Top Stories
ప్రధాన వార్తలు
![YSR Jayanthi: YS Jagan Idupulapaya Visit Updates](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/ysjagan-01_0.jpg.webp?itok=jPBfYHmK)
ఇడుపులపాయ: మహానేత వైఎస్సార్కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, పలువురు కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్కు ఘనంగా నివాళులర్పించారు.కార్యక్రమం అనంతరం అరకు ఎంపీ తనూజ రాణి మీడియాతో మాట్లాడుతూ, పేద ప్రజల గుండెల్లో దివంగత మహానేత వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోతారని.. ముఖ్యంగా మా గిరిజన ప్రాంత ప్రజల్లో గుండెల్లో వైఎస్ ఎప్పటికీ ఉంటారని ఆమె అన్నారు. పోడు భూములు విషయం లో గిరిజనులకు చేసిన మేలు మరిచి పోలేము. గిరిజనుల ఆరాధ్య దైవం మోద కొండమ్మ చిత్ర పటంతో పాటు , మా గిరిజనుల ప్రతి ఇంటిలో వైఎస్సార్ చిత్ర పటం ఉంది.. రాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు జరిగిన మా గిరిజన గ్రామాల్లో, ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని తనూజ రాణి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దివంగత ముఖ్యమంత్రి, రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
![NEET UG 2024 SC Hearing Live July 8 2024 Telugu News Update](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/Supreme_Court_NEET_Hearings.jpg.webp?itok=iS2sZ0o1)
నీట్ విచారణ.. 23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయినప్పటికీ తిరిగి పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్గానే ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఆ ప్రశ్నాపత్రం ఎంత మందికి చేరింది?. ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు?. ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు?. పేపర్ లీక్తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా?. ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా?.. పేపర్ లీక్తో లాభపడిన విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మంది ఫలితాల్ని హోల్డ్లో పెట్టారు?. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఆ నివేదిక మాకు సమర్పించాలి అని కేంద్రాన్ని, ఎన్టీఏని కోర్టు ఆదేశించింది. అలాగే పేపర్ లీక్లకు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మూడు అంశాలపై ఎన్టీఏ నుంచి మాకు స్పష్టత కావాలిలీక్ ఎలా జరిగింది.. ఎక్కడకెక్కడ జరిగింది?పేపర్ లీక్కు, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉందిపేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి?.. ఇది తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీరింగ్లు కావాలన్న మధ్యతరగతి కుటుంబాల కలకు సంబంధించిన వ్యవహారాన్ని మేం విచారణ జరుపుతున్నాం. సుమారు 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అందుకే నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదంటే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. ఈ తరుణంలో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆరోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం చెప్పింది. వాదనల సందర్భంగా.. ముందుగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కొన్ని వివరాలను సీజేఐ బెంచ్ ఆరా తీసింది.. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కు ఎలా పంపించారు ?: సీజేఐప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు ?: సీజేఐఏ తేదీలలో ఈ ప్రక్రియ జరిగింది ?: సీజేఐదీనికి అడిషనల్ సోలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యిందన్నరు. అంటే నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టం అయ్యింది: సీజేఐఈ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: సీజేఐ23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సీజేఐపరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు?: కేంద్రంతో సీజేఐఅక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ?: సీజేఐపేపర్ లీక్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి : పిటిషనర్లుఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యింది : ప్రభుత్వంపరీక్షకు మూడు గంటల ముందు పేపర్ లీక్ అయ్యింది: ఎన్టీఏ NEET-UG 2024 exam: Supreme Court observes that one thing is clear that leak (of question paper) has taken place. The question is, how widespread is the reach? The paper leak is an admitted fact. pic.twitter.com/qyfZQESMsx— ANI (@ANI) July 8, 2024
![YS Jagan Tweet On Occasion Of YSR 75th Birth Anniversary](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/ysjagan-ysr-04.jpg.webp?itok=gNVYitYo)
నాన్న మీ మార్గం శిరోధార్యం.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దివంగత మహానేత వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.‘‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు.ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా.. చివరివరకూ మా కృషి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2024
![Congress Ex MLA Jagga Reddy Interesting Comments Over Chandrababu](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/Congress-Ex-MLA-Jagga-Reddy.jpg-1.jpg.webp?itok=WkGjbI-Z)
చంద్రబాబు వచ్చింది అందుకే.. కాంగ్రెస్ కేడర్ అలర్ట్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్ చేశారు.కాగా, జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కేడర్ అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నాను. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు.చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే. చంద్రబాబు కేవలం కొనసాగించారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్కు కూడా జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. దేశంలో బలమంతా ఈడీ, సీబీఐ, ఐటీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు బీజేపీలో చేరిన వారంతా వివిధ కేసుల్లో ఉన్నవారే ఉన్నారు. ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే.
![104 Year Old World War II Veteran Reveals The Secret To His Long Life](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/vet1.jpg.webp?itok=XctYl0fT)
కొలెస్ట్రాల్ కంట్రోల్తో సెంచరీ కొట్టేశాడు! ఎలాగంటే..
గోర్డాన్ గ్రెన్లే హంట్ అనే వ్యక్తి 104వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఈ ఏజ్లో కూడా తన పనులు తాను చేసుకుంటాడు. అతను రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి వ్యక్తి. ఆ టైంలో ఆక్స్ఫర్డ్లోని కార్ల తయారీ సంస్థ బ్రిటిష్ లైలాండ్ రాయల్ ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్లో పనిచేసేవాడు. అతనికి విపరీతమైన ఆకలి ఉందని, అయినా సమతుల్యమైన ఆహారం తీసుకుని జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటానని చెబుతున్నాడు. ప్రతిరోజు తాను ఇంట్లో చేసిన అల్పహారాన్నే తీసుకుంటానని చెబుతున్నాడు. ఎక్కువ ఫ్రూట్ సలాడ్ తీసుకుంటానని, తరుచుగా సాల్మన్ చేపలు, చిప్స్ తీసుకుంటానని అన్నారు. అంతేగాదు అతడి శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు కూడా నార్మల్గానే ఉన్నాయి. అతడి రెండో భార్య 2019లో మరణించడంతో డోర్సెట్లోని లార్క్సెలీస్ రెంట్ హోమ్లో నివశిస్తున్నాడు. తన తండ్రి దీర్ఘాయువుకి తిండిపై ఉన్న ఇష్టం, శ్రద్ధేనని కొడుకు ఫిలిప్స్ చెబుతున్నాడు.తన తండ్రి గుర్రం మాదిరిగా వేగంగా తింటాడు, డైట్ దగ్గరక వచ్చేటప్పటికీ చాలా స్ట్రిట్గా ఉంటాడని అన్నారు. అతను తన వయసు గురించి చాలా గర్వంగా ఫీలవ్వుతుంటాడని చెబుతున్నాడు. ఆ వృద్ధుడి సుదీర్ఘ జీవితానికి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా తోడ్పడయ్యన్నది సవివరంగా చూద్దాం.కొలస్ట్రాల్ స్థాయిలు జీవితకాలాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..కొలస్ట్రాల స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. అధిక కొలస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాదు పరిశోధనల్లో వారానికి రెండు భాగాలు సాల్మాన్ చేపలు తీసుకోవడం వల్ల అధిక కొలస్ట్రాల్ను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. సాల్మన్ చాలా పోషకాలను కలిగి ఉన్న ఆహారాల్లో ఒకటి. ప్రతి వంద గ్రాముల సాల్మన్లో 25 గ్రాముల ప్రోటీన్, 11 గ్రాముల కొవ్వు, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్, విటమిన్ బీ12, సెలీనియం, నియాసిన్, పాంతోతేనిక్ ఆమ్లం, థియామిన్, ఫోలిక్ యాసిడ్, పోటాషియం, ఫాస్ఫరస్ తదితరాలు ఉంటాయి. అలాగే శాకాహారులకు కొలస్ట్రాల్ని అదుపులో ఉంచుకునేందుకు తీసుకోవాల్సినవి..నట్స్: బాదం, వాల్నట్ వంటి కొన్ని గింజలలో మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి.అవకాడోలు: మోనోఅన్శాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడోలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.చిక్కుళ్ళు: బీన్స్, కాయధాన్యాలు, చిక్పీస్ వంటి కొన్ని చిక్కుళ్ళు దానిలోని ఫైబర్లు కొలస్ట్రాల్ని కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతాయి.(చదవండి: ఆ వ్యాధులకు తప్పుదారి పట్టించే ఆ ఫుడ్ ప్రకటనలే కారణం!)
![What Hell Looks Like Check The AI Video](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/ai-hell.jpg.webp?itok=cOvfSL_t)
'నరకం' చూపించిన ఏఐ.. భయపడని వారే వీడియో చూడండి!
స్వర్గం, నరకం ఉన్నాయో.. లేదో తెలియదు!.. కానీ దశాబ్దాల క్రితం గరుడు పురాణం చదివి ఇలా ఉంటుందని కొందరు ఊహించుకుని ఉండొచ్చు. ఆ తరువాత తరం వాళ్ళు సినిమాలు చూసి ఇలాగే ఉంటాయని భావన పొంది ఉండవచ్చు. అయితే నేడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అభివృద్ధి చెందిన తరుణంలో ఏ ప్రశ్నకైనా.. ఇదిగో సమాధానం అన్నట్టు తయారైపోయింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి నరకం ఎలా ఉంటుందని 'ఏఐ'ను అడిగారు. దీనికి కూడా ఏఐ ఓ వీడియో క్రియేట్ చేసింది.ఏఐ చూపించిన నరకం వీడియోను హిస్టారిక్ వీడియోస్ వారు తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియో షేర్ చేస్తూ.. నరకం చూపించమని ఏఐను అడిగాను' దానికి సమాధానంగా ఈ వీడియో వచ్చిందని పేర్కొన్నారు.18 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఇందులో లెక్కకు మించిన చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ మధ్యలోకి ఒక శరీరం పడుతుంది. ఆ తరువాత ఆ శరీరం ముఖం ఆకృతి వక్రంగా మారుతుంది. ఒకేసారి నోటి నుంచి చేయి బయటకు వచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్నంత సేపు తప్పకుండా భయం పుడుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. ఒకరు ఏఐను ఇలాంటి వింత ప్రశ్నలు కూడా అడుగుతారా? అని అన్నారు. మరొకరు రోజూ పబ్లిక్ బస్సులో వెళుతుంటే ఇలాంటి అనుభవమే ఎదురవుతుందని అన్నారు. మొత్తం మీద ఏఐ నరకం చూపించిందని చెబుతున్నారు.Asked Al to show "Hell' pic.twitter.com/XxoHVE9HKu— Historic Vids (@historyinmemes) April 3, 2024
![He Was Very Happy When I Got Out For 0: Abhishek Sharma About Yuvraj Singh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/yuvi2.jpg.webp?itok=1OfLL12X)
‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’
‘‘మొదటి మ్యాచ్ తర్వాత కూడా నేను ఆయనతో మాట్లాడాను. నేను డకౌట్ అయినా సరే ఆయన ఎందుకో చాలా సంతోషంగా కనిపించాడు. ‘మరేం పర్లేదు.. ఇది శుభారంభమే’ అని నాతో అన్నాడు. అయితే, ఇప్పుడు ఆయన నన్ను చూసి ఎంతగానో గర్విస్తున్నాడు.నా కుటుంబం ఎంతటి సంతోషంలో ఉందో పాజీ కూడా అంతే ఆనందపడుతున్నాడు. ఇదంతా కేవలం ఆయన చలవ వల్లే సాధ్యమైంది. నా కోసం ఎన్నో ఏళ్లుగా ఆయన కూడా కఠిన శ్రమకోరుస్తున్నాడు.నన్ను తీర్చిదిద్దడం కోసం ఎంతో కష్టపడుతున్నాడు. కేవలం క్రికెట్ పాఠాలు నేర్పించడమే కాదు.. మైదానం వెలుపలా నాకు ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తున్నారు’’ అని టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.డకౌట్.. వెను వెంటనే సెంచరీభారత దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా పంజాబీ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్-2024లో అదరగొట్టిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్గా విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్కు అభిషేక్ శర్మను ఎంపిక చేశారు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంలోనే అతడు డకౌట్గా వెనుదిరిగి పూర్తిగా నిరాశపరిచాడు.కానీ ఇరవై నాలుగు గంటల్లోనే తిరిగి అద్భుతం చేశాడు. వైఫల్యాన్ని మరిపిస్తూ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో ఆదివారం నాటి రెండో టీ20లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వంద పరుగులు సాధించాడు.తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డకౌట్ అయిన చోటే శతకంతో సత్తా చాటి ప్రశంసలు అందుకుంటున్నాడు.గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావుఈ క్రమంలో అభిషేక్ శర్మ తన మెంటార్ యువరాజ్ సింగ్కు కాల్ చేయగా.. ‘‘గర్వంగా ఉంది. చాలా బాగా ఆడావు. ఈ ప్రశంసలకు నువ్వు అర్హుడవు. ఇలాంటివి ఇంకెన్నో సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని సంతోషం వ్యక్తం చేశాడు.ప్రస్తుతం అతడు వరల్డ్ చాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ లీగ్తో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ అభిషేక్ ఫోన్కు స్పందించి ఈ మేరకు అభినందించాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ యువీ గొప్పతనాన్ని, తన కెరీర్లో అతడి పాత్ర గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.చదవండి: బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!Two extremely special phone 📱 calls, one memorable bat-story 👌 & a first 💯 in international cricket! 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!A Hundred Special, ft. Abhishek Sharma 👏 👏 - By @ameyatilak WATCH 🎥 🔽 #TeamIndia | #ZIMvIND | @IamAbhiSharma4 pic.twitter.com/0tfBXgfru9— BCCI (@BCCI) July 8, 2024 View this post on Instagram A post shared by Yuvraj Singh (@yuvisofficial)
![check these foods that can help you prevent allergies this monsoon](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/Monsoon_herbalremedies.jpg.webp?itok=e_W0zcSd)
వచ్చే..వానజల్లు : మరి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఉండాలంటే..!
చక్కని మట్టివాసన, స్వచ్ఛమైన, చల్లటి గాలులు...మొత్తానికి వర్షాకాలం వచ్చేసింది. దీంతో మండే ఎండలనుంచి భారీ ఊరట లభించింది. కానీ వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవారి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హాయినిచ్చే చిరుజల్లులే జలుబు, జ్వరం, అలెర్జీలు , ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా మోసుకొస్తాయి. ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలూ ఎక్కువే. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే, పోషకాలను అందించే ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దాం రండి.వర్షాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది. ఫలితంగా వ్యాధికారక క్రిములు చెలరేగే అవకాశం ఉంది. దీంతో రోగనిరోధక వ్యవస్థ ప్రభావితమవుతంది. తేమ గట్లో హానికరమైన బ్యాక్టీరియా , శిలీంధ్రాల పెరుగుదలను కూడా పెంచుతుంది. ఇది గట్ ఫ్లోరాకు అంతరాయం కలిగిస్తుంది. ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టుతాయి. కలుషితమైన ఆహారం, నీరుతో రోగాలు ప్రబలుతాయి.సాధ్యమైనంతవరకు ఈ సీజన్లో కాలి చల్లార్చిన నీళ్లను తాగాలి. ఆహారాలను కూడా వేడి వేడిగా తినడం ఉత్తమం. వంట ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.పసుపు : మన నిత్యం ఆహారంలో పసుపును చేర్చుకోవాలి. ఇందులోని కర్కుమిన్ శక్తి వంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి,అలెర్జీ రాకుండా కాపాడుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటీమైక్రోబయల్ ఏజెంట్ అంది. ఇది జీర్ణక్రియకు సహాయప డుతుంది. వాపును తగ్గిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.వెల్లుల్లి: యాంటీబయాటిక్,యాంటీవైరల్ లక్షణాల పవర్హౌస్ వెల్లుల్లి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో సాయపడుతుంది.పెరుగు : ప్రోబయోటిక్స్తో నిండిన పెరుగు మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆరోగ్య కరమైన గట్ బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.కాకరకాయ: కాకర యాంటీమైక్రోబయల్లక్షణాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తాయి.రక్తంలో చక్కెర నిర్వహణలో సహాయపడతాయి అలాగే ఈ సీజన్లోలభించే బీర,సొర లాంటి తీగ జాతి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.తాజా ఆకుకూరలు : తోటకూర, బచ్చలికూర, పాలకూర తదితర ఆకుకూరలనుఎక్కువగా తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి,ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.సిట్రస్ పండ్లు: రోగ నిరోధక శక్తిని పెంచే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. కీలకమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.తులసి: ఆయుర్వేదంలో తులసి ఔషధ గుణాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచే సామర్థ్యాలతో పాటు , తులసి చికాకు కలిగించే అలెర్జీ లక్షణాలతో పోరాడుతుంది. తాజా తులసి ఆకులను నమలవచ్చు. లేదా టీలో నాలుగు తులసి ఆకులు వేసుకున్నా మంచిదే. ముఖ్యంగా చిన్నపిల్లలకు కొద్దిగా అల్లం, తులసి ఆకులతో మరగించిన నీళ్లకు కొద్దిగా తేనె కలిపి తాగిస్తే మంచిది.వీటితో పాటు చల్లని వాతావరణానికి దూరంగా ఉండాలి. పిల్లలు, పెద్దవాళ్లు చలినుంచి కాపాడే ఉలెన్ దుస్తులు వాడాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
![Tollywood Hero Sudheer Babu Reacts On Sai Dharam Tej post On Social Media](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/sudher.jpg.webp?itok=JbIv6JR_)
'సాయి ధరమ్ తేజ్ పోస్ట్.. ఇలా జరిగినందుకు క్షమాపణలు': సుధీర్ బాబు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు చేసేవారిని అస్సలు ఊపేక్షించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో రియాక్ట్ అయ్యారు. ఇలా జరిగినందుకు క్షమించాలంటూ ట్వీట్ చేశారు.ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుధీర్ బాబు ఈ అంశంపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రణీత్ హనుమంత్ నా చిత్రం హరోం హరలో నటించినందుకు క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. ప్రణీత్ హనుమంతు నా సినిమాలో నటించడం చాలా అసహ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతను ఇలాంటి వ్యక్తి అని తనకు తెలియదన్నారు. సుధీర్ బాబు ట్వీట్లో రాస్తూ..'మంచో, చెడో నేను అయితే సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి హరోం హార చిత్రంలో నటించడం అసహ్యంగా భావిస్తున్నా. ఈ విషయంలో మా చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈ మనిషి ఇలాంటి వాడని నాకు తెలియదు. అతని గురించి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయా. కానీ ఇలాంటి విషయాలపై మనం దృష్టి సారించాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’
వచ్చే..వానజల్లు : మరి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఉండాలంటే..!
సమంత వైద్య సలహా.. ప్రముఖ అవార్డ్ విన్నర్ ఆగ్రహం!
చంద్రబాబు వచ్చింది అందుకే.. కాంగ్రెస్ కేడర్ అలర్ట్: జగ్గారెడ్డి
'నరకం' చూపించిన ఏఐ.. భయపడని వారే వీడియో చూడండి!
కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్’
మార్చి 1న భారత్-పాకిస్తాన్ మ్యాచ్..?
ఏపీలో ఇసుక విధానం కోసం మార్గదర్శకాలు
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్లో ఇకపై..
సాయిపల్లవి ఇకపై హీరోయిన్ కమ్ డాక్టర్.. వీడియో వైరల్
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
‘నేను డకౌట్ అయ్యాను.. యువీ పాజీ సంతోషించాడు’
వచ్చే..వానజల్లు : మరి ఇన్ఫెక్షన్లు, జబ్బులు రాకుండా ఉండాలంటే..!
సమంత వైద్య సలహా.. ప్రముఖ అవార్డ్ విన్నర్ ఆగ్రహం!
చంద్రబాబు వచ్చింది అందుకే.. కాంగ్రెస్ కేడర్ అలర్ట్: జగ్గారెడ్డి
'నరకం' చూపించిన ఏఐ.. భయపడని వారే వీడియో చూడండి!
కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్’
మార్చి 1న భారత్-పాకిస్తాన్ మ్యాచ్..?
ఏపీలో ఇసుక విధానం కోసం మార్గదర్శకాలు
ఈఎంఐలు కట్టేవారికి షాక్!! ఈ బ్యాంక్లో ఇకపై..
సాయిపల్లవి ఇకపై హీరోయిన్ కమ్ డాక్టర్.. వీడియో వైరల్
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
సినిమా
![HanuMan Director Prasanth Varma Cryptic Tweet On Ranveer Singh](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/HanuMan-Director-Prasanth-Varma.jpg.webp?itok=4GAPW9Gw)
'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?
'హనుమాన్'తో ఓవర్ నైట్ సెన్సేషన్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రశాంత్ వర్మ. అప్పటివరకు తెలుగులో పలు సినిమాలు తీసినప్పటికీ ఓ మాదిరి గుర్తింపు వచ్చింది. ఎప్పుడైతే 'హనుమాన్' థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకుందో ప్రశాంత్ వర్మ పేరు మార్మోగిపోయింది. సర్వత్రా ప్రశంసలు దక్కాయి. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల్లో ఇతడు బిజీగా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. ఆవేదనతో మంచు విష్ణుకు నటి హేమ లేఖ)'హనుమాన్' తర్వాత దీనికి సీక్వెల్గా 'జై హనుమాన్' ఉందని ప్రకటించారు. త్వరగా ఈ మూవీ వస్తే బ్రేక్ ఇద్దామని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ మాత్రం వేరే ప్రాజెక్టులు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు. అలా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో 'రాక్షసుడు' అనే మూవీ ఓకే అయిందని కొన్నిరోజుల క్రితం రూమర్స్ వచ్చాయి. అనంతరం కొన్నాళ్లకు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని టాక్ వినిపించింది.ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ షాకింగ్ ట్వీట్ పెట్టాడు. 'ప్రతి తిరస్కరణ ఏదో ఒకరోజు తిరిగి ఆశీర్వాదం అవుతుంది' అని రాసుకొచ్చాడు. దీంతో ఎవరికీ తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు. హీరో రణ్వీర్ సింగ్ రిజెక్ట్ చేయడమే ఈ ట్వీట్కి కారణమని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత? అసలేం జరిగిందనేది ప్రశాంత్ వర్మ చెప్తే తప్ప క్లారిటీ రాదు!(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్లు.. ఎక్కువగా ఆ రోజే!)One day you realise every rejection was a blessing in disguise! :)— Prasanth Varma (@PrasanthVarma) July 8, 2024
![Prabhas kalki 2898 AD Movie Collections After 11 Days](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/kk_0.jpg.webp?itok=P1ibQEdi)
కల్కితో కాసుల వర్షం.. 11 రోజుల్లోనే ఆ మార్క్ దాటేసింది!
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. గతనెల 27న విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు సృష్టిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ సినిమా.. అంతేస్థాయిలో కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి విడుదలైన 11 రోజుల్లోనే అరుదైన మార్క్ను చేరుకుంది. ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరనుంది.సైన్స్ ఫిక్షన్ చిత్రంగా వచ్చిన కల్కి 2898 ఏడీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. మూడు ప్రాంతాల మధ్య జరిగే పోరాటాన్ని కల్కిలో చూపించారు. ఇందులో అమితాబ్ నటన, కమల్ హాసన్తో సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి పార్ట్-2 కూడా ఉంటుందని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. Raging towards the magical milestone…❤️🔥#EpicBlockbusterKalki in cinemas - https://t.co/xbbZpkX7g0#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal @saregamasouth pic.twitter.com/r27Dybw58B— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2024
![Prakash Raj Ekam Web Series Trailer Out](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/ekamtrailer.jpg.webp?itok=MvZ6Vneq)
ఏడు ఎపిసోడ్లుగా ఏకం.. ట్రైలర్ చూశారా?
ప్రకాశ్ రాజ్, రాజ్ బి శెట్టి, షైన్ శెట్టి, మానసి సుధీర్, ప్రకాశ్ తుమినడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ఏకం. ఇందులో ఏడుగురి జీవితాలను ఏడు ఎపిసోడ్లుగా తెరకెక్కించారు. ఈ సిరీస్ కోసం ఏకంగా ఐదుగురు దర్శకులు పని చేశారు. సుమంత్ భట్, స్వరూప్ ఎలమొన్, సనల్ అమన్, శంకర్ గంగాధరన్, వివేక్ వినోద్ దర్శకత్వం వహించారు. వీరిలో సనల్, వివేక్ మినహా మిగతా ముగ్గురూ స్క్రీన్ప్లే అందించారు. ఈ స్క్రీన్ప్లేకు జీఎస్ భాస్కర్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. ఈ సిరీస్ జూలై 13న ఏకం ద సిరీస్ (https://www.ekamtheseries.com/) వెబ్సైట్లో విడుదల కానుంది.భావోద్వేగాల సమ్మేళనంఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రేమ, భయం, ధైర్యం, బాధ.. ఇలా అన్నిరకాల ఎమోషన్స్ను రంగరించారు. ఎంతో సహజసిద్ధంగా కనిపిస్తున్న ఈ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే ఎక్కువమంది చూసే ఆస్కారం ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సిరీస్ను తిరస్కరించడంతో మరో అవకాశం లేక సొంత ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తెస్తున్నారు.పట్టించుకోని ఓటీటీలుఈ విషయాన్ని కన్నడ హీరో రక్షిత్ శెట్టి ఇటీవలే సోషల్ మీడియాలో వెల్లడించాడు. '2020 జనవరిలో ఏకం ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. కరోనా వల్ల కాస్త ఆలస్యమైంది. 2021 అక్టోబర్లో ఫైనల్ కట్ చూసి ఆశ్చర్యపోయాను. ఈ అద్భుతమైన సిరీస్ను ప్రపంచానికి చూపించాలని ఆరాటపడ్డాను. కానీ ఎంత ఎదురుచూసినా, ప్రయత్నించినా ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఏకం తీసుకోవడానికి ముందుకు రాలేదు. అందుకే మా సొంత ప్లాట్ఫామ్లోనే దీన్ని రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు' అని ట్వీట్ చేశాడు. Presenting #EKAM – with love, from us to you! 🤗Join the waitlist now!🔗 https://t.co/PFMuw92M13 @ParamvahStudios @teamjourneyman #SumanthBhat @sandeep_ps5 @AaronMac05 @prakashraaj @RajbShettyOMK @ShineShetty_ @worldofekam @definestudio_ pic.twitter.com/e6DCwAj7tD— Rakshit Shetty (@rakshitshetty) June 17, 2024చదవండి: అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో?
![Liger Heroine Ananya Panday Cousin Alanna Panday Welcomes Baby Boy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/a_0.jpg.webp?itok=CM-GkhXP)
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సిస్టర్..!
బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ సరసన మెప్పించింది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.ఇదిలా ఉండగా అనన్య పాండే కజిన్ సిస్టర్ అలన్నా పాండే తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. తన భర్తతో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా.. గతేడాది మార్చిలో ఐవోర్ మెక్క్రేని వివాహం చేసుకున్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న గర్భం దాల్చినట్లు ఇన్స్టాగ్రామ్లో ప్రకటించింది. ముంబయిలోని హోటల్లో జరిగిన వివాహానికి షారూఖ్ ఖాన్, గౌరీ ఖాన్తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. View this post on Instagram A post shared by Alanna Panday (@alannapanday)
ఫొటోలు
![anant ambani and radhika merchant wedding celebrations photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/anant%20ambani%20and%20radhika%20merchant%20wedding%20celebrations%20photos_1.jpg.webp?itok=wU3OkiSn)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/anant%20ambani%20and%20radhika%20merchant%20wedding%20celebrations%20photos_1.jpg.webp?itok=wU3OkiSn)
అనంత్ - రాధిక పెళ్లి వేడుకలు.. మెరిసిపోయిన అంబానీ కుటుంబం (ఫోటోలు)
![New Camper Opens Most Relaxing Camping of The Summer](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/New%20Camper%20Opens%20Most%20Relaxing%20Camping%20of%20The%20Summer_1.jpg.webp?itok=H5qTEgUJ)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/New%20Camper%20Opens%20Most%20Relaxing%20Camping%20of%20The%20Summer_1.jpg.webp?itok=H5qTEgUJ)
సరికొత్త క్యాంపర్ వ్యాన్.. అన్ని సదుపాయాలు ఒకేచోట (ఫోటోలు)
![YSR Jayanthi Celebrations in Andhra Pradesh photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/YSR%20Jayanthi%20Celebrations%20in%20Andhra%20Pradesh%20photos_1.jpg.webp?itok=AO45E3-C)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/YSR%20Jayanthi%20Celebrations%20in%20Andhra%20Pradesh%20photos_1.jpg.webp?itok=AO45E3-C)
నిను మరువం రాజన్నా.. ఏపీలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు (ఫొటోలు)
![Tollywood Actress Priyamani Stunning Looks In Black And White Saree](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/Priyamani-Raj.jpg.webp?itok=xC422q8R)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/Priyamani-Raj.jpg.webp?itok=xC422q8R)
మాటల్లేవ్ అంటున్న ప్రియమణి కిల్లింగ్ లుక్స్ చూశారా? (ఫొటోలు)
![Director Atlee Kumar And Wife Priya Mohan Latest Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/Atlee-Kumar_Priya-Mohan.jpg.webp?itok=w_BKCvOw)
![](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/Atlee-Kumar_Priya-Mohan.jpg.webp?itok=w_BKCvOw)
కలర్ఫుల్గా మెరిసిపోతున్న డైరెక్టర్ అట్లీ సతీమణి ప్రియా (ఫోటోలు)
క్రీడలు
![Babar To Lose Captaincy Again PCB Coach Gary Kirsten To Decide Future: Report](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/babar_0.jpg.webp?itok=YPWyPG_l)
బాబర్ ఆజంపై వేటు?.. పీసీబీ కీలక నిర్ణయం!
వరుస పరాభవాలతో డీలా పడ్డ పాకిస్తాన్ క్రికెట్కు పూర్వ వైభవం తీసుకురావాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు హెడ్ కోచ్గా జాసెన్ గిల్లెస్పీకి బాధ్యతలు అప్పగించిన పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ).. పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రక్షాళనపైనా దృష్టి సారించినట్లు సమాచారం.బాబర్ ఆజంపై వేటు?ఇందులో భాగంగా వన్డే, టీ20 జట్ల కెప్టెన్గా ఉన్న బాబర్ ఆజంపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. సారథిగా అతడిని తప్పించేందుకు బోర్డు మొగ్గుచూపుతున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించిన నేపథ్యంలో బాబర్ ఆజం మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెస్టు పగ్గాలను షాన్ మసూద్కు అప్పగించిన పీసీబీ.. టీ20 సారథిగా షాహిన్ ఆఫ్రిదిని నియమించింది.ఈసారి కూడా చేదు అనుభవమేఅయితే, షాహిన్ కెప్టెన్గా ఆకట్టుకోకపోవడంతో టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి ముందే బాబర్ ఆజంకు తిరిగి వన్డే, టీ20 నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది. కానీ.. ఈసారి కూడా అతడికి చేదు అనుభవమే ఎదురైంది.గత టీ20 ప్రపంచకప్లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన బాబర్ ఆజం.. ఈసారి మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. కనీసం గ్రూప్ దశ దాటకుండానే పాకిస్తాన్ ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో బాబర్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.అదే విధంగా.. బంధుప్రీతికి తావు లేకుండా జట్టును ఎంపిక చేయాలంటూ ఆజం ఖాన్ వంటి వాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఆటగాళ్ల ఫిట్నెస్, క్రమశిక్షణ తదితర అంశాలకు సంబంధించి ప్రధాన కోచ్ గ్యారీ కిర్స్టెన్, ఛీఫ్ సెలక్టర్ వహాబ్ రియాజ్లను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. కిర్స్టన్ నిర్ణయం మేరకేఅదే విధంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ విషయంలో కిర్స్టన్ నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని నఖ్వీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాబర్ ఆజంపై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోందని పాక్ మీడియా ప్రచారం చేస్తోంది. మరోవైపు.. దేశవాళీ క్రికెట్ స్వరూపం గురించి మాజీ క్రికెటర్లతో చర్చించి రూట్మ్యాప్ తయారు చేయాలని పీసీబీ నిర్ణయించినట్లు సమాచారం. పీసీబీ చైర్మన్ను కలిసిఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బాగు కోరే 30- 35 మంది అంతర్జాతీయ క్రికెటర్లు పీసీబీ చైర్మన్ను సోమవారం కలిసి తమ సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమైనట్లు జియో న్యూస్ వెల్లడించింది. కాగా పాకిస్తాన్ తదుపరి తమ పరిమిత ఓవర్ల సిరీస్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 విజేతగా టీమిండియా అవతరించిన విషయం తెలిసిందే.చదవండి: BCCI: ద్రవిడ్కు రూ. 5 కోట్లు.. రోహిత్, కోహ్లి సహా వారందరికీ ఎంతంటే?
![Chris Gayle Rolls Back With His Vintage Version During WI VS SA WCL 2024 Match](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/ww.jpg.webp?itok=uS_RFTvh)
క్రిస్ గేల్ ఊచకోత..వయసు మీద పడినా అదే జోరు
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. కెరీర్ ఉన్నతిలో ఎలా విధ్వంసం సృష్టించాడో, లేటు వయసులోనే అదే తరహాలో రెచ్చిపోతున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ది బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఫలితంగా వెస్టిండీస్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.THE CHRIS GAYLE SHOW IN WCL. 🐐70 (40) with 4 fours and 6 sixes - the vintage Universe Boss at the Edgbaston Stadium, he's hitting them cleanly. 🌟 pic.twitter.com/jM5O2Lt7uo— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఆష్వెల్ ప్రిన్స్ (46 నాటౌట్), డేన్ విలాస్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రిచర్డ్ లెవి 20, నీల్ మెక్కెంజీ 0, జాక్ కలిస్ 18, జస్టిన్ ఓంటాంగ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జేసన్ మొహమ్మద్ 2, శామ్యూల్ బద్రీ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. క్రిస్ గేల్, చాడ్విక్ వాల్టన్ (29 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డ్వేన్ స్మిత్ 22, జోనాథన్ కార్టర్ 6, ఆష్లే నర్స్ 0 పరుగులకు ఔట్ కాగా..వెర్నన్ ఫిలాండర్ 2, లాంగ్వెల్డ్త్, మెక్ కెంజీ తలో వికెట్ పడగొట్టారు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆరు జట్లు (పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) పాల్గొంటున్న విషయం తెలిసిందే. జులై 3న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్లు జరిగాయి. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఆతర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. అన్ని జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
![WI vs SA Test Series Jansen Rested Breeze Gets Maiden Call Up 16 Member Squad](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/csa.jpg.webp?itok=TzT6kytO)
WI vs SA: విండీస్తో సిరీస్.. సంచలన ఆటగాడి ఎంట్రీ
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు వెస్టిండీస్తో టెస్టు సిరీస్ కోసం సన్నద్ధం కానుంది. విండీస్ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైంది.తొలిసారి జాతీయ జట్టులోఈ క్రమంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన 25 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కేకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు.అదే విధంగా.. వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. కాగా తెంబా బవుమా కెప్టెన్సీలో వెస్టిండీస్తో ఆడనున్న ఈ సిరీస్కు ఆల్రౌండర్ మార్కో జాన్సెన్ దూరం కానున్నాడు.నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఈ పేసర్కు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కొన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్తో బిజీగా ఉన్న మేము.. తిరిగి టెస్టు క్రికెట్తో బిజీ కానున్నాము.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకే కరేబియన్ జట్టుతో పోరుకు పటిష్ట జట్టును ఎంపిక చేశాం.డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టిదేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మాథ్యూకు ఈసారి చోటిచ్చాం. మార్కో జాన్సెన్కు విశ్రాంతి అవసరమని భావించాం’’ అని తెలిపాడు. సౌతాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్ గత సీజన్లో మాథ్యూ బ్రీట్జ్కే 322 పరుగులు సాధించాడు. ఇండియా-ఏ జట్టుతో అనధికారిక సిరీస్లోనూ ఆడాడు.కాగా ఆగష్టు 7 నుంచి వెస్టిండీస్- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్, టొబాగో ఈ రెండు మ్యాచ్ల సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.ఇక ఇదే వెస్టిండీస్ గడ్డపై ఇటీవల సౌతాఫ్రికాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది.వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు సౌతాఫ్రికా జట్టు:తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జీ, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెరెన్నే.
![On Talks Of Marriage With Bollywood Actress, Kuldeep Yadav Makes Big Revelation](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/adsa.jpg.webp?itok=fdJIxPIp)
బాలీవుడ్ నటితో వివాహం.. స్పందించిన టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై తొలిసారి స్పందించాడు. కుల్దీప్ ఓ బాలీవుడ్ నటిని పెళ్లాడబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే వరల్డ్కప్ విజయానంతరం స్వస్థలానికి (కాన్పూర్) చేరుకున్న కుల్దీప్ ఈ ప్రచారాన్ని ఖండించాడు. పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమే కానీ.. బాలీవుడ్ నటిని కాదని కుల్దీప్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కుల్దీప్ మాట్లాడుతే.. త్వరలోనే శుభవార్త వింటారు. నేను పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమే. కానీ, నా కాబోయే భాగస్వామి నటి కాదు. అయినా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరన్నది విషయం కాదు. చేసుకోబోయే అమ్మాయి నన్ను, నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందా లేదా అన్నదే నాకు ముఖ్యమని అన్నాడు.ఇదిలా ఉంటే, కుల్దీప్ భారత్ టీ20 వరల్డ్కప్ 2024 గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. కుల్దీప్ మెగా టోర్నీలో 10 వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్కప్ విజయానంతరం కుల్దీప్ జట్టుతో పాటు ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నాడు. అనంతరం నిన్ననే తన స్వస్థలం కాన్పూర్కు చేరుకున్నాడు. కాన్పూర్లో కూడా ముంబైలో జరిగిన తరహాలోనే విజయోత్సవ ర్యాలీ జరిగింది. కుల్దీప్ను అభిమానులు ఘనంగా సన్మానించి భారీ ఊరేగింపుగా తీసుకెళ్లారు. వరల్డ్కప్ అనంతరం చాలామంది సీనియర్ల లాగే భారత సెలెక్టర్లు కుల్దీప్ కూడా విశ్రాంతి నిచ్చారు. కుల్దీప్ ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్కు ఎంపిక కాలేదు. త్వరలో శ్రీలంకతో జరుగబోయే సిరీస్కు కుల్దీప్ ఎంపికయ్యే అవకాశం ఉంది.
International View all
![](/sites/default/files/article_images/2024/07/8/attack.jpg)
ఉక్రెయిన్పై రష్యా మిసైల్స్ దాడి.. 20 మందికిపైగా మృతి
కీవ్: రష్యా సైన్యం ఉక్రెయిన్లోని పలు సిటీలు టార్గెట్గా భీ
![](/sites/default/files/article_images/2024/07/8/france.jpg)
అంచనాలు తలకిందులు.. హంగ్ దిశగా ఫ్రాన్స్ ఫలితాలు!
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగ
![](/sites/default/files/article_images/2024/07/8/Indonesia-Gold-Mine-Workers.jpg)
బంగారం గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని ఓ బంగారు గనిలో ఆదివారం(జులై 7) ఘోర ప
![](/sites/default/files/article_images/2024/07/8/costlybalcony_rent.jpg)
ఖరీదైన బాల్కనీ.. అద్దె ఎంత అని మాత్రం అడగకండి!
దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అద్దె ఇంటి బాధలు అందరివీ ఒకటే.
![](/sites/default/files/article_images/2024/07/8/PM-Modi-Russia-Tour.jpg)
రష్యా టూర్కు బయలుదేరిన ప్రధాని
న్యూఢిల్లీ: మూడో టర్ములో ప్రధాని మోదీ రెండో విదేశీ టూర్ మొద
National View all
![](/sites/default/files/article_images/2024/07/8/Hit-And-Run-Case.jpg)
ముంబై హిట్ అండ్ రన్ కేసు.. అతడికి బెయిల్ మంజూరు
ముంబై: మహారాష్ట్రలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణ
![](/sites/default/files/article_images/2024/07/8/liquor.jpg)
కర్ణాటకలో మద్యం పంపిణీ వివాదం: ‘ఇది బీజేపీ కల్చర్’
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ కే సుధాకర్ మద్దతుదారులు ఆయన ఎ
![](/sites/default/files/article_images/2024/07/8/cm-shinde.jpg)
భారీ వర్షాలు.. ముంబై వాసులకు సీఎం షిండే విజ్ఞప్తి
ఒక పూట కురిసిన భారీ వర్షం మహారాష్ట్ర రాజధాని ముంబైలను అతలాకుతలం చేసింది.
![](/sites/default/files/article_images/2024/07/8/train_0_0.jpg)
రైలు కింద పడిన మహిళ.. కాపాడేందుకు ట్రైన్ రివర్స్
ముంబై: ఓ మహిళ రైలు కింద పడి ప్రాణాలతో బయడపటింది.
![](/sites/default/files/article_images/2024/07/8/Udhayanidhi-Stalin.jpg)
బీజేపీ మిత్రపక్ష పార్టీని ఓడించండి: మంత్రి ఉదయ్నిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడులోని విక్రవాండీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ
NRI View all
![](/sites/default/files/article_images/2024/07/8/Pranysqa%20Mishra-Anand%20Mahindra.jpg)
దుమ్మురేపిన అమ్మాయి.. ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
‘అమెరికాస్ గాట్ టాలెంట్’ షోలో పాల్గొన్న భారతీయ సంతతి అమ్మాయిని ప్రశంసిస్తూ
![](/sites/default/files/article_images/2024/07/8/855.jpg)
అమెరికా చిన్నారికి అత్యవసర వీసా..
కరీంనగర్: రాయికల్ మండలం కొత్తప
![](/sites/default/files/article_images/2024/07/7/singapoor.jpg)
సింగపూర్లో సూర్యాపేట జిల్లా యువకుడి మృతి
కోదాడ రూరల్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన యువకు
![](/sites/default/files/article_images/2024/07/6/water%20fall.jpg)
సింగపూర్లో కోదాడకు చెందిన పవన్ దుర్మరణం
సింగపూర్లో విషాదం చోటు చేసుకుంది.
![](/sites/default/files/article_images/2024/07/6/Untitled-4_7.jpg)
బ్రిటన్ ఎన్నికల్లో భారతీయ పరిమళం
లండన్: భారతీయమూలాలున్న వ్యక్తులు బ్రిటన్ సార్వత్రిక ఎన్నిక
బిజినెస్
![Mercedes EQA Launched in India](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/mersides-benz-new-electri-car.jpg.webp?itok=qWFyXNdj)
ఫుల్ ఛార్జ్తో 560 కిమీ రేంజ్.. సరికొత్త ఎలక్ట్రిక్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ' లాంచ్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ' 250 ప్లస్ అనే ట్రిమ్లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్, 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 7:15 గంటకు పడుతుంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.The wait is almost over! We are ready to introduce the new all-electric Mercedes-Benz EQA to India. Get ready for a new generation of electric luxury. #SwitchOnToStandOut#EQA #MercedesBenzIndia pic.twitter.com/50EqWDwKAA— Mercedes-Benz India (@MercedesBenzInd) July 8, 2024
![Centre considering doubling the beneficiary base of the Ayushman Bharat scheme](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/budjet01.jpg.webp?itok=Zt-ySYK3)
ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెంపు..?
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ 2024లో ప్రతిపాదనలు వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వచ్చే మూడేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..ఆయుష్మాన్ భారత్ ద్వారా అందించే వార్షిక కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. ఈ పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వారికి విస్తరించాలని యోచిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై రాబోయే బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎంజేఏవై)ను 12 కోట్ల కుటుంబాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా కేటాయింపులను రూ.7,200 కోట్లకు పెంచింది. మరో రూ.646 కోట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు కేటాయించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే నేషనల్ హెల్త్ అథారిటీ రూపొందించిన అంచనాల ప్రకారం కేంద్ర ఖజానాపై ఏడాదికి రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది.ఇదీ చదవండి: అనంత్-రాధికల పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలిబడ్జెట్ రూపొందించడానికి ముందు ప్రభుత్వం వివిధ పరిశ్రమ వర్గాలను సంప్రదించింది. అందులో బడ్జెట్లో ఆర్థిక వనరులను పెంచాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) డిమాండ్ చేసింది. ఆరోగ్యంపై ప్రభుత్వం తక్కువ ఖర్చు చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా దేశ జీడీపీలో 1.1 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే ఆరోగ్య సంక్షేమానికి కేటాయింపులు ఉన్నాయని తెలిపింది. వీక్షిత్ భారత్ 2047 లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్య రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పింది. పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి ప్రాధాన్యతా రంగంగా ఆరోగ్య రంగాన్ని మార్చాలని సూచించింది.
![Five Star Hotel Rooms Rates Nearly Rs 1 Lakh A night in Mumbai](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/five-star-hotels.jpg.webp?itok=qFqkocIZ)
ఒక రాత్రికి రూ.1 లక్ష.. పెరిగిన హోటల్స్ ధరలు - కారణం ఇదే!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి ఈ నెల 12న (జులై) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. వీరి వివాహానికి ముందే ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నారు.సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్లోని గదుల ఛార్జ్ ఒక రాత్రికి రూ.13000 ఉంటుంది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచారు. దీన్ని బట్టి చూస్తే అంబానీ పెళ్లి వేడుకలను హోటల్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.హోటల్స్ ధరలు పెంచడం ఇదే మొదటిసారి కాదుసీజన్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హోటల్స్.. గదుల చార్జెస్ భారీగా పెంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బెంగళూరులో ఏరో షో జరిగినప్పుడు కూడా అక్కడున్న హోటల్స్ గదుల రేట్లకు భారీగా పెంచాయి. ఇది మాత్రమే కాకుండా ఆటో ఎక్స్పో సమయంలో ఢిల్లీ, గురుగ్రావ్ ప్రాంతాల్లోని హోటల్స్ కూడా భారీ చార్జీలను వసూల్ చేశాయి.పెళ్ళికి హాజరుకానున్న ప్రముఖులుఇప్పటికే అనంత్, రాధికల వివాహ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఇటీవలే సంగీత్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకలకు సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరి వివాహం త్వరలోనే జరుగుతుంది. ఈ వేడుకలకు కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మొదలైనవారు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
![Today Gold And Silver Price 8th July 2024](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/gold-price-today.jpg.webp?itok=bDJvBSmG)
ధరల పెరుగుదలకు బ్రేక్!.. తగ్గిన గోల్డ్ రేట్లు
జులై ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. జులై నెలలో బంగారం ధరలు మొదటిసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67450 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73580 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గాయి. ఇదే ధరలు ముంబై, బెంగళూరు, వైజాగ్, ప్రొద్దుటూరులలో కూడా కొనసాగుతాయి.చెన్నైలో కూడా పసిడి ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 68000 వద్ద, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 220 తగ్గి రూ. 74180 వద్ద నిలిచాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం కొంత తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.విజయవాడ, హైదరాబాద్, చెన్నై మాదిరిగానే దేశ రాజధాని నగరంలో కూడా గోల్డ్ రేట్లు తగ్గాయి. దీంతో ఈ రోజు 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 67600 వద్ద, 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ. 73730 వద్ద నిలిచింది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గుముఖం పట్టినా.. వెండి ధరలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ రోజు (జులై 8) కూడా వెండి ధరలు రూ. 200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర నేడు రూ. 95వేలకు చేరింది. జులై ప్రారంభం నుంచి పెరుగుతూ ఉన్న ధరలు ఇలాగే కొనసాగితే.. వెండి ధర త్వరలోనే లక్షకు చేరుకునే అవకాశం ఉందనిపిస్తోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
వీడియోలు
![Kolli Satyavathi About TDP Leader Kaki Govinda Reddy Cheating](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/lo_0.jpg.webp?itok=_A0zVcO3)
![Kolli Satyavathi About TDP Leader Kaki Govinda Reddy Cheating](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/lo_0.jpg.webp?itok=_A0zVcO3)
లాగిపెట్టి గువ్వ మీద కొట్టాడు.. టీడీపీ నేత బరితెగింపు
![YS Rajasekhara Reddy Jayanthi Celebrations All over AP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/st.jpg.webp?itok=6SkZw6gq)
![YS Rajasekhara Reddy Jayanthi Celebrations All over AP](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/st.jpg.webp?itok=6SkZw6gq)
ఏపీలో ఘనంగా మహానేత వైఎస్సార్ జయంతి
![AP EX Speaker Tammineni Sitaram Serious on TDP Leader Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/si.jpg.webp?itok=cRfVtWYB)
![AP EX Speaker Tammineni Sitaram Serious on TDP Leader Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/si.jpg.webp?itok=cRfVtWYB)
అధికారంలోకి రాగానే నరకం చూపిస్తున్నారు
![Supreme Court Key Comments on NEET Paper Leak](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/nee.jpg.webp?itok=IZMkDaoW)
![Supreme Court Key Comments on NEET Paper Leak](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/nee.jpg.webp?itok=IZMkDaoW)
నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
![Guntur Kidney Racket Victim Madhu Face To Face](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/ko.jpg.webp?itok=wB1o65_Z)
![Guntur Kidney Racket Victim Madhu Face To Face](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/ko.jpg.webp?itok=wB1o65_Z)
కిడ్నీ రాకెట్.. దారుణమైన మోసం
![Vellampalli Srinivas Fires on Pawan Kalyan Over TDP Attacks on YSRCP Leaders ](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/att.jpg.webp?itok=Dw_9FTBj)
![Vellampalli Srinivas Fires on Pawan Kalyan Over TDP Attacks on YSRCP Leaders ](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/att.jpg.webp?itok=Dw_9FTBj)
పవన్ కళ్యాణ్ మౌనం? టీడీపీ నేతలకు వెల్లంపల్లి వార్నింగ్
![24 Tested Positive in Hyderabad Drugs Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/pu_3.jpg.webp?itok=FZU4Gnm6)
![24 Tested Positive in Hyderabad Drugs Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/pu_3.jpg.webp?itok=FZU4Gnm6)
24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ
![DSC Candidates Protest At School Education Director Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/po_3.jpg.webp?itok=EAUaEyuK)
![DSC Candidates Protest At School Education Director Office](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/po_3.jpg.webp?itok=EAUaEyuK)
మెగా డీఎస్సీ నిర్వహించాలని, ప్రస్తుత డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్
![Rs 50 Lakh Compensation and Job To Victims Family](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/sc_1_0.jpg.webp?itok=xnzQRu28)
![Rs 50 Lakh Compensation and Job To Victims Family](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/sc_1_0.jpg.webp?itok=xnzQRu28)
అల్ట్రా టెక్ సిమెంట్ ఘటన.. రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం
![Retired Judge Malyadri Explained About EVMs Hack](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/de.jpg.webp?itok=CF7_5Uc-)
![Retired Judge Malyadri Explained About EVMs Hack](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/de.jpg.webp?itok=CF7_5Uc-)
ఈవీఎంలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ఫ్యామిలీ
![Street Dog saves Vasai woman from sexual assault by monster](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/streetdog-sexual%20assault-woman.jpg.webp?itok=4bwso_gS)
మహిళపై అత్యాచారయత్నం : వీధి కుక్క అలర్ట్...దెబ్బకి..!
ఇటీవలి కాలంలో వీధికుక్కలు చిన్నపిల్లలపై దాడిచేస్తూ స్వైరవిహారం చేస్తున్న వార్తలు చదివి చాలా ఆందోళన చెందాం కదా. విశ్వాసానికి మారుపేరైన పెంపుడు కుక్కలు కూడా స్వయంగా యజమానిపై దాడి ఘటనలూ చేశాం. కానీ సాధారణంగా కుక్కలు యజమానులను ప్రేమిస్తాయి. ఆ మాటకొస్తే కాస్త గంజి పోయినా చాలు బోలెడంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న పిల్లలంటే ఇంకా మక్కువ చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలకు తెగించి మరీ మనుషులను ఆదుకుంటాయి. తాజాగా కుక్కల మీద మనుషులకు విశ్వాసాన్ని పెంచే ఘటన ఒకటి మహరాష్ట్రలోని ముంబై చోటు చేసుకుందిఅత్యాచారానికి యత్నించిన వ్యక్తినుంచి 32 ఏళ్ల మహిళను వీధి కుక్క రక్షించిన ఘటన జూన్ 30న ముంబైలోని వసాయ్లో జరిగింది. మాణిక్పూర్ సందులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై సందీప్ ఖోట్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. అకౌంటెంట్ అయిన మహిళ ఇంటికి వస్తుండగా సందీప్ ఆమె వెంబడించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాక చంపేస్తాని బెదిరించి, నోరు నొక్కి కిందపడేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఇంతలో ప్రమాదాన్ని పసిగట్టిన ఓ వీధికుక్క గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దెబ్బకి భయపడిన అతగాడు, లేచి అక్కడినుంచి ఉడాయించాడు. అయితే పోతూ పోతూ ఆమె ఐఫోన్ను లాక్కొని పారిపోయాడు. దీంతో బాధిత మహిళ తప్పించుకుంది. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.
![Tollywood Actress Priyamani Stunning Looks In Black And White Saree](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/8/Priyamani-Raj.jpg.webp?itok=xC422q8R)
మాటల్లేవ్ అంటున్న ప్రియమణి కిల్లింగ్ లుక్స్ చూశారా? (ఫొటోలు)
![Benefits of reverse Walking and Advantages](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/Retro-walking.jpg.webp?itok=hHMd85CS)
ఎక్కువ క్యాలరీలు ఖర్చవ్వాలంటే..రివర్స్ వాకింగ్ ట్రై చేశారా?
ఆరోగ్యకరమైన అలవాట్లు ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో మనిషికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను లభిస్తాయి. చక్కని ఆరోగ్యంతోపాటు, చక్కని శరీరాకృతితో బరువు పెరగకుండా ఉండేందుకు చాలా వ్యాయమాలను చేస్తాం. అయితే వెనుకకు నడవడం లేదా రివర్స్ వాకింగ్ ఉత్తమమైన వ్యాయామమని మీకు తెలుసా? చిన్నతనంలో ఏదో సరదాగా ఆటల్లో భాగంగా అలా చేసే ఉంటారు కదా. కానీ పెద్దయ్యాక కూడా రివర్స్ వాకింగ్ వల్ల చాలా లాభాలున్నాయి. ఇది వింతగా అనిపించినప్పటికీ ఇది ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.రివర్స్ వాకింగ్ మన సమతుల్యతను, స్థిరత్వాన్ని కాపాడుతుంది. తూలి పడిపోయే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా పెద్ద వయసువారిలో పడిపోవడం వల్ల ఎముకలు విరగడం లాంటి ప్రమాదాలను నివారించవచ్చు.ఈ టెక్నిక్తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో మరింత స్థిరంగా ఉండటానికి దోహదపడుతుంది. ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి కూడా వేగవంతమైన నడక కంటే రివర్స్ వాకింగ్తో 40 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.రివర్స్ వాకింగ్ కీళ్ల పనితీరు మెరుగుపడుతుంది. కాళ్లలోని కండరాలు బలపడతాయి. కండరాలు ఎక్కువగా సాగుతాయి. మోకాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రివర్స్ వాకింగ్ కింది వీపుపై ఒత్తిడి తెస్తుంది. దీని వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా బాగా పనిచేస్తుంది. వెనుకకు నడిచేటప్పుడు ఏకాగ్రత అవసరం. కనుక శరీరంలోని మెదడు, ఇతర అవయవాల మధ్య సమన్వయం పెరుగుతుంది. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. గుండె, ఇతర అవయవాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచి, ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది అథ్లెట్లకు, ముఖ్యంగా రన్నర్లకు, ఇది బాగా ఉపయోగకరం. ఎలా చేయాలి?ఆరుబయట, విశాలమైన పార్క్ లేదా ప్రశాతంగా ఉండే నిశ్శబ్ద పరిసరాలు, సురక్షితమైన ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి. ఎటువంటి అడ్డంకులు, ట్రాఫిక్ లేని ప్రాంతాలను ఎంచుకోండి. వెనుకకు నెమ్మదిగా అడుగులు వేస్తూ నడవాలి. ట్రెడ్మిల్పై కూడా చేయవచ్చు.ఈ రివర్స్వాకింగ్ను నెమ్మదిగా ప్రారంభించాలి. ఆరంభంలో ఎవరైనా తోడు ఉంటే ఇంకా మంచిది. అలవాటయ్యే కొద్దీ, ఈ వాకింగ్ సమయాన్ని, దూరాన్ని పెంచుకోవచ్చు. సపోర్ట్ ఇచ్చే ఫిట్టింగ్ పాదరక్షలను ధరించండినోట్ : మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పితో బాధపడేవారు వైద్య సలహా మేరకు రివర్స్వాకింగ్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. తూలిపడే తత్వం, ఉదాహరణకు వర్టిగోతో బాధపడుతున్న వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి.
![Bonalu Festival History And Significance](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/Bonalu.jpg.webp?itok=hHBOUXVs)
బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి? దీని చరిత్ర..!
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్ రాజశేఖరరెడ్డి మహోన్నత నాయకుడు... ఆయన లేరని ప్రతిరోజూ విచారిస్తూనే ఉన్నాం... సందేశం విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీశ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు వెంటనే ఆపండి.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన వేంపల్లె అజయ్కుమార్రెడ్డికి పరామర్శ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ సాధించి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు.. ముంబైలో అపూర్వ స్వాగతం పలికిన ప్రజలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
బ్రిటన్లో నేడే పార్లమెంట్ ఎన్నికలు... 650 స్థానాలకు జరుగనున్న పోలింగ్.. బరిలో 107 మంది బ్రిటిష్ ఇండియన్లు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
రాహల్వి పిల్ల చేష్టలు. సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు. రాహుల్పై ప్రధాని వాగ్బాణాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
హిందువులమని చెప్తూనే హింసాద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీపై రాహుల్ ఫైర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![Greenfield camp office set ablaze by miscreants](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/bhayanaka.jpg.webp?itok=itaRcHUd)
భయానక వాతావరణం సృష్టించేందుకే..
సాక్షి టాస్్కఫోర్స్: వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో వాటా అడిగారని, ఇస్తానని చెప్పినా చివరికి పనులు మొత్తం ఇవ్వాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్ శివప్రసాద్రెడ్డి తెలిపారు. దీనికి అంగీకరించని తాను 15 రోజులుగా నిలిచిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించడానికి గ్రీన్ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసుకు దుండగులు నిప్పుపెట్టారని చెప్పారు. గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు పనులను మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నాలుగు కిలోమీటర్ల మేర పనుల్ని సబ్ కాంట్రాక్ట్ కింద సిద్ధార్థ కంపెనీ యజమాని రామిరెడ్డి శివప్రసాద్రెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్లో పనులు మొదలుపెట్టారు. పనులు జరుగుతుండగా కూటమి అధికారంలోకి వచ్చి0ది. అప్పటి నుంచి హైవే పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. టీడీపీ నేతలు నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో జరిగే హైవే పనులను అడ్డుకున్నారు. వాటా ఇవ్వందే పనులు చేయకూడదని హుకుం జారీచేశారు. అయినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడానికి సిద్ధమైన తరుణంలో వారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాయల్టీ లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారని అధికారులు టిప్పర్లను సీజ్చేశారు. రాయల్టీ అధికారులు విధించిన జరిమానా చెల్లించి టిప్పర్లను తెచ్చుకుని పనులు ప్రారంభించే సమయంలో క్యాంపు ఆఫీసును తగులబెట్టారు. హైవే రోడ్డు పనులు నాలుగు కిలోమీటర్లు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నానని, దాన్లో రెండు కిలోమీటర్లు చేసుకునేందుకు ఇచ్చేస్తానని టీడీపీ నేతలకు చెప్పినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. కానీ వారు మొత్తం నాలుగు కిలోమీటర్ల పనులు కావాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించని తాను పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యానని, ఈ పనులను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు గ్రీన్ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసును తగులబెట్టారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
![TDP attack on ex volunteer Nagaraju](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/8/dalit.jpg.webp?itok=lDs65e63)
దళితుడిపై ‘దేశం’ నేతల దాడి
సాక్షి టాస్్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు. ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు. పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలి నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు.
![Rtc Bus Accident In Hyderabad Suraram](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/7/Bus-Accident.jpg.webp?itok=DNR5IJrH)
HYD: సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులకు గాయాలు
సాక్షి,హైదరాబాద్: నగరంలోని సూరారంలో ఆదివారం(జులై 7) సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు మండిపడ్డారు. ఈ ఘటనతో బహదూర్పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు ట్రాఫిక్జామ్ అయింది.వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించారు. జీడిమెట్ల డిపో బస్సు గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది.
![Bmw Car Hit And Run Case In Mumbai Update](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/7/Mihir%20Shah.jpg.webp?itok=BnWQJsAg)
మద్యం మత్తులో బీభత్సం.. కేసు నుంచి అధికార పార్టీ నేత కుమారుణ్ని తప్పిస్తున్నారా?
ముంబై అధికార శివసేన పార్టీ నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా (24) హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం మిషిర్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణం కోల్పోయింది. అయితే ఈ కేసులో మిషిర్ షాను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మిహిర్ షా ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్కి వెళ్లి తిరిగి వస్తున్న భార్య కావేరీ నక్వా,ఆమె భర్త పార్థిక్ నక్వా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు కావేరీ నక్వా మరణించగా.. భర్త పార్థిక్ నక్వా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతుడున్నాడు.అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగే సమయంలో కారులో కారు డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్తో పాటు మిహిర్ షా ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారైన మిహిర్ షా కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. డ్రైవర్ను బిజావత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీ నేత కుమారుడికి అనుకూలంగాహిట్ అండ్ రన్ కేసులో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై వివాదం నెలకొంది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద అంటే హత్యతో సమానం కాని నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా నేరపూరిత నరహత్య, ర్యాష్ డ్రైవింగ్,సాక్ష్యాలను ధ్వంసం చేయడం మొదలైన వాటిపై కేసు నమోదు చేస్తారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం సేవించిన కారు డ్రైవర్ బిజావత్ నుంచి రక్త నమోనాలకు సేకరించారు.రిపోర్ట్స్ రావాల్సి ఉంది.వాళ్లు సమాజంలో పేరున్న పెద్దోళ్లు.. మనమేం చేయలేంరోడ్డు ప్రమాదంపై తన భార్య కావేరీ నక్వా మరణంపై ఆమె భర్త పార్థిక్ నక్వా కన్నీరు మున్నీరవుతున్నారు. ‘‘ఫిష్ మార్కెట్ నుంచి తిరిగి వస్తున్న తమ వెహికల్ను బీఎండబ్ల్యూ కారు ఢీకొట్టింది. నా భార్య ఎగిరి 100 మీటర్ల అవతల పడింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో నా భార్యను కోల్పోయా. నాకు ఇద్దరు పిల్లలు. వారి సంరక్షణ ఎవరు చూసుకోవాలి. వాళ్లంటే సమాజంలో పేరున్న పెద్ద మనుషులు. వారిని ఎవరు ఏం చేయలేరు. చివరికి బాధపడాల్సి మనమే అంటూ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన కారకుడైన మిహిర్ షా‘‘ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.పోలీసులు వెర్షన్ ఎలా ఉందంటే? బీఎండబ్ల్యూ కారు మిహిర్ షా పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా, డ్రైవర్ ఇద్దరు కారులో ఉన్నారు. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిహిర్ షా గత రాత్రి జుహులోని ఓ బార్లో మద్యం సేవించాడు. ఇంటికి వెళుతుండగా, డ్రైవర్ని లాంగ్ డ్రైవ్ చేయమని అడిగాడు. వర్లీ ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తున్న మిహిర్ షా.. కావేరీ నక్వా ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. సీఎం ఏక్ నాథ్ షిండ్ ఏమన్నారంటే?మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండ్ హిట్ అండ్ రన్ కేసుపై స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా చట్టం తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమే దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనని, ఆ విషయంలో ఎవరి పట్ల వివక్ష చూపబోమని, ఈ కేసులో బాధితులకు న్యాయం జరిగేలా.. నిందితులకు శిక్షపడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఏక్ నాథ్ షిండ్ వెల్లడించారు.