Top Stories
ప్రధాన వార్తలు
లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్
Updates:లోక్ సభలో విపక్షాల వాకౌట్నీట్పై చర్చకు అనుమతించకపోవడంతో వాకౌట్రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత చర్చలో నీట్ విషయం మాట్లాడాలని కోరిన స్పీకర్అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనన్న మంత్రి రాజ్నాథ్ సింగ్నీట్పై చర్చకు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించాలని కోరిన రాహుల్ గాంధీనోటీసు ఇచ్చిన తర్వాత దానిపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న స్పీకర్ ఓం బిర్లా లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్నీట్పై చర్చకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్లోక్ సభ రూల్స్ ప్రకారం నడుస్తోంది: మంత్రి రాజ్నాథ్ సింగ్రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదు ఒకరోజు నీట్పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న రాహుల్ గాంధీవిద్యార్థులు పార్లమెంట్ వేదికగా భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.ఒక్కరోజు నీట్పై చర్చించాలిఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశంరాహుల్ గాంధీ చెప్పిన అంశాన్ని పరిశీలిస్తామని తెలిపిన స్పీకర్ ఓం బిర్లా #WATCH | Lok Sabha LoP Rahul Gandhi raises the NEET irregularities issue, in the House.He says, "A message is disseminated to the country, from Parliament. We want to give a message to students that NEET issue is important for the Parliament. So, to send this message we want… pic.twitter.com/MlXPdMFMH3— ANI (@ANI) July 1, 2024 లోక్సభలో గందరగోళం చోటు చేసుకుంది. నీట్పై చర్చకు పట్టుపట్టిన విపక్షాలురాహుల్ గాంధీ మైక్ స్విచ్ ఆఫ్ చేయటంపై వివరణ ఇచ్చిన స్పీకర్విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లారాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామన్న స్పీకర్స్పీకర్పై ఆరోపణలు చేయటం సరికాదు: ఓం బిర్లా #WATCH | Amid Opposition protest in Lok Sabha, Speaker Om Birla says, "Outside the House, some MPs level allegations that the Speaker switches off the mic. The control of the mic is not in the hands of the one who sits on the Chair." pic.twitter.com/hAjCZsNxJg— ANI (@ANI) July 1, 2024 టీ-20 ప్రపంచకప్ సాధించిన భారత్ జట్టు, కెప్టెన్ రోహిత్ శర్మకు స్పీకర్ ఓం బిర్లా, లోక్సభ అభినందనలు తెలిపారు.#WATCH | Lok Sabha Speaker Om Birla and the House congratulates Cricket Skipper Rohit Sharma and the entire Team India on winning #T20WorldCup2024 pic.twitter.com/MOI144KSxh— ANI (@ANI) July 1, 2024 లోక్సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయినీట్ పరీక్ష పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుఎన్టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం నోటీసులు సభ ప్రారంభానికి ముందే విపక్షాల నిరసన పేపర్ల లీకేజీ, ఎన్టీఏపై చర్చించాలంటున్న విపక్షాలురాష్ట్రపతి ధన్యవాద తీర్మాణంపై చర్చించాలంటున్న అధికార పక్షం నీట్-యూజీ పేపర్ లీకేజీ, యూజీసీ నెట్ నిర్వహణ వైఫల్యంపై లోక్సభలో చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయాదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెండు రోజుల విరామం అనంతరం 18వ లోక్సభ తాత్కాలిక సమావేశాలు తిరిగి ఇవాళ( సోమవారం) ప్రారంభం కానున్నాయి. లోక్సభలో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, అగ్నిపథ్ వంటి అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తెలిపే అవకాశం ఉంది. ఈ మేరకు లోక్సభలో నిరసన చేట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
సాక్షి హైదారాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ వాదనలతోనే ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. కేసీఆర్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు సోమవారం ఉదయం వెల్లడించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్, జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో.. ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా, దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. అయితే.. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్కో జెన్కో అధికారుల్ని సైతం విచారించిందని,ఈ పిటిషన్కు అసలు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో ఏజీ వాదనలతో ఏకీభవించిన ప్రభుత్వం కేసీఆర్ రిట్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో గులాబీ బాస్ తర్వాత ఏం చేయబోతున్నారో? అనే ఆసక్తి నెలకొంది.
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!
కాఫీ ఘుమఘుమలకు వహ్..! అని కితాబిస్తు ఒక్క సిప్ చేసేందుకు తహతహలాడుతుంటాం. అలాంటి టేస్టీ కాఫీ మన ప్రధాని మోదీ మనసును కూడా దోచుకుంది. ఆయన ప్రత్యేకంగా ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ గురించి తరుచుగా చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్లోని అరకులోయలో ప్రసిద్ధి గాంచిని కాఫీ రుచికి మోదీ సైతం పిదా అయ్యారు. మన్కీ బాత్ 111వ ఎపిసోడ్లో ఆ కాఫీ గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. గతేడాది సెప్టెంబర్ 2023లో భారతదేశం నిర్వహించిన జీ20 సదస్సులో కూడా అరకు కాఫీ గురించి హైలెట్ చేస్తూ మాట్లాడారు. అంతేగాదు మన అరకు కాఫీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని గుర్తు తెచ్చుకుంటారు ఆయన. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి మన్ కీ బాత్లో మరోమారు అరకు కాఫీని ప్రశంసించడం విశేషం. కేవలం ప్రశంసలు మాత్రమే కాదు.. అరకు కాఫీ రుచిని ఆస్వాధించమని మన్ కి బాత్ శ్రోతలను కూడా కోరారు. అసలేంటి అరకు కాఫీ ప్రత్యేకతలు అంటే..అరకు కాఫీ అంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు లోయలో కాఫీ సాగు దాదాపు వంద ఏళ్ల నాటిది. అయితే అది 1947 తర్వాత నెమ్మదిగా క్షీణించింది. మళ్లీ 2000లలో వాణిజ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా లాభాప్రేక్షలేని నంది ఫౌండేషన్ సంస్థ ముందుకు కొచ్చి స్థానిక రైతులను ప్రోత్సహించింది. అందుకు అవసరమైన వనరులను కూడా అందించింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడింది. అలాగే అనేక మంది స్థానికులకు ఉపాధిని కూడా అందించింది. ఒకరకంగా ఈ ప్రాంతం ప్రత్యేక వాతావరణం ద్వారా పండించిన ప్రసిద్ధ కాఫీ గింజలకు పేరుగాంచేందుకు దారితీసింది. అరకులోయలో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో అధికంగా ఐరన్ ఉండటం తదితర కారణాల వల్ల కాఫీ మొక్కలు నెమ్మదిగా పండటం మొదలయ్యింది. ఆ వాతావరణమే కాఫీ గింజలకు ప్రత్యేకమైన అరోమా రుచిని తెచ్చిపెట్టాయి కూడా. ఆ తర్వతా ఆ అరుకు వ్యాలీ కాఫీకి విశేష ప్రజాధరణ లభించి, అందరి మన్నలను అందుకుంది. అలా 2019లో, అరకు కాఫీకి భౌగోళిక సూచిక (GI) హోదా లభించింది. ప్రస్తుతం అరకు కాఫీకి దేశవ్యాప్తంగా విశేషమైన ఆధరణ ఉంది. దీనికి సంబంధించి ఫ్లాగ్షిప్ బ్రాండ్తో వచ్చిన బ్రూ కాఫీ మరితం ఫేమస్.(చదవండి: తప్పనిసరిగా ఉడికించే తినాల్సిన కూరగాయలివే..!)
రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త
టీ20 వరల్డ్కప్ 2024 అనంతరం టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ ముగ్గురు ప్రకటించారు. పొట్టి క్రికెట్ నుంచి తప్పుకున్న అనంతరం ఈ ముగ్గురు వన్డే ఫార్మాట్కు కూడా గుడ్బై చెబుతారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించాడు. రోహిత్, కోహ్లి, జడేజా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారని అన్నాడు. టీ20 వరల్డ్కప్ 2024 ఆడిన జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతుందని హింట్ ఇచ్చాడు. సీనియర్లంతా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటారని పేర్కొన్నాడు. టీమిండియా మున్ముందు మరిన్ని టైటిళ్లు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. తమ తదుపరి టార్గెట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటల్స్ అని తెలిపాడు. విరాట్, రోహిత్లు వన్డేల్లో కొనసాగడంపై షా క్లూ ఇవ్వడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్ల మెరుపులను మరిన్ని రోజులు చూడవచ్చని ఆనందపడుతున్నారు.ఇదిలా ఉంటే, బీసీసీఐ నిన్న టీమిండియాకు రూ. 125 కోట్ల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచకప్ ఆధ్యాంతం అద్భుత ప్రదర్శన కనబర్చి, 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్కు తిరిగి సాధించినందుకు భారత బృందం జాక్పాట్ కొట్టింది. టీమిండియా ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్కు వేదిక అయిన బార్బడోస్లోనే ఉంది. గాలివాన భీబత్సం (హరికేన్) కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో భారత జట్టు బార్బడోస్లోనే నిలిచిపోవాల్సి వచ్చింది.అయితే, హరికేన్ ప్రభావం తగ్గి విమాన సర్వీసులు పునరుద్ధరించబడితే రేపటి కల్లా టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. భారత ఆటగాళ్లు ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఘన స్వాగతం పలకాలని ప్లాన్లు చేసుకున్నారు. భారత ప్రభుత్వం సైతం వరల్డ్కప్ హీరోలను ఘనంగా సన్మానించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. భారత్లోకి ఎంటర్ కాగానే టీమిండియా హీరోలను ఊరేగింపుగా తీసుకుపోవచ్చు. ఈ తంతు అనంతరం భారత క్రికెట్ బృందం ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది.
ప్రభాస్ 'కల్కి' రేర్ రికార్డ్.. ఇది కదా అసలైన మాస్ అంటే
డార్లింగ్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించాడు. 'కల్కి'తో ఇప్పటికే వరల్డ్ వైడ్ మరింతగా గుర్తింపుతో పాటు వసూళ్ల జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రూ.500 కోట్ల క్లబ్లోకి మరోసారి చేరిపోయాడు. 'బాహుబలి' నుంచి వరసగా ఈ మార్క్ చేరుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే రికార్డ్ తన పేరిట నమోదు చేసుకున్నాడు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ)'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. దీని తర్వాత బాహుబలి 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్.. ఇలా వరస చిత్రాలతో వందల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. కాకపోతే 'బాహుబలి 2' తప్పితే మిగిలినవన్నీ కూడా లాంగ్ రన్లో ఐదారు వందల కోట్లు మాత్రమే సొంతం చేసుకున్నాయి. 'కల్కి' మాత్రం తొలి వీకెండ్ పూర్తి కాకుండానే రూ.500 కోట్ల మార్క్ అధిగమించింది. రేర్ రికార్డ్ నమోదు చేసింది.ఆదివారం సాయంత్రం ఫస్ట్ షో పడేటప్పటికీ రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చేసినట్లు తెలిసిపోయింది. మరోవైపు ఓవర్సీస్లోనూ వీకెండ్ పూర్తయ్యేసరికి 10.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. గతంలో 'బాహుబలి' మూవీ తొలి వారాంతంలో రూ.415 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు దీన్ని 'కల్కి' అధిగమించిందంటే.. లాంగ్ రన్లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)
మూడు నెలలుగా జైల్లోనే.. కవిత బెయిల్పై ఉత్కంఠ
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నేడు(సోమవారం) తీర్పు వెల్లడించనుంది. మూడు నెలలుగా తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై నేడు మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించనున్నారు.ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున న్యాయవాదుల వాదనలతో పాటు ఈడీ, సీబీఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జులై1కు రిజర్వు చేసింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
కొత్త చట్టాలు.. దేశంలోనే తొలి కేసు నమోదు!
న్యూఢిల్లీ: దేశంలో కొత్త చట్టాలు జూన్ 30 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)ని భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)గా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)ని భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ)ను భారతీయ సాక్ష్య అధినీయం(బీఎస్ఏ)గా మార్చారు. ఈ క్రమంలో తొలి కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.దేశ రాజధాని ప్రాంతంలోనే తొలి కేసు నమోదు కావడం గమనార్హం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారి మీద గత అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పోలీసులు పాట్రోలింగ్ నిర్వహిస్తున్న టైంలో.. ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా, వాటర్ బాటిల్స్ అమ్ముతూ కనిపించాడు. ఆ దుకాణం రోడ్డుగా అడ్డంగా ఉండడంతో పాటు.. దానిని తీసేయాలని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినలేదని పోలీసులు చెబుతున్నారు. భారతీయ న్యాయ్ సంహిత క్రిమినల్ కోడ్లోని సెక్షన్ 285 ప్రకారం.. అతనిపై కేసు నమోదు అయినట్లు సమాచారం. నిందితుడు బీహార్ పట్నాకు చెందిన పంకజ్ కుమార్గా గుర్తించారు. ఈ సెక్షన్ ప్రకారం.. రోడ్లను అతిక్రమించడం, తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు. ఆ జరిమానా ఐదు వేల రూపాయల దాకా ఉంటుంది.ఇదిలా ఉంటే.. కొత్త చట్టాల అమలుపై పోలీసు సిబ్బందికి మే 24 నుంచి జూన్ 25 వరకు శిక్షణను అందిన విషం తెలిసే ఉంటుంది. మూడు చట్టాల ద్వారా మారుతున్న డిజిటల్ యుగంలో సాంకేతికతను వాడుకునేందుకు సౌకర్యంగా తీర్చిదిద్దారు.
ప్రముఖ సంస్థకు రూ.9.5 కోట్ల ట్యాక్స్ నోటీసులు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రూ.9.5 కోట్ల విలువైన ట్యాక్స్ నోటీసులు అందుకుంది. కర్ణాటక కమర్షియల్ టాక్స్ అథారిటీ అధికారుల నుంచి ఈ మేరకు నోటీసులు అందినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.2020 ఆర్థిక సంవత్సరానికిగాను ఫైల్ చేసిన ట్యాక్స్ మినహాయింపులో భాగంగా కంపెనీ అధికంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందినట్లు అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వ్యతిరేకంగా అప్పీల్ను దాఖలు చేస్తామని కంపెనీ ఫైలింగ్లో చెప్పింది. గతంలోనూ కంపెనీ చాలాసార్లు ట్యాక్స్ నోటీసులు అందుకుంది. ఇతర దేశాల్లోని కంపెనీ అనుబంధ సంస్థలకు అందించిన ఎగుమతి సేవలకు సంబంధించి 2024 ఏప్రిల్ 20న చివరిగా రూ.11.82 కోట్ల ట్యాక్స్ నోటీసులు అందాయి. అంతకుముందు ఏప్రిల్ 1న కర్ణాటక వాణిజ్య పన్నుల అథారిటీ నుంచి రూ.23 కోట్ల అదనపు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను పొందడంపై పన్ను నోటీసులు వచ్చాయి. మార్చి 15న గుజరాత్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ నుంచి రూ.8.6 కోట్ల విలువైన నోటీసులు పొందినట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: కోక-కోలా అనుబంధ సంస్థ మూసివేతడిసెంబర్ 30, 31, 2023 తేదీల్లో వచ్చిన ట్యాక్స్ నోటీసుల ప్రకారం..కంపెనీ 2018లో రూ.4.2 కోట్లు తక్కువ జీఎస్టీ చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో దిల్లీ, కర్ణాటక అధికారుల నుంచి మూడు డిమాండ్ ఆర్డర్లను అందుకుంది. డిసెంబర్ 28న వినియోగదారుల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్నును చెల్లించనందుకు జీఎస్టీ అధికారుల నుంచి రూ.402 కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు అందాయని కంపెనీ తెలిపింది. ఆ సమయంలో కంపెనీ వివరణ ఇస్తూ.. సంస్థ తన డెలివరీ భాగస్వాముల తరఫున మాత్రమే ఫీజులను సేకరిస్తుంది కాబట్టి ఈ పన్నులను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
టీడీపీ ఈవెంట్గా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం?!
తాడేపల్లి, సాక్షి: వలంటీర్ వ్యవస్థను ముట్టుకోమన్నారు. పైగా అధికారంలోకి వచ్చాక వాళ్లకు పది వేల రూపాయాలకు జీతం పెంచుతామన్నారు. అధికారం చేపట్టాక.. నెల తిరగక ముందే ఆ హామీని తుంగలో తొక్కేశారు. పెన్షన్ల పంపిణీకి వలంటీర్లను పూర్తిగా దూరం చేసేశారు. పైగా ఆ ప్రభుత్వ కార్యక్రమాన్ని పసుపుమయంగా మార్చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం రాజకీయ రంగు పులుముకుందనే చర్చ మొదలైంది. టీడీపీ అధికారిక కార్యక్రమంగా మారిందది. పెన్షన్ల పంపిణీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువగా కనిపిస్తున్నారు. లబ్ధిదారులకు ఫించన్లు ఇస్తూ.. ఫొటోలకు ఫోజులిస్తూ హల్ చల్ చేస్తున్నారు.‘‘వలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్లు రావని బెదిరించారు. కానీ, ఒక్కరోజులోనే సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎన్నికల సమయంలో పెన్షన్ల కోసం ఎండలో తిప్పారు. ఫలితంగా 33 మంది చనిపోయారు’’ అని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారుల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ టైంలో వలంటీర్ల ద్వారా ఫించన్లు పంపిణీ చేయనీయకుండా ఈసీకి ఫిర్యాదు చేసిందెవరో అందరికీ తెలుసు.ఇదీ చదవండి: పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్మెంట్కు ఎసరుచంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రంగంలోకి దిగారు. సచివాలయ సిబ్బందిని పక్కకు నెట్టేసి.. టీడీపీ ఆధ్వర్యంలోనే పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ వ్యవహారమంతా గత జన్మభూమి కమిటీల తరహాలోనే నడుస్తోందన్న చర్చ మొదలైంది. గతంతో.. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలనే వలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ప్రతీకార రాజకీయాలు ఉండవని, వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పిన కూటమి నేతలు.. ఇప్పుడు జగన్ తెచ్చిన ఆ వ్యవస్థనే లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఏపీలో ముందు ముందు కూడా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతల జోక్యం ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి.
సూర్యకుమార్ యాదవ్ వరల్డ్కప్ విన్నింగ్ క్యాచ్... వివాదాస్పదం
టీమిండియా 2024 టీ20 వరల్డ్కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ సూపర్ మ్యాన్ క్యాచ్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన షాట్ను స్కై బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన విన్యాసం చేసి క్యాచ్గా మలిచాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. స్కై సూపర్ మ్యాన్లా క్యాచ్ పట్టాడని అభిమానులు కొనియాడారు.అయితే స్కై పట్టిన ఈ క్యాచ్ క్యాచ్ కాదు సిక్సర్ అని కొందరు సౌతాఫ్రికా అభిమానులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో స్కై క్యాచ్ పట్టుకునే క్రమంలో అతని కాలు బౌండరీ లైన్ను తాకినట్లు కనిపిస్తుంది.This certainly deserved more than one look, just saying. Boundary rope looks like it clearly moves. 🤷 pic.twitter.com/ulWyT5IJxy— Ben Curtis 🇿🇦 (@BenCurtis22) June 29, 2024ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఓ సౌతాఫ్రికా అభిమాని మేం దోచుకోబడ్డాం అని కామెంట్ చేశాడు. ఈ వీడియోకు సోషల్మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీమిండియా వ్యతిరేకులు ఈ వీడియోను ఆసరగా చేసుకునే భారత జట్టును నిందిస్తున్నారు. టీమిండియా మోసం చేసి గెలిచిందని కామెంట్ చేస్తున్నారు.బంతి చేతిలో ఉన్నప్పుడు సూర్యకుమార్ కాలు బౌండరీ లైన్ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ నిజాయితీగా వ్యవహరించలేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆ బంతిని సిక్సర్గా ప్రకటించి ఉంటే సౌతాఫ్రికా వరల్డ్కప్ గెలిచేదని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. కాగా, 2024 వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాపై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో భారత్ పైచేయి సాధించింది. సూర్యకుమార్ క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో సౌతాఫ్రికా గెలుపుకు 16 పరుగులు అవసరం కాగా.. ఆ ఓవర్ తొలి బంతికే మిల్లర్ ఔటయ్యాడు. మిల్లర్ ఔట్ కావడంతో సౌతాఫ్రికా విజయావకాశాలు దెబ్బతిన్నాయి.
‘భావి ప్రధాని అఖిలేష్’
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!
హీరోయిన్ చెప్పులు మోసిన భర్త.. ఇలాగే ఉంటుంది మరి!
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
బీఆర్ఎస్లోనే.. ఆ ఆలోచన ఎంతమాత్రం లేదు: సబితా ఇంద్రారెడ్డి
మూడు నెలలుగా జైల్లోనే.. కవిత బెయిల్పై ఉత్కంఠ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త
అమర్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
‘భావి ప్రధాని అఖిలేష్’
మోదీ ఇష్టపడే అరకు వ్యాలీ కాఫీ..ప్రత్యేకత ఇదే..!
హీరోయిన్ చెప్పులు మోసిన భర్త.. ఇలాగే ఉంటుంది మరి!
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
బీఆర్ఎస్లోనే.. ఆ ఆలోచన ఎంతమాత్రం లేదు: సబితా ఇంద్రారెడ్డి
మూడు నెలలుగా జైల్లోనే.. కవిత బెయిల్పై ఉత్కంఠ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
రోహిత్, కోహ్లి ఫ్యాన్స్కు శుభవార్త
అమర్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
సినిమా
రోబో, 2.0 సినిమా ఆఫర్.. అందుకే వెనకడుగు వేశా!
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబోలో 1996లో వచ్చిన హిట్ మూవీ ‘భారతీయుడు’ కి సీక్వెల్గా ‘భారతీయుడు 2’ రూపొందింది. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్పై సుభాస్కరన్ నిర్మించిన ఈ మూవీ తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో ఈ నెల 12న విడుదల కానుంది. రిలీజ్ డేట్కి సమయం దగ్గరపడటంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ఐ–రోబో’ అనే ఇంగ్లిష్ నవలను సినిమాగా తెరకెక్కిస్తే బాగుంటుందని నేను, శంకర్, రచయిత సుజాత (ఎస్. రంగరాజన్ ) 90ల్లోనే అనుకున్నాం. నా పాత్ర లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. కానీ, ఆప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇండస్ట్రీలో బడ్జెట్, పారితోషికం, డేట్స్, మార్కెట్.. ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయి. అప్పటి మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమా చేయకపోవడమే మంచిదనిపించింది. అందుకే నేను వెనకడుగు వేశా. కానీ, నా స్నేహితుడు శంకర్ మాత్రం వదల్లేదు. సరైన సమయంలో రజనీకాంత్తో ‘రోబో’ సినిమా తీసి, బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే ‘2.0’ మూవీలో విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు శంకర్. అయితే కొన్నాళ్ల పాటు నేను హీరోగా ఉండాలనుకుంటున్నానంటూ నవ్వుతూ శంకర్కు చెప్పాను’’ అన్నారు కమల్ హాసన్. అయితే రజనీకాంత్ హీరోగా నటించిన ‘2.0’ మూవీలో విలన్గా అక్షయ్ కుమార్ నటించారు.
కథ విన్నారా?
హీరో వెంకటేష్ నుంచి మరో కొత్త సినిమా కబురు వినే సమయం ఆసన్నమైందనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ‘రానా నాయుడు’ అనే వెబ్సిరీస్ నెక్ట్స్ సీజన్స్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు వెంకటేష్. ఈ సిరీస్ షూటింగ్ను పూర్తి చేసుకున్న తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమా సెట్స్లో ఆయన జాయిన్ అవుతారని తెలుస్తోంది.కాగా ‘సామజవరగమన’ వంటి హిట్ మూవీకి రైటింగ్ టీమ్లో పనిచేసిన నందు అనే వ్యక్తి ఓ కథను వెంకటేష్కి వినిపించడంతో, ఆయన సానుకూలంగా స్పందించారట. దీంతో ఈ కథకు తుది మెరుగులు దిద్ది మళ్లీ వెంకటేష్కి వినిపించనున్నారట నందు. అన్నీ కుదరితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్నగర్ భోగట్టా.
అక్టోబరులో ఆరంభం
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్ సాగర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. వార్ బ్యాక్డ్రాప్తో సాగే ఈ లవ్స్టోరీ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి.దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట హను రాఘవపూడి. ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత ‘రాజాసాబ్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహించే సినిమా షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది.అయితే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ అనే సినిమాకి కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఈ ఏడాది చివర్లోనే ప్రారంభం కానుందట. మరి.. హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వాల్లోని సినిమాల చిత్రీకరణలో ప్రభాస్ ఏకకాలంలో పాల్గొంటారా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించాడు. రీసెంట్గా రిలీజైన 'కల్కి' సినిమాలో ఇతడు అర్జునుడి పాత్రలో కనిపించాడు. ఈ క్రమంలోనే ఇతడి డైలాగ్ డెలివరీపై విమర్శలు వచ్చాయి. రెండు మూడు రోజుల నుంచి కర్ణుడు గొప్పా? అర్జునుడు గొప్పా? అనే విషయమై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా.. 'కల్కి' సక్సెస్పై రౌడీ హీరో తొలిసారి స్పందించాడు. తానేం లక్కీ ఛార్మ్ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?)'మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాం. నాగీ, ప్రభాస్ అన్న కోసమే ఇందులో నేను నటించాను. ఇలాంటి సినిమాలో చివరలో అలా రావడం నాకు సంతోషంగా ఉంది. నాగీ యూనివర్స్లో ఓ పాత్ర పోషించాను అంతే. వాళ్లందరి కోసం ఈ పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉంది. వైజయంతీ మూవీస్లోనే నా కెరీర్ మొదలైంది. అందుకే నాగీ ప్రతి సినిమాలో చేస్తుంటా. మహానటి అద్భుతమైన సినిమా, 'కల్కి' అద్భుతమైన సినిమాలు అంతే. అవి నా వల్ల అవి హిట్ కాలేదు. నేనేం లక్కీ ఛార్మ్ కాదు' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.విజయ్ దేవరకొండ తాజాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలోనే అతడిని మీడియా 'కల్కి' గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానమిచ్చాడు. ఇతడు చెప్పిన దానిబట్టి చూస్తే నాగ్ అశ్విన్ తర్వాత తీయబోయే మూవీస్లోనూ విజయ్ ఉండటం పక్కా.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్)#VijayDeverakonda about #Kalki2898AD movie ❤️The way he say #Prabhas anna 😍 is what I really like 😍 pic.twitter.com/o5D4g7538e— The Chanti (@chanticomrade_) June 30, 2024
ఫొటోలు
సినిమాల కంటే ఒక్క కాంట్రవర్సీతో ఫేమస్.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
శివావీ రాజశేఖర్ బర్త్డే స్పెషల్.. క్యూట్ అండ్ హాట్నెస్ తగ్గేదే లే! (ఫొటోలు)
ఘనంగా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం (ఫోటోలు)
Meera Nandan: హీరోయిన్ పెళ్లి.. భర్తతో స్పెషల్ షూట్ (ఫోటోలు)
ఈ చిన్నారి ఇప్పుడు గ్లోబల్ స్టార్.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
క్రీడలు
ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2024 జట్టు ప్రకటన.. విరాట్కు నో ప్లేస్
ఐసీసీ తమ టీ20 వరల్డ్కప్ 2024 జట్టును ఇవాళ (జులై 1) ప్రకటించింది. ఇందులో ఏకంగా టీమిండియా క్రికెటర్లకు చోటు దక్కింది. భారత్ వరల్డ్కప్ విన్నింగ్ జట్టు నుంచి రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఐసీసీ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇందులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఉండగా.. భారత స్టార్ ఆటగాడు, ఫైనల్ మ్యాచ్ హీరో విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవడం గమనార్హం.ఐసీసీ జట్టులో భారత క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభించింది. భారత్ తర్వాత అత్యధికంగా ఆఫ్ఘన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో చోటు దక్కింది. ఆ జట్టు నుంచి వరల్డ్కప్ లీడింగ్ రన్ స్కోరర్ రహ్మానుల్లా గుర్బాజ్, వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్ ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్లకు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు. వీరితో పాటు ఆస్ట్రేలియా నుంచి స్టోయినిస్.. వెస్టిండీస్ నుంచి పూరన్లకు ఛాన్స్ దక్కింది. 12వ ఆటగాడిగా సఫారీ స్పీడ్ గన్ నోర్జే ఎంపికయ్యాడు. వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీలు ముగిసాక ఐసీసీ జట్టును ప్రకటించడం ఆనవాయితీ.వరల్డ్కప్ 2024లో ఐసీసీ జట్టు సభ్యుల ప్రదర్శన..రోహిత్ శర్మ- 257 పరుగులు, సగటు 36.71, స్ట్రయిక్రేట్ 156.7, అర్దసెంచరీలు 3రహ్మానుల్లా గుర్బాజ్- 281 పరుగులు, సగటు 35.12, స్ట్రయిక్రేట్ 124.33, అర్దసెంచరీలు 3పూరన్- 228 పరుగులు, సగటు 38.0, స్ట్రయిక్రేట్ 146.15, అర్దసెంచరీలు 1సూర్యకుమార్ యాదవ్- 199 పరుగులు, సగటు 28.42, స్ట్రయిక్రేట్ 135.37, అర్దసెంచరీలు 2స్టోయినిస్- 169 పరుగులు, స్ట్రయిక్రేట్ 164.07, వికెట్లు 10, ఎకానమీ 8.88హార్దిక్ పాండ్యా- 144 పరుగులు, స్ట్రయిక్రేట్ 151.57, వికెట్లు 11, ఎకానమీ 7.64అక్షర్ పటేల్- 92 పరుగులు, స్ట్రయిక్రేట్ 139.39, వికెట్లు 9, ఎకానమీ 7.86రషీద్ ఖాన్- 14 వికెట్లు, సగటు 12.78, ఎకానమీ 6.17, అత్యుత్తమ ప్రదర్శన 4/17బుమ్రా- 15 వికెట్లు, సగటు 8.26, ఎకానమీ 4.17, అత్యుత్తమ ప్రదర్శన 3/7అర్ష్దీప్ సింగ్- 17 వికెట్లు, సగటు 12.64, ఎకానమీ 7.16, అత్యుత్తమ ప్రదర్శన 4/9ఫజల్హక్ ఫారూఖీ- 17 వికెట్లు, సగటు 9.41, ఎకానమీ 6.31, అత్యుత్తమ ప్రదర్శన 5/912 ఆటగాడు అన్రిచ్ నోర్జే- 15 వికెట్లు, సగటు 13.4, ఎకానమీ 5.74, అత్యుత్తమ ప్రదర్శన 4/7
National Inter State Senior Athletics Championships 2024: జ్యోతి, నందినిలకు స్వర్ణాలు
పంచ్కులా (హరియాణా): జాతీయ సీనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో చివరి రోజు తెలంగాణకు ఒక స్వర్ణం, ఆంధ్రప్రదేశ్కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మహిళల విభాగంలో ఏడు క్రీడాంశాల (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) సమాహారమైన హెప్టాథ్లాన్లో తెలంగాణ క్రీడాకారిణి నందిని అగసార పసిడి పతకాన్ని దక్కించుకుంది. నందిని ఓవరాల్గా 5806 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో అంతర్జాతీయ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి యర్రాజీ విజేతగా నిలిచింది. వైజాగ్కు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.06 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. పురుషుల 200 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్కే చెందిన నలుబోతు షణ్ముగ శ్రీనివాస్ రజత పతకాన్ని సాధించాడు. ఫైనల్లో షణ్ముగ 20.95 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానాన్ని పొందాడు.
Wimbledon 2024: అందరి దృష్టి జొకోవిచ్పైనే
లండన్: టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ప్లేయర్గా రికార్డు సృష్టించేందుకు సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి ప్రయతి్నంచనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 24 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ ఆ్రస్టేలియా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్స్లామ్ టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. నేడు మొదలయ్యే సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో జొకోవిచ్ ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల మోకాలి గాయం నుంచి కోలుకున్న జొకోవిచ్కు ప్రస్తుత ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ (ఇటలీ), డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఏడుసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన జొకోవిచ్, రెండుసార్లు రన్నరప్గా నిలిచాడు. ఈసారి తొలి రౌండ్లో క్వాలిఫయర్, ప్రపంచ 123వ ర్యాంకర్ విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)తో జొకోవిచ్ తలపడతాడు. మరోవైపు భారత నంబర్వన్, ప్రపంచ 72వ ర్యాంకర్ సుమిత్ నగాల్ సోమవారం జరిగే తొలి రౌండ్లో కెచ్మనోవిచ్ (సెర్బియా)తో ఆడతాడు.
T20 World Cup 2024: కప్ మనోళ్లదే, కానీ..!
టీ20 వరల్డ్కప్ 2024లో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. నిన్న (జూన్ 29) జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి ప్రపంచ ఛాంపియన్గా (టీ20) నిలిచింది.ఈ టోర్నీలో భారత్ టైటిల్ గెలిచినప్పటికీ.. లీడింగ్ రన్ స్కోరర్, లీడింగ్ వికెట్ టేకర్గా మాత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఉన్నారు. బ్యాటింగ్లో రహ్మానుల్లా గుర్బాజ్ (8 మ్యాచ్ల్లో 281 పరుగులు), బౌలింగ్లో ఫజల్హక్ ఫారూఖీ (8 మ్యాచ్ల్లో 17 వికెట్లు) టాప్లో ఉన్నారు. బ్యాటింగ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో (8 మ్యాచ్ల్లో 257 పరుగులు) ఉండగా.. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ (8 మ్యాచ్ల్లో 17 వికెట్లు) ఉన్నారు.ఈ టోర్నీలో అత్యధిక బ్యాటింగ్ సగటు రిచీ బెర్రింగ్టన్ (స్కాట్లాండ్. 102), అత్యుత్తమ స్ట్రయిక్రేట్ షాయ్ హోప్ (187.72), అత్యధిక హాఫ్ సెంచరీలు రహ్మానుల్లా గుర్బాజ్ (3), అత్యధిక బౌండరీలు ట్రవిస్ హెడ్ (26), అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ (17) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక బౌలింగ్ సగటు టిమ్ సౌథీ (5.14), అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఫజల్హక్ ఫారూఖీ (5-9) పేరిట ఉన్నాయి. ఈ టోర్నీలో కేవలం రెండు సార్లు మాత్రమే ఐదు వికెట్ల ఘనతలు నమోదయ్యాయి. ఫారూఖీతో పాటు అకీల్ హొసేన్ ఐదు వికెట్ల ఘనత (5/11) సాధించాడు. ఫజల్హక్, అకీల్ హొసేన్ ఇద్దరూ ఉగాండపైనే ఐదు వికెట్ల ఘనత నమోదు చేయడం విశేషం.
బిజినెస్
ఎగుమతులు, తయారీతో ఎకానమీకి బూస్ట్
ముంబై: ఎగుమతులు పెరగడం, కరెంటు అకౌంటు లోటు (సీఏడీ) తగ్గడం, తయారీ మెరుగుపడటం వంటి అంశాలు దేశ ఎకానమీ ఆరోగ్యకర స్థాయిలో వృద్ధి రేటును సాధించేందుకు తోడ్పడగలవని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తువులు, సరీ్వసుల ఎగుమతులు 800 బిలియన్ డాలర్లను అధిగమించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2022– 23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా, 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాభరణాల పరిశ్రమ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. భారత వృద్ధి గాధపై ఇన్వెస్టర్లలో గణనీయంగా విశ్వాసం ఉందని, పరిశ్రమలోనూ.. ఎగుమతిదారుల్లోను సెంటిమెంటు అత్యంత మెరుగ్గా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ప్రత్యేక ఆరి్థక మండళ్లపై (సెజ్) ప్రభుత్వం నిర్దిష్ట సవరణ బిల్లు ఏదైనా తెచ్చే యోచనలో ఉందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పలు సిఫార్సులు పరిశీలనలో ఉన్నట్లు గోయల్ వివరించారు. 2025 ఆరి్థక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేస్తుంది.
ఏటా రూ.10 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారతీయులు వివాహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలియనది కాదు. జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి వేడుక కోసం ఎంత ఖర్చుకైనా సరే తగ్గేదే లేదంటున్నారు. వివాహాల కోసం భారతీయులు ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తెలిపింది. అది కూడా విద్యపై చేసే వ్యయం కంటే వివాహాల కోసం చేస్తున్నదే రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు వెల్లడించింది. వ్యయాల పరంగా ఆహారం, గ్రోసరీ (ఎఫ్ఎంసీజీ) తర్వాతి స్థానంలో పెళ్లిళ్లు ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ఇంకా ఈ నివేదికలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. భారత్లో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయి. అదే చైనాలో ఏటా 70–80 లక్షలు, అమెరికాలో 20–25 లక్షల వరకు పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అమెరికాలో వివాహాల కోసం అక్కడి వారు చేస్తున్న వార్షిక వ్యయం 70 బిలియన్ డాలర్లు (రూ.5.81 లక్షల కోట్లు) కంటే భారతీయుల వ్యయం రెట్టింపుగా ఉంది. ఇక చైనాలో ఏటా జరిగే పెళ్లి వేడుకలు భారత్ కంటే 20 శాతం మేర తక్కువే ఉన్నప్పటికీ.. భారతీయుల కంటే 50 శాతం అధికంగా 170 బిలియన్ డాలర్లు (రూ.14.11 లక్షల కోట్లు) ఖర్చు చేస్తున్నారు. వినియోగంలో భారత్లో రిటైల్ వినియోగ విభాగంలో వివాహాలది రెండో స్థానం. ఆహారం, గ్రోసరీలపై చేస్తున్న 681 బిలియన్ డాలర్లు (రూ.56.52 లక్షల కోట్లు) తర్వాత వివాహాలకే ఎక్కువ కేటాయిస్తున్నారు. వివాహం అంటే ఎన్నో రకాల కొనుగోళ్లతో ఉంటుందని తెలిసిందే. ముఖ్యంగా బంగారం ఆభరణాలు, వస్త్రాలు, వేడుక నిర్వహణ కేంద్రాలు, హోటల్ బుకింగ్లు, అలంకరణలు, ఆహారంపై భారీగా వ్యయం చేయాల్సి వస్తుంది. వివాహాలు పరోక్షంగా ఆటోమొబైల్, ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లకూ మద్దతునిస్తాయి. ప్రాంతం, మతం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెళ్లిళ్లపై చేసే వ్యయాలు కూడా ఆధారపడి ఉంటాయని తెలిసిందే. ‘‘ఏటా 8–10 మిలియన్ల వివాహాలతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంటోంది. రిటైలర్ల సమాఖ్య సీఏఐటీ అంచనా ప్రకారం చూస్తే దీని పరిమాణం 130 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. యూఎస్తో పోలిస్తే దాదాపు రెట్టింపు. కీలక వినియోగ విభాగాలకు వివాహాలు ఊతమిస్తున్నాయి. విలువలకు ప్రాధాన్యమిచ్చే భారతీయ సమాజంలో వివాహాలపై ఖర్చు చేసేందుకు ఇష్టపడుతుంటారు. వారి సంపద, ఆదాయ స్థాయిలకు అనుగుణంగా ఈ వ్యయాలు ఉంటాయి. ఆర్థిక తరగతులతో సంబంధం లేకుండా అధిక వ్యయం చేసే ధోరణి కూడా నెలకొంది’’అని జెఫరీస్ నివేదిక వివరించింది. ఒక్కో పెళ్లికి రూ.1.25 లక్షలు ఒక్కో వివాహంపై చేసే ఖర్చు సగటున 15,000 డాలర్లు (రూ.1.25 లక్షలు సుమారు)గా ఉంటున్నట్టు జెఫరీస్ నివేదిక తెలిపింది. ‘‘ఇది తలసరి ఆదాయం కంటే రెట్టింపు. గ్రాడ్యుయేషన్ వరకు విద్యపై చేసే ఖర్చు కంటే రెండు రెట్లు అధికంగా ఒక జంట వివాహంపై వెచి్చస్తోంది. అదే యూఎస్లో వివాహంపై చేసే సగటు ఖర్చు విద్యలో సగమే ఉంటోంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఖరీదైన ఆతిథ్యాలు, భారీ మెనూతో కూడిన ఆడంబరమైన కేటరింగ్, స్టార్ చెఫ్లు రూపొందించిన మెనూలు, నటులు, సెలబ్రిటీల ప్రదర్శనలను భారత్లో ఖరీదైన వివాహాల్లో చూ డొచ్చని పేర్కొంది. ‘‘వివాహ మార్కెట్ పరిమాణం దృష్ట్యా చూస్తే భారత్లో ఆభరణాలు, వ్రస్తాలు, కేటరింగ్, ప్రయాణాలు తదితర రంగాల్లో డిమాండ్కు ఇది మద్దతుగా నిలుస్తోంది. పరోక్షంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్కు సైతం డిమాండ్ను తెచ్చి పెడుతోంది’’అని వివరించింది.
Wedding Insurance: పెళ్లిళ్లకూ బీమా ధీమా..
మన దగ్గర వివాహ వేడుకనేది ఓ భారీ కార్యక్రమం. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి థీమ్తో బ్యాండ్ బాజా బారాత్, షాన్దార్, వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాలు, అనేక టీవీ షోలు కూడా వచ్చాయి. వివాహానికి సంబంధించి భావోద్వేగాల అంశాన్ని కాస్సేపు అలా ఉంచితే, ఈ వేడుకల్లో గణనీయంగా వ్యాపార అవకాశాలు కూడా ఇమిడి ఉంటాయి. అంతర్జాతీయంగా ఇదో పెద్ద పరిశ్రమ. 2020లో 160.5 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ వెడ్డింగ్ సర్వీసుల మార్కెట్ 2030 నాటికి ఏకంగా 414.2 బిలియన్ డాలర్లకు చేరగలదన్న అంచనాలు ఉన్నాయి. అయితే, భారీ వ్యయంతో తలపెట్టే వివాహ వేడుకలకు ఏదైనా అనుకోని అవాంతరం వచి్చందంటే బోలెడంత నష్టం కూడా వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. వేదిక, వాతావరణం మొదలైన వాటికి సంబంధించి ఏ సమస్య వచి్చనా కార్యక్రమం మొత్తం రసాభాస అవుతుంది. అందుకే, అలాంటి వాటికి కూడా బీమాపరమైన రక్షణ పొందేలా ప్రస్తుతం బీమా కంపెనీలు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను కూడా ఆఫర్ చేస్తున్నాయి. వేడుక స్థాయి, సరీ్వసులను బట్టి వీటికి ప్రీమియంలు ఉంటున్నాయి. భారీ కార్యక్రమం, విస్తృతమైన సరీ్వసులకు కవరేజీ కావాలంటే ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుందని కానీ ఇలాంటి ప్లాన్తో వచ్చే నిశి్చంత వెలకట్టలేనిది. వివిధ రకాలు.. సందర్భాన్ని బట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవరేజీ వివిధ రకాలుగా ఉంటుంది. లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది .. పాలసీదార్ల వల్ల ఇతరులకు ఏదైనా హాని, ఆస్తి నష్టంలాంటివేమైనా జరిగితే కవరేజీనిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏవైనా లీగల్ ఖర్చులు, చెల్లింపులు చేయాల్సి వస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తేలితే మాత్రం కవరేజీ వర్తించదని గుర్తుంచుకోవాలి. ఈ తరహా కవరేజీ అనేది థర్డ్ పారీ్టకి చెల్లించాల్సిన నష్టపరిహారానికి మాత్రమే పరిమితమవుతుంది. దీనితో పాలసీదార్లకు ప్రత్యేకంగా పరిహారమేమీ లభించదు. మరోవైపు, ఏదైనా కారణాల వల్ల పెళ్లి వాయిదా పడిన సందర్భాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకునేందుకు కూడా కవరేజీ ఉంటుంది. పేరొందిన బీమా కంపెనీలతో పాటు ప్రత్యేకంగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ను అందించే ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కాబట్టి వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకునేటప్పుడు తమ నిర్దిష్ట అవసరాలపై ముందుగా ఒక అంచనాకు రావాలి. ఎంత వరకు కవరేజీ వస్తుంది, క్లెయిమ్ల ప్రక్రియ ఎలా ఉంటుంది మొదలైన వాటి గురించి బీమా సంస్థలను కనుక్కోవాలి. యాడ్ ఆన్లు, రైడర్లు .. సంప్రదాయాలు, అభిరుచులను బట్టి ప్రతి వివాహ వేడుకలు విభిన్నంగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో యాడ్–ఆన్లు, రైడర్లు కూడా ఉంటున్నాయి. దుస్తులు మొదలుకుని హనీమూన్ వరకు ఇవి కవరేజీనిస్తాయి. ఉదాహరణకు పెళ్లి దుస్తులు దెబ్బతిన్నా లేక తీసుకొస్తుండగా దారిలో పోయినా .. అటైర్ కవరేజీ రైడర్లాంటిది ఆదుకుంటుంది. ఇక వ్యయాల విషయానికొస్తే.. వివాహ వేడుక స్థాయి, ప్రాంతం, తీసుకోబోయే కవరేజీ వంటి అంశాలన్నీ ప్రీమియంను ప్రభావితం చేస్తాయి. పాలసీదార్లు గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటుంది. ఈ పాలసీల్లోనూ కొన్ని మినహాయింపులు ఉంటాయి. సాధారణంగా బడ్జెట్ మించిపోయినా, ఇతరత్రా మనసు మార్చుకుని వేరే ప్రణాళికలు వేసుకున్నా కవరేజీపైనా ప్రభావం ఉంటుంది. కాబట్టి పాలసీపరంగా దేనికి కవరేజీ ఉంటుంది, దేనికి మినహాయింపు ఉంటుంది వంటి అంశాలను ముందుగా క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది.
ఒడిదుడుకుల ట్రేడింగ్కు అవకాశం
ముంబై: స్టాక్ సూచీలు జీవితకాల గరిష్ట స్థాయిలు నమోదు తర్వాత అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో ఈ వారంలో ఒడిదుడుకులకు లోనవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దిశానిర్ధేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సమగ్ర బడ్జెట్పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘స్టాక్ మార్కెట్లో ఓవర్బాట్ పరిస్థితుల కారణంగా గరిష్ట స్థాయిల వద్ద కొంత లాభాల స్వీకరణ జరగొచ్చు. అధిక వాల్యుయేషన్లు, స్థూల ఆర్థిక డేటా విడుదల నేపథ్యంలో కొంత అస్థిరత చోటు చేసుకునే వీలుంది. ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 23800 వద్ద కీలక మద్దతు ఉంది. ఎగువున 24,200 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంది’’ హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ సాంకేతిక నిపుణుడు నాగరాజ్ శెట్టి తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు, ద్రవ్యోల్బణ సంబంధిత ఆందోళలను అధిగమిస్తూ గతవారం స్టాక్ సూచీలు 2% ర్యాలీ చేశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1,823 పాయింట్లు, నిఫ్టీ 510 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. స్థూల ఆర్థిక గణాంకాలు జూన్ జీఎస్టీ వసూళ్లు, ఆటో కంపెనీలు జూన్ వాహన విక్రయ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఇదే రోజు జూన్ తయారీ రంగ పీఎంఐ వెల్లడి కానుంది. సేవారంగ పీఎంఐ గణాంకాలు బుధవారం వెల్లడి అవుతాయి. జూన్ 28తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, జూన్ 21తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వలను ఆర్బీఐ శుక్రవారం(జూన్ 5న) విడుదల చేస్తుంది. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ప్రపంచ పరిణామాలు చైనా, జపాన్ జూన్ తయారీతో పాటు యూరోజోన్ జూన్ వినియోగదారుల విశ్వాస, తయారీ గణాంకాలు సోమవారం(నేడు) విడుదల అవుతాయి. యూరోజోన్ జూన్ ద్రవ్యోల్బణం, మే నిరుద్యోగ గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మినిట్స్ బుధవారం (జూలై 3న), బ్రిటన్లో (గురువారం) జూలై4న సార్వత్రి ఎన్నికలు జరగునున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం జపాన్ ఏప్రిల్ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్ జూన్ రిటైల్ అమ్మకాలు, అమెరికా జూన్ నిరుద్యోగ గణాంకాలు విడుదల కానున్నాయి. జూన్లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జూన్లో రూ.26,565 కోట్ల కొనుగోళ్లు జరిపారు. రాజకీయ స్థిరత్వం, స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పుంజుకోవడం ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇదే ఏడాది మార్చిలో అత్యధికంగా రూ.35,098 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘జేపీ మోర్గాన్ గ్లోబల్ బాండ్ ఇండెక్సులో భారత ప్రభుత్వ బాండ్లలను చేర్చడంతో దేశీయంగా కూడా పెట్టుబడులు భారీగా పెరగొచ్చు. అమెరికా అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉండే అవకాశం ఉంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్ మరింత ఆకర్షణగా కనిపిస్తుంది’’ స్వస్తిక ఇన్వెస్ట్మెంట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు ప్రవేశ్ గౌర్ తెలిపారు. ఎఫ్ఐఐలు మే నెలలో రూ. 25,586 కోట్లు, ఏప్రిల్లో రూ.8,671 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించగా, జనవరిలో రూ. 25,744 కోట్లతో అమ్మకాలు జరిపారు. ఫిబ్రవరిలో మాత్రం రూ.1,539 కోట్ల స్వల్ప ఇన్ఫ్లోలు వచ్చాయి.
వీడియోలు
కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ
పెన్షన్ల పంపిణీ కోసం కొట్టుకున్న టీడీపీ నేతలు
వాలంటీర్లను పక్కన పెట్టి టీడీపీ నేతలతో పెన్షన్ల పంపిణీ
నీట్ పై ఆగ్రహం.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు
కవిత బెయిల్ తీర్పు.. ఉత్కంఠ
నేడు కేసీఆర్ రిట్ పిటిషన్ పై తీర్పు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశంలో ఎక్కడనుండైనా FIR నమోదు చేయొచ్చు
హైదరాబాద్ లో భారీగా పెరిగిన క్రైమ్
పెన్షన్లకు రాజకీయ రంగు..
ఫ్యామిలీ
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు
నేరస్తుడా? నిరపరాధుల పాలిట దైవమా.. ! ఏకంగా 50 ఏళ్లు జైల్లోనే..
ఓ వ్యక్తి కరుడుగట్టిన నేరస్తుడి మాదిరిగా దారుణమైన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంటరానివాడిలా ఒక ప్రత్యేక భద్రతతో కూడిన సెల్లో ఉన్నారు. అతడికి ఆహారం సైతం ఓ రంధ్రం గుండా పంపిస్తారు జైలు అధికారులు. కానీ అతడి నేరాల చరిత్ర వింటే..నేరస్తుడా లేదా నిరపరాధిల పాలిట రక్షకుడా అన్న ఫీలింగ్ వస్తుంది. లేక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడంతో చట్టాన్ని చేతిల్లోకి తీసుకుని దుర్మార్గులని దునుమాడిన మహోన్నత వ్యక్తి ఏమో..! అనే భావన కలుగుతుంది. పైగా బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం ఒంటిరిగా నిర్భంధంలో ఉన్న ఖైదీగా నిలిచిపోయాడు. అతడెవరంటే..బ్రిటన్లో అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నాడు రాబర్ట్ మాడ్స్లీ. ప్రస్తుతం అతడు వేక్ఫీల్డ్ జైలులో ఉన్నాడు.అతని జైలు గది 18 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉండి, 17 ఉక్కు తలుపుల వెనుక ఉంటుంది.ఈ గది కాల్పులు తట్టుకునేంత దృఢంగా ఉంటుంది.“ఇన్సైడ్ వేక్ఫీల్డ్ ప్రిజన్” అనే పుస్తకంలో జోనాథన్ లెవి, ఎమ్మా ఫ్రెంచ్లు రాసినట్లుగా, మాడ్స్లీ జైలు గదిలోని టేబుల్, కుర్చీలు కార్డ్బోర్డ్తో తయారు చేశారు.టాయిలెట్, సింక్ నేలకు బిగించబడి ఉంటుంది. అతనికి అందించే భోజనం కూడా ఒక చిన్న రంధ్రం గుండా పంపిస్తారు. నిజానికి మాడ్సీ 21 ఏళ్ల వయసు నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. అతడి నేరాలు గురించి తెలుసుకుని విస్తుపోతారు. ఎందుకంటే అతడు ఖైదీనా నిరపరాధుల పాలిట దైవమా..!అనిపిస్తుంది. చేసిన నేరాలు..1974లో, చిన్న పిల్లలపై లైంగిక దాడి చేసిన 30 సంవత్సరాల వ్యక్తి జాన్ ఫారెల్ని అతను చంపేశాడు.ఆ తర్వాత 1977లో, అతను మరో ఖైదీతో కలిసి, చిన్నపిల్లలపై లైంగిక దాడి నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్న డేవిడ్ ఫ్రాన్సిస్( David Francis )ని చంపేశాడు.వేక్ఫీల్డ్ జైలులో కూడా మాడ్స్లీ నేరాలు కొనసాగాయి.1978 జులై 29న, తన భార్యను హత్య చేసిన ఖైదీ సల్నీ డార్వడ్ని హతమార్చాడు.అంతేకాకుండా, ఏడేళ్ల బాలికపై అత్యాచార చేసిన బిల్ రాబర్ట్స్ను కూడా చంపేశాడు.ఈ హత్యల కారణంగా, అధికారులు మాడ్స్లీని ఇతర ఖైదీలతో కలిపి ఉంచడం చాలా ప్రమాదకరమని భావించారు.ఫలితంగా, 1983లో అతని కోసం ప్రత్యేక అద్దాల గదిని నిర్మించారు. అప్పటి నుంచి, అతను అదే గదిలో ఉన్నాడు. తన జైలు జీవితాన్ని మాడ్స్లీ ఒకసారి నరకంలో బంధించడం లాగా ఉందని వర్ణించాడు. ప్రస్తుతం అతని వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ అదే జైలులో ఉండడం వల్ల, అతన్ని నేరస్తుడిగా చూడాలా లేక నిరపరాధుల రక్షకుడిగా భావించాలా అనే సందేహం బ్రిటన్ ప్రజల్లో కలుగుతుంటుంది. కనీసం ఇప్పుడైనా మాడ్స్లీ క్షమాభిక్ష పెట్టి స్వేచ్ఛగా జీవించేలా చేస్తే బాగుండనని కొందరూ భావిస్తుండటం విశేషం. (చదవండి: ఆ ఫోబియాకు పుస్తకాలతో చెక్పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్విమెన్!)
ఆ ఫోబియాకు పుస్తకాల శక్తితో చెక్ పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్విమెన్!
ట్రాన్స్జెండర్లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్. ఎవరీ నియోగ్? ఏం చేస్తోందంటే..అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్ ఫోబియా అంటారు. తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది. అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్ జెండర్గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ. తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు. View this post on Instagram A post shared by Rituparna (@the_story_mama) (చదవండి: అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!)
Janhvi Kapoor: పూలగౌనులో దేవర బ్యూటీ సోయగాలు (ఫోటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
ముఖ్యమంత్రి అంటే ‘కటింగ్ మాస్టరా’?.. తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
నీట్పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో ఒకే దఫా రైతుల పంట రుణాల మాఫీ... రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం... 47 లక్షల మంది రైతులకు చేకూరనున్న లబ్ధి.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి
యశవంతపుర: భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న నవ వివాహిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకా తెల్లారు వద్ద జరిగింది. తెల్లారు గ్రామానికి చెందిన నీక్ష అనే యువతికి రెండు నెలల క్రితం విశాల్ అనే యువకుడితో వివాహమైంది. దంపతులు బైక్పై వెళ్తుండగా గ్రామ సమీపంలో హొస్మారు వంతెన వద్ద హఠాత్తుగా రోడ్డుకు అడ్డంగా కుక్క వచ్చింది. దానిని తప్పించే యత్నంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కలో కిందపడ్డారు. ప్రమాదంలో నీక్షా తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. విశాల్కు చిన్నపాటి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
డ్రగ్స్తో జీవితం అంధకారమే
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్ బారిన పడొద్దు..’అంటూ నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన కురుమ్తోత్ రాథోడ్ నవీన్ నాయక్ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్ పెడ్లర్గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్ చేయడంతో దుండిగల్ పీఎస్లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్ పీఎస్లో నమోదైన ఎన్డీసీఎస్ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. ఒత్తిడిని అధిగమించాలివిద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్ నాయక్ చెప్పాడు. భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు. ముగ్గురికి పాజిటివ్మాదాపూర్లోని హైటెక్స్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. దూద్ బౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్ మోటికర్ సిచి్చతానంద్ అలియాస్ సచిన్ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్తోత్ నవీన్ నాయక్, ప్రణీత్రెడ్డి, రాహుల్రాజ్ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్ పెడ్లర్ ధూల్పేట్కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్) తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్ నంబర్లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్ జోన్ పరిధిలో డ్రగ్స్పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీలు యాక్టివ్గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గంజాయి డాన్ నీతూ బాయ్ ఆస్తులు అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్బీ డీఎస్పీ రమే‹Ù, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రేమ పేరుతో వల.. బాలికపై లైంగిక దాడి
హిమాయత్నగర్: ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన ఓ మైనర్ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో సుల్తాన్బజార్ ఏసీపీ కె.శంకర్, ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్, అడ్మిన్ ఎస్సై జి.నరేష్ కుమార్తో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆగాపురాకు చెందిన షేక్ అర్బాస్(23) బైక్ మెకానిక్. ఇన్స్ట్రాగామ్లో 13 ఏళ్ల మైనర్ బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రతిరోజూ చాటింగ్ చేస్తూ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ఈ నెల 24న పాఠశాలకు వచి్చన బాలికను తనతో పాటు గుల్బర్గాకు తీసుకెళ్లాడు. దీంతో బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అఘాపురాకు చెందిన షేక్ అర్బాస్ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకున్న నిందితుడు భయంతో బాలికను తన కుటుంబ సభ్యులకు అప్పగించి పరారయ్యాడు. బాలికను భరోసా సెంటర్కు తరలించి, వాగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు నిందితుడు రెండు రోజుల పాటు బాలికతో లాడ్జీలో ఉండి లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం నాంపల్లి రైల్వేస్టేషన్లో షేక్ అర్బాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శంకర్ తెలిపారు.
ప్రాణం తీసిన అతివేగం..
చేగుంట (తూప్రాన్)/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నాగ్పూర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. నాగ్పూర్ వైపు నుంచి మేకల లోడుతో హైదరాబాద్కు వస్తున్న లారీ.. రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా చేగుంట శివార్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులేనని గుర్తించారు. గాయపడ్డవారికి హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్కు మేకలు తీసుకొస్తూ.. 44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ దాణా లారీ శుక్రవారం తెల్లవారుజామున టైర్ పంక్చరై, రోడ్డుపై ఆగిపోయింది. అదే దారిలో నాగ్పూర్ వైపు నుంచి మేకల లోడ్ లారీ వస్తోంది. హైదరాబాద్లోని చర్లపల్లిలో ఉన్న మేకల మండీకి ఉదయమే మేకలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ ఆత్రుతతోనే డ్రైవర్ వేగంగా లారీని నడిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ధాటికి మేకల లోడ్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో కూర్చుని ఉన్న ఇద్దరు, వెనుకాల ట్రాలీలో మేకలతోపాటు ఉన్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం.. నిద్రమత్తుతో! ప్రమాదం జరిగినప్పుడు మేకల లారీ గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమా దం జరిగిన ప్రదేశంలో మూల మలుపు ఉంది. దానికితోడు తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డుపై ఆగిఉన్న దాణా లారీని సరిగా గమనించకపోవడం వల్లే ప్రమాదానికి దారితీసి ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదంలో లారీలోని 80 వరకు మేకలు కూడా మృతి చెందాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని గుర్తించారు. క్యాబిన్లో ప్రయాణిస్తున్న మేకల వ్యాపారులు చిక్వారాజు(57), చిక్వా మనీశ్కుమార్ (30), వెనకాల ట్రాలీలో మేకలతోపాటు కూర్చున్న కారి్మకులు ఎండీ ఇబ్రహీం (21), ఎండీ షబ్బీర్ (48), ఎండీ జిసాన్ (21) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ బుట్టాసింగ్, మేకల వ్యాపారి లాల్మణి, రమేశ్లాల్, మహేశ్లాల్, శుక్లాల్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి తెలిపారు.