోహ్లి, హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యారు. వీరిద్దరు దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతర గీతాలాపన చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోను ఎంతసేపు చూసినా చూడాలనిపించేలా ఉంది.THE DANCE OF ROHIT SHARMA, VIRAT KOHLI & PLAYERS AT WANKHEDE.🥹🏆- One of the Most beautiful Moments in Indian cricket history. ❤️ pic.twitter.com/IjBujoejgb— Tanuj Singh (@ImTanujSingh) July 5, 2024ఇదిలా ఉంటే, టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరదించుతూ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ విజయానంతరం భారత క్రికెట్ జట్టు నిన్న ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంది. అక్కడ ప్రధానితో భేటి అనంతరం విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబైకు వచ్చింది. 11 ఏళ్ల అనంతరం ఐసీసీ ట్రోఫీ సాధించడంతో భారత క్రికెట్ జట్టుకు అడుగడుగునా నీరాజనాలు అందాయి. టీమిండియాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో జరిగిన విన్నింగ్ పెరేడ్లో భారత క్రికెటర్లను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ముంబై నగర వీధులు భారత క్రికెటర్ల నామస్మరణతో మార్మోగాయి. విజయోత్సవ ర్యాలీ మెరైన రోడ్ గుండా సాగగా.. రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. భారత క్రికెటర్లు ఓపెన్ టాప్ బస్ నుంచి జనాలకు అభివాదం చేశారు. విన్నింగ్ పెరేడ్ మెరైన్ రోడ్ గుండా వాంఖడే వరకు సాగింది. అనంతరం వాంఖడే స్టేడియంలో భారత క్రికెటర్లకు బీసీసీఐ ఆథ్వర్యంలో సన్మానం జరిగింది. భారత క్రికెటర్లను, వరల్డ్కప్ను చూసేందుకు వాంఖడే స్టేడియంకు జనాలు పోటెత్తారు.
National View all
![](/sites/default/files/article_images/2024/07/5/kavitha_1.jpg)
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స
![](/sites/default/files/article_images/2024/07/5/pli%20drone01.jpg)
‘పీఎల్ఐ శాశ్వత సబ్సిడీ కాదు’
డ్రోన్ పరిశ్రమ పురోగతికి కేంద్రం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్ఐ) పథకం ఎంతో ఉపయోగపడుతోందని కేంద్ర మంత్రి
![](/sites/default/files/article_images/2024/07/5/baba.jpg)
లగ్జరీ కార్లు, ఆశ్రమాలు.. భోలే బాబా ఆస్తులు రూ. 100 కోట్లకు పైనే!
ఉత్తర్ప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన సూరజ్ పాల్ అలియాస్ నారాయణ్ హరి సాకర్ అలియాస్ భ
![](/sites/default/files/article_images/2024/07/5/neetpg%20exam_0.jpg)
నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్పై కీలక ప్రకటన
సాక్షి న్యూ ఢిల్లీ : నీట్-పీజీ ప్రవేశ పరీక్షపై నేషనల్ బోర్
![](/sites/default/files/article_images/2024/07/5/oida.jpg)
షాపింగ్మాల్లో భారీ అగ్నిప్రమాదం.. బయటకు పరుగులు తీసిన జనం
ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలోని ఓ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
NRI View all
![](/sites/default/files/article_images/2024/07/5/blood.jpg)
స్ఫూర్తిమంతంగా సింగపూర్ తెలుగు సమాజం రక్తదాన కార్యక్రమం
![](/sites/default/files/article_images/2024/07/5/UKpolls-Suella%20Braverman.jpg)
యూకే ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బ్రేవర్మాన్ సంచలనం
2024 యూకే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన, మాజీ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ సంచలనం రేపారు.
![](/sites/default/files/article_images/2024/07/5/UK_Labour_party_Victory.jpg)
యూకే ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విక్టరీ
లండన్: యూకే సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ విజయం
![](/sites/default/files/article_images/2024/07/4/nats.jpg)
ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన నాట్స్
![](/sites/default/files/article_images/2024/07/4/UK_Elections2024_Sakshi_Lat.jpg)
యూకే ఎన్నికలు: సతీసమేతంగా ఓటేసిన సునాక్
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గం. పోలింగ్ ప్రారంభం కాగా..
International View all
![](/sites/default/files/article_images/2024/07/5/Jayathi-Murthi.jpg)
అప్ టు డేట్గా ఉండటమే ఏఐ రంగంలో సవాలు!
![](/sites/default/files/article_images/2024/07/5/Keke%20Jabbar.jpg)
అమెరికా రియాల్టీ టీవీ స్టార్ అనుమానాస్పద మృతి
![](/sites/default/files/article_images/2024/07/5/steve.jpg)
బ్రిటన్ కొత్త ప్రధానిగా కీర్ స్టార్మర్.. 50 ఏళ్లకు రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఆసక్తికర నేపథ్యం
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా సాగుతోంది.
![](/sites/default/files/article_images/2024/07/5/rishi_0.jpg)
ఘోర పరాజయంపై రిషి సునాక్ క్షమాపణలు
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
![](/sites/default/files/article_images/2024/07/5/Heat-Wave.jpg)
అమెరికాలో దంచికొడుతున్న ఎండలు.. రికార్డు స్థాయిలో హీట్ వేవ్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఎండలు దంచికొడుతున్నాయి.
బిజినెస్
![Minister said that the QR code for cylinders is incorporated in the draft Gas Cylinders Rules](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/gas01.jpg.webp?itok=FL_DHz4e)
గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటన
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్ ఇవ్వాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం, ఏజెన్సీల ఇన్వెంటరీ నిర్వహణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దాంతో పాటు నివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా భద్రతా చర్యల నమూనా రూపొందించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘గ్యాస్ సిలిండర్ల క్యూఆర్ కోడ్ ముసాయిదాను గ్యాస్ సిలిండర్ రూల్స్ (జీసీఆర్)లో పొందుపరిచాం. త్వరలో దీనిపై తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాలోని అవకతవకలను తగ్గించేందుకు, వంట గ్యాస్ సిలిండర్ల ట్రాకింగ్ కోసం ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘అమెరికా ఇండిపెండెన్స్ డే’.. జుకర్బర్గ్ వినూత్న వేడుకలునివాసాలకు 30-50 మీటర్లలోపు కూడా పెట్రోల్ పంపులు పని చేసేలా, అవసరమైన భద్రతా చర్యల నమూనా రూపొందించాలని మంత్రి పెసో (పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్)ను ఆదేశించారు. ఇందుకోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) మార్గదర్శకాలను పాటించాలని తెలిపారు. డీపీఐఐటీ (పరిశ్రమ ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం) కింద పని చేసే పెసో, 1884 ఎక్స్ప్లోజివ్స్ చట్టం, 1934 పెట్రోలియం చట్టం నిబంధనలను నియంత్రించే కీలక బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పెసో మంజూరు చేసిన లైసెన్స్ల లైసెన్సింగ్ ఫీజులో మహిళా పారిశ్రామికవేత్తలకు 80 శాతం, ఎంఎస్ఎంఈలకు 50 శాతం రాయితీని ప్రకటిస్తున్నట్లు మంత్రి వివరించారు.
![Mark Zuckerberg celebrates america independence day an eye catching way this year](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/mark01.jpg.webp?itok=XkQ7UJl3)
‘అమెరికా ఇండిపెండెన్స్ డే’..మార్క్ జుకర్బర్గ్ వినూత్న వేడుకలు
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ జులై 4న వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో విడుదల చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖులు వేడుకలు నిర్వహించుకున్నారు. అందులో భాగంగా మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఒక చేతిలో బీర్ బాటిల్, మరో చేతిలో అమెరికా జెండాతో నీటిపై హైడ్రోఫాయిల్(నీటిపై కదలడం) చేశారు. ఇందులో మార్క్ బ్లాక్ యాప్రాన్, వైట్ షర్ట్ ధరించారు. కళ్లకు బ్లాక్ గాగుల్స్ పెట్టి అదిరిపోయే పోజు ఇచ్చారు. ఈ వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ‘హ్యాపీ బర్త్డే అమెరికా’ అని రాశారు. View this post on Instagram A post shared by Mark Zuckerberg (@zuck)జుకర్బర్గ్ ఆరు నెలల కిందట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ)లో శిక్షణ పొందుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. దాంతో తన మోకాలికి తీవ్ర గాయమై శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇటీవల కోలుకున్న మార్క్ తన 40వ పుట్టినరోజు వేడులకు ఘనంగా జురుపుకున్నారు. తాజాగా ఇలా హైడ్రోఫాయిల్ చేయడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![Stock Market Rally On Today Opening](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/Market02.jpg.webp?itok=LOScwdLf)
వరుస లాభాలకు బ్రేక్.. నష్టాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ 116 పాయింట్లు కోల్పోయి 24,186కు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు తగ్గి 79,553 వద్ద ట్రేడవుతోంది. దాంతో వరుస లాభాలకు బ్రేక్ పడినట్లయింది.అమెరికా డాలర్ ఇండెక్స్ 105.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 87.11 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.35 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.51 శాతం, నాస్డాక్ 0.88 శాతం లాభపడ్డాయి.ఈక్విటీ మార్కెట్ల గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో భారత్ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ రెగ్యులేటర్– సెబీ, సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు (శాట్) కీలక సూచనలు చేశారు. ఈ విషయంలో ముందస్తు జాగ్రత్త అవసరమన్నారు. ఎటువంటి సవాలునైనా సత్వరం పరిష్కరించడానికి, వ్యవస్థ పటిష్టంగా ఉండడానికి మరిన్ని ట్రిబ్యునల్ బెంచ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. శాట్ కొత్త ప్రాంగణాన్ని ఇక్కడ ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్లలో అధిక మొత్తంలో లావాదేవీలు, అలాగే కొత్త నిబంధనల కారణంగా శాట్పై అధిక పనిభారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో శాట్ కొత్త బెంచ్లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలించాలన్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
![Video of woman dancing aboard an IndiGo flight went viral on social media](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/indigo01.jpg.webp?itok=F9-76QAJ)
ఇండిగో విమానంలో మహిళ డ్యాన్స్.. వీడియో వైరల్
ఇండిగో విమానంలో ఇటీవల ఓ మహిళా ప్యాసింజర్ చేసిన డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం సాధరణమైందని ఈ వీడియో చూసిన వీక్షకులు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇండిగో సంస్థ ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.సల్మాషేక్ అనే మహిళా ప్యాసింజర్ ఈ వీడియోలో నల్లటి చీర కట్టుకుని రజనీకాంత్ నటించిన ‘భాషా’ చిత్రంలోని ‘స్టైల్స్టైల్’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్ను ఇప్పటికే 16 లక్షల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Salma Sheik (@salma.sheik.9216)ఇదిలాఉండగా, ఈ వీడియో చూసినవారు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ విమానం తన ప్రైవేట్ ఫ్లైట్ కాదు. ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ‘ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది. పబ్లిక్లో ఇలాంటివి చేయడానికి సిగ్గుపడాలి. ఆమె ధైర్యంగా ఉందని అభినందించాలో.. లేదా ఇలా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినందుకు అసహనం వ్యక్తం చేయాలో తెలియడం లేదు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
వీడియోలు
![NRI Hospital Involvement In Kidney Transplantation Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/nr.jpg.webp?itok=0LC15eML)
![NRI Hospital Involvement In Kidney Transplantation Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/nr.jpg.webp?itok=0LC15eML)
కిడ్నీ మార్పిడి కేసులో NRI ఆసుపత్రి కీలక పాత్ర
![Hero Raj Tarun Lover Lavanya Sensational Audio Call](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/lo_0.jpg.webp?itok=7A065thL)
![Hero Raj Tarun Lover Lavanya Sensational Audio Call](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/lo_0.jpg.webp?itok=7A065thL)
రాజ్ తరుణ్ లవర్ లావణ్య సంచలన ఆడియో
![Gadwal Congress Leaders Protest against Gadwal MLA at Ghandi Bhavan In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/g.jpg.webp?itok=Hd0CDPWA)
![Gadwal Congress Leaders Protest against Gadwal MLA at Ghandi Bhavan In Hyderabad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/g.jpg.webp?itok=Hd0CDPWA)
ఆ ఎమ్మెల్యే మనకొద్దు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
![YSRCP Leaders Meet YS Jagan At Tadepalli](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/t_0.jpg.webp?itok=3FVaX9Il)
![YSRCP Leaders Meet YS Jagan At Tadepalli](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/t_0.jpg.webp?itok=3FVaX9Il)
వైఎస్ జగన్ను కలిసిన ముద్రగడ, కాసు మహేష్రెడ్డి
![Chandrababu Meets PM Modi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/de.jpg.webp?itok=H9OG-jet)
![Chandrababu Meets PM Modi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/de.jpg.webp?itok=H9OG-jet)
మోదీ ముందు చంద్రబాబు విన్నపాలు ఇవే
![TDP fake News on Uppada Fishing Harbour](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/su_0.jpg.webp?itok=UWD565jn)
![TDP fake News on Uppada Fishing Harbour](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/su_0.jpg.webp?itok=UWD565jn)
ఇదిగో ఉప్పాడ హార్బర్.. ఎల్లో మీడియా తల ఎక్కడ పెట్టుకుంటుంది ?
![Police Revealed Some Information in Raj Tarun Lavanya Complaint](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/ci.jpg.webp?itok=K_Vrx7Xq)
![Police Revealed Some Information in Raj Tarun Lavanya Complaint](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/ci.jpg.webp?itok=K_Vrx7Xq)
రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు.. సంచలన విషయాలు బయటపెట్టిన పోలీసులు
![Doctors Association Serious on Samanthas Controversial Post](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/sa_1.jpg.webp?itok=swipc-Jf)
![Doctors Association Serious on Samanthas Controversial Post](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/sa_1.jpg.webp?itok=swipc-Jf)
సమంత వివాదాస్పద పోస్ట్ మండిపడుతున్న డాక్టర్లు
![BJYM Activists & Unemployed Youth Protest at TGPSC](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/h_0.jpg.webp?itok=KEWpzWSQ)
![BJYM Activists & Unemployed Youth Protest at TGPSC](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/h_0.jpg.webp?itok=KEWpzWSQ)
TGPSC వద్ద హైటెన్షన్
![Actor Sonu Sood Visited Kumari Aunty Food Stall](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/s_0.jpg.webp?itok=CXLP-bRs)
![Actor Sonu Sood Visited Kumari Aunty Food Stall](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/s_0.jpg.webp?itok=CXLP-bRs)
కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శించిన సోనూసూద్
ఫ్యామిలీ
![Tollywood Beauty Queen Trisha Krishnan Stunning Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/5/Trisha-Krishnan.jpg.webp?itok=4Tgum_9L)
అందానికే అసూయ పుట్టించే బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
![Pantangi Rambabu Guest Column Special Story On Cooperation Day](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/Agriculture.jpg.webp?itok=O_kbkFxP)
సమ్మిళిత అభివృద్ధికి సహకార నమూనా!
‘సమాజంలో ప్రతి ఒక్కరి కోసం మెరుగైన ప్రపంచాన్ని సహకార సంఘాలు నిర్మిస్తాయి...’ ఇదీ ఈ ఏడాది అంతర్జాతీయ సహకార దినోత్సవ నినాదం! జూలై మొదటి శనివారం నాడు సహకార దినోత్సవం జరుపుకోవటం ఆనవాయితీ. ఈ జూలై 6న సహకార దినోత్సవ సంబురం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కోట్లాది సహకారులు రకరకాల కార్యక్రమాల ద్వారా సరికొత్త ఆశలతో సహకార స్ఫూర్తిని మరోసారి చాటడానికి సమాయత్తమవుతున్నారు.మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహకార శాఖను ఏర్పాటు చేసి అనేక సంస్కరణలు చేపట్టిన తర్వాత మన దేశంలో సహకార వ్యవస్థలో కొత్త కదలిక మొదలైంది. అంతకుముందు నుంచే రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సహకార శాఖలు ఉన్నప్పటికీ కేంద్రం స్థాయిలో వ్యవసాయ శాఖలో ఒక విభాగంగానే సహకార పాలన ఉంటూ వచ్చింది.అనాదిగా రైతులకు రుణాలు ఇచ్చే సొసైటీలుగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు (పీఏసీఎస్లు) రైతుల ఆర్థిక సేవలకే పరిమితం కాకుండా ఇతర ప్రజల అవసరాలను కూడా తీర్చే వ్యాపార సంస్థగా ఉండాలని భావించి కేంద్ర సహకార శాఖ పీఏసీఎస్ లకు సరికొత్త బైలాస్ను నిర్దేశించటం ఒక కీలక పరిణామం. ఈ సేవలన్నీ పారదర్శకంగా అందించటం కోసం పీఏసీఎస్ లన్నిటినీ కంప్యూటరీకరించే పని జరుగుతోంది.పీఏసీఎస్ల తర్వాత సంఖ్యాపరంగా పాడి రైతుల సొసైటీలు, మహిళా సహకార సంఘాలు (ఉదా: లిజ్జత్ పాపడ్ను ఉత్పత్తి చేసే మహిళా సొసైటీ), చేనేత కార్మికుల సొసైటీలు, మత్స్యకారుల సొసైటీలు, గృహనిర్మాణ సొసైటీలు, ఉద్యోగుల సొసైటీలు, ప్రత్యేకించి కార్మికుల సొసైటీలు (ఉదా: కేరళలో ప్రసిద్ధమైన ఉరులుంగల్ నిర్మాణ కార్మికుల సొసైటీ) సైతం గతంలోనే ఏర్పాటు కావటం మనకు తెలిసిందే.గుజరాత్లో ఏర్పడిన చిన్న పిల్లల పొదుపు సహకార సంఘం పెద్ద హిట్ అయ్యింది. ఆధునిక కాలానికి అనుగుణంగా సరికొత్త వర్గాలు విలక్షణమైన సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అర్బన్ ప్రాంతాల్లో చిన్నపాటి ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే పనివారి సహకార సంఘం కూడా ఏర్పాటైంది. ఈ–కామర్స్ సంస్థల్లో వస్తువులు పంపిణీ చేసే గిగ్వర్కర్ల సహకార సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి.ఆయుర్దాయం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో, పట్టణాల్లో వయోవృద్ధుల జనాభా పెరుగుతోంది. పిల్లలు చదువులు/ ఉద్యోగాలు/ వ్యాపారాల కోసం దేశ విదేశాలకు వెళ్లిపోవటంతో గ్రామాలు/ పట్టణాలు/ నగరాల్లో వృద్ధులే మిగిలిపోతున్నారు. కొందరు వృద్ధాశ్రమాల్లో చేరుతున్నా ఇళ్లు వదిలి వెళ్లలేక, అక్కడే ఉండలేక పండుటాకులు నానా అగచాట్లు పడుతున్నారు.వీరి ప్రత్యేక ఆహార, వైద్య, సామాజిక అవసరాలు తీర్చే ప్రత్యేక సహకార సంఘాలు ఇప్పటికే కేరళ వంటి రాష్ట్రాల్లో విశేష సేవలు అందిస్తున్నాయి. ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసుకొని ఉమ్మడిగా భోజన ఏర్పాట్లు చేసుకోవటం దగ్గరి నుంచి.. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునే వరకు సభ్యులైన వృద్ధులకు అనేక సేవలు అందిస్తున్నాయి ఈ సొసైటీలు. తెలుగు రాష్ట్రాల్లోనూ వృద్ధుల సహకార సంఘాల అవసరం ఎంతో ఉంది.గుజరాత్లో సహకార వ్యవస్థతో గట్టి సంబంధం ఉన్న అమిత్ షా కేంద్ర సహకార మంత్రిగా ఇటీవలే రెండోసారి బాధ్యతలు చేపట్టారు. సహకార వ్యాపారాన్ని దేశ విదేశాల్లో కొత్త పుంతలు తొక్కించాలన్నది తమ లక్ష్యమని మోదీ, అమిత్షా చెబుతున్నారు. సహకార రంగంలో ఢిల్లీ నుంచి తేదలచిన మార్పులన్నిటినీ క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది రాష్ట్ర సహకార శాఖలు. రాష్ట్రస్థాయిలో సహకార వ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే సలహా మండళ్లు కీలకం. వాటి జాడ లేకుండా పోయింది.సాచివేత ధోరణి, అవినీతి, మితిమీరిన రాజకీయ జోక్యం, జవాబుదారీతనం లోపించటం వంటి జాడ్యాలతో కునారిల్లుతున్న సహకార శాఖల్లో కొత్తగా సహకార స్ఫూర్తి వెల్లివిరియాలంటే రాష్ట్ర స్థాయిలోనూ సంస్కరణలు తేవాలి. అప్పుడే ‘సహకార నమూనా’ మేలైన సమ్మిళిత అభివృద్ధి మార్గంగా నిలుస్తుంది. వాతావరణ మార్పుల గడ్డు కాలంలో సహకార అభివృద్ధి నమూనా కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్ట్
![US Reality TV Star Keke Jabbar Passed away](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/Keke%20Jabbar.jpg.webp?itok=CIPunEYP)
అమెరికా రియాల్టీ టీవీ స్టార్ అనుమానాస్పద మృతి
అమెరికా రియాల్టీ స్టార్ కేకే జబ్బార్ ( 42) అనుమానాస్పరీతిలో కన్నుమూసింది. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్లో జబ్బార్ మరణవార్తను కుటుంబం ప్రకటించింది. దీంతో జబ్బార్ ఫ్యాన్స్ అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. యూఎస్లో 'లవ్ అండ్ మ్యారేజ్:హంట్స్విల్లే' రియాలిటీ టీవీ షోతో పాపులర్ అయిన కేకే తన కారులోనే శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో కారులో విగతజీవిగా పడివున్న జబ్బార్ను తొలుత ఆమె భర్త గుర్తించారు. దీంతోఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. డ్రగ్ డోస్ ఎక్కువకావడం మరణించిందా, లేక ఆత్మహత్యకు పాల్పడింది అనుమానాలు వెల్లువెత్తాయి.మరోవైపు జబ్బార్ అకాలమరణపై వస్తున్న ఊహాగానాలపై సన్నిహిత మిత్రుడు యూట్యూబర్ జోఆన్ జెంకిన్స్ క్లారిటీ ఇచ్చారు. కేకే అతిగా మద్యం సేవించలేదనీ, జీవితాన్ని చాలాప్రేమించేదనీ, ఆత్మహత్య చేసుకునే ఉద్దేశం అసలే లేదని వివరణ ఇచ్చారు. అయితే జబ్బార్ మరణాలకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.కేకే జబ్బార్ కుటుంబంకేకే భర్త అమీన్ జబ్బార్ ఇంటూటివ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్లో సెక్యూరిటీ స్పెషలిస్ట్/ప్రోగ్రామ్ అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె.
![The First Descendant High Quality Graphics Game](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/5/gaming.jpg.webp?itok=5_jfPqks)
'ది ఫస్ట్ డిసెన్డెంట్'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్ గేమ్!
థర్డ్–పర్సన్ షూటర్ గేమ్ ‘ది ఫస్ట్ డిసెన్డెంట్’ విడుదల అయింది. హైక్వాలిటీ గ్రాఫిక్స్తో కూడిన ఈ స్ట్రాటజిక్ గేమ్లో యూనిక్ క్యారెక్టర్లు ఉంటాయి. ‘ఇన్గ్రిస్’ కాంటినెంట్ను కాపాడడానికి ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ప్లేయర్ పోరాడవలసి ఉంటుంది.ఇది మాత్రమే కాదు ప్లేయర్ రకరకాల మిషన్లలో పాల్గొనవలసి ఉంటుంది. డిస్టింక్టివ్ కాన్సెప్ట్తో వచ్చిన ఈ గేమ్లో యూనిక్ స్కిల్ సెట్స్, ఫ్రీ మూమెంట్స్, చైన్ యాక్షన్స్, గ్రాప్లింగ్ హుక్స్, కలర్ఫుల్ ఫైర్ఆర్మ్... మొదలైనవి గేమింగ్ ప్రియులను ఆకట్టుకుంటాయి.డెవలపర్: నెక్సన్ గేమ్స్,ఇంజిన్: యునైటెడ్ ఇంజిన్ 5,జానర్: థర్డ్–పర్సన్ షూటర్ యాక్షన్ ఆర్పీజీ,మోడ్: కోఆపరేటివ్ మల్టీప్లేయర్.ఇవి చదవండి: ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి!
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్లో నేడే పార్లమెంట్ ఎన్నికలు... 650 స్థానాలకు జరుగనున్న పోలింగ్.. బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
రాహల్వి పిల్ల చేష్టలు. సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు. రాహుల్పై ప్రధాని వాగ్బాణాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
హిందువులమని చెప్తూనే హింసాద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీపై రాహుల్ ఫైర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![Gym receptionist commits suicide](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/44_0.jpg.webp?itok=KaswSRmS)
జిమ్ రిసెప్షనిస్ట్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: జిమ్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాగలకుంట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దావణగెరెకి చెందిన మల్లనగౌడ, జ్యోతి దంపతుల కుమార్తె శ్రావణి(22) దాసరహళ్లిలో ఉంటూ బాగలకుంట పరిధిలోని గోల్డెన్ జిమ్లో రిసెప్షనిస్ట్గా పని చేస్తోంది. సోమవారం ఉదయం రోజులాగే పనికి వెళ్లిన శ్రావణి హఠాత్తుగా కూర్చున్న చోటే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై కుప్పకూలింది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. శ్రావణికి తలంలితండ్రులు వివాహం నిశ్చయించారు. అయితే ఆమె శంకర్ అనే యువకుడిని ప్రేమిస్తోందని సమాచారం. శ్రావణిని పెళ్లికి ఒప్పించాలని తల్లితండ్రులు ఇటీవల బెంగళూరు వచ్చారు. అయితే వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని శ్రావణి చివరిసారిగా ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పటికే ఆమె విషం తాగింది. కేసు దర్యాప్తులో ఉంది.
![Young Women suicide in Vemulawada](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/4/588_3.jpg.webp?itok=ukdiXFzM)
కష్టపడి పెంచిన బిడ్డా.. ఇడిసిపోతివా?
చందుర్తి(వేములవాడ): ఆస్తి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేయగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. ఒక్కగానొక్క బిడ్డవని రెక్కల కష్టం చేసి, పెంచి పెద్ద చేసుకుంటిని బిడ్డా.. నన్ను ఇడిసిపెట్టి ఎలా పోవాలనిపించింది బిడ్డా.. ఎవరిని చూసుకొని బతకాలె బిడ్డా అంటూ ఆమె తల్లి రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన కుమ్మరి లచ్చయ్యకు భార్య లలిత, కుమారుడు బాబు ఉన్నారు. లలిత తల్లిగారింటికి వెళ్లిపోయి, కాపురానికి రాలేదు. తర్వాత లచ్చయ్య లచ్చవ్వను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కూతురు శ్రీవాణి(14) జన్మించింది. ఆమె తొమ్మిదోతరగతి చదువుతోంది. లచ్చయ్య రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటివరకు ఎలాంటి బాధ లేని ఆ కు టుంబంలో లచ్చయ్య మరణంతో ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఇంటితోపాటు రెండెకరాల భూమిలో తమ కు వాటా ఉందని అతని మొదటి భార్య కొడుకు బాబు పలుమార్లు పోలీస్స్టేషన్కు వెళ్లాడు. అప్పటినుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇంటి వెనక స్థలంలో గుడిసె వేసుకోవాలని బాబు చూడగా లచ్చవ్వ అడ్డు చెప్పింది. ఆస్తిలో తనకు హక్కు ఉందని అతను.. తమకు వీలునామా రాశాడని ఆమె గొ డవ పడుతున్నారు. దీంతో శ్రీవాణి మనస్తాపానికి గురైంది. ఈ నెల 1న ఇంట్లోనే దూలానికి ఉరి పెట్టుకుంది. గమనించిన తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి, ఆమెను కిందికి దించారు. అపస్మారక స్థితిలోకి చేరిన శ్రీవాణిని ఆటోలో వేములవాడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు బాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, శ్రీవాణి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, రాత్రి స్వగ్రామం తరలించారు.
![Men Attempts Gang Rapes On Woman In Car At Miyapur](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/gang_rape.jpg.webp?itok=WoZPsaaw)
హైదరాబాద్లో దారుణం..కారులో యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగింది.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్రెడ్డి బాధితురాలితో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్ చేశారు. ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్డ్రింగ్ ఇచ్చారు. ఆ కూల్డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్ పోలిస్ స్టేషన్కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు.
![-](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/369.jpg.webp?itok=6v9W7Pn4)
ఉసురు తీసిన కుటుంబ కలహాలు
కుల్కచర్ల: కుటుంబ కలహాలతో కలత చెందిన తండ్రి ఆత్మహత్యకు సిద్ధపడగా.. కాపాడబోయిన కూతురుతో పాటు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్చచర్ల మండల పరిధి చౌడాపూర్ల మండలం మందిపల్ గ్రామానికి చెందిన శివానంద్(51) భార్య లావణ్యలకు కుమారుడు సాయి, కూతురు చందన ఉన్నారు. 25 సంవత్సరాలుగా ఈ కుటుంబం మహబూబ్నగర్ జిల్లా శివరాంనగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో భూమి విషయంలో ఇంట్లో గొడవ జరగగా.. మనస్థాపం చెందిన శివానంద్.. రైలు పట్టాలపై నిల్చున్నాడు. ఇది గమనించిన కూతురు, కుమారుడు తండ్రిని కాపాండేదుకు యత్నించగా.. వేగంగా వచ్చిన రైలు.. తండ్రి శివానంద్, తనయ చందనను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలకు కుటుంబ సభ్యులు మందిపల్లో అంత్యక్రియలు పూర్తి చేశారు.