Top Stories
ప్రధాన వార్తలు
![Rajya Sabha sessions july 3rd 2024 updates](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Modi_1.jpg.webp?itok=o5Y7aNpo)
ప్రధాని ప్రసంగం: రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్
updatesరాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగ తీర్మానం చర్చపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు ప్రజలు ఓడించినా వారిలో మార్పు రాలేదు: మోదీచర్చలో పాల్గొనే దమ్ములేక పారిపోయారు.సభను విపక్షాలు అవమానిస్తున్నాయి. విపక్షాల తీరుపై రాజ్యసభ చైర్మన్ అసంతృప్తివిపక్షాలు ఇలా చేయటం సరికాదువిపక్షాలు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయి. నిజాలు చెబుతుంటే విపక్షాలు భరించటం లేదువిపక్షాలు అవమానిస్తున్నాయి.రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్కిషాన్ సమ్మాన్ యోజనా ద్వారా రైతులకు అండగా ఉంటాంప్రధాని ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలుపదేళ్ల చేసిన అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాంప్రతిపక్ష సభ్యుల నినాదాలు, ఆందోళన నడుమ ప్రధాని ప్రసంగంరైతు సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఈ ఎన్నికలో దేశ ప్రజలు చూపిన విశ్వాసం పట్ల గర్వపడుతున్నాపదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం సేవాభావంతో ముందు వెళ్లుతోంది.అంబేద్కర్ ఆశయాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది.మా విజయాన్ని చూసి కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం చర్చలో 70 మంది ఎంపీలు పాల్గొన్నారు.రాజ్యాంగం మాకు చాలా పవిత్రమైంది.అంబేద్కర్ రాజ్యాంగం వల్లే మాకు ఈ అవకాశం దిక్కింది.ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందిఈ ప్రభుత్వానికి రాజ్యాంగమే దిక్చూచికరోనా కష్టకాలంలో కూడా భారత్ ఆర్థికంగా ముందుకు వెళ్లింది.గతపదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది.వచ్చే ఐదేళ్లలో పేదరికంపై యుద్ధం చేస్తాంఆర్థిక వృద్ధిలో భారత్ను ఐదోస్థానం నుంచి మూడో స్థానానికి తీసుకువెళ్తాంవచ్చే ఐదేళ్లలోమ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాంవిపక్షాల నిసనల మధ్య మోదీ ప్రసంగిస్తున్నారు.గతంలో రిమోట్ ప్రభుత్వం నడిచింది. ప్రజలు మూడోసారి ఎన్డీయేకు పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.60 ఏళ్ల తర్వాత దేశంలో వరుసగా మూడోసారి ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ప్రజాతీర్పును కొందరు ఇష్టపడటం లేదు. హత్రాస్ సత్సంగ్ తొక్కిసలాట ఘటనపై రాజ్యసభలో ఎంపీలు సంతాపం తెలిపారు.మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది భక్తులు మృతి చెందారు.#WATCH | Delhi: Rajya Sabha observes silence to mourn the loss of lives in Hathras Stampede accident. pic.twitter.com/mcF3aBszUo— ANI (@ANI) July 3, 2024 ప్రారంభమైన రాజ్యసభరాజ్యసభ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం ఇవ్వనున్నారు.Prime Minister Narendra Modi will speak in the Rajya Sabha on the Motion of Thanks to the President's Address at around 12 noon. pic.twitter.com/YQqV0GqVlH— ANI (@ANI) July 3, 2024 నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం నిన్న(మంగళవారం) రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి.లోక్సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వటంలో చర్చ ముగిసింది. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు.
![Kommineni Srinivasa Rao Strong Counter On TDP Super Six Schemes](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Chandrababu_AP_Debts_Pawan.jpg.webp?itok=3nk_kbS2)
ఏపీలో అప్పులు.. లెక్కలు.. ఇక అంతా మాయేనా?
ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ అమలు చేయడానికి సంపద సృష్టిస్తాం.. ఇది టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే,పదే చేసిన ప్రచారం. ఆయనకు మద్దతు ఇస్తూ చంద్రబాబుకు ఎంతో అనుభవం ఉందని జనసేన అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు ఇచ్చేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్లు అంటున్నారు.. పైగా సంపద సృష్టిస్తామంటున్నారు. అంటే అప్పులే చేయకుండానే ఇవన్నీ చేస్తారు కాబోలు!. రాష్ట్రానికి అదే మేలు" కదా అని చాలా మంది అనుకున్నారు. ఎలాగైతేనేం చంద్రబాబు, పవన్లు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చారు. ఇబ్బడి ,ముబ్బడిగా సంపద రెడీ అయిపోతుందని ఆశించినవారు ఇప్పుడు బిత్తరపోతున్నారు. ఇరవైరోజుల్లోనే ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. ఇది ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తెలుగుదేశం మీడియాకు పెద్ద వార్త కాలేదు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అవసరార్దం వెయ్యి కోట్లు రుణం సేకరించినా, ఇంకాస్త ఎక్కువ తీసుకున్నా,చాలా ఘోరం జరిగిపోతున్నట్లు, ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నట్లు విపరీతమైన ద్వేష ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఇరవై రోజుల్లోనే ఏకంగా ఏడువేల కోట్ల అప్పు చేస్తే అదసలు లెక్కే కాదన్నట్లుగా ఆ మీడియా వ్యవహరిస్తోంది. అంతేకాదు..జూలై నెలలో మరో తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణానికి టీడీపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు అయితే ఈ అప్పుల గురించి నోరు తెరిస్తే ఒట్టు. నిజంగా వారికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా అప్పు తెచ్చిన ప్రతిసారి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు మీడియా సమావేశం పెట్టి ,తాము ఎందుకు అప్పు చేశామో ప్రజలకు వివరించాలి. దానిని సంపద సృష్టికి వాడారా?లేక సంక్షేమ స్కీములకు వాడారా అన్నది చెప్పాలి. వైఎస్ జగన్మోహన్రెడ్డి టైమ్ లో స్కీములు అమలు చేస్తుంటే, డబ్బును పప్పు ,బెల్లాల మాదిరి పందారం చేస్తున్నారని, బటన్ నొక్కుడు తప్ప ఇంకేమి చేస్తున్నారని దుష్ప్రచారం చేసేవారు. అదే టైమ్ లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన స్కీములకన్నా మూడు రెట్లు అధికంగా వెల్ఫేర్ పధకాలు ప్రజలకు ఇస్తామని, దానికి సూపర్ సిక్స్ అని పేరు పెట్టి ఊదరగొట్టారు. బహిరంగ సభలలో కన్నా, వీటిపై కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారు. ప్రస్తుతం మంత్రి అయిన నిమ్మల రామానాయుడు వంటివారు ప్రతి గృహానికి వెళ్లి అక్కడ ఎంత మంది పిల్లలు ఉంటే, వారందరికి నీకు పదిహేనువేలు, నీకు పదిహేనువేలు అంటూ,పద్దెనిమిదేళ్ల వయసు దాటిని మహిళ కనిపిస్తే నీకు పద్దెనిమిది వేల రూపాయలు అంటూ తెగ ప్రచారం చేశారు. సంబంధిత వీడియో వైరల్ కూడా అయింది.ఈ సంగతి పక్కనబెడితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెంచిన వృద్దాప్య పెన్షన్ నాలుగువేల రూపాయలను కొందరు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఇదిపాత స్కీమే అయినా వెయ్యి రూపాయలు పెంచారు. కనుక బాగానే హడావుడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల సిబ్బంది,ఇతర ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపించారు. టీడీపీ కార్యకర్తలంతా దీనిని ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. అది వేరే విషయం.పెన్షన్ తో పాటు మూడు నెలల బకాయి మూడువేల రూపాయలు కూడా ఇచ్చారు.ఈ ఏడువేల రూపాయలను సుమారు అరవైఐదు లక్షల మందికి పంపిణీ చేయడానికి గాను సుమారు 4550 కోట్ల వ్యయం అవుతుంది. ఇదే టైమ్ లో దివ్యాంగులకు, కిడ్నీ బాధితులు,ఇతర అర్హులైన వర్గాల వారికి కూడా పెరిగిన పెన్షన్ ఇచ్చారు. దీనికి అయ్యే వ్యయం మరికొన్ని కోట్లు ఉంటుంది.ఈసారి బకాయిలు కూడా చెల్లించవలసి వచ్చినందున ఈ స్థాయిలో ఖర్చు అయినా, వచ్చే నెల నుంచి కొంత తగ్గి సుమారు రూ.2,600 కోట్ల వ్యయం అవుతుంది.ఇది కూడా చాలా ఎక్కువే. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రెండువేల రూపాయల పెన్షన్ ను మూడువేల రూపాయలు చేసి ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుతూ అమలు చేసింది. దానికి సుమారు రూ.1,800 కోట్ల వరకు అయ్యేది. విశేషం ఏమిటంటే చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇచ్చిన మరో హామీ ప్రకారం బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ సదుపాయం కల్పించాలి.చంద్రబాబు వీటిలో కోతలుపెట్టకుండా అది కూడా ఇస్తే బహుశా నెలకు రూ.3,500 కోట్ల వరకు వెళ్లవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,పెన్షన్ లకు సుమారు రూ.4,500 కోట్లు అవవుతుంది. అంటే ఈ రెండు పద్దుల కిందే సుమారు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందన్నమాట.ఇదీ చదవండి: ఒక్క రోజే రూ.5,000 కోట్ల అప్పుఇవి కాకుండా అనేక ఇతర స్కీములు, ప్రభుత్వపరంగా ఉండే ఇతర వ్యయాలు ఉంటాయి. ఇవన్నీ లెక్క వేస్తే పదివేల కోట్ల రూపాయల అంచనా దాటిపోతుంది. కేవలం ఒక్క హామీ అమలుకే ఇంత మొత్తం ఖర్చు అయితే, ఇక సూపర్ సిక్స్ లోని ఇతర స్కీముల అమలుకు ఇంకెంత కావాలో గణించుకోవచ్చు. బహుశా నెలకు పదిహేనువేల కోట్ల రూపాయల వరకు అవుతుందేమో తెలియదు. కాకపోతే చంద్రబాబు తెలివిగా వాటన్నిటిని అలవాటు ప్రకారం ఎగవేస్తే చెప్పలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కాని, కేంద్రం నుంచి వచ్చే వాటా,సాయం కాని అన్ని కలిపినా పది,పన్నెండు వేల రూపాయలు మించి ఉండకపోవచ్చు. అప్పుడు అప్పులు చేయక తప్పని స్థితి ఏర్పడుతుంది.కేవలం ఒక స్కీము అమలు చేసినందునే ఏడువేల కోట్ల అప్పు చేస్తే, మరి మిగిలిన స్కీముల కోసం ఎంత డబ్బు సమీకరించాలి?ఎంత అప్పు చేయాలి?దీని గురించి చంద్రబాబు లేదా ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణాత్మకంగా చిత్తశుద్దితో చెబితే మెచ్చుకోవచ్చు. కాని వారు అలా చేసే అవకాశం ఉండదు. పైగా శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.అది వేరే కధ. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తే అప్పులపాలు అయిందని ప్రచారం చేసిన చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లు ఇరవై రోజులలోనే ఎందుకు ఇంత అప్పు చేశారు?ఈ రకంగా ప్రతి నెల రుణం తీసుకుంటే ఏడాదికి సుమారు తొంభైవేల కోట్ల నుంచి లక్ష కోట్ల అప్పు చేయడానికి సిద్దపడుతున్నారా?లేదా ఆ మేరకు సంపద సృష్టిస్తారా? ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 2019 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి దిగిపోయే టైమ్ కు ఖజానాలో వంద కోట్లే ఉంది. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మారే నాటికి సుమారు 5500 కోట్ల నిధులు ఉన్నాయట.దీని గురించి వారు మాట్లాడరనుకోండి. ఈ మొత్తం కాకుండా ప్రతిరోజు వచ్చే పన్నులు,పన్నేతర ఆదాయం ఉండనే ఉంటుంది. ఇవేవి చాలక ఏడువేల కోట్ల రూపాయల అప్పు చేశారు. అన్నింటికి జిందాతిలిస్మాత్ మాదిరి.. అమరావతిని అభివృద్ది చేస్తామని, ఆ తర్వాత భూములు అమ్మి వేలు,లక్షల కోట్లు పంపాదిస్తామని, అదే సంపదని తెలుగుదేశం నేతలు ప్రచారం చేశారు. భూములు అమ్మితే లక్షల కోట్ల ఆదాయం వస్తుందో,రాదోకాని, ముందుగా ఆ ఏభైఐదువేల ఎకరాలు అభివృద్ది చేయడానికి సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఆ మొత్తాన్ని ఎక్కడ నుంచి తెస్తారో వీరు చెప్పడం లేదు. ఇంకా ఏ రకంగా సంపద వస్తుందో వీరు ఇంతవరకు వెల్లడించలేదు. పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి మాదిరి చంద్రబాబు, పవన్ లు డబ్బును ఏమైనా సృష్టించే అవకాశం ఉందా?అన్న సందేహం రావచ్చు.అది సాధ్యం కాదన్న సంగతి తెలిసిందే.ఈ మొత్తం ప్రక్రియలో అయితే సూపర్ సిక్స్ పేరుతో ప్రకటించిన లక్షల కోట్ల రూపాయల విలువైన స్కీములను ఎగవేయాలి. అంటే ప్రజలను మోసం చేయాలి. లేక మభ్య పెట్టాలి. లేదంటే అప్పులు మరింతగా తెచ్చి వాటిని అర్హులందరికి పంచిపెట్టాలి. అది కూడా బటన్ నొక్కుడు కిందే వస్తుంది కదా?అప్పుడు ఏపీ రెండు శ్రీలంకలు అవుతుంది కదా! అయినా ఫర్వాలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అంతా బ్రహ్మండంగా ఉన్నట్లు, ఆయన అప్పుల ద్వారా సంపద సృష్టించడంలో చాలా శ్రమపడుతున్నట్లు పిక్చర్ ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉంది కనుక ఏమి చేసినా వారికి పచ్చగానే కనపడవచ్చు.కాని ప్రజలకు అలా కనిపిస్తుందా? అంటే చెప్పలేం. పాత వృద్దాప్య పెన్షన్ స్కీములో వెయ్యిరూపాయలు పెంచి అమలు చేశాం కనుక సూపర్ సిక్స్ అయిపోయినట్లేనని ప్రచారం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు సుమా!.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
![BRS MP Keshava Rao Will Join In Congress](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Keshava-Rao.jpg.webp?itok=hWndd4s2)
నేడు కాంగ్రెస్లోకి కేశవరావు.. కేబినెట్ విస్తరణ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు కాంగ్రెస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కాగా, సీనియర్ నేత కే. కేశవరావు నేడు హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేశవరావు కాంగ్రెస్లో చేరనున్నారు. నేడు ఎంపీ పదవి(రాజ్యసభ సభ్యత్వం)కి కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ కాసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఇదిలా ఉండగా.. రేపు(గురువారం) తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉన్న విషయం తెలిసిందే. అయితే, సీఎం రేవంత్ హస్తిన పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశంలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. దీంతో, కేబినెట్ విస్తరణ వాయిదాపడే ఛాన్స్ ఉంది.
![Union Minister BJP MP Srinivasa Varma Comments On AP Special Status](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/BJP-MP-Srinivasa-Varma.jpg.webp?itok=dcLO5GDA)
‘ప్రత్యేక హోదాకు బదులుగానే కదా ఏపీకి ప్యాకేజీ ఇచ్చింది’
న్యూఢిల్లీ, సాక్షి: ఎన్టీయే కూటమిలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పట్టుబట్టాలనే ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంలో మిత్రపక్షాలకు కేంద్రంలోని బీజేపీ మొండి చేయి చూపిస్తుందా? అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి చెందిన ఆ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై నరసాపురం ఎంపీ, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మీడియాతో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని వ్యాఖ్యానించారాయన. అలాగే.. బీహార్ అసెంబ్లీ ప్రత్యేక హోదా తీర్మానంపైనా స్పందిస్తూ.. జేడీయూ తీర్మానాలు చేసినంత మాత్రాన హోదా వస్తుందా? అని ఎదురు ప్రశ్నించారాయన. ‘‘కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది తీర్మానాలు చేసి ఇచ్చే అంశం కాదు. ప్రత్యేక హోదా లేదనేది బీహార్కు కూడా వర్తిస్తుంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని తెలిపారాయన. ఇక.. పోలవరం ప్రాజెక్టు అంశంపైనా స్పందిస్తూ.. నిర్మాణ వైఫల్యం వల్లే డయాఫ్రం వాల్, కాపర్ డ్యాంకు పగుళ్లు వచ్చాయన్నారు. జాతీయ ప్రాజెక్టు పొలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుంది. కానీ, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందా? లేదంటే కేంద్రం నిర్మిస్తుందా? అనేది కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయిస్తుందన్నారు.రాష్ట్రంలో కొనసాగుతున్న దాడుల పర్వంపైనా స్పందిస్తూ.. ఏపీలో శాంతిభద్రతలు కొలిక్కి రావడానికి రెండు, మూడు నెలల టైం పట్టొచ్చని, గత పరిస్థితుల వల్లే ఈ దాడులు కొనసాగుతున్నాయని అన్నారాయన.
![Box Office War Between Prabhas, Jr NTR And Ram Charan](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Box-Office.jpg.webp?itok=M_lP74UE)
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే.
![T20 World Cup 2024: Team India To Tour Mumbai In Open Bus After Meeting PM Modi](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/ca.jpg.webp?itok=J--GLcOe)
ప్రధాని మోదీని కలువనున్న టీ20 ఛాంపియన్స్.. ఓపెన్ టాప్ బస్లో ఊరేగింపు
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 14 ఏళ్ల తర్వాత భారత్ జట్టు పొట్టి ప్రపంచకప్ను చేజిక్కించుకుంది. టోర్నీ ఆరంభ ఎడిషన్లో (2007) టీమిండియా టైటిల్ను సాధించింది. అనంతరం 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. ఆ ఏడాది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.THE MUMBAI TOUR OF TEAM INDIA IN OPEN BUS...!!!!! 🇮🇳- After meeting PM Narendra Modi, Team India will tour Mumbai in Open bus with T20 World Cup Trophy. 🏆❤️ (Abhishek Tripathi). pic.twitter.com/75tnkBihMD— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచిన ప్రతిసారి భారత్లో సంబురాలు అంబరాన్నంటుతాయి. ఈసారి కూడా అదే తరహాలో సెలబ్రేట్ చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇందుకు భారత ప్రభుత్వం కూడా సహకరించనుందని తెలుస్తుంది.వరల్డ్కప్ విన్నింగ్ టీమ్ స్వదేశానికి తిరిగి రాగేనే తొలుత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. మోదీ భారత బృందం మొత్తాన్ని సన్మానించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ప్రభుత్వం ఆథ్వర్యంలోనే భారత ఆటగాళ్లను ముంబై నగర వీధుల్లో ఓపెన్ టాప్ బస్లో ఊరేగించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా ఐసీసీ టోర్నీలు, ముఖ్యంగా వరల్డ్కప్ గెలిచినప్పుడు ఓపెన్ టాప్ బస్ల్లో ఊరేగించారు. ఈసారి కూడా అలాగే చేయాలని భారత ప్రభుత్వం బీసీసీఐని ఆదేశించినట్లు తెలుస్తుంది.Can't wait to see these types of scenes in Mumbai of Team India with T20 World Cup Trophy...!!!!🏆❤️- THIS IS GOING TO BE GOOSEBUMPS. 🇮🇳 pic.twitter.com/o25c2dJDdZ— Tanuj Singh (@ImTanujSingh) July 3, 2024ఇదిలా ఉంటే, వరల్డ్కప్లో విజయబావుటా ఎగరవేసిన టీమిండియా ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. భారత క్రికెటర్లు హరికేన్ (గాలివాన) కారణంగా ఫైనల్ మ్యాచ్కు వేదిక అయిన బార్బడోస్లో ఇరుక్కుపోయారు. భారత బృందం రేపు ఉదయం కల్లా స్వదేశానికి చేరే అవకాశం ఉంది. టీమిండియా ఢిల్లీలో ల్యాండ్ అయ్యేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారత బృందం ప్రత్యేక ఛార్టర్ విమానంలో బార్బడోస్ నుంచి బయల్దేరనుంది.
![Karnataka And Tami Nadu May Ban Pani Puri](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Pani-Puri.jpg.webp?itok=ArolwX9z)
త్వరలో ఈ రెండు రాష్ట్రాల్లో పానీ పూరీ బ్యాన్!?
బెంగళూరు/చెన్నై: పానీ పూరీ లవర్స్కు బ్యాడ్ న్యూస్. కర్ణాటక, తమిళనాడులో పానీ పూరీని బ్యాన్ చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. పానీ పూరీలో క్యాన్సర్ కారక పదార్దాలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా, పానీ పూరి అనేక వ్యాధులకు కారణమవుతోందని ఫుల్ సెఫ్టీ అధికారులు గుర్తించారు. వీటిని అమ్మేవారు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పానీపూరీ తిన్న వారు డయేరియా, టైఫాయిడ్, జాండిస్ వంటి వ్యాధులకు గురవుతున్నారు. ఇక, తాజాగా కర్ణాటకలో 250 నమూనాలు సేకరించగా దీనిలో 40 భద్రతా ప్రమాణాలు విఫలమయ్యాయని తేలింది.వీటిలో బ్రిలియంట్ బ్లూ, టార్ట్రాజైన్ వంటి రసాయనాలు కనుగొన్నారు. వీటిలో క్యాన్సర్ కలిగించే పదార్థాలను కనుగొన్నారు. పానీ పూరిలో రంగుల వాడకమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇక, ఇప్పటికే కర్ణాటకలో గోభీ మంచూరియన్, కబాబ్స్ వంటి ఇతర స్నాక్స్లలో ఇటువంటి అనేక ఏజెంట్ల వాడకంపై నిషేధం విధించారు.ఇక, తమిళనాడులో కూడా దాదాపు 80 చోట్ల 1500 పానీ పూరీ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని గుర్తించారు. అలాగే, చాట్ మసాలాలలో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా కూడా గుర్తించారు. దీంతో, పానీ పూరీని బ్యాన్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
![Google Engineer Makes Worlds First AI Dress](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/dress.jpg.webp?itok=vsJCe8b0)
'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!
ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సాయంతో రోబోట్లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. ఆమె ఈ ఏఐ డ్రెస్ని రోబోటిక్ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్ స్నేక్ డ్రెస్ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ డ్రెస్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ డ్రెస్ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్ అయినా ఫ్యాషన్ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by She Builds Robots (@shebuildsrobots) (చదవండి: సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!)
![Poll Says Kamala Harris Is Better Than Joe Biden For Democratic Party](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Kamla-Harris.jpg.webp?itok=A8kLjF4a)
బైడెన్ కంటే కమలా హారీస్ బెటర్.. పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలపై ఎన్నడూ లేనంత చర్చ నడుస్తోంది. ఇందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహార శైలే కారణమని పలువురు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారీస్ను బరిలో దింపాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పలు సర్వేల పోల్స్ కూడా ఆమెకు అనుకూలంగానే ఉన్నాయి. దీంతో, అధ్యక్ష ఎన్నికల బరిలో ఎవరు ఉంటారనే చర్చ మొదలైంది.కాగా, తాజాగా సీఎన్ఎన్ పోల్ ప్రకారం.. నమోదైన ఓటర్లలో ట్రంప్నకు 47 శాతం ఓట్లు రాగా.. కమలా హరీస్కు 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఇందులో మహిళల ఓట్ల విషయంలో కమలా హారీస్ 50 శాతం ఓట్లు రావడం విశేషం. ఇదే సమయంలో బైడెన్కు 44 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు.. మిచెల్లీ ఒబామాకు 37 శాతం ఓట్లు పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్తో బైడెన్ డిబెట్ గురించే ప్రధానంగా చర్య జరుగుతోంది. ట్రంప్ను ఢీకొనడంతో బైడెన్ విఫలమయ్యారనే డెమోక్రటిక్ పార్టీ నేతలే చెబుతున్నారు. దీంతో, ఆయన పోటీలో ఉంటారా? అనే చర్య మొదలైంది. మరోవైపు.. ట్రంప్తో డిబెట్ సందర్భంగా తాను ఎందుకు సరిగా మాట్లాడలేదో క్లారిటీ ఇచ్చారు. ఈ తడబాటుకు గల కారణాన్ని బైడెన్ చెప్పుకొచ్చారు.వర్జీనియాలో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన..‘తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని బైడెన్ తెలిపారు. ఈ పర్యటనల వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందన్నారు. అందుకే డిబెట్లో ట్రంప్తో సరిగా వాదించలేకపోయానన్నారు. చర్చలో తాను మరింత ధాటిగా మాట్లాడి ఉంటే బాగుండేదని చెప్పారు. అందుకు తనను క్షమించాలని పార్టీ మద్దతుదారులను కోరారు. దీన్ని సాకుగా భావించవద్దని.. కేవలం వివరణగా మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
![If You Are Preparing For Neet Again Heres Why You Should Choose Aakashs Repeaterxii Passed Courses](/sites/default/files/styles/webp/public/article_images/2024/06/20/Untitled-2_9.jpg.webp?itok=Yu3M0cnh)
మీరు మళ్లీ NEET లేదా JEE కోసం సిద్ధమవుతున్నట్లయితే, మీరు ఆకాష్ రిపీటర్/XII Passed కోర్సులను ఎందుకు ఎంచుకోవాలి?
NEET/JEE కోసం సన్నద్ధం కావడానికి ఒక సంవత్సరాన్ని వెచ్చించడం అనేది ఏడాది పొడవునా నిబద్ధత కలిగి మరియు మెడిసిన్ లేదా ఇంజినీరింగ్లో కెరీర్పై మీ కలను కొనసాగించడం పట్ల మీకు మక్కువ ఉంటే ఖచ్చితంగా విలువైనది. ఈ పరీక్షలు ఛేదించడానికి చాలా కఠినంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి హాజరైన లక్షలాది మంది విద్యార్థులలో మొదటి ప్రయత్నంలోనే కొంత మంది మాత్రమే విజయం సాధిస్తారు. ప్రత్యామ్నాయ కెరీర్ ఎంపికల కోసం వెతకని వారు లేదా తమకు పెద్దగా నచ్చని కాలేజీలలో స్థిరపడని వారు. అయినప్పటికీ, ఒక సంవత్సరం పునరావృతం చేయడానికి మరియు మళ్లీ సిద్ధం కావడానికి వెనుకాడని వారు కూడా చాలా మంది ఉన్నారు.మీరు మీ మొదటి ప్రయత్నంలో NEETని ఛేదించనట్లయితే మరియు మళ్లీ సిద్ధం కావాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు తాజాగా ప్రారంభించి సరైన మార్గ నిర్దేశం చేయడంలో సహాయపడే ఆకాష్ రిపీటర్/XII పాస్ కోర్సులను మీరు తీవ్రంగా పరిగణించాలి.NEET/ JEE 2025 కోసం మీరు ఆకాష్ రిపీటర్/ XII Passed కోర్సును ఎంచుకోవడానికి కారణాలు● ఆకాష్ రిపీటర్ కోర్సులు మీ స్కోర్ను మెరుగుపరచడంలో మీకు సహాయపడటానికి రూపొందించబడ్డాయి మరియు తద్వారా మీ కలల కళాశాలకు ఎంపికయ్యే అవకాశాలను పెంచుతాయిసూర్యాంశ్ K ఆర్యన్ ఆకాష్లో NEET రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి, అతను NEET 2023లో తన 2వ ప్రయత్నంలో తన స్కోర్లలో గణనీయమైన మెరుగుదలను నమోదు చేసుకున్నాడు మరియు NEET 2022 (592 స్కోర్)లో తన మొదటి ప్రయత్నం కంటే 705 స్కోర్ సాధించగలిగాడు మరియు ప్రస్తుతం AIIMS భోపాల్లో చదువుతున్నాడు. అంజలి కథ కూడా అలాంటిదే. NEET 2022లో 622 స్కోర్ చేసిన తర్వాత, అంజలి ఆకాష్ NEET రిపీటర్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్లో చేరింది మరియు 706 స్కోర్ చేయగలిగింది మరియు NEET 2023లో అండమాన్ & నికోబార్ దీవుల టాపర్గా నిలిచింది. అంజలి ప్రస్తుతం MAMC, ఢిల్లీలో చదువుతోంది. ఆకాష్లోని రిపీటర్ సక్సెస్ స్టోరీలు ప్రోగ్రామ్ యొక్క దృఢత్వం మరియు తీవ్రతను తెలియజేస్తాయి, ఇది తమ కలలను సాధించుకోవడానికి తమ విలువైన సమయాన్ని వెచ్చించే విద్యార్థులకు ఆఫర్లో ఉత్తమమైన వాటి కంటే తక్కువ ఏమీ కాకుండా లభించేలా చేస్తుంది.● ఉత్తమ అధ్యాపకులతో అత్యుత్తమ ఫలితాలను అందించడం ద్వారా ఆకాష్ యొక్క 35 ఏళ్ల వారసత్వం నుండి ప్రయోజనం పొందండిఆకాష్ దానితో పాటు, దేశంలోని అత్యుత్తమ అధ్యాపకులలో ఒకరి ద్వారా ఫోకస్డ్ మరియు రిజల్ట్-ఓరియెంటెడ్ టెస్ట్ ప్రిపరేషన్ను అందించే 35 సంవత్సరాల శక్తివంతమైన చరిత్ర కలిగినదిగా పిలవబడింది.. ఆకాష్లోని ఉపాధ్యాయులు అధిక అర్హతలు మరియు అనుభవజ్ఞులు మాత్రమే కాకుండా కోచింగ్ మెథడాలజీలు మరియు విద్యార్థుల మారుతున్న విద్యా అవసరాలకు అనుగుణంగా వారికి సహాయపడే నైపుణ్యాలలో బాగా శిక్షణ పొందారు. ఆకాష్ రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో, రిపీటర్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం మరియు వారి ప్రత్యేక అవసరాలు మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం కలిగిన అత్యుత్తమ అధ్యాపకుల దగ్గర మీరు నేర్చుకుంటారు, తద్వారా వారి ఎంపిక అవకాశాలను మెరుగుపరుస్తారు.● నిపుణులచే రూపొందించబడిన అధిక నాణ్యత అధ్యయన సామగ్రిఆకాష్లోని ప్రతి అధ్యయన వనరు అన్ని అంశాల సమగ్ర విశ్లేషణను అందించడానికి రూపొందించబడింది, విద్యార్థులు NEET మరియు/లేదా JEEలో పరీక్షించిన కాన్సెప్ట్లపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా చూసుకుంటారు. విద్యార్థులు కష్టమైన పాఠాలను సులభంగా గ్రహించడంలో సహాయపడేందుకు వివిధ రకాల అభ్యాస ప్రశ్నలు, ఉదాహరణలు మరియు దృష్టాంతాలను చేర్చడానికి మా నిపుణులు స్టడీ మెటీరియల్ను జాగ్రత్తగా డిజైన్ చేస్తారు.అంతేకాకుండా, తాజా పరీక్షల ట్రెండ్లు మరియు ప్యాటర్న్లకు అనుగుణంగా మా స్టడీ మెటీరియల్ కఠినమైన సమీక్ష మరియు అప్డేట్లను కలిగియున్నది. విద్యార్థులు తమ పరీక్షా సన్నాహక ప్రయాణంలో ముందుకు సాగడానికి అత్యంత సందర్భోచితమైన మరియు నవీనమైన కంటెంట్పై అవగాహణ కలిగి ఉండేలా ఇది దోహదపడుతుంది.● పూర్తి అభ్యాసం కోసం కఠినమైన పరీక్షలు మరియు మూల్యాంకన షెడ్యూల్ఆకాష్లో విద్యార్థులు తమ సన్నద్ధత సమయంలో వారి బలహీనమైన ప్రాంతాలలో గణనీయమైన మెరుగుదలను ప్రదర్శించడంలో సహాయపడే నిర్దిష్టమైన పరీక్ష షెడ్యూల్ను అనుసరిస్తారు. ప్రస్తుతం భోపాల్లోని AIIMSలో ఉన్న ఆకాష్లోని రిపీటర్ క్లాస్రూమ్ విద్యార్థి సూర్యాంశ్ మాటల్లో, “నేను ప్రతిరోజూ ఒక పరీక్ష రాశాను”, పరీక్షలు నా బలమైన మరియు బలహీనమైన ప్రాంతాలను గుర్తించడంలో నాకు సహాయపడాయి.● గరిష్టంగా 90% మొత్తం స్కాలర్షిప్ పొందండిమీ కల కోసం సిద్ధపడడం మరియు అది కూడా రెండవసారి, ఖచ్చింగా సవాలుగా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థికంగా. మేము, ఆకాష్ వద్ద, ఆకాష్ ఇన్స్టంట్ అడ్మిషన్ కమ్ స్కాలర్షిప్ టెస్ట్ (iACST)తో మీ కలను సాకారం చేయడానికి మీకు అవకాశాన్ని అందిస్తున్నాము. iACST మీకు 90% మొత్తం స్కాలర్షిప్ను గెలుచుకోవడానికి మరియు ఆకాష్ యొక్క రిపీటర్/ XII ఉత్తీర్ణత సాధించిన కోర్సులతో మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి తక్షణ అవకాశాన్ని మీకు అందిస్తుంది.మీరు 2025లో NEET లేదా JEEలో మరోసారి మీ అదృష్టం పరీక్షించుకోవాలనుక్నుట్లయితే , మెడిసిన్/ఇంజినీరింగ్లో మీ కలల కెరీర్కు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్లగల సరైన మెంటర్ని మీరు ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. ఆకాష్ రిపీటర్ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజే నమోదు చేసుకోండి మరియు మొత్తం 90% స్కాలర్షిప్ పొందండి.ఇక్కడ క్లిక్ చేయండి
పింఛన్ హామీ తప్పెన్
డిప్రెషన్లో దర్శన్ భార్య.. ఎప్పుడూ భర్త కోసమే తపించేది!
లిటిల్ బూమ్ బూమ్..ఈ చిన్నోడిని గుర్తు పట్టారా? ఫోటోలు వైరల్
గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!
ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!
అందుకేగా మరీ వెంటబడి అధికార పార్టీతో పొత్తుపెట్టుకున్నది!
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
జైలు నుంచి నిర్మాతలకు దర్శన్ ఫోన్?
మణిపూర్లో భారీ వర్షాలు.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేత
కవిత జ్యూడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
పింఛన్ హామీ తప్పెన్
డిప్రెషన్లో దర్శన్ భార్య.. ఎప్పుడూ భర్త కోసమే తపించేది!
లిటిల్ బూమ్ బూమ్..ఈ చిన్నోడిని గుర్తు పట్టారా? ఫోటోలు వైరల్
గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!
ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!
అందుకేగా మరీ వెంటబడి అధికార పార్టీతో పొత్తుపెట్టుకున్నది!
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
జైలు నుంచి నిర్మాతలకు దర్శన్ ఫోన్?
మణిపూర్లో భారీ వర్షాలు.. కార్యాలయాలు, పాఠశాలలు మూసివేత
కవిత జ్యూడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
అందరికంటే ముందుగా మీరే 'కల్కి'ని ఆదరించారు: నాగ్ అశ్విన్
మేం ఓడిపోయాం.. ప్రజలు మోసపోయారు..
Pension Distribution In AP: మంత్రి గారి భార్య దాదాగిరి.. !
నాకు మొబైల్ లేదు: సిద్ధూ
భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
సినిమా
![SSMB29: Prithviraj Sukumaran To Play Villain Role In Rajamouli, Mahesh Film](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Mahesh-Babu.jpg.webp?itok=GW37PRGg)
మహేష్ – రాజమౌళి మూవీ: విలన్గా స్టార్ హీరో!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. భారీ బడ్జెట్తో యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్గా తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు చాలా కష్టపడుతున్నాడు. తన లుక్ను కూడా మార్చుకున్నాడు. పాత్రకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకుంటున్నాడు. త్వరలోనే సెట్స్పైకి అడుగుపెట్టనున్నారు.(చదవండి: టాలీవుడ్లో హాలీవుడ్ భామ.. 'నిన్ను వదలను' అంటోన్న బ్యూటీ!)ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టిపెట్టాడు రాజమౌళి. ఈ చిత్రం కోసం అంతర్జాతీయ నటీనటులను, టెక్నీషియన్లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేశ్కు జోడీగా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ పుకారు బయటకు వచ్చింది. అయితే చిత్రబృందం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా విలన్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి బయటకు వచ్చింది. మహేశ్ను ఢీ కొట్టే విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ను ఎంపిక చేశారట. ఈ విషయానన్ని జక్కన్న గోప్యంగా ఉంచినప్పటకీ..లీకుల వీరులు బయటకు వదిలేశారు. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పృథ్విరాజ్.. ‘సలార్’తో పాన్ ఇండియా నటుడయ్యాడు. ఆ చిత్రంలో పృథ్విరాజ్ ప్రభాస్తో పోటీ పడి నటించాడు. తన సినిమాలోని విలన్ పాత్రకు పృథ్వీరాజ్ బాగా సెట్ అవుతాడని జక్కన్న భావిస్తున్నాడట. ఇక రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? పృథ్విరాజ్ వెంటనే ఓకే చెప్పేశాడట. అన్ని సెట్ అయితే.. మహేశ్ బాబును ఢీకొట్టే విలన్గా పృథ్విరాజ్ను చూడొచ్చు.
![Son Of Sardaar 2: Mrunal Thakur Replaces Sonakshi Sinha](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/sonakshi-sinha.jpg.webp?itok=V2u8b_fn)
హిందీలో ‘మర్యాద రామన్న’ సిక్వెల్.. సోనాక్షి ప్లేస్లో మృణాల్!
సన్నాఫ్ సర్దార్గా అజయ్ దేవగన్ అతి త్వరలో స్కాట్లాండ్ వెళ్లనున్నారని బాలీవుడ్ సమాచారం. అజయ్ దేవగన్, సోనాక్షీ సిన్హా, సంజయ్ దత్ లీడ్ రోల్స్లో అశ్వినీ ధీర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సన్నాఫ్ సర్దార్’ (2012). రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న’కు హిందీ రీమేక్గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు పన్నెండేళ్ల తర్వాత ‘సన్నాఫ్ సర్దార్’కు సీక్వెల్గా ‘సన్నాఫ్ సర్దార్ 2’ చిత్రం రానుందని సమాచారం. తొలి భాగంలో లీడ్ రోల్స్లో నటించిన అజయ్ దేవగన్, సంజయ్ దత్ సీక్వెల్లోనూ నటించనున్నారని, హీరోయిన్గా మాత్రం సోనాక్షీ సిన్హా ప్లేస్లో మృణాల్ ఠాకూర్ కనిపించనున్నారని భోగట్టా. ఈ చిత్రానికి సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ని స్కాట్లాండ్లో జరిపేలా ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్ దాదాపు యాభై రోజులకు పైగా ఉంటుందని, అజయ్ దేవగన్–మృణాల్ ఠాకూర్ల కాంబినేషన్ ట్రాక్ అంతా విదేశాల్లోనే చిత్రీకరిస్తారని టాక్. ఈ సినిమాకు అజయ్ దేవగనే దర్శకత్వం వహిస్తారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
![Varun Sandesh New Movie Viraaji First Look Launch](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Varun%20Sandesh%20at%20Viraaji.jpg.webp?itok=jQea0pAt)
ఫస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతారు: వరుణ్ సందేశ్
‘‘నా 17 ఏళ్ల కెరీర్లో చేయని ఒక డిఫరెంట్ మూవీ ‘విరాజి’. ఈ చిత్రంలో ఓ క్రేజీ పాత్ర చేస్తున్నాను. ఈ నెల 10న విడుదల చేయనున్న ‘విరాజి’ ఫస్ట్ లుక్ చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘విరాజి’. ఈ చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు.మహా మూవీస్తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న రిలీజ్ కానుంది. మంగళవారం జరిగిన ‘విరాజి’ టైటిల్ ప్రకటన కార్యక్రమంలో ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ– ‘‘విరాజి’కి చాన్స్ ఇచ్చిన మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, నిర్మాత మహేంద్రగారు, వరుణ్ సందేశ్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘వరుణ్ సందేశ్ని కొత్త అవతారంలో చూపించే చిత్రమిది. మాలాంటి కొత్తవాళ్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ప్రేక్షకుల సపోర్ట్ కావాలి’’ అన్నారు మహేంద్రనాథ్ కూండ్ల. సంగీతదర్శకుడు ఏబీ నెజర్ పాల్ (ఏబీ), నటీనటులు ప్రమోదిని, రఘు కారుమంచి, ఫణి తదితరులు పాల్గొన్నారు.
![Sonakshi Sinha enjoy In the pool on their honeymoon Trip Pics Goes Viral](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/df.jpeg.webp?itok=K4ZEQoTP)
ప్రియుడితో పెళ్లి.. హనీమూన్ ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్!
బాలీవుడ్ ఇటీవలే హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సిరీస్కు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పాక్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తీసుకొచ్చారు. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్స్ నటించారు.సినిమాల సంగతి పక్కనపెడితే.. ఇటీవల హీరామండి భామ సోనాక్షి సిన్హా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. ముంబయిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ సినీతారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.తాజాాగా ఈ జంట హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోనాక్షి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశారు. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. నూతన దంపతులు స్విమ్మింగ్ పూల్లో చిల్ అవుతూ హనీమూన్ ఆస్వాదిస్తున్నారు. కాగా.. జూన్ 23న ముంబయిలో జరిగిన వివాహ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, కాజోల్, రిచా చద్దా వంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. View this post on Instagram A post shared by HT City (@htcity)
క్రీడలు
![Lanka Premier League 2024: Alex Hales Shines, Galle Marvels Beat Jaffna Kings By 5 Wickets](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/Untitled-5_7.jpg.webp?itok=LQUf0m4p)
అలెక్స్ హేల్స్ మెరుపులు
లంక ప్రీమియర్ లీగ్ 2024లో గాలె మార్వెల్స్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రెచ్చిపోయాడు. జాఫ్నా కింగ్స్తో నిన్న (జులై 2) జరిగిన మ్యాచ్లో మెరుపు అర్దసెంచరీతో (47 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటాడు. హేల్స్తో పాటు నిరోషన్ డిక్వెల్లా (27 బంతుల్లో 47; 8 ఫోర్లు, సిక్స్), జనిత్ లియనాగే (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), జహూర్ ఖాన్ (4-0-24-3), ప్రిటోరియస్ (4-0-23-2), ఉడాన (4-0-60-2) రాణించడంతో మార్వెల్స్ 5 వికెట్ల తేడాతో జాఫ్నాపై విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా.. నిస్సంక (51), అవిష్క ఫెర్నాండో (59), అసలంక (33) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మార్వెల్స్ చివరి బంతికి విజయం సాధించింది. మార్వెల్స్ గెలుపు చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. సహన్ బౌండరీ బాదాడు. జాఫ్నా బౌలర్లలో అశిత ఫెర్నాండో, ఫేబియన్ అలెన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ధనంజయ డిసిల్వ ఓ వికెట్ దక్కించుకున్నాడు.రాణించిన వెల్లలగే, షాదాబ్ ఖాన్నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో క్యాండీ ఫాల్కన్స్పై కొలొంబో స్ట్రయికర్స్ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కొలొంబో.. సమరవిక్రమ (48), తిసార పెరీరా (38), ముహమ్మద్ వసీం (32) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్యాండీ బౌలర్లలో రజిత, హసరంగ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. షనక, చమీరా, అఘా సల్మాన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన క్యాండీ.. దునిత్ వెల్లలగే (4/20). షాదాబ్ ఖాన్ (4/22) రెచ్చిపోవడంతో 15.5 ఓవర్లలో 147 పరుగులకే చాపచుట్టేసింది. క్యాండీ ఇన్నింగ్స్లో కేవలం నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. చండీమల్ (38) టాప్ స్కోరర్గా నిలిచాడు.
![Indian Team Departure From Barbados Has Been Delayed Yet Again. They Are Likely Going To Arrive Early Morning On Thursday](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/afa.jpg.webp?itok=pPWA0-tR)
T20 World Cup 2024: హరికేన్ ప్రభావం.. ఇంకా బార్బడోస్లోనే టీమిండియా
టీ20 వరల్డ్కప్ విజయానంతరం మరుసటి రోజే (జూన్ 30) భారత్కు తిరిగి రావాల్సిన టీమిండియా.. హరికేన్ (గాలివాన) ప్రభావం కారణంగా ఫైనల్ మ్యాచ్కు వేదిక అయిన బార్బడోస్లోనే ఇరుక్కుపోయింది. హరికేన్ తీవ్రరూపం దాల్చడంతో బార్బడోస్లోని విమానాశ్రయం మూసివేశారు. దీంతో భారత క్రికెటర్లు గత రెండు రోజులుగా హోటల్ రూమ్కే పరిమితమయ్యారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా భారత బృందంతో పాటే ఉన్నారు. Virat Kohli showing Hurricanes to Anushka Sharma on video call at Barbados. ❤️pic.twitter.com/PzZY3RmMMb— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024ప్రకృతి శాంతిస్తే టీమిండియా గురువారం ఉదయానికంతా భారత్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. భారత బృందం రిటర్న్ జర్నీ ఇప్పటికే పలు దఫాలుగా వాయిదా పడింది. గాలివాన మధ్యమధ్యలో కాస్త ఎడతెరిపినిస్తూ మళ్లీ తీవ్రరూపం దాలుస్తుంది.బార్బడోస్లో భారత బృందం బస చేస్తున్న హోటల్లో నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం. బార్బడోస్ నగరంలో కర్ఫ్యూ అమల్లో ఉంది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. తన భార్య అనుష్క శర్మకు హరికేన్ తీవ్రతను ఫోన్లో చూపించాడు. మూడు రోజులైనా హరికేన్ తీవ్రత తగ్గకపోవడంతో భారత్లో ఉన్న క్రికెటర్ల ఆప్తులు ఆందోళన చెందుతున్నారు. టీమిండియా రాక కోసం స్వదేశంలో అభిమానులు కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. వరల్డ్కప్ విన్నింగ్ హీరోలకు ఘన స్వాగతం పలకాలని యావత్ భారత దేశం ఎదురుచూస్తుంది. కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్కప్ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది.
![Virat Kohli Dance Video After T20 WC Victory Becomes ICC Most Liked Post On Instagram In History](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/as.jpg.webp?itok=LlHCDHaw)
T20 World Cup 2024: విరాట్ కోహ్లినా మజాకా.. ఆల్టైమ్ రికార్డు
సోషల్మీడియాలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కింగ్ సోషల్మీడియాలోని ఏ ప్లాట్ఫాంలో పోస్ట్ పెట్టినా కోట్లల్లో వ్యూస్, లైక్స్ వస్తాయి. తాజాగా విరాట్కు సంబంధించిన పోస్ట్ ఒకటి ఆల్టైమ్ రికార్డును సెట్ చేసింది.టీమిండియా టీ20 వరల్డ్కప్ 2024 గెలిచిన అనంతరం విరాట్ సహచరులతో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ ఇన్స్టాగ్రామ్ చరిత్రలో అత్యధిక వ్యూస్, లైక్స్ పొందిన పోస్ట్గా రికార్డు సృష్టించింది. Virat Kohli, Arshdeep Singh and Rinku Singh dancing. 😭 pic.twitter.com/mhThl8IC7o— Selfless⁴⁵ (@SelflessRohit) June 29, 2024ఈ వీడియోను ఏకంగా 126 మిలియన్ల మంది వీక్షించారు. 9.7 మిలియన్ల మంది లైక్ చేశారు. ఐసీసీ ఇన్స్టా చరిత్రలో ఇది అత్యధిక జనాధరణ పొందిన పోస్ట్గా రికార్డైంది. ఇన్స్టాలో 20 మిలియన్ లైక్స్ పొందిన తొలి భారతీయుడిగా, తొలి ఏషియన్ అథ్లెట్గా, సెకెండ్ ఏషియన్గా, ప్రపంచంలో ఐదో అథ్లెట్గా విరాట్ రికార్డులు నెలకొల్పాడు.ఐసీసీ ఇన్స్టా వీడియోకు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన వీడియోలో కోహ్లి ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహింది పాడిన ఆల్టైమ్ హిట్ సాంగ్ "తునుక్ తునుక్ తన్"కు డ్యాన్స్ చేశాడు. కోహ్లికి జతగా అర్ష్దీప్, సిరాజ్, అక్షర్ పటేల్, బుమ్రా, రింకూ సింగ్ చిందులేశారు.VIRAT KOHLI'S INSTAGRAM POST ON T20 WORLD CUP VICTORY NOW HAS 20 MILLION LIKES...!!!! 🇮🇳- King Kohli becomes the first Asian to have 20 Million likes on a Instagram post in the History. 🐐🙌 pic.twitter.com/noofdlRQfP— Tanuj Singh (@ImTanujSingh) July 2, 2024కాగా, టీమిండియా 14 ఏళ్ల అనంతరం టీ20 వరల్డ్కప్ను తిరిగి కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. బార్బడోస్లో జరిగిన ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగోసారి (1983, 2007, 2011, 2024) జగజ్జేతగా నిలిచింది. విరాట్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్కప్ విజయానంతరం విరాట్.. సహచరులు రోహిత్ శర్మతో కలిసి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడు. కోహ్లి, రోహిత్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
![Portugal in the quarter finals](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/portugalll_0.jpg.webp?itok=I6p2C136)
క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్
ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ): యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో మాజీ చాంపియన్ పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే టాప్ టీమ్లలో ఒకటైన పోర్చుగల్కు విజయం అంత సులువుగా దక్కలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా గట్టి పోటీనిచ్చింది. ఒక దశలో స్లొవేనియా దూకుడు చూస్తే విజయం సాధించేలా అనిపించింది. కానీ చివరకు పెనాల్టీ షూటౌట్లో విజయం పోర్చుగల్ సొంతమైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్ లేకుండా 0–0తో సమంగా నిలవగా...షూటౌట్లో పోర్చుగల్ 3–0తో గెలుపొందింది. దిగ్గజ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు నిర్ణీత సమయంలో మ్యాచ్ గెలిపించే అవకాశం వచ్చినా అది సాధ్యం కాలేదు. ఈ మ్యాచ్లో అతను పలు అవకాశాలు వృథా చేశాడు. ఎట్టకేలకు 105వ నిమిషంలో పోర్చుగల్కు పెనాల్టీ కిక్ లభించింది. అయితే రొనాల్డో కొట్టిన ఈ కిక్ను స్లొవేనియా గోల్ కీపర్ జాన్ ఆబ్లక్ సమర్థంగా అడ్డుకున్నాడు. దాంతో రొనాల్డో కన్నీళ్లపర్యంతం కావడంతో సహచరులు సముదాయించాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు షూటౌట్లో గెలిచి పోర్చుగల్ ఊపిరి పీల్చుకుంది. పోర్చుగల్ తరఫున రొనాల్డో, బ్రూనో ఫెర్నాండెజ్, బెర్నార్డో సిల్వ గోల్స్ సాధించగా... స్లొవేనియా ఆటగాళ్లు ఎల్లిసిక్, బల్కోవెక్, వెర్బిక్ కొట్టిన షాట్లను పోర్చుగల్ కీపర్ డియాగో కోస్టా నిలువరించగలిగాడు. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్తో పోర్చుగల్ తలపడుతుంది. 2016లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో పోర్చుగల్ గెలిచి చాంపియన్గా నిలిచింది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నెదర్లాండ్స్ 3–0తో రొమేనియాను ఓడించి క్వార్టర్స్ చేరింది.
బిజినెస్
![Promoters cash out over Rs 87000 crore in H1CY24 amid market boom](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/mark.jpg.webp?itok=kuDPvsb5)
ప్రమోటర్లు వాటాలు అమ్మేస్తున్నారు!
ఇటీవల సెకండరీ మార్కెట్లు బుల్ వేవ్లో పరిగెడుతున్నాయి. తాజాగా సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ నేపథ్యంలో పలు లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు కొంతమేర సొంత వాటాలను విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు పలు అంశాలు ప్రభావం చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..ముంబై: రోజుకో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకుతూ దౌడు తీస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లో పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు సైతం కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీల ప్రమోటర్లు ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా తమ వాటాలో కొంతమేర విక్రయిస్తున్నారు. తద్వారా నిధులను సమకూర్చుకుంటున్నారు. వీటిని రుణ చెల్లింపులు, విస్తరణ ప్రణాళికలు, పబ్లిక్కు కనీస వాటా తదితరాలకు వినియోగిస్తున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వివరాల ప్రకారం 2024 తొలి ఆరు నెలల్లోనే ఎన్ఎస్ఈ–500లోని కొన్ని కంపెనీల ప్రమోటర్లు 10.5 బిలియన్ డాలర్ల(రూ. 87,000 కోట్లకుపైగా) విలువైన ఈక్విటీలను విక్రయించారు. మరొక విశ్లేషణ ప్రకారం గత రెండు నెలల్లోనే సుమారు 200 లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు రూ. 33,000 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించడం తాజా ట్రెండ్కు అద్దం పడుతోంది. వెరసి దేశీ ఈక్విటీల విలువలు అత్యంత ప్రీమియంస్థాయికి చేరాయన్న సంకేతాలు వెలువడుతున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇందువల్లనే కొన్ని లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లు తమతమ బిజినెస్లలో లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విశ్లేíÙంచారు. కరోనా ఎఫెక్ట్...ప్రస్తుత మార్కెట్లలో పలు కంపెనీల షేర్లు గరిష్ట విలువలకు చేరడంతో బ్లాక్ డీల్స్ లేదా బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్లు కొంతమేర వాటాలను అమ్మివేస్తున్నారు. వీరికితోడు ఇటీవల పీఈ దిగ్గజాలు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు సైతం తమ పెట్టుబడులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుత ట్రెండ్ కారణంగా 2023 జనవరి–డిసెంబర్లో నమోదైన 12.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1,04,000 కోట్లు) విక్రయ రికార్డ్ 2024 కేలండర్ ఏడాదిలో తుడిచిపెట్టుకుపోయే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు వాటాలు విక్రయించిన విషయం విదితమే. 2024లో ఇప్పటివరకూ దేశ, విదేశీ ప్రమోటర్లు మొత్తంగా రూ. 87,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. కోవిడ్–19 నేపథ్యంలో 2020 జనవరి–డిసెంబర్లోనూ రికార్డు నెలకొల్పుతూ రూ. 78,500 కోట్ల విలువైన షేర్లను వివిధ కంపెనీల ప్రమోటర్లు అమ్మివేశారు.జూన్లో పలువురు ప్రమోటర్లు బ్లాక్ డీల్స్ ద్వారా భారీగా వాటాలను విక్రయించారు. రుణ భారాన్ని తగ్గించుకునే ప్రణాళికలతో ఇండస్ టవర్స్లో యూకే దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ 18 % వాటాను విక్రయించింది. ఇక ఎంఫసిస్లో 15% వాటాను పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ 80 కోట్ల డాలర్లకు అమ్మింది. దేశీ మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్లో ప్రమోటర్ వేదాంతా రిసోర్సెస్ 2.63% వాటా విక్రయం ద్వారా రూ. 4,184 కోట్లు సమీకరించింది. ఇక జెడ్ఎఫ్ కమర్షియల్ వెహికల్లో వాబ్కో ఏషియా 30 కోట్ల డాలర్ల విలువైన వాటాను విక్రయించింది.విక్రయ తీరు(రూ. కోట్లలో)కంపెనీ పేరు షేర్ల విలువ ఇండస్ టవర్స్ 15,300 ఎంఫసిస్ 6,680 వేదాంతా 4,184 ఇంటర్గ్లోబ్ 3,300 జెడ్ఎఫ్ సీవీ 2,194 గ్లాండ్ ఫార్మా 1,754
![Narayana Health launches Rs 1 crore health insurance at a premium of Rs 10000 per year](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/health-insurance.jpg.webp?itok=Hqy7RZKM)
రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా
బెంగుళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్త వెంచర్ నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) తన మొదటి బీమా ఉత్పత్తిని ప్రకటించింది. 'అదితి' పేరుతో తీసుకొచ్చిన ఈ బీమా శస్త్రచికిత్సలకు రూ. 1 కోటి, వైద్య నిర్వహణ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు హామీతో కుటుంబానికి సమగ్ర కవరేజీని అందిస్తుంది.తక్కువ ప్రీమియంకే సమగ్ర కవరేజీని అందించడం ద్వారా దేశంలోని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడం ఈ ప్లాన్ లక్ష్యం అని డాక్టర్ దేవి శెట్టి నేతృత్వంలోని ఈ హెల్త్కేర్ మేజర్ పేర్కొంది. ఈ కొత్త బీమాను సంవత్సరానికి రూ. 10,000 ప్రీమియంతో పొందవచ్చు. సాధారణంగా ఇలాంటి బీమాకు ప్రీమియం అధికంగా ఉంటుంది. గరిష్టంగా నలుగురు సభ్యులున్న కుటుంబం ఈ బీమా ప్లాన్ తీసుకునేందుకు అవకాశం ఉంది.నారాయణ హెల్త్ దేశంలో బీమా కంపెనీని కలిగి ఉన్న మొదటి హాస్పిటల్ చైన్గా నిలిచింది. దేశం అంతటా దాదాపు 21 హాస్పిటల్ నెట్వర్క్లు, అనేక క్లినిక్లను కలిగి ఉంది. బెంగళూరులో ఇది దాదాపు 7 ఆసుపత్రులు, 3 క్లినిక్లను కలిగి ఉంది. ఎన్హెచ్ఐ వెంచర్ కింద ‘అదితి’ పైలట్ ప్లాన్ మొదట మైసూరు, బెంగళూరులో తర్వాత కోల్కతా, ఢిల్లీలో అందుబాటులోకి రానుంది. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల మార్పిడితో సహా శస్త్ర చికిత్సలకు కోటి రూపాయల వరకు, వైద్య చికిత్సల కోసం రూ. 5 లక్షల వరకు అదితి కవరేజీని అందజేస్తుంది.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించిన డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి కార్డియాక్ సర్జన్. ఆయన లక్షకు పైగా గుండె ఆపరేషన్లు చేశారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం దేవి శెట్టిని 2004లో పద్మశ్రీ , 2012లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.
![Ratan Tata launches new animal hospital in Mumbai](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Ratan-Tata.jpg.webp?itok=hXJSwvCl)
టాటా కలల ఆస్పత్రి ప్రారంభం.. ఇక్కడ వైద్యం ఎవరికో తెలుసా?
దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బిలియనీర్ వ్యాపార వేత్తలలో రతన్ టాటా ఒకరు. దాతృత్వం, జ్ఞాన సంపద, వ్యాపార నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన రతన్ టాటాకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. మూగ జీవాలను ప్రేమించే ఆయన వాటి కోసం నిర్మించిన ప్రత్యేక ఆస్పత్రిని తాజాగా ప్రారంభించారు.ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెంపుడు జంతువుల ఆసుపత్రిని ప్రారంభిస్తున్నట్లు టాటా ట్రస్ట్ల చీఫ్ రతన్ టాటా ప్రకటించారు. 'వుయ్ ఆర్ ఓపెన్' అనే క్యాప్షన్తో పాటు వైద్యులతో తాను ముచ్చటిస్తున్న ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. జంతువుల పట్ల సానుభూతితో ఉండే టాటా గ్రూప్ దాని గురించి అవగాహన పెంచడానికి అనేక ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. అదే బాటలో కొనసాగుతూ దేశంలోనే అతిపెద్ద జంతు వైద్యశాలలలో ఒకదాన్ని ప్రారంభించింది.టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ను ముంబైలో 2.2 ఎకరాలలో రూ. 165 కోట్ల ఖర్చుతో నిర్మించారు. కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఇతర చిన్న జంతువులకు ఇక్కడ వైద్యం అందిస్తారు. ఇది 24x7 పని చేస్తుంది. “నేడు మూగ జీవాలు కుటుంబ సభ్యుల మాదిరిగా మారిపోయాయి. జీవితాంతం అనేక పెంపుడు జంతువుల సంరక్షకుడిగా ఈ ఆసుపత్రి అవసరాన్ని నేను గుర్తించాను" అని రతన్ టాటా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పారు.జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఈ కొత్త ఆసుపత్రి రాయల్ వెటర్నరీ కాలేజ్ లండన్తో సహా ఐదు యూకే వెటర్నరీ స్కూల్స్తో భాగస్వామ్యం కలిగి ఉంది. మల్టీడిసిప్లినరీ కేర్తో పాటు సర్జికల్, డయాగ్నోస్టిక్, ఫార్మసీ సేవలను ఆసుపత్రి అందిస్తుంది. నాలుగు అంతస్తులు ఉండే ఆసుపత్రి భవనంలో 200 జీవులకు వైద్యం అందించే సదుపాయం ఉంది. దీనికి బ్రిటిష్ పశువైద్యుడు థామస్ హీత్కోట్ నాయకత్వం వహిస్తున్నారు.We are open https://t.co/Dh4ndSMo7A— Ratan N. Tata (@RNTata2000) July 1, 2024
![Godrej Properties reported sales 2000 Homes On Day One Of New Project](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/Godrej.jpg.webp?itok=GmfEUZ4B)
‘రియల్’ రికార్డ్!! ఒక్క రోజులోనే 2,000 ఇళ్లు సేల్..
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇళ్ల అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరులో ప్రాజెక్ట్ ప్రారంభించిన మొదటి రోజే 2,000 పైగా ఇళ్లను విక్రయించింది. దీంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ షేర్లు రికార్డు లాభాలను అందుకున్నాయి.ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ బెంగళూరులోని వైట్ఫీల్డ్-బుడిగెరె క్రాస్లోని గోద్రేజ్ వుడ్స్కేప్స్లో రూ. 3,150 కోట్ల విలువైన ఇళ్లను విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. గోద్రెజ్ వుడ్స్కేప్స్ అనేది విలువ, అమ్మకాల వాల్యూమ్ల పరంగా తమ "అత్యంత విజయవంతమైన" లాంచ్ అని గోద్రెజ్ ప్రాపర్టీస్ ఫైలింగ్ తెలిపింది. గత నాలుగు త్రైమాసికాలలో ప్రారంభంలోనే రూ. 2,000 కోట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసిన కంపెనీ ఆరో ప్రాజెక్ట్ ఇది.బెంగళూరులో గోద్రెజ్ వుడ్స్కేప్స్ విజయంతో విక్రయాలలో ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్ గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ త్రైమాసికంలో 500% పైగా వృద్ధిని సాధించింది. సుమారు రూ. 3,000 కోట్ల ఆదాయ అంచనాతో పుణె, బెంగళూరులో ల్యాండ్ పార్సెల్లను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ చేసిన ప్రకటన తర్వాత సోమవారం గోద్రెజ్ ప్రాపర్టీస్ స్టాక్స్ కొత్త గరిష్టాలకు ఎగిశాయి. 3.23% లాభాన్ని నమోదు చేశాయి.
వీడియోలు
![Keshava Rao To Join In Congress Party Today](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/27.png.webp?itok=cva8NnpJ)
![Keshava Rao To Join In Congress Party Today](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/27.png.webp?itok=cva8NnpJ)
నేడు కాంగ్రెస్ లోకి చేరనున్న కే కేశవరావు
![Twist In Yelamanchili Missing Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/26.png.webp?itok=uMomjx5u)
![Twist In Yelamanchili Missing Case](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/26.png.webp?itok=uMomjx5u)
ఏపీలో కొససాగుతున్న విధ్వంస పాలన
![YSRCP Katasani Rambhupal Reddy Serious Comments On TDP Govt](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/23.png.webp?itok=dMc0WLZD)
![YSRCP Katasani Rambhupal Reddy Serious Comments On TDP Govt](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/23.png.webp?itok=dMc0WLZD)
టీడీపీ నేతలకు కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరిక
![Case Filed Under BNS Act On MLA Padi Kaushik Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/22.png.webp?itok=DNldfOdC)
![Case Filed Under BNS Act On MLA Padi Kaushik Reddy](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/22.png.webp?itok=DNldfOdC)
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
![Uttar Pradesh Hathras Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/21.png.webp?itok=UePEHoiN)
![Uttar Pradesh Hathras Incident](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/21.png.webp?itok=UePEHoiN)
బాబా ఆశీస్సుల కోసం వెళ్లి 116 మంది దుర్మరణం..
![Stock Market Are Trading In ALL Time High](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/20.png.webp?itok=mUObiG1-)
![Stock Market Are Trading In ALL Time High](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/20.png.webp?itok=mUObiG1-)
ఆల్ టైమ్ హైలో స్టాక్ మార్కెట్లు
![YSRCP Complaint To President Droupadi Murmu On TDP Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/19.png.webp?itok=jT9aM42h)
![YSRCP Complaint To President Droupadi Murmu On TDP Attacks](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/19.png.webp?itok=jT9aM42h)
టీడీపీ నేతల అరాచకాలపై రాష్ట్రపతికి వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
![MLA Kolikapudi Srinivasa Rao Over Action](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/18.png.webp?itok=XMhsV2uJ)
![MLA Kolikapudi Srinivasa Rao Over Action](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/18.png.webp?itok=XMhsV2uJ)
తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అరాచకం
![CM Revanth Reddy To Meet Rahul Gandhi Over Cabinet Posts](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/17.png.webp?itok=VUMX3too)
![CM Revanth Reddy To Meet Rahul Gandhi Over Cabinet Posts](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/17.png.webp?itok=VUMX3too)
ఈ వారంలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ
![YSRCP Leader Nandigam Suresh Reaction On Kolikapudi Srinivasa Rao Overaction](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/14.png.webp?itok=qNtiD4PS)
![YSRCP Leader Nandigam Suresh Reaction On Kolikapudi Srinivasa Rao Overaction](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/14.png.webp?itok=qNtiD4PS)
కొలికపూడిపై నందిగం సురేష్ ఫైర్
ఫ్యామిలీ
![The Highest Waterfalls In India: Photos](/sites/default/files/styles/webp/public/gallery_images/2024/07/3/Indian-Waterfalls.jpg.webp?itok=La8Vgp6O)
దేశంలో ఎత్తైన జలపాతాలు:రెండు కళ్లూ చాలవంతే! (ఫొటోలు)
![Google Engineer Makes Worlds First AI Dress](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/dress.jpg.webp?itok=vsJCe8b0)
'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!
ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సాయంతో రోబోట్లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. ఆమె ఈ ఏఐ డ్రెస్ని రోబోటిక్ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్ స్నేక్ డ్రెస్ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ డ్రెస్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ డ్రెస్ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్ అయినా ఫ్యాషన్ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by She Builds Robots (@shebuildsrobots) (చదవండి: సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!)
![Special Story By Guest Column On The Occasion Of Swami Vivekananda's Death Anniversary](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/swamy.jpg.webp?itok=agR5Wo0X)
నిరుపమాన దీక్షాశక్తి..
భారతీయ సంస్కృతిని, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి ఎదలో ప్రతిధ్వనించేట్లు, ప్రతినిత్యం స్మరించేట్లు ప్రచారం చేసి యావత్ జాతినంతా మేల్కొలిపిన మహనీయుడు స్వామి వివేకానందుడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు. ఆయన్ని ఆ రోజులలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు.1893 సెప్టెంబర్లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచ దేశాలంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాలలో పర్యటించి, అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897లో స్వదేశానికి తిరిగి వచ్చి ‘రామకృష్ణ మిషన్’ స్థాపించారు.వివేకానందుని ప్రసంగాలు యుగయుగాలకు స్ఫూర్తిదాయకం. ఆయన ఓ ప్రచార కర్త కాదు, ఓ మతం. ప్రతి మనిషి ఆత్మలో దైవత్వాన్ని చూడడం ఆ మత సూత్రం. పేదవాడి సేవే భగవంతుని సేవ అని చాటి చెప్పిన యుగకర్త. భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యుడాయన.1863 జనవరి 12న కలకత్తాలో జన్మించిన వివేకానందుని తొలినామం నరేంద్రుడు. ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను కలిగిన ఆయన చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితి కూడా పొందారు. దక్షిణేశ్వరంలోని రామకృష్ణ పరమహంసతో పరిచయమేర్పడిన అనతి కాలంలోనే నరేంద్రుడు ఆయనకు ముఖ్య శిష్యులయ్యారు. ఆయన మనోహర గాన మాధుర్యం రామకృష్ణుని ఆనందసాగరంలో ముంచెత్తేది. 1886లో పరమహంస నిర్యాణం అనంతరం నరేంద్రుడు పరివ్రాజకునిగా యావత్ భారత పర్యటన చేశారు. వివేకానందనామం స్వీకరించారు. దేశ సముద్ధరణకు, భారతజాతి పునరుజ్జీవనానికి అహర్నిశలు తపించారు.‘బలమే జీవనం బలహీనతే మరణం’ అనే వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాతం. ‘దేశంలో పస్తున్న ప్రతి ప్రాణికీ ఆహారం పెట్టి రక్షించటమే పరమధర్మం. ఇదే నా మతం. తద్భిన్నమంతా ఆదర్శమే, కృత్రిమ ధర్మమే. నిరుపేదయైన సోదర భారతీయునీ, నా ఇష్టదేవతలనూ అర్చించటానికి ఎన్ని జన్మలైనా ఎత్తగలను, ఎన్ని బాధలైనా ఓరుస్తాను’ అని ప్రకటించారాయన.1902 జూలై 4న తన 39వ ఏట బేలూరు మఠంలో ఆయన తనువు చాలించారు. అన్నదాన, విద్యాదాన, జ్ఞానదానాల రూపంలో ప్రజాసేవ చేస్తూ యావద్భారతంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రఖ్యాతి వహించిన శ్రీ రామకృష్ణ మఠసేవా సంఘాలను స్థాపించిన ఘనత వివేకానందుడికే దక్కుతుంది.గొప్ప దేశభక్తుడు. ఆయన యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి. మానవునిలో లోపాలు వివరిస్తూ ‘మనం పని చేయం, చేసే వారిని చేయనీయం, వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతి పతనానికి ముఖ్యమైనదీ లక్షణమే’ అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమనీ... దేశ ప్రజలందరికీ ఆత్మవిశ్వాసం, క్రియా శూరత్వం అవసరం తనకు స్పష్టంగా కనిపిస్తున్నదనీ చెప్పారు. – నందిరాజు రాధాకృష్ణ; సీనియర్ జర్నలిస్ట్ ‘ 98481 28215 (రేపు స్వామి వివేకానంద వర్ధంతి)
![Precautions And Instructions On Edible Adulterants](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/kdkka.jpg.webp?itok=Lu3LEH6g)
కిచెన్ టిప్స్.. ఇక కల్తీ కథ కంచికే!
కల్తీ... కల్తీ... కల్తీ. కల్తీ లేని వస్తువు కోసం దుర్భిణీ వేసి వెతకాల్సి వస్తోంది. బతకాలంటే రోజుకు మూడుసార్లు తినాలి. హోటల్లో తిందామంటే పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడం కోసం వంటల్లో రంగులేస్తారు. ఇంట్లో శుభ్రంగా వండుకుని తిందామంటే... వంట దినుసులు కల్తీ. మిరప్పొడి కొందామంటే అందమైన ప్యాకింగ్ మీద నోరూరించే ఎర్రటిరంగు ఫొటో ఉంటుంది.లోపల మిరప్పొడి ఏ రంగులో ఉందో కనిపించదు. ఇంటికి తెచ్చి ప్యాకెట్ తెరిచి చూస్తే ఒక్కోసారి రంపం పొట్టులా, ఇటుక పొడిలా నిర్జీవంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు ఎర్రటి ఎరుపుతో ఇది కారంపొడేనా లేక గోడలకేసే రంగా అన్నంత చిక్కగా ఉంటుంది. మనం దాదాపుగా వంటల్లో రోజూ వాడే ఐదు దినుసులను ఎలా పరీక్షించుకోవచ్చో చూద్దాం.మిరప్పొడి: ఒక కప్పు నీటిని తీసుకుని అందులో టీ స్పూన్ మిరప్పొడి వేయాలి. మిరప్పొడి నీటిమీద తేలుతూ ఉండి రేణువులు నీటిని పీల్చుకుంటూ మెల్లగా మిరప్పొడి మొత్తం కప్పు అడుగుకు చేరుతుంది. కల్తీ మిరప్పొడి అయితే నీటిలో వేయగానే అడుగుకు చేరుతుంది. అంతేకాదు, కప్పు అడుగుకు చేరేలోపు రంగు వదులుతూ నీటిని ఎర్రగా మారుస్తుంది.ఇంగువ: ఇంగువకు మండే గుణం ఎక్కువ. ఇంగువ కల్తీని తెలుసుకోవడానికి అదే మంచి గీటురాయి కూడా. ఇంగువను చిన్న ముక్క తీసుకుని మంట మీద పెడితే వెంటనే మంట అంటుకుని ఇంగువ ముక్క మండిపోతుంది. కల్తీ ఇంగువ అయితే వెంటనే మండదు. మంట మీద పెట్టి వెలిగించే ప్రయత్నం చేసినా సరే వెలగకుండా మాడిపోతుంది. ఇంగువ పొడి కొనేవాళ్లకు కూడా ఇదే చిట్కా. చిన్న పేపర్ మీద పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాగితాన్ని వెలిగించాలి. కాగితంతోపాటే ఇంగువ కూడా మంటను ఆకర్షిస్తే అది అసలైన ఇంగువ. కాగితం మండిపోయి ఇంగువ పొడి నల్లబారి సరిగా మండకపోతే అది కల్తీ ఇంగువ అని అర్థం.మిరియాలు: మిరియాలలో కల్తీ ఎలా జరుగుతుందంటే... బొ΄్పాయి గింజలను కలుపుతారు. ఒక కప్పు నీటిలో టీ స్పూన్ మిరియాలు వేయాలి. మిరియాలు బరువుగా ఉంటాయి నేరుగా నీటి అడుగుకు చేరతాయి. బొ΄్పాయి గింజలు తేలిక. కాబట్టి అవి నీటిలో తేలుతాయి.జీలకర్ర: జీలకర్రలో ఏ గింజలు కలుపుతారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ అసలు జీలకర్ర, అందులో కలిపిన గింజలు ఒకేరకంగా కనిపించడానికి కొద్దిగా నల్లరంగు కలుపుతారు. జీలకర్రను పావు టీ స్పూన్ తీసుకుని అరచేతిలో వేసి బాగా రుద్దాలి. చేతులకు నలుపు అంటితే కల్తీ జీలకర్ర అని అర్థం.పసుపు: పసుపుకు కూడా రంగులద్దుతారు. అర టీ స్పూన్ పసుపును కప్పునీటిలో వేయాలి. మిరప్పొడి వలెనే ఇది కూడా నీటిని పీల్చుకుంటూ మెల్లగా నానుతూ అడుగుకు చేరుతుంది. రంగు కలిపిన పసుపు అయితే నీటి అడుగుకు చేరే లోపే రంగు వదులుతుంది. వేసిన వెంటనే నీరు చిక్కటి పసుపురంగులోకి మారుతాయి.
న్యూస్ పాడ్కాస్ట్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
రాహల్వి పిల్ల చేష్టలు. సానుభూతి కోసం సభలో వెక్కిళ్లు. రాహుల్పై ప్రధాని వాగ్బాణాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
హిందువులమని చెప్తూనే హింసాద్వేషాలు వ్యాప్తి చేస్తున్నారని బీజేపీపై రాహుల్ ఫైర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
టీ20 క్రికెట్ ప్రపంచ కప్ మనదే... ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన... వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్... ఉభయ సభలు పలుమార్లు వాయిదాట.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు. నిర్ణయం వాయిదా వేసిన కోర్టు.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ.. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
దేశ ప్రజాస్వామ్యానికి ‘ఎమర్జెన్సీ’ మాయని మచ్చ.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపాటుర్.. ఇంకా ఇతర అప్డేట్స్
![](themes/custom/sakshi/assets/images/audio.png)
ముఖ్యమంత్రి అంటే ‘కటింగ్ మాస్టరా’?.. తెలంగాణ సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
![Revanth Reddy asked about Rythu Prabhakars suicide](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/3/2hrs.jpg.webp?itok=Y5HonyKj)
ఆ రెండు గంటల్లో ఏం జరిగింది?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/చింతకాని/హైదరాబాద్: : ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్(45) సోమవారం భూవివాదంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోగా, ఈ ఘటనపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకున్నారా.. ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించిరా అనే దానిపై స్పష్టత రావడం లేదు. ఆయన చెబుతున్న మాటలను గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీయడంతో పురుగుల మందు తాగిన సమయాన వారు అక్కడే ఉన్నారని భావిస్తున్నారు. ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి తుమ్మల కూడా తీవ్రంగా స్పందించారు. ఆత్మహత్య ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విచారణ జరిపి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. దీంతో అదికారులు నివేదిక సమర్పించినట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే, ధరణి పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ముదిరెడ్డి కోదండరెడ్డి కూడా చింతకాని తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. వివరాలు ఆరా తీయడమే కాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే వరకు స్థానిక అధికారులు ఏం చేశారని ప్రశ్నించినట్టు సమాచారం.వీడియో తీసి... వాట్సాప్ గ్రూపులో పెట్టి కలెక్టరేట్ వద్ద ప్రభాకర్ తన తండ్రిని వెళ్లిపోవాలని సూచించారు. ఆ తర్వాత గ్రామానికి చెందిన ఇద్దరు ప్రభాకర్ను బయటకు తీసుకెళ్లి పురుగుల మందు డబ్బా పట్టుకొని ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేయించాక, ఆయన వివరిస్తుండగా వీడియో తీసినట్టు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.39 గంటలకు తీసిన వీడియోను సాయంత్రం 5.40 గంటలకు వాట్సాప్ గ్రూప్లో పెట్టారు. దీంతో మధ్య రెండు గంటల సమయంలో ఏం జరిగిందో తేలాల్సి ఉంది. అయితే, రైతు ప్రభాకర్ ఆత్మహత్యలో రాజకీయకుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ తొలుత సమస్యను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు విన్నవించాడు. కాంగ్రెస్ నాయకులు అనుకూలంగా మాట్లాడకపోవటంతో బీఆర్ఎస్ నాయకుల ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అవమాన పరచాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకునేలా కొందరు ప్రేరేపించారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీడియో తీసినట్టు భావిస్తున్న గ్రామానికి చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.విచారణ చేయిస్తున్నాం..ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్దత్ను ఈ విషయమై ఆరా తీయగా రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తున్నామని తెలిపారు. ఆయన తండ్రి ఫిర్యా దుతో ఇప్పటికే పది మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పా రు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి ఎవరు బాధ్యులుగా ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలనడంతో..బోజడ్ల ప్రభాకర్ తన తండ్రి పెదవీరయ్యతో కలిసి సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. కలెక్టర్ లేకపోవడం, అంతకు ముందే సమయం అయిపోవడంతో అధికారులు వెళ్లిపోగా సిబ్బందికి ఫిర్యాదు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాకర్ ఓ మామిడితోటలో వీడియోలో పురుగుల మందు డబ్బా చూపిస్తూ మాట్లాడాక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ వీడియోలో తనకు న్యాయం చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్లు పేర్కొనడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా వీడియోలో ప్రభాకర్ కన్నీటిపర్యంతమవుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ప్రభాకర్ కలెక్టరేట్కు ఎప్పుడు వచ్చాడు, ఆయనతో ఎవరెవరు ఉన్నారు, మండల స్థాయిలో అధికారులను కలిసినా ఎందుకు పరిష్కారం చూపలేదనే అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
![Mumbai Old Man Arrested After Being On The Run For Three Decades](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/mumbaiaccused.jpg.webp?itok=QZCcH8X_)
ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు
ముంబై: ముప్పై ఏళ్ల క్రితం నాటి ముంబయి అల్లర్ల కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడు ఇప్పుడు మళ్లీ చిక్కాడు. అతడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి. అల్లర్ల సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్యలో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.అనంతరం అతడు బెయిల్పై విడుదలయ్యాడు. బెయిల్పై విడుదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అతడిని చట్టపరంగా పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. సెంట్రల్ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా అతడు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా ఆచూకీ లభ్యమైంది. జూన్ 29న అతడు తన ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని తాజాగా మళ్లీ అరెస్టు చేశామని, కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందనియ పోలీసులు తెలిపారు
![Young woman commits suicide with stomach pain](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/658666.jpg.webp?itok=kmDEOFjJ)
కడుపునొప్పితో యువతి ఆత్మహత్య
మండ్య: తీవ్రమైన కడుపు నొప్పిని భరించలేక యువతి ఒకరు ప్రాణాలు తీసుకుంది. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని కణివెకొప్పలు గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. న్యాయవాది కణివె యోగేష్ కుమార్తె అయిన గౌతమి (21) కొంత కాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యులతో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
![School bus collides with lorry in Nellore, 15 children injured](/sites/default/files/styles/webp/public/article_images/2024/07/2/5656.jpg.webp?itok=8dePtf4J)
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నెల్లూరు జిల్లా: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కావలి దగ్గర జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు గాయపడిన వారిని హుటాహుటినా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమా? అతివేగమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలి జాతీయ రహదారిపై ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ బోల్తాబస్సు క్లీనర్ మృతి పలువురు విద్యార్థులకు గాయాలు.హుటాహుటిన గాయపడిన విద్యార్థులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ప్రమాదానికిగల కారణాలు పూర్తి… pic.twitter.com/x5CKlHCjen— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024